మరో ఆర్టీసీ  కార్మికుడి ఆత్మహత్య | Suicide of Another RTC Worker At Jiyaguda | Sakshi
Sakshi News home page

మరో ఆర్టీసీ  కార్మికుడి ఆత్మహత్య

Oct 14 2019 5:07 AM | Updated on Oct 14 2019 5:07 AM

Suicide of Another RTC Worker At Jiyaguda - Sakshi

జియాగూడ: మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని రాణిగంజ్‌–2 డిపోకు చెందిన కండక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ (45)ఆదివారం రాత్రి కార్వాన్‌లోని బాంజవాడి తోటలోని తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ప్లాస్టిక్‌ వైర్‌ తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గంట తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. 14 ఏళ్లుగా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సురేందర్‌.. ఇటీవల ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఉద్యోగం పోతుందేమోనన్న ఆందోళనతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సురేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement