మహిళపై అడవి పంది దాడి | Woman Attacked By A Wild Boar | Sakshi
Sakshi News home page

మహిళపై అడవి పంది దాడి

Published Thu, May 10 2018 2:02 PM | Last Updated on Thu, May 10 2018 2:02 PM

Woman Attacked By A Wild Boar - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మి

గోవిందరావుపేట వరంగల్‌ : తునికాకు సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన మహిళపై అడవి పంది దాడి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పస్రా అభ్యుదయ కాలనీకి చెందిన జిట్టబోయిన లక్ష్మి సమీప అటవీ ప్రాంతంలోకి తునికాకు సేకరణకు వెళ్లింది. ఈ క్రమంలో అడవి పంది ఆమెపై దాడి చేయడంతో కాలికి బలమైన గాయమైంది. ఆమె అరుపులతో సమీపంలో ఉన్న కూలీలు అక్కడికి రాగా పంది పారిపోయింది. గాయాలపాలైన లక్ష్మిని పస్రా అటవీ శాఖ అధికారులు ఆస్పత్రికి తరలించారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement