సాగర్నుంచి 3,884 క్యూసెక్కుల నీరు విడుదల
జలవిద్యుత్ కేంద్రం ద్వారా సోమవారం 3,884 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలకు 5టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేయటంతో నీటి విడుదలకు అంగీకరించింది.
జలవిద్యుత్ కేంద్రం ద్వారా సోమవారం 3,884 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలకు 5టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేయటంతో నీటి విడుదలకు అంగీకరించింది. బోర్డు నిర్ణయం మేరకు సాగర్ జలాశయం నుంచి పుష్కరాలకు ఈ నెల 16వ తేదీ వరకు 5టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు సాగర్డ్యాం నిర్వహణ ఎస్ఈ రమేశ్ తెలిపారు. దీంతో నల్లగొండజిల్లాలోని పుష్కరఘాట్లతో పాటు కృష్ణాడెల్టా ప్రాంతాల్లోని పుష్కరఘాట్లకు కూడా కృష్ణాజలాలు చేరనున్నాయి.