నీళ్లనుకుని లైజాల్‌ తాగి... | Women Dies After Mistakenly Drinking Lizol Near Tenali | Sakshi
Sakshi News home page

నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

Jul 18 2019 11:40 AM | Updated on Jul 18 2019 11:40 AM

Women Dies After Mistakenly Drinking Lizol Near Tenali - Sakshi

సాక్షి, తెనాలి: నీళ్లనుకుని లైజాల్‌ (యాసిడ్‌) తాగి మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన జంపాని అక్కమ్మ (50) పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో, తెనాలి మండలం అంగలకుదురులోని చెల్లి వెంకటేశ్వరమ్మ వద్ద ఉంటోంది.

మానసిక రుగ్మతతో బాధపడే ఆమె ఇళ్లలో పనులకు వెళ్తుంటుంది. ఒంట్లో నలతగా ఉండడంతో రెండు రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. తాగునీరనుకుని ఫ్లోర్‌ను కడిగేందుకు వాడే లైజాల్‌ను తాగింది. వాంతులు చేసుకుంటుండడంతో  కుటుంబసభ్యులు గమనించారు. తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement