అనుమానం..పెనుభూతం | Husband Killed Wife In hyderabad | Sakshi
Sakshi News home page

అనుమానం..పెనుభూతం

Aug 14 2018 9:31 AM | Updated on Sep 4 2018 5:53 PM

Husband Killed Wife In hyderabad - Sakshi

షరీఫా (ఫైల్‌)

నాంపల్లి: అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన సోమవారం హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ మధుకర్‌ స్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుభాన్‌పురకు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్, అదే ప్రాంతానికి చెందిన షరీఫా బేగం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా షరీఫాపై అనుమానం పెంచుకున్న ఇమ్రాన్‌ తరచూ ఆమెతో గొడవ పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేక షరీఫా పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్న ఇమ్రాన్‌ అందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా షరీఫాకు ఫోన్‌ చేసి తాను పూర్తిగా మారిపోయానని, ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటికి మారదామని చెప్పాడు. అతని మాటలు నమ్మిన షరీఫా ఇంటికి తిరిగివచ్చింది. పథకంలో భాగంగా దర్గా యూసుఫియన్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో రెండు గదులను అద్దెకు తీసుకున్న ఇమ్రాన్‌ అందులో కాపురం పెట్టాడు.  ఆదివారం రాత్రి అతను షరీఫా గొంతు నులుమి హత్య చేశాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఇమ్రాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement