హైదరాబాద్‌లో భారీ నగదు పట్టివేత | Hyderabad Police Seize Three Crores Rupees From Gold Merchant | Sakshi
Sakshi News home page

నగల వ్యాపారీ ఇంట్లో రూ.3.5 కోట్ల హవాలా మనీ!

Apr 5 2019 12:22 PM | Updated on Apr 5 2019 12:32 PM

Hyderabad Police Seize Three Crores Rupees From Gold Merchant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగల వ్యాపారి అనిల్‌ అగర్వాల్‌ ఇంట్లో రూ. 3.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా ద్వారా డబ్బులు పంచుతున్నట్టు పోలీసుల గుర్తించారు. పట్టుబడిన నగదును బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ నగదు మొత్తం నగల వ్యాపారి అనిల్‌ అగర్వాల్‌కు సంబంధించినదిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ వ్యాపారీ హవాలా రూపంలో మనీ సర్క్యూటేట్‌ చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ప్రకాశ్‌ అనే వ్యక్తికి అనిల్‌ అగర్వాల్‌ ఇదివరకే రూ.కోటి ఇచ్చినట్లుగా విచారణలో తేలినట్లు తెలుస్తోంది. అయితే ఆ కోటి రూపాయలు ఎక్కడికి తరలించారో తెలియరాలేదు. ​​ఎన్నికల్లో అభ్యర్థులకు ఇచ్చేందుకే ఈ డబ్బును తరలిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన సొమ్ము ఏపీ ఎన్నికల్లో పంచడానికి తరలిస్తున్నారా లేదా తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి సరఫరా చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement