మహిళా కండక్టర్‌పై దాడి, డ్రెస్‌ చించివేత | Passenger Attacks Woman RTC Conductor in Chittoor District | Sakshi
Sakshi News home page

పబ్లిగ్గా మహిళా కండక్టర్‌పై దురాగతం

Published Tue, Feb 25 2020 7:12 PM | Last Updated on Tue, Feb 25 2020 7:28 PM

Passenger Attacks Woman RTC Conductor in Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు: విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. గుర్రంకొండ తరికొండల మధ్య తిరిగే మదనపల్లి డిపో బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. టికెట్‌ ఎందుకు తీసుకోలేదని అడిగిన మహిళా కండక్టర్‌పై శివారెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆమె మీద దాడి చేయటమే కాకుండా డ్రెస్ చింపివేశాడు. డ్రైవర్‌, ప్రయాణికులు అడ్డుకున్నా లెక్కచేయకుండా అందరి సమక్షంలో కండక్టర్‌పై చేయి చేసుకున్నాడు. వారంతా కలిసి అతడిని అదుపుచేసి పోలీసులకు అప్పగించారు.

దాడికి గురైన మహిళ కండక్టర్ వాల్మీకిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వలంగా గాయపడిన మహిళా కండక్టర్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు. తమ తోటి కార్మికురాలిపై దాడిని ఆర్టీసీ కార్మిక నాయకులు ఖండించారు. (చదవండి: మీకు నచ్చిన బ్రాందీ అమ్ముతారా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement