ఇన్ని రోజులు పండుగకు వెళ్తావా అన్నందుకు.. | Women Died In Medak | Sakshi
Sakshi News home page

ఇన్ని రోజులు పండుగకు వెళ్తావా అన్నందుకు..

Jan 19 2020 10:24 AM | Updated on Jan 19 2020 2:26 PM

Women Died In Medak - Sakshi

సాక్షి, బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన కన్నం సృజన అలియాస్‌ ప్రవళ్లిక(30) చికిత్స పొందుతూ కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందినట్లు బెజ్జంకి పోలీసులు తెలిపారు. ఘటకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రేగులపల్లె గ్రామానికి చెందిన మాతంగి బాబు పెద్ద కూతురు ప్రవళ్లిక వివాహం మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన నరేష్‌తో 2015లో జరిగింది. వారికి ఒక కుమారుడు అన్వేషిత్‌ ఉన్నాడు.

12వ తేదీనా ప్రవళ్లిక సంక్రాంతి పండుగకు రేగులపల్లెలోని తల్లిగారింటికి వెళ్లి 17వ తేదీన బేగంపేటకు వచ్చింది. ఇన్ని రోజులు పండుగ కోసం వెళ్తావా అని మామ మందిలించాడని ఆమె సోదరుడికి సమాచారమిచ్చింది. అనంతరం కొద్ది సమయానికే క్షణికావేశంతో అదే రోజు(శుక్రవారం) రాత్రి క్రిమిసంహారక మందు సేవించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మొదట బెజ్జంకిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి మాతంగి బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు 
కరీంనగర్‌లో మృతి చెందిన ప్రవళ్లిక నేత్రాలను హైదరాబాద్‌కు చెందిన ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement