నక్కపల్లి జాతీయ రహదారిపై దారుణం.. | Man Brutally Murdered On Nakkapalli National Highway Visakhapatnam | Sakshi
Sakshi News home page

నక్కపల్లి జాతీయ రహదారిపై దారుణం..

Published Sat, Oct 13 2018 9:58 AM | Last Updated on Sat, Oct 13 2018 11:36 AM

Man Brutally Murdered On Nakkapalli National Highway Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : నక్కపల్లి జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తల నరికి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన విశాఖపట్నంలోని నక్కపల్లి జాతీయ రహదారిపై గల టోల్‌గేట్‌ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మదురైకి చెందిన నీలమేఘ అమరన్‌ అనే వ్యక్తి నక్కపల్లి జాతీయ రహదారిపై గల టోల్‌గేట్‌ సమీపంలో రోడ్డు దాటుతుండగా కారులో వచ్చిన ఏడుగురు వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా అతన్ని కొట్టి తల నరికి హత్య చేశారు.

అనంతరం దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆధార్‌ కార్డు ఆదారంగా మృతుడిని తమిళనాడుకు చెందిన నీలమేఘ అమరన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే హత్య జరిగిన కొద్దిగంటల్లోని పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం కారుతో సహా పరారీలో ఉన్న నలుగురిని ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి వద్ద పట్టుకున్నారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement