విజయనగరం: విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలం రోలుచొప్పడిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అగ్నిప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధం
Published Sun, Dec 13 2015 7:42 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement