project
-
India Bhutan Train : త్వరలో భారత్-భూటాన్ రైలు.. స్టేషన్లు ఇవే..
న్యూఢిల్లీ: సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే విమానాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా రైలులోనూ మన దేశం నుంచి విదేశాలకు వెళ్లవచ్చనే సంగతి మీకు తెలుసా? త్వరలో భారత్- భూటాన్ల మధ్య నడవబోయే రైలు దీనిని సాకారం చేయనుంది. అస్సాంలోని కోక్రాఝర్ నుంచి భూటాన్లోని గెలెఫు వరకు రైల్వే లైన్ వేయడానికి భారత రైల్వేలు(Indian Railways) ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్)ప్రతినిధి తాజాగా మీడియాకు దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు.ప్రతిపాదిత 69.04 కి.మీ రైల్వే లైను అస్సాంలోని కోక్రాఝర్ స్టేషన్ను భూటాన్లోని గెలెఫుకు అనుసంధానిస్తుందని, ఇందుకోసం రూ.3,500 కోట్లు వ్యయం అవుతుందని ప్రతినిధి తెలిపారు. ఈ రైల్వే లైన్కు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు డీపీఆర్ ఆమోదం పొందాల్సివుంది. ఈ ప్రాజెక్టులో బాలజన్, గరుభాస, రునిఖాత, శాంతిపూర్, దద్గిరి గెలెఫు.. ఇలా మొత్తం ఆరు కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ రైల్వే మార్గం భారత్-భూటాన్ సంబంధాలను బలోపేతం చేస్తుంది.ఈ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి(Cultural exchange)ని పెంపొందిస్తుంది. ఈ రైల్వే లైను ఏర్పాటుపై భూటాన్ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. భారత్- భూటాన్లను రైలు ద్వారా అనుసంధానించేందుకు రెండు దేశాలు 2018 నుండి చర్చలు జరుపుతున్నాయి. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా, రెండు దేశాలు అధికారికంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ రైలు మార్గంలో రెండు ప్రధాన వంతెనలు, 29 భారీ వంతెనలు, 65 చిన్న వంతెనలు, ఒక రోడ్డు ఓవర్ బ్రిడ్జి, 39 రోడ్డు అండర్-బ్రిడ్జిలు, 11 మీటర్ల పొడవు గల రెండు వంతెనలు నిర్మాణం కానున్నాయి. -
వైఎస్ జగన్ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
-
ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్లు!
ఎంతోమంది రాజులు రాజ్యాలేలారు.. కాలంతో పాటు కనుమరుగైపోయారు. అయితే వారు కట్టిన కట్టడాలు మాత్రం ఇప్పటికీ వారి ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి. కట్టడాలకు అంత చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా కొంత మంది ఆర్కిటెక్చర్లు లేదా సంస్థలు కనీవినీ ఎరుగని కట్టడాలను నిర్మించి అక్కడి ప్రాంతాల రూపురేఖలనే మార్చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలు భూమిపై అనేకం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది (2025) 11 ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్లు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.న్యూ సిడ్నీ ఫిష్ మార్కెట్ (సిడ్నీ)ప్రపంచంలోని మూడో అతిపెద్ద చేపల మార్కెట్గా ప్రసిద్ధి చెందిన 'సిడ్నీ ఫిష్ మార్కెట్' (Sydney Fish Market) మరింత పెద్దదికానుంది. దీనికోసం 3XN ఆర్కిటెక్ట్లు, ఆస్ట్రేలియన్ సంస్థ BVN ముందడుగు వేసాయి. లాజిస్టిక్లు, ఇతర కార్యకలాపాలు గ్రౌండ్ ఫ్లోర్లో నిర్వహించనున్నారు. పై అంతస్తులలో సందర్శకుల కోసం మార్కెట్ హాల్, వేలం హాలు ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్లు, రిటైలర్లు పాంటూన్లు వంటివన్నీ చూడవచ్చు.గ్రాండ్ రింగ్, ఒసాకా (జపాన్)ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు.. జపాన్ రెండవ నగరమైన ఒసాకాలో నిర్వహించే ఎక్స్పో 2025 కార్యక్రమానికి 28 మిలియన్ల మంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. వేదిక మధ్య భాగంలో ఉంటుంది. గ్రాండ్ రింగ్ వృత్తాకార చెక్క నిర్మాణంతో పూర్తవుతుంది. 1970లో ఒసాకా మొదటిసారిగా ఎక్స్పోను నిర్వహించినప్పుడు, ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అవాంట్-గార్డ్ జపనీస్ వాస్తుశిల్పులు భారీ స్పేస్-ఫ్రేమ్ పైకప్పును నిర్మించారు. దాదాపు 6,46,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఇది ప్రపంచంలోని అతిపెద్ద చెక్క భవనాలలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్, ఆక్స్ఫర్డ్ (యూకే)లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చరిత్రలో అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్ట్. ఈ నిర్మాణ డిజైన్ సూత్రాలు విద్యాసంబంధమైన వాటికి దగ్గరగా ఉన్నాయి. లోపల ఫ్లెక్సిబుల్ ల్యాబ్ స్పేస్లు వివిధ విభాగాల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇది కూడా గొప్ప ఆర్కిటెక్చర్ నిర్మాణాలలో ఒకటిగా ఉంటుంది.కెనడియన్ స్కూల్, చోలులా (మెక్సికో)మెక్సికోలోని చోలులాలోని ఆర్కిటెక్చర్ సంస్థ సోర్డో మడలెనోస్ కెనడియన్ స్కూల్ ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రకృతిలో మమేకమయ్యే ఈ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులకంటే భిన్నంగా ఉంటుంది. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మెక్సికన్ ఆర్కిటెక్ట్ ఫెర్నాండో సోర్డో మడలెనో.. దీనిని పర్యావరణంతో మిళితం చేయడంతో పాటు భవనం కూడా ఆట స్థలంలో భాగమవుతుందని పేర్కొన్నాడు.టెక్కో అంతర్జాతీయ విమానాశ్రయం, నమ్ పెన్ (కంబోడియా)కంబోడియా దాని రాజధాని నమ్ పెన్.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత పెద్దది కానుంది. ఇది ఇప్పటి కంటే ఆరు రెట్లు ఎక్కువ మంది సందర్శకులను నిర్వహించగల సామర్థ్యం పొందనుంది. పర్యాటకుల సంఖ్యను పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ విమానయాన కేంద్రంగా మారడానికి దీనిని సిద్ధం చేస్తున్నారు. సిటీ సెంటర్కు దక్షిణంగా 12 మైళ్ల దూరంలో ఉన్న ఈ టెర్మినల్ భవనం ఆగ్నేయాసియాలో అతిపెద్దది.సౌత్ స్టేషన్ రీడెవలప్మెంట్, బోస్టన్ (ఇంగ్లాండ్)న్యూ ఇంగ్లాండ్లో అత్యంత రద్దీగా ఉండే గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ హబ్ అయిన బోస్టన్ సౌత్ స్టేషన్ను కూడా రీడెవలప్మెంట్ చేయనున్నారు. ఇది పూర్తయితే.. బస్సు, రైలు సామర్థ్యం వరుసగా 50 శాతం, 70 శాతం పెరుగుతుంది. 1899 నుంచి అలాగే ఉన్న ఈ నిర్మాణం కొత్త హంగులు సంతరించుకోనుంది.గోథే ఇన్స్టిట్యూట్, డాకర్ (సెనెగల్)"నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్"గా ప్రసిద్ధి చెందిన ప్రిట్జ్కర్ ప్రైజ్ని.. మొట్టమొదటి ఆఫ్రికన్ విజేత ఫ్రాన్సిస్ కేరే తన స్వదేశీ ఖండంలో నిర్మించిన వాతావరణాన్ని మార్చనున్నారు. 18,300 చదరపు అడుగుల భవనం వక్రతలు చుట్టుపక్కల ఉన్న పందిరి రూపురేఖలను ప్రతిబింబించేలా రూపొందించారు. దీనిని ప్రధానంగా స్థానికంగా లభించే ఇటుకలతో నిర్మించారు. కాగా ఇది ఈ ఏడాది మరింత సుందరంగా మారనుంది.అర్బన్ గ్లెన్, హాంగ్జౌ (చైనా)బీజింగ్లోని సీసీటీవీ హెడ్క్వార్టర్స్.. చైనాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సమకాలీన భవనంగా మారనుంది. తూర్పు నగరమైన హాంగ్జౌలో దాదాపు 9,00,000 చదరపు అడుగుల ఆఫీసు, హోటల్, విశ్రాంతి స్థలాన్ని కలిగి ఉన్న ఒక జత టవర్లు అర్బన్ గ్లెన్లో అత్యంత అద్భుతమైనవిగా రూపుదిద్దుకోనుంది.రియాద్ మెట్రో, రియాద్ (సౌదీ అరేబియా)2020లలో సౌదీ అరేబియాలో ఈ రియాద్ మెట్రో వెంచర్లను ప్రకటించారు. ఇది క్యూబ్ ఆకారంలో ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా మారనుంది. ఇది ఆరు లైన్లతో ఉంటుంది. దీని రోజువారీ సామర్థ్యం రోజుకు 3.6 మిలియన్లు. ఈ ప్రాజెక్టు నవంబర్లో ప్రారంభమైంది.స్కైపార్క్ బిజినెస్ సెంటర్, లక్సెంబర్గ్ (ఫ్రాన్స్)యూరప్ దేశంలోని కొత్త పబ్లిక్ భవనాలు కనీసం 50 శాతం కలపను కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే లక్సెంబర్గ్ రూపుదిద్దుకుంటోంది. ఇది ఖండంలోని అతిపెద్ద హైబ్రిడ్ చెక్క భవనాలలో ఒకటిగా మారనుంది. దీని విస్తీర్ణం 8,44,000 చదరపు అడుగులు. ఇందులో సుమారు 5,42,000 క్యూబిక్ అడుగులు కలపతో మిర్మించనున్నారు. ఈ భవనం, మొదటి దశ ఫిబ్రవరితో పూర్తవుతుంది.డాంజియాంగ్ బ్రిడ్జ్, తైపీ (తైవాన్)డాన్జియాంగ్ బ్రిడ్జ్ దాదాపు తొమ్మిదేళ్లుగా, దివంగత జహా హదీద్ సంస్థ తన వారసత్వాన్ని కొనసాగించింది. 3,018 అడుగుల పొడవైన నిర్మాణం తైవాన్ రాజధాని తైపీ గుండా ప్రవహించే తమ్సుయ్ నది ముఖద్వారం మీదుగా నాలుగు ప్రధాన రహదారులను కలుపుతుంది. మొత్తం నిర్మాణం కేవలం ఒకే కాంక్రీట్ మాస్ట్తో ఉంటుంది. ఇది పూర్తయిన తరువాత ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్-మాస్ట్ అసమాన కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్ అవుతుంది. -
రూ.61,000 కోట్ల పెట్టుబడి.. ఒడిశాలో ఐవోసీఎల్ నాఫ్తా ప్రాజెక్ట్
భువనేశ్వర్: ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) రూ.61,000 కోట్ల పెట్టుబడులతో ఒడిశాలోని పరదీప్లో నాఫ్తా క్రాకర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబందించి ఐవోసీఎల్, ఒడిశా (Odisha) ప్రభుత్వం మధ్య జనవరిలో జరిగే ‘ఉత్కర్ష్ ఒడిశా–మేక్ ఇన్ ఒడిశా 2025’ సదస్సు సందర్భంగా అవగాహన ఒప్పందం కుదరనుంది.ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భద్రక్లో రూ.4,352 కోట్లతో ఏర్పాటు చేయనున్న యార్న్ ప్రాజెక్ట్కు సైతం ఇదే వేదికగా శంకుస్థాపన చేయనున్నట్టు పేర్కొంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఐవోసీఎల్ చైర్మన్ ఏఎస్ సాహ్నే మధ్య భువనేశ్వర్లో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపింది.‘‘పరదీప్లో నాఫ్తా ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఐవోసీఎల్ రూ.61,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ రంగంలో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికీ వాటా ఉంటుంది. పన్నులకు అదనంగా, డివిడెండ్ రూపంలో ఆదాయం లభిస్తుంది’’అని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. భద్రక్లో రూ.4,352 కోట్లతో ఏర్పాటు చేయనున్న యార్న్ ప్రాజెక్టుతో, పెద్ద ఎత్తున వస్త్రాల తయారీ కంపెనీలు ఇక్కడకు వస్తాయని తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులతో యువకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రకటించింది. -
అసంపూర్తి నిర్మాణాలకు మళ్లీ జీవం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్ల పేరిట కొందరు బిల్డర్లు చేస్తున్న మోసా లకు అటు రూ. కోట్లలో డబ్బు పోగొట్టుకోవడంతోపాటు ఇటు సొంతింటి కలకు దూరమవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా), రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా దుండిగల్లో ఇలా బోర్డు తిప్పేసిన జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు చెందిన ‘ప్లాటినం’ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీ (మరో బిల్డర్)కు అప్పగించాయి. ఈ మేరకు టీజీ–రెరా చేసిన ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.దీంతో రెరా–2016 చట్టంలోని సెక్షన్ 8 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఆ ప్రాజెక్టును థర్డ్ పార్టీకి బదిలీ చేస్తూ టీజీ–రెరా మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. త్వరలోనే ఇలా ఆగిపోయిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా థర్డ్ పారీ్టలకు ఇచ్చేందుకు టీజీ రెరా కసరత్తు చేస్తోంది. దీంతో ఆగిపో యిన నిర్మాణాలు మళ్లీ జీవం పోసుకోనున్నాయి. ఇదీ ‘ప్లాటినం’కథ..: ఐదేళ్ల క్రితం జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యజమాని కాకర్ల శ్రీనివాస్ దుండిగల్లో ప్లాటినం పేరుతో అపార్ట్మెంట్ ప్రాజెక్టును ప్రకటించాడు. 3,267 గజాల స్థలంలో స్టిల్ట్+5 అంతస్తులకు హెచ్ఎండీఏ నుంచి అను మతి తీసుకొని 5,865 చ.అ. బిల్టప్ ఏరియాలో 60 అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని ప్రచారం చేశాడు. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్రీలాంచ్ ఆఫర్ కింద కస్టమర్ల నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. కొనుగోలుదారులను నమ్మించేందుకు శ్లాబ్ లెవల్స్ వరకు నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టాడు. హెచ్ఎండీఏకు తనఖా పెట్టిన 9 ఫ్లాట్లు మినహా మిగిలిన 51 ఫ్లాట్లను విక్రయించేశాడు. అయితే నిధుల దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో గతేడాది సెపె్టంబర్లో కస్టమర్లు ‘రెరా’కు ఫిర్యాదు చేశారు. త్వరలోనే సాహితీ, మంత్రి ప్రాజెక్ట్లు కూడా..: జయత్రీ కేసులాగే సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, మంత్రి డెవలపర్స్ మధ్యలోనే వదిలేసిన పలు అపార్ట్మెంట్ ప్రాజెక్టులను కూడా సెక్షన్–8 కింద ఉత్తర్వులు ఇచ్చేందుకు రెరా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గచి్చ»ౌలి, గుండ్లపోచంపల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని కస్టమర్ల నుంచి సొమ్ము వసూలు చేసి సాహితీ సంస్థ చేతులెత్తేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద లగ్జరీ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని వినియోగదారుల నుంచి మంత్రి డెవలపర్స్ రూ. కోట్లు వసూలు చేసింది. నిధుల దురి్వనియోగం కారణంగా ఆయా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో సెక్షన్–8 కింద ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనులను థర్డ్ పార్టీ బిల్డర్కు అప్పగించేందుకు ‘రెరా’కసరత్తు చేస్తోంది. 8 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉంటే ‘రెరా’పరిధిలోకి..: గృహ కొనుగోలుదారుల భద్రత, పెట్టుబడులకు భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ‘రెరా’తెలంగాణలో 2016 మే 1న అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా ఒక అపార్ట్మెంట్లో 8 అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ‘రెరా’పరిధిలోకి వస్తాయి. స్థానిక మున్సిపాలిటీ/కార్పొరేష న్ అనుమతులు ఉన్నప్పటికీ ఫ్లాట్ల వ్యాపారం చేస్తే తప్పనిసరిగా సదరు ప్రాజెక్టు ‘రెరా’రిజి్రస్టేషన్ పొందాలి. అయితే చాలా మంది బిల్డర్లు నిర్మాణ అనుమతులు రాకముందే.. ‘రెరా’రిజిస్ట్రేషన్ లేకుండానే ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. నిధుల మళ్లింపు, దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పను లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో కస్టమర్లు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో రెరా– 2016 చట్టంలోని సెక్షన్–8 కింద థర్డ్ పారీ్టకి నిర్మా ణ పనులను బదలాయించే అధికారం రెరాకు ఉంది. కస్టమర్లకు ఊరట లభిస్తుంది పలువురు బిల్డర్లు, ఏజెంట్లు అబద్ధపు హామీలతో కస్టమర్లను నమ్మించి మోసం చేస్తున్నారు. అలాంటి వారిని వదిలిపెట్టం. టీజీ–రెరాకు విస్తృత అధికారాలు ఉన్నాయి. చట్ట పరిధిలో గృహ కొనుగోలుదారులకు న్యాయం అందించి తీరతాం. మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ‘రెరా’అధికారాలను వినియోగించి కస్టమర్లకు ఊరట కల్పిస్తాం. – కె. శ్రీనివాసరావు, టీజీ–రెరా సభ్యుడు -
ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి. అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్ఐఐడీసీఓ కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.-పంకజ్ సేఖసరియావ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో) -
బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్
బీజింగ్ : చైనాకు బ్రెజిల్ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రణాళికకు బ్రెజిల్ అడ్డుకట్టవేసింది. చైనా చేపట్టిన బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేరకూడదని నిర్ణయించుకుంది. తద్వారా ఈ భారీ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వని బ్రిక్స్ గ్రూపులోని రెండో దేశంగా బ్రెజిల్ అవతరించింది.బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్ మీడియాతో మాట్లాడుతూ బ్రెజిల్ బీర్ఐలో చేరదని, అయితే ఇందుకు బదులుగా చైనా పెట్టుబడిదారులతో భాగస్వామిగా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. బ్రెజిల్ ఎటువంటి ఒప్పందాలపై సంతకం చేయకుండా, చైనాతో తన సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటోందన్నారు.హాంకాంగ్కు చెందిన వార్తాపత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'లోని వార్తల ప్రకారం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రకటించిన చైనా ప్రణాళికకు బ్రెజిల్ మద్దతునివ్వడం లేదు. బ్రెజిల్ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు ఇటీవల చైనా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఇప్పటికే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్ఐ ప్రాజక్టు అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలకు విరుద్ధమని భారత్ పేర్కొంది.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
ఎవరి అర్థాలు వాళ్లవి...
దసరా పండుగ నాడు ఢిల్లీ ‘భారత మండపం’లోని ‘గతిశక్తి అనుభూతి కేంద్ర’ను మోదీ హఠాత్తుగా సందర్శించారు. ఆ రోజు ‘ప్రధాన మంత్రి గతి శక్తి’ కేంద్రం మూడవ వార్షికోత్సవం వేళ అక్కడికి వెళ్లి తన ప్రాధాన్యాన్ని దేశానికి వెల్లడించారు. అయితే, ఇది అందరికీ ఒకేలా అర్థం కావాలనే షరతు ఏమీ లేదు. వీటి తాత్పర్యం చంద్ర బాబుకు ఒకలాగా, జగన్మోహన్ రెడ్డికి మరొక లాగా అర్థం కావొచ్చు. అందుకు వాళ్ళ వయస్సు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన కాలం, వారి ప్రాపంచిక దృక్పథం, మరెన్నో కారణాలు కావొచ్చు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఈ పదేళ్ళలో అదీ దేశానికి తూర్పున ఈ చివరన ఉన్నామేమో, ఇందులో ‘మనకు ఏముంది’ అని చూసినప్పుడు, మనం అర్థం చేసుకోవాల్సింది కొంచెం ఎక్కువే ఉంది.ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 15.39 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన 208 భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు ఉన్నాయి. దీని అమలుకు వేర్వేరు శాఖలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలతో సమన్వయం కోసం ఒక ‘నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్’ పనిచేస్తున్నది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ – ఇంటర్నల్ ట్రేడ్’ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా... ‘ఇందులో 101 జాతీయ రహదారులు, 73 రైల్వే ప్రాజెక్టులు, 12 పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, 4 చమురు–గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి’ అంటున్నారు. ఈ నాలుగు రంగాలు కూడా ప్రాంతాల మధ్య దూరాలనుతగ్గించి వాటిని చేరువ చేస్తూ, విద్యుత్తు భద్రత, పట్టణీకరణ లకు దోహదం చేస్తాయి. ఇందులో కీలకమైన అంశం ‘పి.ఎం. గతిశక్తి’... ‘బ్రాడర్ విజన్’ పేరుతో దేశవ్యాప్తంగా 1600 రకాల ‘జియో స్పైటల్ డేటా’ను సేకరించి ఈ ‘నేషనల్ మాస్టర్ ప్లాన్’ ప్రాజెక్టు కోసం ఇక్కడ భద్రపరుస్తున్నారు. పక్కా ‘డేటా’తో అభివృద్ధి ప్రణాళికల తయారీకోసం వీటిని సేకరిస్తున్నారు. ఇందులో ‘నేచురల్ రిసోర్సెస్ డేటా’ సేకరణ ఒక అంశంగా ఉంది. ప్రాంతాల స్వరూపం తెలి యడం కోసం ‘ల్యాండ్ రికార్డ్ డేటా’ అవసరం. అలాగే సాగు కోసం భూగర్భ జలాల వినియోగం ఎంతో తెలియడానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చాలి. నిజానికి ఇవి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన వీటిని ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఏ స్థాయిలో అల్లరి చేసిందీ తెలిసిందే. ‘అభివృద్ధి’ గురించి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు మార్చి 2023లో విశాఖలో జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పింది ఏమిటో చూడాలి. ఇందులో కీలకం ఏమంటే, ఆయన దృష్టి ఆసాంతం ఢిల్లీ నుంచి కిందికి దక్షిణాదికి దిగే క్రమంలో ఢిల్లీ యంత్రాంగాన్ని నేరుగా తూర్పు తీరానికి చేర్చడంపై పెట్టారు. ‘ప్రస్తుతం ఢిల్లీ నుంచి బొంబాయి చేరి అక్కణ్ణించి నాగపూర్ వచ్చి అక్కణ్ణించి దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి రోడ్డు ప్రయాణంలో ఎదురవుతున్న కష్టాన్ని చెబుతూ... ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘నేషనల్ హైవేస్’ డిసెంబర్ 2024 నాటికి పూర్తి అవుతాయనీ, అవి పూర్తి అయితే వాటిలో ఒకటైన ‘రాయపూర్–విశాఖపట్టణం’ రోడ్డు ద్వారా ఖనిజ నిక్షేపాలు ఉన్న ఛత్తీస్గఢ్కు ఏపీ పోర్టులు అందుబాటులోకి వస్తాయనీ ఆయన అన్నారు. ప్రస్తుతం ఇక్కడ 2,014 కి.మీ. పొడవైన 70 రోడ్డు ప్రాజెక్టులు రూ. 33.540 కోట్ల వ్యయంతో నిర్మిస్తు న్నామన్నారు. ఇలా ఢిల్లీ నుంచే కాకుండా, సెంట్రల్ ఇండియా నుంచి దక్షిణాన మన సముద్ర తీరానికి రెండు మూడు మార్గాల్లో తేలిగ్గా చేరవచ్చన్నారు. సరే, ఇది విని ‘ఎందుకు?’ అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు నాలుగు నెలల తర్వాత కాకినాడలో దొరికింది. అక్టోబర్ 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు–వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ సదరన్ కేంపస్ ప్రారంభానికి హాజరై ఆంధ్ర సముద్ర తీరం డిల్లీకి ఎంత కీలకమో చెప్పకనే చెప్పారు. ఇక వెనకబడిన మెట్ట కరవు ప్రాంతాలను ‘ఓపెన్’ చేయడానికి నడికుడి– శ్రీకాళహస్తి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు. రెండో దశలో దర్శి వరకు రైల్వే లైన్ మార్చి నాటికి పూర్తయింది. అద్దంకి రోడ్డు వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తనదైన సంక్షేమ ముద్రను ప్రతి రంగం మీద వేసింది. కుర్చీ ఎక్కిన ఆరు నెలల్లోనే వచ్చిన ‘కరోనా’ మహమ్మారిని నిలువరించడంలో దేశంలోనే ‘ఏపీ’ ముందు నిలిచింది. జగన్ ముందు చూపు అప్పట్లో అందరికీ అర్థం కాలేదు. కేంద్రం ‘గతిశక్తి సంఘటన్’ పేరుతో చేస్తున్న మౌలిక వసతుల కల్పన వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, జగన్ ప్రభుత్వం ప్రజల పాటవ నిర్మాణం (కెపా సిటీ బిల్డింగ్) పై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, విద్య–వైద్యం ప్రాధాన్యత పెంచింది. కొత్త జిల్లాలతో ప్రభుత్వాన్ని, కొత్త మెడికల్ కాలేజీలతో వైద్యాన్ని కొత్త ప్రాంతాలకు చేర్చింది. నైపుణ్యాలు తప్పనిసరి అయ్యే సామాజిక వర్గాలు – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవిక కోసం ‘స్కిల్ డెవలప్మెంట్’పై దృష్టి పెట్టింది. అయినా ఎన్నికలప్పుడు ‘అభివృద్ధి ఏది?’ అనే విమర్శ చేయడం చాలా తేలిక. కానీ ‘అభివృద్ధి’ అంటే ‘మానవాభివృద్ధి’ అని అర్థమయ్యేట్టుగా చెప్పడం మరీ కష్టం. వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
‘సరళ’జల తరంగిణి
పది గ్రామాల్లో పంట సిరుల కోసం సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలనుకున్నారు. అనుకున్నదే తడవు అమెరికాకు చెందినఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. స్వాతం్రత్యానికి ముందు మొదలై.. స్వాతం్రత్యానంతరం ప్రారంభమైన ఆ సాగునీటి ప్రాజెక్టు వయసు ఏడున్నర దశాబ్దాలు.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో సంస్థానాదీశుల కాలంలో అప్పట్లో రూ.35 లక్షలతో నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు విశేషాలివి. – వనపర్తివనపర్తి సంస్థానాదీశుడి ఆలోచనే.. స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన.. అప్పటి వనపర్తి సంస్థానా«దీశుడు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ప్రత్యేకంగా నిర్మించేందుకు ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతం్రత్యానంతరం అప్పటి మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెపె్టంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో దీన్ని పూర్తి చేశారు. 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రాజెక్టును ప్రారంభించారు. ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతటవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ పరిజ్ఞానంతో ఆసియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు కాగా.. ప్రపంచంలో రెండోది కావడం విశేషం. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ను నిర్మించారు. ఒక్కొక్క సైఫన్ నుంచి 520 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. మట్టికట్ట పొడవు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు. నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 20 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న కట్ట ఇప్పటికి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31వ తేదీన రెండోసారి కట్టకు గండిపడింది. ముంపు సమస్య పరిష్కారానికే.. వర్షం నీరు ఊకచెట్టు వాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవటం.. ఈ వాగు సమీపంలోని గ్రామాలు తరచూ వరద ముంపునకు గురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం అధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు సాగునీరందే గ్రామాలు ప్రస్తుతం మదనాపురం మండల పరిధిలో ఉన్నాయి. ఎడమ కాల్వ పరిధిలో శంకరంపేట, దంతనూరు, మదనాపురం, తిరుమలాయపల్లి, వడ్డెవాట, చర్లపల్లి, రామన్పాడు, అజ్జకోలు, కుడికాల్వ పరిధిలో నెల్విడి నర్సింగాపూర్ గ్రామాలున్నాయి. కాగా.. సరళాసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి సరళాసాగర్ను సందర్శించినా.. ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. మరమ్మతులకు ప్రతిపాదనలు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టుకు అక్కడక్కడా ఏర్పడిన నెర్రెలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందుకోసం నిపుణులైన ఇంజనీర్లను రప్పించి.. ఆధునిక పద్ధతిలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూపరింటెండింగ్ ఇంజనీరు ఆదేశించారు. ఈ మేరకు సరళాసాగర్ను సందర్శించనున్నాం. – రనీల్రెడ్డి, ఇంజనీర్, నీటి పారుదలశాఖ -
మన దేశంలోనూ టైమ్ బ్యాంక్
విశాఖపట్నానికి చెందిన సత్యమూర్తి విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తన ఇద్దరు పిల్లలను అమెరికా పంపించి బాగా చదివించారు. ఉన్నతోద్యోగాల్లో వారు అక్కడే సెటిల్ అయ్యారు. ఏడాదికి ఓసారి భార్యతో కలిసి అమెరికాలోని కొడుకుల వద్దకు వెళ్లి కొద్దిరోజులుండి రావడం ఆయనకు అలవాటు. అయితే, ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఇక్కడ ఒంటరైపోయారు. తమ వద్దకు వచ్చేయమని కొడుకులు కోరుతున్నా ఆయన ఒప్పుకోవడం లేదు. తాను టైమ్ బ్యాంక్లో కొంత సమయం దాచుకున్నానని, తనకు అవసరం వచ్చినప్పుడు తనను చూసుకునేందుకు మనుషులు వస్తారని చెప్పడంతో కొడుకులు ఆశ్చర్యపోయారు. విలువైన నగలు, డాక్యుమెంట్లను లాకర్లో దాచుకున్నట్టు బ్యాంకులో టైమును కూడా దాచుకోవచ్చా..అలాంటి అవకాశం కూడా ఉందా!! సాక్షి, అమరావతి: ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. జీవితాలు అపార్ట్మెంట్లలో బందీ అయ్యాయి. ఇది ఒంటరిగా ఉన్న వృద్ధులకు పెద్ద సవాలుగా మారింది. విదేశాల్లోనో లేక మరో దూర ప్రాంతంలోనో ఉండటంతో తల్లిదండ్రులను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో పిల్లలు ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకో లేక ఇంటి వద్దే కొన్ని పనులు చేసిపెట్టేందుకో ఓ వయసు దాటాక ప్రతి ఒక్కరికీ మరొకరి సాయం తప్పనిసరైంది. ఇలాంటి అవసరాలు ఉన్న వారిని చూసుకునేందుకు రోటరీ సంస్థ ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో సామాజిక కమ్యూనిటీ ప్రాజెక్ట్ని అందుబాటులోకి తెచ్చి కుటుంబ అవసరాల అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.ఏమిటీ టైమ్ బ్యాంక్.. అరవై ఏళ్లు దాటి ఆరోగ్యవంతమైన వ్యక్తి టైమ్ బ్యాంక్ సభ్యుడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సమయంలో సహాయం చేయడం ద్వారా వారి సమయాన్ని కొంత ఇతరులకు వెచ్చించవచ్చు. ఇలా ఎన్ని గంటలు వెచి్చస్తే అన్ని గంటలు సదరు సమయం కేటాయించిన వ్యక్తి పేరుపై అతని ఖాతాలో ఆ సమయం జమ అవుతుంది. దానిని వారు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ సభ్యులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా ఇతర అవసరాలు ఉన్నపుడు ఇంకో సభ్యుడు వీరికి సాయం చేస్తారు. ఇందులో సభ్యులు.. సేవ కోరేవారి మధ్య డబ్బు లావాదేవీ ఉండదు. ఉదాహరణకు, ఒక సభ్యుడు వారానికి నాలుగు గంటలు మరొకరికి సేవ చేస్తున్నట్టయితే, అతను నెలకు 16 గంటలు సంపాదిస్తాడు లేదా ఆదా చేస్తాడు. ఇలా సంవత్సరానికి 192 గంటలు లేదా 8 రోజులు అతని/ఆమె ఖాతాలో జమ అవుతాయి. ఈ సమయాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత విడతల వారీగా లేదా ఒకేసారి తన అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చు. దీనికోసం సదరు బ్యాంకులో నమోదు చేసుకుంటే మరో సభ్యుడు లేదా సభ్యురాలు వచ్చి సేవలందిస్తారు. సరళంగా చెప్పాలంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజి్రస్టేషన్ అనేది జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ ఖాతాను తెరవడం లాంటిది. పెద్దలకు సేవ చేయడం ద్వారా డబ్బుకు బదులు సమయాన్ని జమ చేసుకుంటారు. వారి అవసరాల సమయంలో వారి డిపాజిట్ సమయానికి సమానమైన సమయాన్ని విత్డ్రా చేసుకుంటారు. ప్రపంచంలో 34 దేశాల్లో అమలు స్విట్జర్లాండ్లో మొదలైన టైమ్ బ్యాంక్ కాన్సెప్్టను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాలు అమలు చేస్తున్నాయి. ఇందులో యూకే, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, స్పెయిన్, గ్రీస్, సింగపూర్, తైవాన్, సెనెగల్, అర్జెంటీనా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో 300కు పైగా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 40 రాష్ట్రాల ప్రభుత్వాలు టైమ్ బ్యాంక్ను అమలు చేస్తున్నాయంటే వీటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనూ ఈ తరహా కాన్సెప్ట్ అవసరమని 2018లో జాతీయ మానవ హక్కుల సంఘం కేంద్రానికి సూచించింది. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే 2019లో టైమ్ బ్యాంక్ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం 50 వేల మంది వలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతోపాటు సామాజిక సేవల్లో ముందుండే రోటరీ క్లబ్ కూడా టైమ్ బ్యాంక్ను ప్రారంభించగా, ఇందులో 5 వేల మంది వరకు సభ్యులుగా చేరారు. 2012లో స్విట్జర్లాండ్లో ప్రారంభండబ్బుతో అవసరం లేకుండా ‘మనిíÙకి మనిషి సాయం’ అందించే వినూత్న విధానానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నాంది పలికింది. స్విస్ ప్రభుత్వం వృద్ధులకు ప్రత్యేకంగా పెన్షన్ అందిస్తోంది. అయితే, తమకు డబ్బు కంటే సాయం చేసేవారు అవసరమని, చాలా సందర్భాల్లో ఏ పనీ చేసుకోలేకపోతున్నామని అక్కడి వృద్ధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తమతో మాట్లాడేందుకు మనిíÙని తోడు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన అక్కడి ఫెడరల్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి అధ్యయనం చేసింది. దేశంలో వృద్ధుల్లో అత్యధికులు ఒంటరి జీవితాలు గడుపుతున్నారని, వారు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మనిషి సాయం కోరుతున్నట్టు గుర్తించారు. దాంతో ఇంట్లో ఉండే ఒంటరి వృద్ధులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012లో ‘టైమ్ బ్యాంక్’ను అక్కడి ప్రభుత్వం ప్రారంభించి ‘టైమ్ ఈజ్ మనీ’ కాన్సెప్్టను వర్తింపజేస్తోంది. ఈ కాన్సెప్ట్ని కచ్చితంగా ఆచరించడంలో స్విట్జర్లాండ్ ముందడుగు వేసింది. ఆ దేశంలో పౌరులు తమ సమయాన్ని బ్యాంకుల్లో ‘పొదుపు’ చేసేలా ప్రోత్సహించింది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో వలంటీర్గా రిజిస్టర్ చేసుకుంటే వారిని అవసరం ఉన్నవారికి అలాట్ చేస్తారు. అలా వారు తోటపని, ఇంటి పని, బయటకి తీసుకెళ్లడం, కబుర్లు చెప్పడం, వృద్ధులు చెప్పే మాటలు వినడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి పనుల్లో సాయంగా ఉంటారు. వీరు ఎన్ని గంటలు కేటాయించారో అంత సమయం సాయం చేసిన వ్యక్తి అకౌంట్లో జమ చేయడం ప్రారంభించారు. -
మరమ్మతులకు తక్షణమే టెండర్లు
సాక్షి, హైదరాబాద్: భారీవర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువుల కట్టలు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తక్షణమే స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులకు పరిపాలనాపర అనుమతులను అత్యవసరంగా జారీ చేసి శుక్రవారం ఉదయం నాటికి ఆన్లైన్లో టెండర్లను పొందుపర్చాలని సూచించారు. దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఆయన జలసౌధ నుంచి క్షేత్రస్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మొత్తంగా 544 జలవనరులకు నష్టం వాటిల్లిందని, అత్యవసర మరమ్మతులకు రూ.113 కోట్లు అవసరమని అధికారులు మంత్రికి నివేదించారు.అత్యవసర, శాశ్వత మరమ్మతులకు రూ.1,100 కోట్లు కేటాయించాలని కోరగా, రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.350 కోట్లు కేటాయించిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తక్షణమే అన్ని పనులకు షార్ట్ టెండర్లు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవ తప్పిదంతో ఏదైనా నష్టం జరిగితే సంబంధిత చీఫ్ ఇంజనీర్లను బాధ్యులుగా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వట్టెం పంప్హౌస్ పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థదే...: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని వట్టెం వద్ద నిర్మించిన పంప్హౌస్తోపాటు సొరంగం నీటమునగగా, 4000 హెచ్పీ సామర్థ్యం కలిగిన 16 పంపుల ద్వారా నీళ్లను బయటకు తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి చెప్పారు. నిర్మాణ సంస్థే సొంతఖర్చుతో పునరుద్ధరణ పనులు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. త్వరలో పదోన్నతులు, బదిలీలు..: విపత్తుల సమయంలో 90 శాతం మంది ఉద్యోగులు బాగా పనిచేశారని, మిగిలిన 10 శాతం మంది సైతం తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. కొత్తగా నియామకం పొందిన 700 మంది ఏఈలకు త్వరలో పోస్టింగులతోపాటు నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక పదోన్నతులు కాకుండా శాశ్వత పదోన్నతులే ఇస్తామన్నారు. నీటిపారుదలశాఖలో ఖాళీగా ఉన్న 1,800 లస్కర్ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలను పంపించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్, ఈఎన్సీ(జనరల్) అనిల్కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సుంకిశాలపై మాటల యుద్దం.. కేటీఆర్కు భట్టి కౌంటర్
సాక్షి, ఖమ్మం: సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేటీఆర్కు కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్లు కూలిపోతే మా ప్రభుత్వానికి ఎలా బాధ్యత అవుతుందని భట్టి ప్రశ్నించారు.కాగా, తాజాగా భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం, సుంకిశాల కట్టింది బీఆర్ఎస్ పార్టీనే. ప్రాజెక్ట్లు మీరే కట్టారు కాబట్టి.. అవి కూలితే మీదే బాధ్యత. మా ప్రభుత్వంలో కట్టడాలపై మాది బాధ్యత అవుతుంది. సాగర్లోకి నీళ్లు రాకుండా ఉంటాయా?. మేము ఎందుకు దాచిపెడతాము. మేడిగడ్డ కరెక్ట్ కాదిన మేము ముందే చెప్పాం. మీరు కట్టిన ప్రాజెక్ట్లు క్వాలిటీ లేకుండా అవినీతితో కట్టారు. రాష్ట్రంలో మిగతా ప్రాజెక్ట్లు కూడా చెక్ చేయాల్సి అవసరం ఉంది. ప్రాజెక్ట్ల విషయంలో జరిగిన తప్పులను కేటీఆర్, బీఆర్ఎస్ ఒప్పుకుని ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రాజెక్ట్లో ఇంజినీర్లు చేయాల్సిన పని మీరు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.ఇక, సుంకిశాల విషయంలో అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు
రిషికేశ్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రిషికేశ్- కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ-2లో శివపురి, గూలర్ మధ్య ఆరు కిలోమీటర్ల రైలు సొరంగ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యింది. దీనికి సమాంతరంగా వెళ్లే సొరంగ నిర్మాణం 2023 సెప్టెంబరు నాటికే పూర్తయ్యింది.రిషికేశ్లోని కర్ణప్రయాగ్ వరకూ 125 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైనులోని 104 కిలోమీటర్ల ప్రాంతం 17 విభిన్న సొరంగాల మధ్య నుంచి వెళుతుంది. అన్ని సొరంగాల మొత్తం పొడవు 213.4 కిలోమీటర్లు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టులోని మొత్తం 213.4 కిలోమీటర్లలో ఇప్పటికే 169.496(79.42 శాతం) సొరంగం తవ్వకాల పనులు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) బృందానికి అభినందనలు తెలిపారు.రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు ఎల్ అండ్ టీ కంపెనీ చేపడుతున్న నేపధ్యంలో తాజాగా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రాజేష్ చోప్రా మాట్లాడుతూ ప్యాకేజీ-2లో ఎల్ అండ్ టీ చేతిలో ఎడిట్-2(56 మీటర్లు), మెయిన్ టన్నెల్-2లో డబుల్ లైన్ 7-స్టేజ్(80 మీటర్లు) ముఖ్య సొరంగం(6002) మీటర్లు, నికాస్ సొరంగం(6066 మీటర్లు)నకు సంబంధించిన టన్నలింగ్ పనులు ఉన్నాయన్నారు. వీటిలోని చాలా పనులు 2023 సెప్టెంబరు 12 నాటికే పూర్తయ్యాయని తెలిపారు. -
నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్
మనదేశంలోని పలు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు కనిపిస్తాయి. వీటిని ఇంటి పైకప్పులపైన, మైదాన ప్రాంతాల్లో చూడవచ్చు. అయితే నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ను ఎప్పుడైనా చూశారా? త్వరలో నీటిపై తేలియాడే 15 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ను మనం చూడబోతున్నాం. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో గల భిలాయిలో సెయిల్ భిలాయి స్టీల్ ప్లాంట్ తాజాగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా ముందుగా 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధిత అధికారులు మరోదా-1 జలాశయంలో శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు.ఇది ఛత్తీస్గఢ్లో ఏర్పాటవుతున్న తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. కర్బన ఉద్గారాలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్లాంట్ను చేపడుతోంది. ఈ ప్లాంట్ ఏడాదికి 34.26 మిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నదనే అంచనాలున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టు కారణంగా ఏటా 28,330 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్ యాసిడ్–సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ ఫెసిలిటీ కోసం రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి చేస్తున్నట్టు కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వెల్లడించారు. రోజుకు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉత్పత్తి కేంద్రం రానుంది. అలాగే రోజుకు 1,800 టన్నుల సామర్థ్యంగల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం కొలువుదీరనుంది. కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికిపైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్ఫరిక్ యాసిడ్ స్థిరంగా సరఫరా చేస్తుందని సంస్థ తెలిపింది. ప్రాజెక్టు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి పెట్టుబడి మద్దతును కూడా కంపెనీ అన్వేíÙస్తోంది. ఇది ఎరువుల తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థాలకు సరఫరా భద్రతను నిర్ధారిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా, కాకినాడ వద్ద ఉన్న కోరమాండల్ ప్లాంటు ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్ తయారీలో దేశంలో రెండవ అతిపెద్దది. సామర్థ్యం 20 లక్షల టన్నులు. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయం (ఎన్పీకే) ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ ధరఖాస్తు రిజెక్ట్ చేసిన రెరా
ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్కు భారీ షాక్ తగిలింది. గురుగ్రామ్, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ 2016కు అనుగుణంగా లేని కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ ప్రాజెక్ట్ల పొడిగింపు దరఖాస్తును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తిరస్కరించింది. గోద్రెజ్ డెవలపర్ ప్రాజెక్ట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ను పొడిగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రమోటర్లు రెరాకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులో లైసెన్స్ పునరుద్ధరణ, త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)లో అందించిన బ్యాంక్ బ్యాలెన్స్కు సంబంధించిన వివరాల్లో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల్ని సరిదిద్దాలని రెరా అనేక సార్లు గోద్రెజ్కు ఆదేశాలు చేసింది. అయితే, వాటిని సరిదిద్దడంలో సదరు నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విఫలమయ్యారు. దీంతో తాజాగా గోద్రెజ్ డెవలపర్ల ప్రాజెక్ట్ పొడింపు ధరఖాస్తును రిజెక్ట్ చేసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సెక్టార్ 85, గురుగ్రామ్లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఎయిర్ ఫేజ్ 4 నిర్మాణాలు చేపడుతోంది. ఇందుకోసం రెరా నుంచి గోద్రెజ్ 2018 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ పొందింది. రిజిస్ట్రేషన్ తేదీ ముగియడంతో ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ను పొడిగించాలని కోరుతూ గోద్రెజ్ ప్రాపర్టీస్ రెరా చట్టంలోని సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన రెరా.. ఆ దరఖాస్తులో అనేక లోపాలను గుర్తించింది. వాటిని సరిదిద్దాలని కోరింది. చివరికి తీరు మార్చుకోకపోవడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ దరఖాస్తును తిరస్కరించింది. -
చేతులు కలిపిన అంబానీ– అదానీ
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్కు చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వెరసి అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను ఆర్ఐఎల్ సొంతం చేసుకోనుంది. రూ. 10 ముఖ విలువకే(రూ. 50 కోట్లు) వీటిని చేజిక్కించుకోవడంతోపాటు.. 500 మెగావాట్ల విద్యుత్ను సొంత అవసరాలకు ఆర్ఐఎల్ వినియోగించుకోనుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా ఆర్ఐఎల్ 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్ను సొంత అవసరాల పద్ధతిలో తెరతీయనున్నట్లు వివరించింది. -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్బుక్పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్ఫామ్ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్చాట్ (Snapchat) యాప్కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్ను అర్థం చేసుకోవడానికి, స్నాప్చాట్పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ స్నాప్చాట్లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్కు స్టీల్ షీట్ పైల్స్ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలుడు నాసాకి ఎంపికయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జస్ట్ అతడు చేసిన రూ. 150ల ప్రాజెక్టు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నిర్వహించే ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్ టీమ్లో సెలక్టయ్యేలా చేసింది. ఓ సాదాసీదా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటూ నాసాకి ఎంపికవ్వడమే కాకుండా తన అద్భుత మేధాతో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు ఈ బాలుడు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీలోని చిన్నగ్రామమైన ఛాయ్సన్కు చెందిన 15 ఏళ్ల ఉత్కర్ష్ అనే బాలుడు నాసాకు వెళ్తున్నాడు. పదోవతరగతి చదువుతున్న ఈ ఉత్కర్ష్ జనవరిలో సైన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల్లో వివిధ పాఠశాల విద్యార్థులంతా సుమారు రూ. 25 వేల నుంచి లక్షలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ప్రిపేర్ చేస్తే, ఉత్కర్ష్ కేవలం రూ. 150ల ప్రాజెక్టుతో పాల్గొన్నాడు. అంతమంది విద్యార్థుల మందు నిలబడగలనా? అనుకున్న ఉత్కర్ష్ ..తన అద్భుత ప్రతిభతో తయారు చేసిన వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదికూడా తక్కువ మొత్తంలో ప్రాజెక్టుని ప్రజెంట్ చేయడంతో ఉత్కర్షని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. అతడిలో ఉన్న ఆ అసాధారణ మేధస్సే నాసా హ్యుమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్(హెచ్ఈఆర్సీ) అని పిలిచే ఇంజనీర్ డిజైన్ ఛాలెంజ్ 2024లో పాల్గొనే కైజెల్ టీమ్లో ఉత్కర్షని భాగమయ్యేలా చేసింది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మానవ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులనే భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్ని నిర్వహిస్తుంది. ఆ రోవర్ ఛాలెంజ్లో ఉత్కర్ష్ తన బృందంతో కలసి పాల్గొననున్నాడు. ఈ ఛాలెంజ్ వచ్చే నెల ఏప్రిల్ 18 నుంచి 20, 2024 వరకు జరుగుతుంది. ఇక ఉత్కర్ష నేపథ్యం వచ్చేటప్పటికీ..ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. ఉత్కర్ష్ తన తాత సురేంద్ర సింగ్ చేసే వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంటాడు కూడా. చిన్నతనంలోనే ఉత్కర్ష్ బ్రెయిన్ హేమరేజ్కి గురయ్యి దాదాపు మూడు నెలలు వెంటిలేటర్ ఉన్నట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. "మృత్యముఖం నుంచి కాపడుకున్నా మా బిడ్డ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన నాసా వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఎంపిక కావడం అన్నది మాకెంతో గర్వంగా ఉంది". అని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక ఉత్కర్ష్ తోపాటు పదోవతరగతి చదువుతున్న టౌరుకు చెందిన లోకేష్ కుమార్, గుహ, గురుగ్రామ్కి చెందిన పల్లవి, ఫరీదాబాద్కి చెందిన అరుణ్ కుమార్, పానిపట్ నుంచి రోహిత్ పాల్, నోయిడా నుంచి ఓమ్ తదితర విధ్యార్థులు ఎంపికయ్యారు. ఎంత్రీఎం ఫౌండేష్ ఈ వైఎంఆర్డీ టీమ కైజెల్కి మద్దతు ఇస్తుంది. నాసా నిర్వహించే ఈ ఇంజనీరింగ్ ఛాలెంజ్లో భారత్ తరుఫు నుంచి ఎనిమిది టీమ్లను ఎంపిక చేయగా, వాటిలో ఎన్జీవో మద్దతు గల జట్టే ఈ కైజెల్ టీమే. (చదవండి: స్నానమే ఆమెకు శాపం! చేసిందా..నరకమే..!) -
భూసార పరిరక్షణకు విద్యార్థి సైన్యం
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల్ని మితిమీరి వినియోగించడం వల్ల దిగుబడులు రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున భూసార పరీక్షలు చేయిస్తూ ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులను అందజేస్తోంది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, మందులు వాడేలా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించేలా ‘స్కూల్ సాయిల్ హెల్త్ ప్రాజెక్ట్’ చేపట్టింది. భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో ప్రకృతిపై ఆరాధన భావం పెంపొందించడం, వ్యవసాయంపై ఆసక్తి, ఉత్సుకత, రైతుల కష్టంపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించడం, వారిపట్ల బాధ్యతాయుత ప్రేమ, సాగుపై ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తోంది. 6–12వ తరగతి విద్యార్థులకు అవగాహన తొలి దశలో రాష్ట్రంలోని 29 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 జవహర్ నవోదయ పాఠశాలలతో పాటు 8 కేంద్రీయ విద్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్గా దీనిని చేçపడుతున్నారు. విద్యాశాఖ సమన్వయంతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు భూసార పరిరక్షణ–చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా మట్టి నమూనాల సేకరణ, రసాయనిక విశ్లేషణ, యాప్ ద్వారా ఫలితాల నమోదు, సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీపై ఎస్హెచ్సీ మొబైల్ యాప్ ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన సాయిల్ టెస్టింగ్ పరికరాలను పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. మట్టి నమూనాల సేకరణ, పరీక్ష, విశ్లేషణ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పాఠశాల పరిధిలో 50 నమూనాలు ప్రతి పాఠశాల పరిధిలోని గ్రామంలో సీజన్కు 25 చొప్పున ఖరీఫ్, రబీ సీజన్లలో కనీసం 50 శాంపిల్స్కు తక్కువ కాకుండా సేకరించనున్నారు. వీటిని పాఠశాలకు అందజేసిన సాయిల్ టెస్టింగ్ కిట్ ద్వారా విశ్లేషించి ఫలితాలను మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 24వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. జూన్ 15న ఆయా పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేస్తారు. భూమిలో ఉండే పోషక లోపాలను వివరిస్తూ, కోల్పోయిన భూసారం తిరిగి పొందాలంటే భూమికి ఎలాంటి పోషకాలు అందించాలి, సాగువేళ ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు, పురుగుల మందులు వినియోగించాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాలపై గ్రామసభల్లో శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పిస్తారు. విద్యార్థి దశ నుంచే ఆసక్తి విద్యార్థి దశ నుంచే సాగు, రైతులపై గౌరవభావం పెంపొందించడం, భూసారం పట్ల ఆసక్తి కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే అన్ని పాఠశాలలకు విస్తరిస్తాం. ఈ ప్రాజెక్ట్ కింద విద్యార్థులే స్వయంగా మట్టి నమూనాలు సేకరించి, పాఠశాలకు అందించిన కిట్ ద్వారా భూసార పరీక్షలు చేస్తారు. మట్టిలో ఏ లోపం ఉందో గుర్తిస్తారు. దీనివల్ల భూసార పరిరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఇంధన ఆదాకు రోల్మోడల్ ‘ఈసీబీసీ బిల్డింగ్’
సాక్షి, విశాఖపట్నం: త్వరలో విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు దీటుగా విశాఖపట్నంను రోల్ మోడల్లా నిలిపేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఏపీఈపీడీసీఎల్, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) భాగస్వామ్యంతో వైజాగ్లో అత్యాధునిక సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దీనికి బీఈఈ నిధులు మంజూరు చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) బిల్డింగ్గా ఏపీఈపీడీసీఎల్ నిర్మిస్తున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తొలుత జీ+1 నిర్మాణంగా భావించినా.. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్ఎంఏ) సహకారంతో జీ+2కు ప్లాన్లో మార్పులు చేశారు. జూన్ నెలాఖరుకు ఇది అందుబాటులోకి రానుంది. అదనపు నిధుల కోసం... గతేడాది మేలో సాగర్ నగర్ సమీపంలోని బీచ్రోడ్డులో భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటివరకూ రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఒప్పంద విలువ తొలుత రూ.10.61 కోట్లుగా భావించినా.. అదనంగా మరో అంతస్తు చేర్చడంతో రూ.15.38 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం వ్యయాన్ని భరించేలా అదనంగా రూ.10 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కేంద్ర విద్యుత్శాఖను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా ఈసీబీసీ, ఈసీబీసీ ప్లస్, సూపర్ ఈసీబీసీ అనే మూడు పెర్ఫార్మెన్స్ స్థాయి ప్రమాణాలను ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) సూచిస్తుంది. ఇందులో విశాఖలో నిరి్మస్తున్న ‘సూపర్ ఈసీబీసీ’ ఇంధన సామర్థ్య నిర్వహణలో అత్యుత్తమ స్థాయికి సూచీ. సంప్రదాయ భవనాలతో పోలిస్తే 50 శాతానిపైగా ఇంధనం పొదుపు అవుతుంది. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లని పరిష్కరించడంతో పాటు ఇంధన డిమాండ్ తీర్చడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎనర్జీ డిపార్ట్మెంట్, డిస్కమ్లు వినూత్న కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా.. బీఈఈ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరి్మస్తున్న ఈ భవనం ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు 24/7 విద్యుత్ సరఫరాకు సహాయకారిగా మారనుంది. 24వ రెగ్యులేటరీ–పాలసీ మేకర్స్ రిట్రీట్, ఇప్పాయ్ పవర్ నేషనల్ అవార్డుల్ని ఏపీఈపీడీసీఎల్ సాధించడమే ఇందుకు నిదర్శనంగా దేశమంతా ప్రశంసిస్తుండటం గర్వంగా ఉంది. – పృద్వితేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పొదుపులో అగ్రగామి ఇంధన వినియోగం, ఉద్గారాల నియంత్రణలో సూపర్ ఈసీబీసీ బిల్డింగ్ కీలకం. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడం, తక్కువ నిర్వహణ ఖర్చుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ఈ భవన నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలకు రోల్మోడల్గా వ్యవహరించనుంది. ఇంధన వనరుల పొదుపులో ఏపీ ప్రభుత్వం, ఈపీడీసీఎల్ చొరవను బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్భాక్రే కూడా ప్రశంసించారు. – ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బీఈఈ సదరన్ స్టేట్స్, యూటీ మీడియా అడ్వైజర్ -
చర్చ పెట్టు..సమాధానమిస్తాం
వనస్థలిపురం (హైదరాబాద్), సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం రేవంత్రెడ్డి దగ్గర విషయం లేదు గనకనే ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్పై, బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ఈ అంశంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన సవాల్కు ప్రతిసవాల్ చేశారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చపెట్టాలని.. దిమ్మతిరిగే సమాధానం చెప్తామని పేర్కొన్నారు. గతంలో తాము అసెంబ్లీలో చర్చ పెడితే ప్రిపేర్ కాలేదంటూ కాంగ్రెస్ తప్పించుకుందని.. ఇప్పుడు తాము అలా చేయకుండా ధైర్యంగా చర్చకు వస్తామని చెప్పారు. గత పదేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా తాము రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని హస్తినాపురంలో, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాల్లో హరీశ్రావు మాట్లాడారు. సీఎం రేవంత్కు ఆలోచన లేక, అర్ధంకాక ఆగమాగమై మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి నీటి సమస్యను తీసుకువస్తున్నారని ఆరోపించారు. విభజన బిల్లులో పెట్టిందెవరు? ‘‘రాష్ట్ర విభజన సమయంలో.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? ఆ బిల్లును తయారుచేసింది మీ జైపాల్రెడ్డి, జైరాం రమేశ్ కాదా? అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత రేవంత్కు లేదు. దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే. పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు స్తంభింపజేశాం. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ పోతిరెడ్డిపాడుపై ఏమాత్రం స్పందించలేదు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని వెంకయ్యనాయుడు ఉదయమే రేవంత్కు చెప్పారు. కానీ మధ్యాహ్నమే రేవంత్ చిల్లర మాటలు మాట్లాడారు..’’అని హరీశ్రావు మండిపడ్డారు. తాము మేం కృష్ణా నీటిలో 50శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే హైదరాబాద్కు మంచినీటి సమస్య వస్తుందని.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్లకు సాగునీరు, తాగునీటి సమస్య నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఆరోపణలా? కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని.. హామీలపై ప్రశ్నిస్తే పసలేని అంశాలతో ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. డిసెంబర్లోనే రూ.4వేలు పింఛన్ ఇస్తామని, ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని డేట్లు పెట్టి.. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి ముక్కలవుతోందని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవనందున రాష్ట్రంలో హామీలను అమలు చేయడం కుదరడం లేదని సీఎం రేవంత్రెడ్డి సాకు చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరగబోతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
AP: ‘ప్రాజెక్ట్ జలధార’.. అద్భుత ఫలితాలు
సాక్షి, అనంతపురం : ఇటీవల నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ను జాతీయ అవార్డుతో సత్కరించింది. అనంతపురంలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ జలధార ద్వారా కరువు ప్రాంతాలలో అభివృద్ధికి దోహదపడినందుకు ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో ’ప్రాజెక్ట్ జలధార’ ద్వారా ...ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలోసాధించిన ఫలితాలను గురించి ఆనందన –కోకా–కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ ఎం సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాలను పెంపొందించటంలో ఎన్నదగిన ఫలితాలను సాధించిందన్నారు. వివరాల్లోకి వెళితే... పెరిగిన భూగర్భజలసిరి... గ్రామీణాభివృద్ధి ఎన్జిఓ ఎస్ఎం సెహగల్ ఫౌండేషన్ సహకారంతో ఆనందన – కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ’వాటర్ స్టీవార్డ్షిప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగమైన ప్రాజెక్ట్ ’జలధార’ ను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. తద్వారా అనంతపురంలో 5 చెక్ డ్యామ్స్ను కోడూరు– సుబ్బారావుపేట, ముద్దపల్లి– తిమ్మడిపల్లి , మధురేపల్లి – కందురుపర్తి నల్లపరెడ్డి పల్లి గ్రామాలలో 416 మిలియన్ లీటర్ల నీటి సేకరణ సామర్థ్యంతో నిర్మించారు.దీంతో భూగర్భజలాల పెంపుదల కారణంగా సాగు విస్తీర్ణంలో 35% పెరుగుదల నమోదయింది, తగ్గుతున్న నీటి కొరత... ఈ ప్రాంతంలో నీటి కొరత సమస్య కూడా పరిష్కారమవుతోంది. భూగర్భ జలాలు పెరగటంతో పంట దిగుబడిలో కూడా గణనీయమైన రీతిలో 75% పెరుగుదల నమోదయింది. దానితో పాటే భూసారమూ పెరిగింది. ఒక సంవత్సరంలో రైతులు బహుళ పంటలు పండించడానికి ఇది వీలు కల్పించింది. అదనంగా, 82% మంది రైతులు పంటల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను గమనించారు. ప్రాజెక్ట్ అమలులో భాగంగా 7 నీటి నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిర్వహణలో స్థానికుల ప్రమేయాన్ని కూడా పొందగలిగింది. ఇందులో 75 మంది పురుషులు, 17 మంది మహిళలు సహా 92 మంది సభ్యులు ఉన్నారు. నీటి–ఎద్దడి ఉన్న భూములలో భూగర్భ జలాలను పెంచటం, వాటర్షెడ్లను మెరుగుపరచడం ద్వారా కోకోకోలా ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆ కృషి ఫలితంగానే కంపెనీ వినియోగిస్తున్న నీటిలో 200% పైగా తిరిగి అందించగలిగింది. మంచి ఫలితాలు సాధించాం... అనంతపురంలో చెక్ డ్యామ్ల నిర్మాణంతో. భూమి నాణ్యత మెరుగుపరచి పంట దిగుబడిని, భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచగలిగాం. ఫలితంగా, నేడు రైతులు విభిన్న పంటలను పండిస్తున్నారు మా నీటి నిర్వహణ కమిటీలు ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి తగిన శిక్షణ పొందాయి. ఇదీచదవండి.. వేడెక్కిన ఏపీ రాజకీయం -
పెండింగ్ పనులకు నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: అవసరమైన రోడ్లను మెరుగు పరచటంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆ శాఖ బడ్జెట్ సన్నాహక సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న పనులు, వాటికి సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ప్రస్తుత అవసరా ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వారికి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా, క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణతోపాటు కలెక్టరేట్ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. సీఐఆర్ఎఫ్ పనులకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, భట్టి విక్రమార్క అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల ఉత్సవాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా కోరారు. సినీ భూములను కాపాడాలని ఆదేశాలు సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల ను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ లాంటి మహమ్మారిలకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో సినీ సెలబ్రిటీలు పొల్గొనేలా చూడాలని సూచించారు. నంది అవార్డుల కార్యక్రమం నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా హాళ్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలని, ఆన్లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చిత్రపురి కాలనీలో అవకతవకలపై దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నందున ఆ విష యంలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివా సరాజు, ఆర్థికశాఖ జాయింట్ సెక్రెటరి హరిత, ఉప ముఖ్యమంత్రి కార్యదర్శి కృష్ణ భాస్కర్, సమాచార శాఖ కమిషన్ అశోక్రెడ్డి, ఈఎన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డితో పాటు సీఈలు మధుసూధన్ రెడ్డి, సతీష్, మోహన్ నాయక్ పాల్గొన్నారు. -
Visakhapatnam: 76 కిమీ.. రూ.14వేల కోట్లు..
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో లైట్మెట్రోకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయమవుతుందని తెలిపింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ను అందించేందుకు కావల్సిన పూర్తి డాక్యుమెంట్లను సిద్ధంచేసే పనిలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. 76.90 కి.మీ. మేర ప్రాజెక్టు.. విశాఖ నగర ప్రజలకు భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. నెలరోజుల క్రితం సీఎం జగన్ ఆధ్వర్యంలో లైట్మెట్రో ప్రాజెక్టు డీపీఆర్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 76.90 కిమీ మేర లైట్మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. హెవీ మెట్రోతో పోల్చిచూస్తే.. లైట్ మెట్రో ద్వారా నిర్మాణ వ్యయంలో 20 శాతం, వార్షిక నిర్వహణలో 15 శాతం భారం తగ్గనున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లైట్మెట్రో వైపే మొగ్గు చూపింది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఒక మెట్రో రైలు వెళ్తే ఎనిమిది బస్సులు వెళ్లినట్లు సమానం. ఒకసారి వెళ్లే మెట్రోలో 400 మంది ప్రయాణించగలరు. ప్రాజెక్టు గడువు ఎనిమిదేళ్లు.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు జీఓలో స్పష్టంచేశారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇక టెండర్లు దక్కించుకున్న సంస్థ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు దక్కించుకున్న మూడేళ్లకు తొలిమార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని జీఓలో స్పష్టంచేశారు. 30 ఏళ్ల పాటు సదరు నిర్మాణ సంస్థకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని, ఈ సమయంలో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు సంస్థ ఆర్జిస్తుందని డీపీఆర్లో తెలిపారు. 17న కేంద్రానికి డీపీఆర్ ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కేబినెట్ డీపీఆర్ను ఆమోదించినందున లైట్మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన జీఓ నెం.161ని ప్రభుత్వం విడుదల చేసింది. జీఓ, డీపీఆర్తో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పిస్తాం. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కాపీలు అందిస్తాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆమోదింపజేసి టెండర్లకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. లైట్ మెట్రో ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఏపీలో కీలకంగా, ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. రాబోయే 35–40 ఏళ్లలో నగర ట్రాఫిక్ డిమాండ్కి అనుగుణంగా డీపీఆర్ సిద్ధంచేశాం. – యూజేఎం రావు, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ -
అరుణాచల్ హైవే ప్రాజెక్టు ఏమిటి? చైనా మండిపాటు ఎందుకు?
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో చైనా అనునిత్యం చొరబాటు ప్రయత్నాలను చేస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలోనే అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పనులను భారత్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సరిహద్దు ప్రాంతాలకు సైన్యం చేరుకోవడం మరింత సులభతరం కానుంది. అప్పుడు సైన్యం ఎల్ఏసీకి చేరుకోవడానికి అధిక సమయం పట్టదు. 1748 కి.మీ పొడవైన నేషనల్ హైవే-913ని పూర్తి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టనుంది. ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తికానుంది. ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని అన్ని గ్రామాలను ఆల్-వెదర్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2016లో భారత్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించిన తర్వాత చైనా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించకూడదని చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్ పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా హున్లీ- హ్యూలియాంగ్ మధ్య దాదాపు 121 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మించనున్నారు. అదే సమయంలో హున్లీ- ఇతున్ మధ్య 17 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక వంతెన, టుటిన్ నుండి జిడో వరకు 13 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తున్నారు. అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగర్లో ముగుస్తుంది. ఈ హైవే సిద్ధమైన తర్వాత తవాంగ్ సమీపంలోని బోమ్డిలా నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగరానికి అనుసంధానం ఏర్పడుతుంది. అన్ని వాతావరణాల్లోనూ ఉపయుక్తమయ్యేలా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలకు ఈ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ హైవే నిర్మాణం కోసం అనేక సొరంగాలు కూడా నిర్మించనున్నారు. ఈ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై, భారత్-మయన్మార్ సరిహద్దులోని విజయనగర్ వద్ద ముగుస్తుంది. ఈ రహదారి భారతదేశం-టిబెట్-చైనా, మయన్మార్ సరిహద్దులకు దగ్గరగా వెళుతుంది. -
విదేశీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..!
దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వ కార్తికేయ. జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాలతో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయకు జోడిగా ఆయుషి పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో ఇండోనేషియన్ ప్రాజెక్ట్లో వీరిద్దరు క్రేజీ ఆఫర్ పట్టేశారు. ‘శూన్యం చాప్టర్ -1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్తో ఈ చిత్రం రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కాలయాపన చేసేందుకే శ్వేతపత్రాలు, జ్యుడీషియ ల్ ఎంక్వైరీ, ప్రాజెక్టుల సందర్శన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి విమర్శించారు. కాలయాపనతో ఎన్నికల హామీ లను ప్రజలు మరిచిపోతారని ప్రభుత్వం భావిస్తోందని, ఆరు నెలల్లోపు హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. అవినీతికి హక్కుదారు కాంగ్రెస్ పార్టీ అని, గత ప్రభుత్వంపై వేసే ప్రతి విచారణను బీఆర్ఎస్ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అవినీతి అవాస్తవమని తేలింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత సీఎం రేవంత్, రాహు ల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరో పణలు అవాస్తవమని శుక్రవారం మంత్రుల మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తేలిందని కడియం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 98 వేల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని, 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి నట్లు మంత్రులు తమ పవర్పాయింట్ ప్రజెంటేషన్లోనే అంగీకరించారని పేర్కొన్నారు. బ్యారేజీ కుంగుబాటుపై సమగ్ర విచారణ 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఏర్పడిన తమ ప్రభుత్వం.. నీటి లభ్యత, ఇతర సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతల పథకం సాధ్యం కాదని తేలినందునే.. కాళేశ్వరం ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ ద్వారా రీ డిజైన్ చేసిందని కడియం శ్రీహరి చెప్పారు. 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.62 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ జరిగిందని తెలిపారు. సీడబ్ల్యూసీ సహా 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించామన్నారు. డిసెంబర్ 2008లో తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా 2014 వరకు కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎనిమిదేళ్ల పాటు అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. ఈపీసీ విధానం తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు తదితరాల పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేదని అన్నారు. కేబినెట్ ఆమోదంతోనే ల్యాండ్ క్రూజర్ల కొనుగోలు వాస్తవాలను పక్కన పెట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రులు జ్యుడీషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని కడియం ధ్వజమెత్తారు. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు పై సమగ్ర విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ క్రూజ ర్ల కొనుగోలు కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని, ఇలాంటి అంశాలపై పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు లంకెబిందెల కోసం అధికారంలోకి వ చ్చారా? బడ్జెట్ గణాంకాలు అధ్యయనం చేయ కుండానే హామీలిచ్చారా? అని ప్రశ్నించారు. -
ఇస్రో వేల కోట్లు సంపాదన.. కేంద్ర మంత్రి ఏమన్నారో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. వివిధ రకాల వాహక నౌకలను రూపొందించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఉపగ్రహ సేవలు, వాణిజ్య పరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో రికార్డులు నెలకొల్పుతోంది. అంతరిక్ష వాణిజ్యంలో ఇతర దేశాలు, ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. గడచిన 4-5 ఏళ్ల కాలంలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో పెను మార్పులు జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఇస్రో ఎలా డబ్బు సంపాదిస్తుందో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత శాస్త్రవేత్తలు ప్రతిభ, సామర్ధ్యం, ప్యాషన్తో పనిచేస్తున్నారని జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల పురోగతి కుంటుపడిందన్నారు. మోదీ రాకతో ప్రైవేట్ మార్గాల నుంచి పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్, రష్యా వంటి ఇతర దేశాలకు ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా వచ్చే ఆదాయం గురించి మాట్లాడారు. నాసాకు సగం వనరులు ప్రైవేట్ పెట్టుబడుల నుంచి వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇస్రో సైతం దాదాపు రూ.1000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించినట్లు చెప్పారు. ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత పురోగతిని నొక్కిచెప్పారు. ఇండియా నుంచి ఇస్రో.. అమెరికా, రష్యాలకు చెందిన ఉపగ్రహాలను విజయవంతంగా తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. దాంతో డబ్బు సమకూరుతుందని తెలిపారు. వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇతర దేశాల శాటిలైట్లను ప్రయోగించి ఇస్రో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లకు పైగా సంపాదించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో అనేక దేశాలకు చెందిన దాదాపు 430 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు చెప్పారు. ఇస్రో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్ఏ వంటి దేశాలకు సర్వీసులు అందించిందని వివరించారు. యూరోపియన్ దేశాల నుంచి రూ.2,635 కోట్లు, అమెరికా నుంచి రూ.1,417 కోట్లు సంపాదించినట్లు సింగ్ చెప్పారు. ఇదీ చదవండి: అంబానీ వాటిని పట్టించుకోరు: విజయ్ కేడియా గగన్యాన్ మిషన్ 2025 ప్రారంభంలో మానవరూప రోబోట్ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధంగా ఉందని సింగ్ వెల్లడించారు. 2047లో ప్రతిష్టాత్మకమైన 'డీప్ సీ మిషన్' గురించి సింగ్ మాట్లాడారు. హిమాలయ, సముద్రయాన్ వంటి మిషన్ల ద్వారా హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికితీసే ప్రణాళికల గురించి వివరించారు. -
సుజలధార ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
సీఆర్పీఎఫ్ పహారాలో ‘సాగర్’
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి యథాస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తూ సీఆర్పీఎఫ్ దళాల పహారాలో ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామన్న కేంద్ర హోంశాఖ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే నవంబర్ 30 నాటి పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి స్పష్టం చేయగా గత నెల 28కి ముందున్న పరిస్థితిని లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఏమాత్రం రాజీ లేకుండా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల దాహార్తి తీర్చేలా తాగునీటి అవసరాల కోసం రెండో రోజు శుక్రవారం కూడా 3,300 క్యూసెక్కుల నీటి విడుదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని నాగార్జునసాగర్ సగం స్పిల్వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఏపీ ప్రభుత్వం గురువారం స్వాధీనం చేసుకుని కుడి కాలువకు నీటిని విడుదల చేయడంపై తెలంగాణ సర్కార్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా శుక్రవారం ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్లతో కలిసి రెండు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్మోహన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. హక్కులు కాపాడుకోవడానికే.. తాము శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం 500 మంది పోలీసులను పంపి సాగర్లో సగం స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకుని ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేసిందని తెలంగాణ సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. దీనివల్ల ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి అతిక్రమణలకు పాల్పడడం ఇది రెండోసారి అని చెప్పారు. సాగర్ కుడి కాలువకు నీటిని తరలించడం వల్ల హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. దీనిపై ఏపీ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో అక్టోబర్ 6న కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయిస్తే అదే రోజు అక్రమంగా ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్కు తెలంగాణ సర్కారు నీటిని తరలించిందని ప్రస్తావించారు. దీనివల్ల శ్రీశైలంలో తమకు కేటాయించిన నీటిలో 17 టీఎంసీలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తమ రాష్ట్రానికి నీటిని విడుదల చేసే సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలోనే ఉన్నా దాన్ని తెలంగాణ తన అధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేయకుండా హక్కులను హరిస్తోందన్నారు. తమ హక్కులను కాపాడుకోవడానికే సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నామని తేల్చి చెప్పారు. తెలంగాణ సర్కార్ తీరుతో వివాదాలు కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్మోహన్ సమావేశంలో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించగా తెలంగాణ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటోందని, ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరుతోందని ప్రస్తావించారు. తెలంగాణ సర్కార్ చర్యల వల్లే గెజిట్ నోటిఫికేషన్ అమలులో జాప్యం జరుగుతోందని, దీనివల్లే వివాదాలు ఉత్పన్నమవుతున్నాయని తేల్చి చెప్పారు. తాను శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వెళ్తే తెలంగాణ సర్కార్ తనను ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలోకి అనుమతించలేదని వెల్లడించారు. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ తెలంగాణ సర్కార్ కృష్ణా జలాలను వాడుకుంటోందని, ఇదే వివాదానికి కారణమవుతోందని ఆనంద్మోహన్ స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్ కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు.. సాగర్ డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న ఏపీ జలవనరుల శాఖ, పోలీసు సిబ్బందిని అడ్డుకున్న ఘటనకు సంబంధించి తెలంగాణ స్పెషల్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)పై రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై పల్నాడు జిల్లా విజయపురి సౌత్ పోలీస్స్టేషన్లో గురువారం రాత్రి కేసులు నమోదు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చర్చలు రెండు రాష్ట్రాల సీఎస్ల వాదనలు, కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, కృష్ణా బోర్డు ఛైర్మన్ అభిప్రాయాలను విన్న తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ బల్లా దీనిపై స్పందించారు. ఈనెల 3న తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ సాగర్పై స్టేటస్ కో కొనసాగుతుందని ప్రకటించారు. ఈలోగా ఈ వివాదంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు రాష్ట్రాలతో సమగ్రంగా చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తామని, అప్పటిదాకా సంయమనం పాటించాలని ఇరు రాష్ట్రాల సీఎస్లకు దిశానిర్దేశం చేశారు. కొనసాగుతున్న నీటి విడుదల రెండో రోజు సాగర్ కుడికాలువ ద్వారా 3,300 క్యూసెక్కులు దిగువకు సాక్షి, నరసరావుపేట, మాచర్ల, విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ భూభాగంలో ఉన్న 13 క్రస్ట్గేట్లు, హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనపర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం నీటి హక్కులపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. సాగర్ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కుల నీటి విడుదల రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం 5వ గేటు నుంచి 2,000 క్యూసెక్కులు, 2వ గేటు నుంచి 1,300ల క్యూసెక్కుల విడుదలను కొనసాగిస్తూ ఇరిగేషన్, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. సాగర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్రెడ్డి నేతృత్వంలో సుమారు 1,300 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తును పరిశీలించారు. -
నాగార్జున సాగర్ రగడ.. మంత్రి అంబటి క్లారిటీ
-
తుది దశకు ‘వెలిగొండ’
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు సిద్ధమైంది. ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేయించిన సీఎం జగన్.. రెండో సొరంగంలో శనివారం సాయంత్రానికి 18.465 కి.మీ.ల పొడవున తవ్వకం పనులు పూర్తి చేయించారు. మరో 335 మీటర్ల పనులే మిగిలాయి. రోజుకు 8 మీటర్ల చొప్పున పనులు చేయిస్తున్నామని.. డిసెంబర్లోగా పూర్తవుతాయని సీఈ మురళీనాథ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు తరలించనున్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం జగన్ చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో పనుల వరద శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులు తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4.37,300(తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో వైఎస్సార్ 2004, అక్టోబర్ 27న దీనికి శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్తో పాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసేలా 23 కి.మీ. పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ చానల్ పనులు చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులు చేపట్టారు. ఖజానాను లూటీ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండం నుంచి గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసమే ఖర్చు చేశారు. విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63(çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లు ఇచ్చి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి, వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి.. కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. శరవేగంగా పూర్తి చేయించిన సీఎం జగన్ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే, మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019, నవంబర్లో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులనూ అదే ఏడాది పూర్తి చేయించారు. రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దు చేసిన సీఎం జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్ల తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ సొరంగం పనులు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందుంచారు. రెండో సొరంగంలో టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడమే కష్టంగా మారింది. దీంతో గతేడాది మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ., 16.555 కి.మీ., 14.5 కి.మీ., 13.5 కి.మీ., 12.5 కి.మీ. వద్ద సొరంగాలు తవ్వి.. అక్కడ మనుషులతో పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే 7.363 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేయించింది. మిగిలిన 335 మీటర్ల పనులు డిసెంబర్లోగా పూర్తికానున్నాయి. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.700 కోట్లకు పైగా వ్యయం చేసి.. ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం జగన్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. -
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
విశాఖలో విప్రో విస్తరణ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ పరిశ్రమలకు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే పలు సంస్థలు తమ శాఖల్ని ఇక్కడ విస్తరిస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో దిగ్గజ ఐటీ సంస్థ విప్రో చేరింది. విశాఖలో ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్టు ఆ సంస్థ ‘ప్రాజెక్ట్ లావెండర్’ పేరు తో ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లలో విశాఖ వెళ్లేందుకు ఉన్న ఉద్యోగుల వివరాల్ని ఈ మెయిల్స్ ద్వారా సేకరించే పనిలో విప్రో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థను 1000 సీట్లకు విస్తరించే విషయంపై ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం, ఎపిటా జరిపిన చర్చల్లో విప్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సంస్థ ప్రకటనతో విశాఖ ఐటీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఇప్పుడు మహా నగరాల నుంచి టైర్–2 సిటీల వైపు చూస్తున్నాయి. టెక్ మహీంద్ర, హెచ్సీఎల్, యాక్సెంచర్, రాండ్స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్ మొదలైన ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులేస్తున్నాయి. ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తాజాగా విప్రో కూడా అదే బాటలో విశాఖలో విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ సమయంలో వర్క్ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు.. తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపించని నేపథ్యంలో వారి వద్దకే వెళ్లేందుకు ఐటీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ వ్యయాల్ని తగ్గించుకునేందుకు ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా విప్రో కూడా విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చింది. ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో.. విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ డెవలప్మెంట్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వారికి విప్రో సంస్థ లేఖలు రాసింది. విశాఖ కేంద్రంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలు సేకరిస్తోంది. ఈ తరుణంలో తాజాగా విశాఖలో డేటా సెంటర్ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధి చెందుతున్న నగరాల్లో తమ సంస్థ డెవలప్మెంట్ సెంటర్ను విస్తరించేందుకు ప్రాజెక్ట్ లావెండర్ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా తొలి అడుగు విశాఖలో వేస్తున్నట్టు విప్రో స్పష్టం చేసింది. వైఎస్సార్ హయాంలో నాంది సత్యం జంక్షన్లో వైఎస్సార్ హయాంలో 2006 మేలో విప్రో క్యాంపస్కు ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం మూడున్నరేళ్ల తర్వాత విప్రో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 750 మందితో ప్రారంభించాలని భావించినా.. తొలుత 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. అయితే కోవిడ్ సమయంలో క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ కార్యకలాపాల జోరు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విప్రో ప్రతినిధులతో చర్చించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(ఎపిటా) గ్రూప్ సీఈవో కిరణ్రెడ్డి విప్రో ప్రతినిధి శశికుమార్తో పలు దఫా లుగా చర్చలు జరిపి.. విస్తరించేందుకు ఆహా్వనించారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన విప్రో.. కా ర్యకలాపాలు ప్రారంభించింది. దశల వారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించింది. మౌలిక సదుపాయాల పనులు పూర్తి విశాఖలో విస్తరణకు విప్రో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తోంది. గత క్యాంపస్లో కొంత భాగం ఇప్పటికే అద్దెకు ఇచ్చిన విప్రో.. ముందు భవనంలో ఇప్పటికే సేవలు ప్రారంభించింది. ఈ భవనంలోని అన్ని ఫ్లోర్లలోనూ తమ సంస్థ మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇందులో అద్దెకు ఇచ్చిన వారిని ఖాళీ చేయించారు. వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్ను మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే వీడీఐ ప్రాజెక్టులతో కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికే 1000 మందికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల్ని దాదాపు పూర్తి చేసింది. మానవ వనరుల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం సంస్థ సేవల్ని విశాఖలో విస్తరిస్తామని ప్రభుత్వంతో విప్రో స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి కల్లా 1000 సీట్లకు పెంచుతామని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు విప్రో ప్రతినిధులు హామీ ఇవ్వడం శుభపరిణామం. వైజాగ్లో టాలెంట్, అప్స్కిల్లింగ్, అనుభవజు్ఞలైన నిపుణుల్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేశాం. భవిష్యత్తులో ఏ క్లైయింట్ వచ్చినా.. ఇక్కడికే తీసుకురావాలని సూచించాం. దానికి కావాల్సిన మానవ వనరుల్ని అందిస్తామన్నాం. దానికి విప్రో ప్రతినిధులు కూడా అంగీకరించారు. ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సహకారంతో పాటు విప్రో ప్రాజెక్టులకు అవసరమైన రిక్రూట్మెంట్కు కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చాం. – కిరణ్రెడ్డి, ఎపిటా గ్రూప్ సీఈవో -
చైనా బిగ్ ప్లాన్.. పుతిన్ మద్దతు
తాయ్ పీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనకు బయల్దేరారు. మంగళవారం చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘన స్వాగతం లభించింది. ద్వైపాక్షిక విషయాలతో పాటు పలు ఇతర అంశాల్లో ఇరు దేశాల బంధం ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఈ పర్యటన తాజా నిదర్శనమని అంటున్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా అవి ఇప్పటికే పరోక్షంగా జట్టు కట్టడం తెలిసిందే. అందులో భాగంగా ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు పలుకుతోంది. విదేశాల్లో ఆర్థిక, భౌగోళిక, దౌత్యపరమైన ఆధిపత్యం సాధించేందుకు చైనా ప్రదర్శిస్తున్న దూకుడుకు రష్యా దన్నుగా నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు (బీఆర్ఐ)కు కూడా రష్యా మద్దతు పలుకుతోంది. ఆ ప్రాజెక్టులో తనకేమీ తప్పుడు ఉద్దేశాలు కనిపించడం లేదని చైనా అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ చెప్పారు కూడా. బీఆర్ఐ పదో వార్షికోత్సవానికి ఆయన హాజరవుతున్నారు. దీని ద్వారా మధ్య ఆసియాలోని మాజీ సోవియట్ యూనియన్ దేశాల మధ్య ఆర్థిక బంధం ఏర్పాటు చేయాలని ఆశాభావం వెలిబుచ్చారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగేందుకు కొద్ది వారాల ముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు. ఇక జిన్ పింగ్ కూడా మార్చిలో రష్యాలో పర్యటించారు. ఆ దేశంపై అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలను దుయ్యబట్టారు. ఇది కూడా చదవండి: గాజా ఆస్పత్రిపై భీకర దాడి -
సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది?
ఆధునిక నిర్మాణాలకు సౌదీ అరేబియా పెట్టిందిపేరు. ప్రపంచంలోని ఏ పెద్ద కట్టడానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా ముందుగా సౌదీ అరేబియా పేరే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా భారీ స్మార్ట్ సిటీ నిర్మాణంలో తలమునకలై ఉంది. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. నియోమ్.. ఇది అనేది వాయువ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్లో నిర్మాణంలో ఉన్న అద్భుత స్మార్ట్ సిటీ. ఈ ప్రదేశం ఎర్ర సముద్రానికి ఉత్తరంగా, ఈజిప్టుకు తూర్పున అకాబా గల్ఫ్ సమీపంలో, జోర్డాన్కు దక్షిణంగా ఉంది. 500 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ భవిష్యత్ నగరం సంపూర్ణంగా ‘స్వచ్ఛమైన శక్తి’తో మనుగడ సాగించనుంది. ఈ అధునాతన సిటీలో కార్లు ఉండవు. రోడ్లు కూడా ఉండవు. జీరో కార్బన్ ఉద్గారాలతో స్మార్ట్ సిటీ కాలుష్య రహితంగా ఉండనుంది. కాగా ఈ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో 20 శాతం పనులు పూర్తయ్యాయని నియోమ్ సీఈఓ నద్మీ అల్ నాస్ర్ మీడియాకు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. నియోమ్ అనేది గ్రీకు పదం. నియో అంటే కొత్తది. ఎం అనేదానిని అరబిక్ పదం ముస్తాక్బాల్ నుంచి తీసుకున్నారు. దీని అర్థం భవిష్యత్తు. నియోమ్ అనే పదాన్ని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి కూడా తీసుకున్నారని చెబుతారు. ఎర్ర సముద్ర తీరంలో 26,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగాసిటీ ప్రాజెక్ట్ను చేపట్టనున్నట్లు 2017 అక్టోబరులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ప్రకటించారు. రియాద్లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్లో ఎంబీఎస్ ఈ ప్రకటన చేశారు. ఇది సౌదీ అరేబియా- 2030 విజన్లలో ఒకటి. దీనిని సౌదీ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేసే లక్ష్యంలో నిర్మిస్తున్నారు. నియోమ్ అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిర్మాణాలకు భిన్నంగా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికంటూ సొంత పన్ను, కార్మిక చట్టాలు, ‘స్వయంప్రతిపత్త న్యాయ వ్యవస్థ’ ఉంటుందని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్లో పోర్ట్లు, ఎంటర్ప్రైజ్ జోన్లు, పరిశోధనా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, క్రీడా కేంద్రాలు, వినోద వేదికలు ఉంటాయని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వంద శాతం శక్తిని అందుకుంటుంది. సూర్యరశ్మి, గాలి, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే నియోమ్ వినియోగిస్తుంది. ఫలితంగా ఈ సిటీలో కర్బన ఉద్గారాల విడుదల ప్రస్తావనే ఉండదు. ఈ నగరానికున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి తరలించరు. దానిని తిరిగి పారిశ్రామిక ముడి పదార్థంగా వినియోగిస్తారు. వ్యవసాయం విషయంలో కూడా నియోమ్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. గ్రీన్హౌస్ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధిగల నగరాన్ని సృష్టించనున్నారు. సౌదీ అరేబియా ప్రస్తుతం 80 శాతం మేరకు ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇది కూడా చదవండి: అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది? -
రూరల్ రోడ్ల పనుల నాణ్యత భేష్
సాక్షి, అమరావతి: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సహాయంతో చేపట్టిన ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఆ బ్యాంకు ప్రతినిధి బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బ్యాంకు సహాయంతో చేపట్టిన ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం 5 రోజులపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించింది. జిల్లా స్థాయి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశమై పనుల ప్రగతిని, నాణ్యతను పరిశీలించింది. తదనంతరం మంగళవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డితో ఈ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించి పనులపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తమ బ్యాంకు ఆర్థిక సహాయంతో జరుగుతున్న గ్రామీణ రహదారి పనుల్లో నాణ్యతతో కూడిన ఒక ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. రూ.5,026 కోట్లతో పనులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించడంతోపాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణ సహాయంతో ఏపీ రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా.. ఏఐఐబీ రూ.3,418 కోట్లను రుణంగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,608 కోట్లను సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3,665 పనులు చేపట్టి 7,213 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటికే కాంపొనెంట్–1ఏ కింద 6,215 కిలోమీటర్ల పొడవున 3,231 పనులు చేపట్టగా.. ఇప్పటికే 2,450 కి.మీ. పొడవు గల 1,201 పనులు పూర్తయ్యాయి. మరో 3,765 కి.మీ. పొడవు గల 2,030 పనులు ప్రగతిలో ఉన్నాయి. కాంపొనెంట్–1బీ కింద 364 కి.మీ. పొడవు గల 142 పనులు చేపట్టగా.. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కమిషనర్ సురేశ్కుమార్, పంచాయతీరాజ్ ఈఎన్సీ బాలూనాయక్, ఏఐఐబీ ప్రతినిధి బృందం లీడర్ ఫర్హద్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్కుమార్, పర్యావరణ, సోషల్ ఎక్స్పర్ట్ శివ, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ ప్రదీప్, ట్రాన్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ తౌషిక్ పాల్గొన్నారు. -
నేడు శ్రీనివాస సేతు ప్రారంభం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోని నాలుగు దిక్కులను కలుపుతూ యాత్రికులు నేరుగా తిరుమల వెళ్లేందుకు అత్యాధునిక రీతిలో నిర్మిం చిన శ్రీనివాస సేతు (ఫ్లైఓవర్) ప్రారంబోత్సవం, ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ వర్చువల్ ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ (తిరుపతి–చెన్నై జాతీయ రహదారిలోని వడమాలపేట వద్ద 307 ఎకరాల్లో 3,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు) కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమల చేరుకుని వకుళమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్లు ప్రారంభిస్తారు. బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేష వాహనం సేవలో పాల్గొని, రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. నీటి పథకాలకు ప్రారంబో త్సవం మంగళవారం ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన 68 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నంద్యాల జిల్లా డోన్కు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. -
2030 నాటికి ఇస్రో నుంచి స్పేస్ టూరిజం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3, సూర్యయాన్ వంటి ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రస్తుతం గగన్యాన్ ప్రాజెక్ట్కు సిద్ధమవుతోంది. మరోవైపు 2030 నాటికి స్పేస్ టూరిజానికి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. గగన్యాన్ ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాలను, అనంతరం మానవ సహిత ప్రయోగాలను నిర్వహించనుంది. మానవ సహిత ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన వెంటనే స్పేస్ టూరిజం వైపు అడుగులు వేయనుంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో వెబ్సైట్లో గురువారం వివరాలు పేర్కొన్నారు. గగన్యాన్ ప్రయోగాల్లో మానవ సహిత ప్రయోగాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకువచ్చిన తర్వాత ఇస్రో స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ చేపడుతుందని సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరడం ఖాయమవుతుందని తెలిపారు. కాగా యువత శాస్త్రవేత్తలుగా ఎదిగి ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బీవీ సుబ్బారావు సూచించారు. సూళ్లూరుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు’ అనే అంశంపై గురువారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బీవీ సుబ్బారావు మాట్లాడుతూ భారత అంతరిక్ష యాత్ర.. నేడు చంద్రుడు, సూర్యుడిపై అధ్యయనం కోసం గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించే స్థాయికి చేరిందని వివరించారు. -
దోపిడీకి రాచబాట
రాజధాని అమరావతిని చంద్రబాబు తన అవినీతికి అక్షయపాత్రగా మార్చుకున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన అవినీతికి సాధనంగా చేసుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. అందుకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్. కేవలం కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం చంద్రబాబుకే చెల్లింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ చైర్మన్గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో చినబాబు లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లుకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు కూడా పిడికెడు వాటా ఇవ్వడం కొసమెరుపు. ఇంతటి భారీ అవినీతికి రాచబాట వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెనుక గూడు పుఠాణీ ఇలా సాగింది. –సాక్షి, అమరావతి చంద్రబాబు అలైన్మెంట్కు కన్సల్టెన్సీ ద్వారా రాజముద్ర సీఆర్డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంపై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఎందుకంటే ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెద్దపరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా వెళ్తుంది. అంటే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి నిర్మించాల్సి వస్తుంది. దాంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలు ఉన్న తాడికొండ, కంతేరు, కాజలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజలలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్మెంట్ను రూపొందించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తీసుకొచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన అలైన్మెంట్కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. తాడికొండ, కంతేరు, కాజలలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్మెంట్ను ఎస్టీయూపీ ఖరారు చేసింది. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, ఆయన బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజలలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేశారు. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. కాగా మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారులో నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా పెంచుకున్నారు. సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు. గుంటూరు జిల్లాలోని నూతక్కి–కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప–ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్రోడ్డు కొనసాగుతుంది. అయితే అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో ఈ అలైన్మెంట్పై నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్మెంట్ను మార్చాలని ఆదేశించారు. దాంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం–కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఖరారు చేశారు. ఏ–1 చంద్రబాబు, ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రింగ్రోడ్డు కుంభకోణంపై సీఐడీ సమగ్ర దర్యాప్తు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ, ఏ–3 లింగమనేని రమేశ్, ఏ–4 లింగమనేని రాజశేఖర్, ఏ–5 అంజినీ కుమార్, ఏ–6గా లోకేశ్లపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసం, నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. -
‘పాలమూరు’ పూర్తికాకుండానే ప్రారంభోత్సవమా?
సాక్షి, హైదరాబాద్: ‘సగం పనులు కూడా కాని ప్రాజెక్టుకు ప్రారంబోత్సవాలట. పూర్తే కాని రిజర్వాయర్లకు పూజలట’ అని ఎద్దేవా చేస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. స్వరాష్ట్రంలో ప్రారంభించిన తొలి ప్రాజెక్టు పాలమూరు– రంగారెడ్డిని కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం నామమాత్రం పనులు చేసి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనే భ్రమను సృష్టిస్తున్నారన్నారు. వాస్తవానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 50% కూడా కాలేదని, అందులోని 4 రిజర్వాయర్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని పేర్కొన్నారు. కానీ ప్రాజెక్ట్ మొత్తం కట్టినట్లు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కాలువలకు భూసేకరణ కూడా పూర్తి కాలేదంటే, పాల మూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. -
భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు
-
దేశ భద్రతకు‘పంచ’ కవచాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటి వరకు షిప్ రిపేర్ హబ్గా మాత్రమే కొనసాగుతున్న విశాఖపట్నం హిందూస్థాన్ షిప్యార్డ్.. త్వరలోనే షిప్ బిల్డింగ్ హబ్గా అత్యుత్తమ సేవలందించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారించిన షిప్యార్డ్ అందుకోసం భారత నౌకాదళంతో కీలక ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ క్రమంలో రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దేశ చరిత్రలో ఏ షిప్యార్డ్ నిర్మించని విధంగా ఏకంగా 44 వేల టన్నుల షిప్స్ని నిర్మించనున్న హెచ్ఎస్ఎల్... 2027 ఆగస్ట్లో తొలి యుద్ధనౌకని ఇండియన్ నేవీకి అప్పగించనుంది. యుద్ధ విన్యాసాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా షిప్ డిజైన్లతో పాటు.. రక్షణ వ్యవస్థలోనే కాకుండా.. విపత్తు నిర్వహణకు వినియోగించేలా షిప్లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సింధుకీర్తి సబ్మెరైన్ మరమ్మతుల విషయంలో హిందుస్థాన్ షిప్యార్డ్ అపవాదు మూటకట్టుకుని.. తొమ్మిదేళ్లకు పూర్తి చేయడంతో షిప్యార్డ్డ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఐఎన్ఎస్ సింధువీర్ మరమ్మతుల్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఆ మరకని తుడిచేసుకున్న షిప్యార్డ్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ.. ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హెచ్ఎస్ఎల్.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీ గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్ పనుల్ని ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. మొత్తంగా హిందుస్థాన్ షిప్యార్డ్ పనితీరుతో విశాఖ.. షిప్ బిల్డింగ్ కేంద్రంగా మారుతోంది. రూ.19 వేల కోట్లు.. 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,038 కోట్ల టర్నోవర్ సాధించిన షిప్యార్డ్ .. ఈ ఏడాది ఏకంగా రూ.19,048 కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్)ను భారత నౌకాదళం, కోస్ట్గార్డు కోసం తయారు చేసేందుకు శుక్రవారం భారత రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.హైవాల్యూస్తో ఈ నౌకల నిర్మాణాలు చేపట్టనుంది. దేశంలోని ఏ షిప్యార్డ్లోనూ లేనివిధంగా ఏకంగా 44 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యమున్న నౌకల్ని తయారు చేయనుంది. ఈ నౌకల నిర్మాణాలతో 2023–24 నుంచి హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం రూ.1,038 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న íషిప్యార్డ్ .. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 నుంచి 2 వేల కోట్ల రూపాయలకు చేరుకోనుంది. 8 సంవత్సరాల కాల పరిమితితో ఈ షిప్స్ని తయారు చేయనుంది. తొలి షిప్ని 2027 ఆగస్ట్ 24న భారత నౌకాదళానికి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్లలో మరింత అభివృద్ధి.. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా.. షిప్యార్డ్ను ఆధునికీకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ.1,000 కోట్లతో యార్డుని రానున్న మూడేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్లిప్వేలు 190 మీటర్లుండగా వీటిని 230 మీటర్లకు పెంచనున్నారు. ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మరమ్మతులు, నౌకా నిర్మాణాలకు అనుగుణంగా రూ.5 వేల కోట్లతో మెటీరియల్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 364 వెండార్ బేస్డ్ ఎంఎస్ఎంఈల సహకారం తీసుకుంటున్నారు. లక్షల మందికి ఉపాధి టెండర్లు దక్కించుకోవడంలో దూకుడు పెంచాం. తాజాగా 50 టన్స్ బొలార్డ్ పుల్ టగ్ బాల్రాజ్ మరమ్మతులు పూర్తి చేసి నేవల్ డాక్యార్డు (విశాఖపట్నం)కు అందించాం. అందుకే.. ఆర్డర్లు కూడా పెద్ద ఎత్తున సొంతం చేసుకుంటున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం.. షిప్యార్డ్ భవిష్యత్తుని మార్చబోతోంది. ఈ ఎంవోయూ ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. విశాఖ భవిష్యత్తు కూడా మారబోతుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా.. మేక్ ఇన్ ఇండియాని చాటిచెప్పేలా షిప్స్ తయారు చేస్తాం. దేశీయ నౌకల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. సబ్మెరైన్ల నిర్మాణం, రీఫిట్కు సంబంధించిన సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పనతో మరింత ఆధునికీకరించుకునేందుకు రష్యాతోనూ సమగ్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. – కమోడోర్ హేమంత్ ఖత్రి, హిందుస్థాన్ షిప్యార్డు సీఎండీ -
మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ..
మన దేశమంతా ఆగస్టు 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేరోజు చంద్రయాన్-3 చంద్రుని ఉపరితంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 ఆర్థిక బడ్జెట్ 615 కోట్ల రూపాయలు(75 మిలియన్ డాలర్లు) 2023, జూలై 14న చంద్రయాన్-3 లాంచ్ బటన్ను నొక్కారు. అప్పటి నుండి చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపైకి ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని భారతదేశమంతా ఎదురుచూస్తోంది. పలువురు నెటిజన్లు చంద్రయాన్-3 బడ్జెట్ను కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్తో పోలుస్తున్నారు. 2009లో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవతార్ బడ్జెట్ దాదాపు రూ.1970 కోట్లు. చంద్రయాన్-3 మొత్తం బడ్జెట్ రూ.615 కోట్లు. అంటే అవతార్ సినిమా ఖర్చులోని మూడో వంతు మొత్తంతో చంద్రయాన్-3ని చంద్రునిపైకి పంపడంలో భారత్ విజయం సాధించిందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే హాలీవుడ్ సినిమా ఇంటర్స్టెల్లర్కు 165 మిలియన్ల డాలర్లు ఖర్చుకాగా, చంద్రయాన్ 75 మిలియన్ డాలర్లతోనే విజయం సాధించిందని అంటున్నారు. రూ. 615 కోట్లు అంటే భారత్కు భారీ మొత్తమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇది శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయం అని కొందరు, వారి నాలుగేళ్ల శ్రమ వృథాగా పోలేదని మరికొందరు అంటున్నారు. శాస్త్రవేత్తల కృషికి సెల్యూట్ అని, శాస్త్రపరిశోధనలకు భారతదేశం మరింతగా ఖర్చు చేయాలని యూజర్లు సలహా ఇస్తున్నారు. కొందరు యూజర్లు చంద్రయాన్-3 ప్రాజెక్టును సినిమాల నిర్మాణ వ్యయంతో పోల్చడం సరికాదని అన్నారు. భారతీయులు వ్యయ నియంత్రణతో ఈ ప్రాజెక్టు చేపట్టారని, చంద్రయాన్ ప్రయోగం ప్రతీ భారతీయునికి గర్వకారణమని మరికొందరు అంటున్నారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. Kinda crazy when you realize India's budget for Chandrayaan-3 ($75M) is less than the film Interstellar ($165M)😯🚀 #Chandrayaan3 #moonlanding pic.twitter.com/r2ejJWbKwJ — Newsthink (@Newsthink) August 21, 2023 -
హల్దీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లి.. ఆపై ఏం జరగనట్టుగా..
సంగారెడ్డి: ఈతకు వెళ్లిన ముగ్గురిలో ఒకరు నీటమునిగి మృతిచెందారు. మిగతా ఇద్దరు అసలు ఏం జరగనట్టు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గొర్రెల కాపారుల ద్వారా తెలుసుకున్న సర్పంచ్ నిలదీయడంతో సమాచారం బయటికొచ్చింది. ఈ ఘటన వెల్దుర్తిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మధుసూదన్ గౌడ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం బొమ్మారానికి చెందిన మెట్టెల నాగరాజు, మెట్టెల శ్రీకాంత్, మెట్టెల సందీప్ ముగ్గురు స్నేహితులు. హకింపేట శివారులోని హల్దీ ప్రాజెక్ట్లో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్ళారు. నదిలో దిగిన క్రమంలో నీటి ప్రవాహానికి సందీప్(16) గల్లంతయ్యాడు. ఇది జరిగిన కొద్దిసేపటికి మిగతా ఇద్దరు తమకేమీ తెలియదు అన్నట్లుగా అక్కడి నుంచి గట్టుపై ఉన్న సందీప్ దుస్తులు తీసుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. రాత్రి పది గంటల సమయంలో కొప్పులపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపారుల ఇచ్చిన సమాచారంతో బొమ్మారం సర్పంచ్ శంకర్ వారిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పారు. గట్టి నిలదీయగా అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో సోమవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు హల్దీ ప్రాజెక్ట్లో వెతకగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
రాష్ట్రంలో 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధర, పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎస్ఎఫ్పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. దీంతో రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సోమవారం విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్రెడ్డి, బీవోబీ డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 35 శాతం (రూ.29.40కోట్లు) సబ్సిడీగా భరిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం (రూ.8.40 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు.మిగిలిన 55 శాతం (రూ.46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, గ్రామీణ మహిళా సాధికారత ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలన్నారు. కర్నూలులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా ఒక్కో మహిళ సగటున రూ.12 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పారు. బి, సి గ్రేడ్ ఉల్లి, టమాటాలకు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 3,500 యూనిట్లు, మిగిలిన జిల్లాల్లో మరో 1,500 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్ డీజీఎం చందన్ సాహూ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులకు ఆర్థి క చేయూతనిచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎఫ్పీఎస్ స్టేట్ లీడ్ సుభాష్ కిరణ్ కే, మేనేజర్ సీహెచ్ సాయి శ్రీనివాస్, బ్యాంక్ రీజనల్ మేనేజర్లు కె.విజయరాజు, పి.అమర్నాథ్రెడ్డి, ఎంవీ శేషగిరి, ఎంపీ సుధాకర్, రీజనల్ ఇన్చార్జి డి. రాజాప్రదీప్, డీఆర్ఎం ఏవీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరులోగా గ్రిడ్కు ‘సూపర్ థర్మల్’!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2 *800) మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి దశలోని 800 మెగావాట్ల యూనిట్ను ఈ నెలాఖరులో గా గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. తొలి యూనిట్ ద్వారా గత రెండు వారాలుగా 650 మెగావాట్ల వరకు నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా నిరంతరంగా 72 గంటల పాటు పూర్తి స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాణిజ్యపరమైన ఉత్పత్తికి అర్హత సాధించిన తేదీ(కమర్షియల్ ఆపరేటింగ్ డేట్/సీఓడీ)ని ప్రకటిస్తారు. సీఓడీ ప్రకటన తర్వాత విద్యుత్ కేంద్రాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 800 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యంతో తొ లి యూనిట్లో విద్యుదుత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను 27 నుంచి గ్రిడ్కు సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నుంచి ఇటీవల స్లాట్లను పొందింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా తొలి యూనిట్ సీఓడీ ప్రకటన ప్రక్రియ పూర్తి చేసుకుని గ్రిడ్కు అనుసంధానం కానుంది. వచ్చే అక్టోబర్లో రెండో యూనిట్కు సీఓడీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణంలో మూడున్నరేళ్ల జాప్యం ! ఎన్టీపీసీ తొలి యూనిట్ నుంచి జూన్ 2020, రెండో యూనిట్ నుంచి నవంబర్ 2020 నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును జూలై 2023కు పొడిగించారు. యూనిట్–1 నిర్మా ణం దాదాపు 8 నెలల కిందటే పూర్తయింది. కాగా, బాయిలర్లోని రీహీటర్ ట్యూబ్స్కు పగుళ్లు రావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన సీఓడీ ప్రక్రియను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరమ్మతుల్లో భా గంగా ట్యూబ్స్కు పగుళ్లు వచ్చి న చోట కట్ చేసి వెల్డింగ్తో మళ్లీఅతికించారు. ఏకంగా 7,500 చోట్లలో వెల్డింగ్ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచి్చన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉండగా, తొలి దశ కింద 1,600 మెగా వాట్ల కేంద్రాన్ని నిర్మి స్తున్న విషయం తెలిసిందే. రూ.10,599 కోట్ల అంచనా వ్య యంతో తొలి దశ ప్రాజెక్టును చేపట్టగా, గత మార్చి నాటికి రూ.10,437 కోట్ల వ్య యం జరిగింది. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయా న్ని రూ.10,998 కోట్లకు పెంచారు. డిస్కంలకు ఊరట..! ఎన్టీపీసీ తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే నిరంతరం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు వీలుపడుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్ను రాష్ట్ర పంపిణీ సంస్థ (డిస్కం)లు అధిక ధరలతో పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు. -
ప్రాజెక్టుల జాప్యానికి బాధ్యుడు చంద్రబాబే
శ్రీకాకుళం (పాత బస్టాండ్): రాష్ట్రంలో ప్రాజెక్టుల జాప్యానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబునాయుడే నని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సాగునీరు, వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం నాలుగేళ్ల పాలన చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. శనివారం శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాజెక్టుల వద్దకు కనీస అవగాహనతో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. తమ ప్రభుత్వం పాలన ప్రారంభించి కేవలం నాలుగేళ్లు మాత్రమే అయిందని.. అందులో రెండేళ్లు కరోనా కష్టకాలంలోనే గడిచిపోయిందని గుర్తు చేశారు. ఇప్పటికే వంశధార ప్రాజెక్టు 77 శాతం పూర్తయిందని, డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కేవలం 23 శాతం మాత్రమే చేశారన్నారు. నేరడి బ్యారేజీ సమస్యపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించామని.. ఇలాంటి ప్రయత్నం చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ధర్మాన ప్రశ్నించారు. రూ.200 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తయారు చేసి సాగునీరు అందించడం జరుగుతోందని తెలిపారు. చంద్రబాబు నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తే, ఇటీవల వారికి రూ.200 కోట్లు మంజూరు చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తామంటున్న చంద్రబాబునాయుడు 14 ఏళ్లు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ‘విధ్వంసం’ అనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ‘నీరు–చెట్టు’ పేరుతో నాయకులు దోపిడీ చేశారన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి నేడు వ్యవసాయ రంగంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులపై ఇన్వెస్ట్మెంట్ దండగ అని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. -
Fact Check: అది బాబు వదిలేసిన పార్కే..
సాక్షి, అమరావతి: మెగా సీడ్ పార్క్ అంటూ చంద్రబాబునాయుడు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర అధికారంలో ఉన్నా ప్రాజెక్టుకు పైసా కూడా విదల్చలేదు. ఆయన వేసిన వేల శంకుస్థాపన శిలాఫలకాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోయింది. అయినా ఏనాడూ నోరుమెదపని రామోజీరావు ఈ పార్కును జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విషప్రచారానికి ఒడిగట్టారు. ఓ అబద్ధాల కథనాన్ని ఈనాడు అచ్చేసింది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్న చేయి పట్టుకొని నడిపిస్తున్న ప్రభుత్వంపై బురదజల్లుతూ ఈ కథనం వండివార్చింది. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. సాధారణంగా పంటల సాగు కోసం బ్రీడర్ సీడ్ నుంచి ఉత్పత్తి చేసిన ఫౌండేషన్ సీడ్ను రైతులకు ఇచ్చి వారి ద్వారా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా విత్తనోత్పత్తి చేస్తుంటారు. ఇలా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తికి రాష్ట్రంలో తొమ్మిది సీడ్ ఫామ్స్ ఉన్నాయి. వీటి ద్వారా 70 వేల క్వింటాళ్ల ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేస్తారు. ఈ సీడ్ను రైతులకు అందజేసి అవసరమైన విత్తనాన్ని తయారు చేస్తారు. ఏటా 10 లక్షల క్వింటాళ్ల వరి, వేరుశనగ, కందులు, శనగలు, చిరు ధాన్యాల విత్తనాలను తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. ఇలా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేసే ఫామ్స్లో కర్నూలు జిల్లా తంగడంచ సీడ్ ఫామ్ ఒకటి. 630 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సీడ్ ఫామ్లో స్థానికంగా డిమాండ్ ఉన్న కందులు, శనగల ఫౌండేషన్ సీడ్ను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో రూ.670 కోట్లతో మెగా సీడ్ పార్కు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. పైసా విదల్చకుండానే 2017 అక్టోబర్లో హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ దీనిని పట్టించుకోలేదు. అయితే ఈ తంగడంచలోని సీడ్ పార్కును వివిధ పంటల హైబ్రిడ్ సీడ్ మూల విత్తన ఉత్పత్తి క్షేత్రంగా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈ పార్కు కోసం 2018లోనే అప్పటి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందంటూ ఓ పెద్ద అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. నిజంగా ని«ధులు కేటాయించి ఉంటే శంకుస్థాపన చేసిన తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్న బాబు ఎందుకు గాలికొదిలేశారో రామోజీకే తెలియాలి. -
వాయువేగంతో వెలిగొండ
సాక్షి, అమరావతి: ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఫలాలను అందించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారనడానికి మరో తార్కాణమిది. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో సొరంగం పనులను శరవేగంగా కొలిక్కి తెస్తోంది. ఇప్పటికే 17.924 కి.మీ. పొడవున సొరంగం తవ్వకం పనులు పూర్తి కాగా మిగతా 876 మీటర్ల పనులను అక్టోబర్లోగా పూర్తి చేసేలా ముమ్మరం చేసినట్లు సీఈ మురళీనాథ్రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. శ్రీకారం చుట్టిన వైఎస్సార్ ఈ ఏడాదే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్కు తరలించి తొలి దశ పూర్తి చేసే దిశగా పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్లో నిల్వ చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టి పడియ కాలువ ద్వారా 9,500, గుండ్ల బ్రహ్మేశ్వరం రిజర్వాయర్ ద్వారా 3,500, రాళ్లవాగు ద్వారా 1,500) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో దివంగత వైఎస్సార్ 2004 అక్టోబర్ 27న వెలిగొండకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులను పూర్తి చేశారు. సొరంగాలను నల్లమల సాగర్తో అనుసంధానించి 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక 1996 లోక్సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే అదికూడా శంకుస్థాపన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. 2014లో మళ్లీ అధికారంలో ఉండగా వెలిగొండను చంద్రబాబు కామధేనువులా మార్చుకున్నారు. రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి లేకపోవడం గత సర్కారు లూటీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ని వర్తింపజేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా రూ.650 కోట్లకుపైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు రాబట్టుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిచ్చిన చంద్రబాబు చివరకు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి అంచనా వ్యయాన్ని పెంచేశారు. అనంతరం వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. స్వప్నాన్ని సాకారం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దివంగత వైఎస్సార్ చేపట్టిన వెలిగొండను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019 నవంబర్లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేశారు. శ్రీశైలం నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తి చేశారు. వెలిగొండ పనులకు ఇప్పటిదాకా రూ.953.12 కోట్లను వ్యయం చేసి ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేసేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. గత సర్కారు అంచనా వ్యయం పెంచిన రెండో సొరంగంలో మిగిలిన పనులను రద్దు చేసిన సీఎం జగన్ వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. నాడు టీడీపీ సర్కార్ నిర్దేశించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువ వ్యయంతో పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ. సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. వైఎస్సార్ హయాంలోనే నల్లమల పర్వత శ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో విస్తరించిన వెలిగొండ కొండల మధ్య సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద కాంక్రీట్ ఆనకట్టలు నిర్మించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్ను పూర్తి చేశారు. శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్కు తరలించేందుకు వీలుగా 23 కి.మీ. పొడవున ఫీడర్ ఛానల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండో సొరంగంలో కాలం చెల్లిన టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) స్థానంలో గతేడాది మనుషుల ద్వారా పనులను చేపట్టారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద మనుషుల ద్వారా సొరంగాన్ని తవ్విస్తున్నారు. ఇప్పటికే 6.822 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేసింది. మిగిలిపోయిన మరో 876 మీటర్ల పనులు అక్టోబర్లోగా పూర్తవుతాయి. -
‘కడెం’ కష్టమే.. ప్రాజెక్టు నిర్వహణపై చేతులెత్తేసిన నీటిపారుదలశాఖ
సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. నిర్వహణతో నెట్టుకురాలేమని, తరచూ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, గేట్లు మొరాయిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి దిగువకు 3.82 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉన్నా, గతేడాది జూలై 13న రికార్డు స్థాయిలో 5,09,025 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ప్రాజెక్టు ఎత్తు 700 అడుగులు కాగా అప్పట్లో ప్రాజెక్టుపై నుంచి 706 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. గతనెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టుపై నుంచి 702 అడుగుల ఎత్తులో వరద పారింది. గేట్ల మొరాయింపుతోనే సమస్య గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు పంపించడం సాధ్యం కావడం లేదు. టాప్సీల్ గేట్ల కారణంగా వీటి నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. గతేడాది వచ్చిన వరదలకు 4 గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలడం సాధ్యం కాలేదు. మళ్లీ ఆ గేట్లకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. గత నెలలో వ చ్చి న వరదల సమయలోనూ మరో 4 గేట్లు మొరాయించడంతో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గేట్లకు అప్పటికప్పుడు మరమ్మతులు చేసి పైకి ఎత్తగలిగారు. మరో గేటుకు తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు. చివరి గేటుకు మరమ్మతులు సాధ్యం కాలేదు. గేట్ల విడి భాగాలు లభించడం లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించుకోవాలనుకున్నా, వీటి డిజైన్లు, డ్రాయింగ్స్ అందుబాటులో లేవు. కడెం ప్రాజెక్టు 18 గేట్లను పైకి ఎత్తడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. అయితే కడెం నదిపరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో గంట వ్యవధిలో కడెం ప్రాజెక్టుకు గత నెలలో 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. మూడు చోట్ల పగుళ్లు.. ప్రాజెక్టు గేట్ల మధ్య పిల్లర్ తరహాలో ఉంటే కట్టడాన్ని పీయర్స్ అంటారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మూడు పీయర్స్కు అర్ధ అంగుళం నుంచి అంగుళం నిడివితో పగుళ్లు వచ్చాయి. వీటికి సిమెంట్ మిశ్రమంతో మూసి గ్రౌటింగ్తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. భవిష్యత్లో ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తే పగుళ్లు వచ్చిన పీయర్స్ ఉధృతిని తట్టుకోవడం కష్టమేనని, అకస్మాత్తుగా కొట్టుకుపోతే దిగువన ఉన్న గ్రామాలు నీటమునిగే ప్రమాదముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుఫ్తీ కడితే పెద్దగా ప్రయోజనం ఉండదు.. ఎగువ పరీవాహక ప్రాంతంలో కుఫ్తీ డ్యాం నిర్మిస్తే కడెం ప్రాజెక్టుపై వరద ఉధృతి తగ్గుతుందని గతంలో నీటిపారుదల శాఖ భావించింది. అయితే కుఫ్తీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెంపై పెద్దగా వరద ఒత్తిడి తగ్గదని, ఎగువ నుంచి వచ్చే వరదను ముందస్తుగా అంచనా వేసేందుకు అవసరమైన సమయం మాత్రం లభిస్తుందని తాజాగా నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఆధునీకరణ ప్రతిపాదనలు ఇలా.. కొత్తగా రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాలి. అదనంగా 1.5 లక్షల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా డిజైన్ చేయాలి. అదనపు గేట్లు, కొత్త స్పిల్వే నిర్మించాలి. గతేడాది డ్యామ్ సేఫ్టీ అండ్ రిçహాబిలేషన్ ప్రోగ్రామ్(డీఎస్ఆర్పీ) కింద నిపుణులతో అధ్యయనం చేయించినా ఇదే సూచనలు చేసినట్టు సమాచారం. -
పోలవరం ప్రాజెక్టులో తాగునీటి విభాగం ఖర్చూ భరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్రం అంగీకరించింది. ప్రాజెక్టులో కేవలం సాగు నీటి విభాగం పనులకే నిధులిస్తామని, తాగు నీటి విభాగం ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్లూ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. సీఎం జగన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు నిధులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఈ విషయం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, వరదల కారణంగా ప్రాజెక్టులో దెబ్బతిన్న చోట్ల మరమ్మతులకు అదనంగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిరభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. అదేవిధంగా తాగు నీరు కాంపొనెంట్ ఖర్చును కూడా ఇవ్వడానికి అభ్యంతరం లేదని సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. వేధింపుల నిరోధక చట్టంలో బాధితులకూ శిక్షలా? వేధింపుల నిరోధక చట్టంలో ఫిర్యాదుదారులను శిక్షించే పరిస్థితి కూడా ఉండడంతో బాధితులు ముందుకు రావడంలేదని, దీని పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఎంఎస్ఎంఈ సహాయ మంత్రి భాను ప్రతాప్ వర్మ స్పందిస్తూ.. లైంగిక వేధింపులపై బాధిత మహిళలు చేసే ఫిర్యాదులను అంతర్గత కమిటీ అన్ని కోణాల్లో క్షుణ్నంగా దర్యాప్తు చేసిన మీదటే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వలు ఇండియన్ మినరల్స్ ఇయర్ బుక్ – 2021 ప్రకారం ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వల సామర్ధ్యం ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంట్లో 5.3 టన్నుల నిరూపిత, సంభావ్య నిల్వలు, 41.87 టన్నుల మిగిలిన వనరులు ఉన్నాయని వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనల ప్రకారం రామగిరి, పెనకచర్ల బంగారు క్షేత్రాలు, జోనగిరి షిస్ట్ బెల్ట్, సౌత్ చిగర్గుంట – బిసనట్టం గోల్డ్బెల్ట్లో బంగారు నిల్వలు గుర్తించారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం ప్రతిపాదన లేదు సెయిల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. కాగా ఆత్మనిర్భర భారత్లో భాగంగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్(పీఎస్యూ) విధానానికి అనుగుణంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.(ఆర్ఐఎన్ఎల్) షేర్హోల్డింగ్లో 100% పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం పొందిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. -
పోలవరం కాంట్రాక్టర్ని మార్చొద్దన్నా మార్చేశారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చొద్దని ఎంతచెప్పినా వినకుండా సీఎం జగన్ మార్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో పెట్టిన కాంట్రాక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని పీపీఏ చెప్పినా వినలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ చేశారని, జీవనాడి అయిన ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, రివర్స్ పోకడల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సీఎం మూర్ఖపు నిర్ణయాలే కారణమని చెప్పారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11,537 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంపు బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు వారిని ముంచేశారని విమర్శించారు. వైఎస్ చేసిన పనుల వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2009 వరకు ఎలాంటి పురోగతి లేదని, మొత్తం ప్రాజెక్టుని వైఎస్ సమస్యల సుడిలోకి నెట్టేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్ది తాను ప్రాజెక్టు పనులు ప్రారంభించానని చెప్పారు. తమ హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వైఎస్సార్సీపీ వచ్చాక కేవలం నాలుగుశాతం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు సకల వసతులతో కాలనీలు నిరి్మస్తానని చెప్పి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టులను దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
బంగ్లాదేశ్ ప్రాజెక్టును పూర్తి చేసిన బీహెచ్ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) బంగ్లాదేశ్లో నెలకొల్పిన మైత్రీ సూపర్ థర్మల్ పవర్ప్రాజెక్టులో యూనిట్–2ను పూర్తి చేసింది. 660 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్–2లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్కు అనుసంధానం చేసినట్టు బుధవారం ప్రకటించింది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్టీపీసీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన బంగ్లాదేశ్–ఇండియా ఫ్రెండ్షిప్ పవర్ కంపెనీ కోసం బీహెచ్ఈఎల్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. -
5 ప్రాధాన్య ప్రాజెక్టులు ఈ ఏడాది పూర్తికావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాల ప్రగతిపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల వారీ ఇప్పటి వరకు విడుదలైన, ఖర్చుచేసిన నిధులు.. చేసిన, చేయాల్సిన పనులు.. నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్రాజెక్టులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, పునరావాస ప్యాకేజీకి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన పనులను సమీక్షించిన ఆయన గడువు ప్రకారం పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అవుకు టన్నెల్, గొట్టా బ్యారేజి నుంచి హిర మండలం ఇరిగేషన్ ప్రాజెక్టు, వంశధార–నాగావళి నదుల అనుసంధానం, గొట్టా బ్యారేజి రిజర్వాయర్ ప్రాజెక్టు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2 ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఈ ఐదు ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చుక్కల భూముల తొలగింపు పనులు వేగవంతం 22–ఎ జాబితా నుంచి చుక్కల భూములను తొలగింపు పనులను వేగవంతం చేయాలని సీఎస్ జవహర్రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం రాష్ట్ర సచివాలయంలో సి.సి.ఎల్.ఎ., ఐ.టి.ఇ.– సి, జి.ఎస్.డబ్లు్య.ఎస్ అధికారులతో సమావేశమయ్యారు. 22–ఎ జాబితా నుంచి చుక్కలు, అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు, జగనన్న సురక్ష కింద ధ్రువీకరణపత్రాల జారీ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22–ఎ జాబితా నుంచి ఇంకా దాదాపు 7,558 ఎకరాల చుక్కల భూములను తొలగించాల్సి ఉందని చెప్పారు. ఆ పనులను వేగవతం చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సి.సి.ఎల్.ఎ. సాయిప్రసాద్ను ఆదేశించారు. అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు పనులపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రామ సేవా ఈనామ్ భూముల విషయంలో దేవదాయ శాఖ క్లియరెన్సు పొందాలని సూచించారు. 20 సంవత్సరాలకు పైబడి అసైన్డు భూములను అనుభవిస్తున్న వారికి ఆ భూమిపై పూర్తి హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అసైన్డు భూములను, ఒరిజనల్ అస్సైనీలను, వారి వారసులను ధ్రువీకరించే పనులనుపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలని చెప్పారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు ఏపీలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సాహితీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలు శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ప్రమాదకర రసాయన పరిశ్రమలను వెంటనే మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు, ఫైర్ తదితర విభాగాల అధికారులతో ప్రతిఏటా తప్పకుండా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఎక్కడైనా లోపాలుంటే వెంటనే నోటీసులిచ్చి వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. సాల్వెంట్ పరిశ్రమలను నిర్వహించే వ్యక్తుల సామర్థ్యాన్ని, భద్రతకు తీసుకుంటున్న చర్యలను పూర్తిగా పరిశీలించాకే లైసెన్స్లు జారీ చేయాలన్నారు. -
ఏపీలో లక్షా 20 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్లు
న్యూఢిల్లీ: సాగరమాల కింద ఆంధ్రప్రదేశ్లో లక్షా 20 వేల కోట్ల రూపాయలతో 113 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. సాగరమాల ప్రోగ్రాం కింద ప్రస్తుతం ఉన్న పోర్టులు, టెర్మినల్స్, రోల్ ఆన్, రోల్ ఆఫ్, టూరిజం జెట్టీల ఆధునీకరణ, పోర్టుల కనెక్టివిటీ, విస్తరణ, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజక్టులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్టేట్ మారిటైం బోర్డులు, మేజర్ పోర్టులు, పబ్లిక్ రంగం ప్రైవేటు భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ సమన్వయంతో ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ పోర్ట్ అథారిటీ, ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర రోడ్ విభాగం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యుత్ శాఖ, ఐఆర్ ఎస్, ఏపీ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ మారిటైం బోర్డు మెదలగు సంస్థలు ఇంప్లిమెంటింగ్ ఏజన్సీలుగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన మొత్తం ప్రాజెక్టుల్లో ఇప్పటికే 32 వేల కోట్లతో చేపట్టిన 36 ప్రాజక్టులు పూర్తి చేశామని, మిగిలిన రూ.91వేల కోట్లతో చేపట్టిన 77 ప్రాజక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు. పోర్టు ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు,పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, కోస్టల్ షిప్పింగ్, ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి రూ.32210 కోట్లతో చేపట్టిన 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే రూ.17,741 కోట్లతో చేపట్టిన 27 ప్రాజెక్టులు పురోగతి దశలోనూ, రూ.73527 కోట్లతో చేపట్టిన మిగిలిన 50 ప్రాజెక్టులు అమలు దశలోనూ ఉన్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు అందుబాటులో నానో డీఏపీ న్యూఢిల్లీ: నానో డీఏపీని మార్కెట్లోకి ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా వెల్లడించారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు. ఇఫ్కో సమాచారం ప్రకారం నానో డీఏపీ ద్రవరూపంలో ఉండగా, సాంప్రదాయ డీఏపీ కణికల రూపంలో ఉంటుందని తెలిపారు. నానో డీఏపీ విత్తనాలు, వేర్లు, ఆకులకు అందేలా వినియోగించగా, సాంప్రదాయ డీఏపీ మట్టిలో మాత్రమే వినియోగిస్తారని తెలిపారు. వినియోగ సామర్థ్యం 20%-30%గా ఉన్న సాంప్రదాయ డీఏపీతో పోలిస్తే నానో డీఏపీ వినియోగ సామర్థ్యం 80%-90% ఉంటుందని అన్నారు. సాంప్రదాయ డీఏపీకి రాయితీ అందిస్తుండగా, నానో డీఏపీకి మాత్రం సబ్సిడీ లేదని తెలిపారు. -
శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టులో జలవిద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల్లో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 22,573 క్యూసెక్కులు చేరాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు.. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 808.90 అడుగుల్లో 33.67 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నారాయణపూర్, ఉజ్జయిని డ్యామ్లకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధాన పాయ, భీమాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 41,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 37,930 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్లోకి 2,015 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 8,685 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.39 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు దిగువన మున్నేరు, వాగులు, వంకల ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజ్లోకి 15,698 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 6,114 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 9,584 క్యూసెక్కులను అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టిలోకి పెరిగిన వరద పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్లోకి 1,07,769 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.56 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదలుతున్న ఆరు వేల క్యూసెక్కులు నారాయణపూర్ డ్యామ్కు చేరుతున్నాయి. సోమవారం ఆల్మట్టిలోకి మరింతగా వరద పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. తుంగభద్రలోనూ పెరిగిన ప్రవాహం తుంగభద్ర డ్యామ్, తుంగ ఆనకట్ట దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల తుంగభద్రలో వరద ఉద్ధృతి కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్లోకి 54,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.36 టీఎంసీలకు చేరుకుంది. -
తెలంగాణ ప్రాజెక్టు–1లో విద్యుత్ ఉత్పత్తి షురూ
జ్యోతినగర్: రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేందుకు మొదలుపెట్టిన తెలంగాణ స్టేజీ–1లోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ ఆదివారం రాత్రి 7.40 గంటలకు ఉత్పత్తి ప్రారంభించింది. 801.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. 800 మెగావాట్ల యూనిట్ కంట్రోల్ రూంలో సీజీఎం కేదార్ రంజన్పాండుతో పాటు ఉన్నతాధికారులు, అధికారులు స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు స్టేజ్–1లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం చేపట్టారు. మొదటి యూనిట్ (800 మెగావాట్ల) నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల మొదటి యూనిట్లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచి్చన క్రమంలో ఈనెల 28లోపు కమర్షియల్ డిక్లరేషన్ చేసి గ్రిడ్కు అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి రెండో యూనిట్లో..? ఎన్టీపీసీ తెలంగాణ స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల రెండో యూనిట్ స్టీమ్ బ్లోయింగ్ మే 20న పూర్తి చేసుకుంది. టర్భైన్ జనరేటర్తోపాటు వివిధ పనులు పూర్తి చేశారు. రెండో యూనిట్ సైతం ఆగస్టులో విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు యూనిట్లలో విడుదలయ్యే మొత్తం 1600 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. -
కృత్రిమ మేధస్సుతో వ్యవసాయ సంక్షేమం
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు వినియోగం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘సాగు బాగు ప్రాజెక్టు’ తొలి దశ నివేదికను తమిళనాడు ఐటీ శాఖ మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్తో కలిసి కేటీఆర్ శుక్రవారం విడుదల చేశారు .డేటా ఆధారిత సలహాలు, మార్కెట్ ఇంటెలిజెన్స్ తదితరాల ద్వారా రైతాంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. కృత్రిమ మేధస్సుతో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయో గించుకుంటూ భారత్లో వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చే లక్ష్యంతో ‘సాగు బాగు’ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. ఖమ్మంలో మిరప రైతులకు ’సాగు బాగు’ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్’ (ఏఐ4ఏఐ) నినాదంతో రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో మూడు స్టార్టప్ల భాగస్వామ్యంతో అమలుచేస్తున్నారు. సాగు బాగులో భాగంగా ఖమ్మం జిల్లాలో 7వేలమందికి పైగా మిరప రైతులు వ్యవసాయ సాంకేతిక సేవలు, ఏఐ ఆధారిత సలహాలు పొందారు. కాగా శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్రావు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరక్టర్ రమాదేవి లంకా పాల్గొన్నారు. -
త్వరలో ఏలేరు–తాండవ ప్రాజెక్టుల అనుసంధానం
నాతవరం (అనకాపల్లి జిల్లా): వర్షాకాలం తర్వాత ఏలేరు–తాండవ అనుసంధానం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇంజనీర్ ఇన్ చీఫ్, గోదావరి డెల్టా సిస్టం చీఫ్ ఇంజనీర్ ఆర్.సతీష్ కుమార్ చెప్పారు. నాతవరం మండలం జిల్లేడుపూడిలో ఏలేరు సొరంగం వద్ద తాండవ ప్రాజెక్టు కాల్వలను ఉత్తర కోస్తా సీఈ ఎస్.సుగుణాకరరావుతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఏలేరు, తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు రూ.470 కోట్ల 5 లక్షలను కేటాయించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నంలో పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి విశాఖ స్టీల్ప్లాంట్, జీవీఎంసీ, ఇక్కడి పరిశ్రమలకు రోజుకు 95 జీఎండీల నీరు సరఫరా అవుతోంది. అనుసంధానం పనులు ప్రారంభించడానికి నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు నీటిపారుదల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. అనంతరం ఏలేరు, తాండవ ప్రాజెక్టు అధికారులతో పాటు జీవీఎంసీ, విస్కో అధికారులకు అనుసంధానం పనులపై ఇంజనీర్ ఇన్ చీఫ్ సతీష్కుమార్ దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టు పనులను రూ.1,100 కోట్లతో పూర్తి చేస్తున్నామని ఉత్తర కోస్తా సీఈ ఎస్.సుగుణాకరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వంశధార ప్రాజెక్టు లిఫ్ట్ పనులు రూ.150 కోట్లతో జరుగుతున్నాయన్నారు. హిరమండలంలో బ్యాలెన్స్ రిజర్వాయర్ పెండింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. రూ.123 కోట్లతో విజయనగరం జిల్లా తోటపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ పనులు చేస్తున్నామన్నారు. తారకరామ రిజర్వాయర్తో పాటు పలు ప్రాజెక్టులకు మరమ్మతులు చేస్తున్నామని వివరించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ భాస్కరరావు, డీఈ వినోద్కుమార్, విస్కో సలహాదారు, విశ్రాంత ఎస్ఈ జగన్మోహన్రావు, తాండవ ప్రాజెక్టు డీఈ జె.స్వామినాయుడు, జేఈలు శ్యామ్కుమార్, వినయ్కుమార్, ఆర్.పాత్రుడు, రామకృష్ణ, నాగబాబు సిబ్బంది పాల్గొన్నారు. -
పవన విద్యుత్కు యూనిట్కు రూ.2.64
సాక్షి, అమరావతి: పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన టారిఫ్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఖరారు చేసింది. ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుని పదేళ్లు దాటిన తరువాత యూనిట్ రూ.2.64 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. 11వ సంవత్సరం నుంచి 20 ఏళ్ల వరకు ఇదే టారిఫ్ వర్తిస్తుందని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 2,100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు చెందిన 22 పీపీఏలకు ఆ సంస్థలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్సీ ఈ టారిఫ్ను నిర్ణయించింది. అదే విధంగా ప్రాజెక్టు జీవిత కాలాన్ని 25 ఏళ్లుగా సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. కానీ దానిని 30 ఏళ్లుగా ఏపీఈఆర్సీ పరిగణించింది. ప్రాజెక్టు ఏర్పాటుకు మెగావాట్కు ఐదెకరాల చొప్పున ఆ సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నాయి.పీపీఏ గడువు ముగిసేనాటికి వాటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఏపీఈఆర్సీ అంచనా వేసింది. దానిని పరిగణనలోకి తీసుకుని యూనిట్ ధరను ఖరారు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. మీరు అడిగినంత ఇవ్వలేం మొదటి పది సంవత్సరాలకు యూనిట్కు రూ.3.43 చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే ప్రస్తుత మార్కెట్ ధరల మేరకు 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకూ యూనిట్కు రూ.3.50 టారిఫ్ సెట్ చేయాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. ఏపీఈఆర్సీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్ల టారిఫ్ రూ.3.43గా నిర్ణయించామని, ఆ సమయంలో సుంకం కూడా యూనిట్పై రూ.2.4 తగ్గించామని, కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్కు రూ.2.64గా నిర్ధారించింది.20 ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. కొనసాగితే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది. వృద్ధికి అనుగుణంగా.. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పెరుగుదల నమోదు చేసుకుంది. వాతావరణ మార్పులకు ప్రభుత్వ చర్యలు తోడవడంతో ఏపీలో పవన విద్యుత్కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పూణె)కి చెందిన పరిశోధకులు వారి అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. -
పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది: మంత్రి అంబటి
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దాని కాంట్రాక్టు రామోజీరావు బంధువు నుంచి పోయిందని కక్ష కట్టారని అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనతో సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. కరోనా టైంలో కష్టాలు వచ్చినా కీలక నిర్మాణాలు పూర్తి చేశామని పేర్కొన్నారు. లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత జగన్దని చెప్పారు. డయా ఫ్రం వాల్ నిర్మాణం వరదల వల్ల కొట్టుకుపోలేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు. కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం, కమిషన్ల వలనే కొట్టుకుపోయిందన్నారు. ఆ విషయాలను రామోజీ ఎందుకు రాయటం లేదు? అని ప్రశ్నించారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్కి మరమ్మత్తు చేయటమా? కొత్తది నిర్మాణమా అనే దానిపై సీడబ్ల్యుసీ ఆలోచిస్తోందని చెప్పారు. కాఫర్ డ్యాంలు పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ కట్టొచ్చని మీ పత్రికలో రాయగలరా? అని ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్కి లోకేష్ కన్నా తక్కువ బుర్ర ఉందని, అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రూ.900 కోట్లు మాయం అయ్యాయని వాపోతున్నారు.. ఆర్.ఈ.సీ. కాంట్రాక్టును ఒకసారి చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి అంబటి తెలిపారు. అన్నిస్థాయిల్లోనూ పనులను చెక్ చేసిన తర్వాతనే నిధులు విడుదల చేశారని వెల్లడించారు. చట్టం ప్రకారమే నిధులు విడుదల చేశారని, అందులో తప్పేమీలేదని అంబటి చెప్పారు. పవన్ ఏకపత్నీవ్రతుడు: అంబటి 'పవన్కళ్యాణ్ నిన్న తణుకు సభలో మరోసారి ఊగిపోయాడు. ఆయన పెళ్ళిళ్ల గురించి మాట్లాడితే ఆయనకు కోపం వస్తుంది. కానీ నిత్యం ఆయన పక్కనే ఉండే నాదెండ్ల మనోహర్కు మాత్రం ఏ కోపం రాదు. ఆయన ఒక కార్మిక వీరుడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జనసేన ఆఫీస్కు రహస్య సొరంగ మార్గం తవ్వడానికి పని చేస్తున్న కార్మిక వీరుడు నాదెండ్ల మనోహర్. 'మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్' ఆవరించింది అంటే పవన్కళ్యాణ్కు కోపం వచ్చింది. ఇక నుంచి పెళ్ళిళ్ల గురించి ఎత్తం. అందుకు బదులుగా, ఒక్కోసారి ఒక్కో పెళ్ళి చేసుకున్న‘ఏకపత్నీ వ్రతుడు పవన్కళ్యాణ్గారు’ అని మాత్రమే అంటాం. అప్పుడు ఆయనకు చాలా ఆనందంగా ఉంటుంది.' అని మంత్రి అంబటి అన్నారు. వారిపై ఎందుకంత కడుపు మంట?.. 'వాలంటీర్ల వ్యవస్థ మీదు ఎందుకంత కడుపు మంట? వారు ఇతర ప్రాంతం, ఇతర రాష్ట్రాల నుంచి రాలేదు కదా? ఆ 50 ఇళ్లలో నుంచి వచ్చిన వారే కదా? అలాంటి వారిపై ఒక ఏకపత్నీవ్రతుడు, మరో ముసలాయన పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు. వారు గౌరవ వేతనం రూ. 5 వేలు మాత్రమే తీసుకుని ఎంతో సేవ చేస్తున్నారు. మీకు నిజంగా వారి పట్ల చిత్తశుద్ధి ఉంటే.. మీరు వస్తే వారికి లక్ష జీతం ఇస్తామని చెప్పండి. లేదా వారిని తీసేస్తామని చెప్పండి' అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 1000సార్లు జగన్నామస్మరణ చేయండి.. 'ఇక నుంచి సీఎం జగన్ను ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ అన్నాడు. దాంతో మేము బాధ పడ్డామని, ఆయన బాధ పడిపోతున్నాడు. పవన్, ఆ శపథం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 373 సార్లు సీఎం జగన్ను ఏకవచనంతో సంబోధించాడు. అయ్యా, 1000 సార్లు అలా జగన్ పేరు ఉచ్ఛరించండి. మీరు చేసిన పాపాలన్నీ పరిహారం అవుతాయి.' అని మంత్రి అంబటి పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి -
ఫాక్స్కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి
తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ ఫాక్స్కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ మెటల్స్-టు-ఆయిల్ వేదాంత కంపెనీతో 19.5 బిలియన్ డాలర్ల సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఫాక్స్కాన్ నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి గల కారణాలను వివరించలేదు. (మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట) గ్లోబల్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్కాన్ , వేదాంత గత ఏడాది గుజరాత్లో సెమీకండక్టర్. డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను నిర్మించడానికి సుమారు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రాజెక్ట్పై ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పనిచేసినప్పటికీ ఈ జాయింట్ వెంచర్ను ముగించాలని ఇరుపక్షాలు పరస్పరం నిర్ణయించుకున్నాయన్న తాజా ప్రకటన సంచలనం రేపుతోంది. ఆ కంపెనీతో ఫాక్స్కాన్కు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్లో భాగస్వాములు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా ఒరిజినల్ పేరునే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) ప్రకటించింది. ఈ ఒప్పందం 'మేక్ ఇన్ ఇండియా' పుష్కు ఖచ్చితంగా ఎదురుదెబ్బ అని కౌంటర్పాయింట్లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా వ్యాఖ్యానించారు. (ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) కాగా 2026 నాటికి సెమీకండక్టర్ మార్కెట్ విలువ 63 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్న కేంద్రం, గతేడాది 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం కింద ప్లాంట్ల ఏర్పాటుకు మూడు దరఖాస్తులు అందుకుంది. ఇందలో వేదాంత-ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ ఒకటి, సింగపూర్కు చెందిన IGSS వెంచర్స్ , టవర్ సెమీకండక్టర్ను టెక్ భాగస్వామిగా పరిగణించే గ్లోబల్ కన్సార్టియం ఐఎస్ఎంసీ నుండి వచ్చాయి. -
విశాఖ సిగలో కలికితురాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరానికి ఐకానిక్గా నిలిచే భవన నిర్మాణానికి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వివిధ ప్రాంతాల్లో సరికొత్తగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు సాంకేతిక సహాయంతో ప్రజలకు సేవలందిస్తున్న స్మార్ట్ సిటీ కార్పొరేషన్.. మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం సంపత్ వినాయక రోడ్డు మార్గంలో ఆశీలమెట్ట ప్రాంతంలో జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాలను నగర అభివృద్ధికి చిహ్నంగా(ఐకానిక్) మార్చేందుకు ప్రతిపాదనలు ఆహా్వనించింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై ఈ నెల 12లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల(ఈవోఐ)ను కోరింది. మొత్తం 2.7 ఎకరాల్లో ఏకంగా 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్తో పాటు రిక్రియేషన్ సెంటర్ అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం రూ.265 కోట్లతో ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని పేర్కొంటూ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో.. ఆశీలమెట్ట.. నగరంలో వాణిజ్య ప్రాంతం. ఇక్కడ జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రాంతంలో 6.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా ఉంది. 2.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయంతో పాటు మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్, అర్బన్ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే ప్రతిపాదనలతో సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను సమర్పించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్కు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిలో ఈ భూమిని కేటాయించేందుకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిర్ణయించింది. దీనిని సబ్లీజుకు ఇవ్వడం కానీ, స్థలాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం కానీ కుదరదని స్పష్టం చేసింది. డీఎఫ్బీవోటీ పద్ధతిలో..! వాణిజ్యానికి అనువుగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 2.7 ఎకరాల్లో వాణిజ్య భవనాలను నిర్మించాల్సి ఉంటుందని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ స్పష్టం చేస్తోంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ఈ భూమిలో వాణిజ్య భవనాల ద్వారా వచ్చే ఆదాయంలో జీవీఎంసీకి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. వాటా ఇచ్చే శాతంతో పాటు ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని సంస్థ ఎంపిక ఉండనుంది. అంతేకాకుండా స్థలాన్ని కేవలం లీజు పద్ధతిలో 33 ఏళ్ల పాటు అప్పగించనున్నారు. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీఎఫ్బీవోటీ) పద్ధతిలో చివరకు 33 ఏళ్ల తర్వాత తిరిగి స్మార్ట్ సిటీ కార్పొరేషన్కు అప్పగించాల్సి ఉంటుంది. దీని అభివృద్దికి సుమారు రూ.265 కోట్ల మేర వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా తమ ప్రతిపాదనలతో ఆయా సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చేందుకు ఈ నెల 12వ తేదీ నాటికి ఈవోఐలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన అనంతరం.. ఒక మంచి ప్రతిపాదనను ఓకే చేసి సంస్థ ఎంపిక ప్రక్రియ తర్వాత నిర్మాణాలు చేపట్టనున్నారు. రెండేళ్లలోనే ఐకానిక్ భవనం అందుబాటులోకి తీసుకురావాలన్నదే అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. -
మహేష్ బాబు ప్రభాస్ స్థానాల్లో రవితేజ విజయ్ దేవరకొండ
-
కొంపముంచిన ప్రకటన..టీసీఎస్కు 15 వేల కోట్ల నష్టం!
ఇండియన్ స్టాక్ మార్కెట్లో రెండో అత్యంత విలువైన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు వ్యాపారం పరంగా ఎదురు దెబ్బ తగిలింది. టీసీఎస్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ట్రాన్సామెరికా ప్రకటించింది. దీంతో టీసీఎస్ వేల కోట్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా కేంద్రంగా ట్రాన్సామెరికా హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఇతర ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, 2018 నుంచి 10 ఏళ్ల కాలానికి సేవలు పొందేందుకు దేశీయ టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ డీల్ విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా టీఎస్ఎస్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ట్రాన్సామెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లో టీసీఎస్ మార్కెట్ వ్యాల్యూ రూ.11,76,842 కోట్ల నుంచి రూ.11,61,840 వద్ద స్థిర పడింది. రూ.15,000 కోట్ల సంపద తరిగింది. ఏడాదికి 200మిలియన్ల ఆదాయం 2018 నుంచి ట్రాన్సామెరికాకు టీసీఎస్ సర్వీసుల్ని అందిస్తుంది. అందుకు గాను దేశీ టెక్ దిగ్గజం ఏడాదికి 200 మిలియన్ డాలర్ల ఆదాయన్ని గడిస్తుంది. ఈ సందర్భంగా అమెరికన్ ఆర్ధిక సేవల సంస్థ జేపీ మోర్గాన్.. తాము సైతం ఆర్ధిక అనిశ్చితి ఇబ్బంది పడుతున్నట్లు ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితులు గణనీయమైన లాభాల్ని సైతం పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు! -
ఇండ్ఇన్ఫ్రావిట్ చేతికి రోడ్ ప్రాజెక్టులు - డీల్ విలువ ఎంతంటే?
ముంబై: బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి నిర్వహణలో ఉన్న నాలుగు రహదారి ప్రాజెక్టులను ఇండ్ఇన్ఫ్రావిట్ ట్రస్ట్ సొంతం చేసుకుంది. పూర్తి నగదు రూపేణా జరిగిన డీల్ విలువ బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 8,200 కోట్లు)కాగా.. కొనుగోలును పూర్తి చేసినట్లు ఇండ్ఇన్ఫ్రావిట్ తాజాగా వెల్లడించింది. బ్రూక్ఫీల్డ్ నిర్వహణలోని బీఐఎఫ్ ఇండియా హోల్డింగ్స్, కైనెటిక్ హోల్డింగ్స్ నుంచి ఐదు ప్రాజెక్టులను చేజిక్కించుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే నాలుగు ఆస్తులను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జాబితాలో సింహపురి ఎక్స్ప్రెస్వే, రాయలసీమ ఎక్స్ప్రెస్వే, ముంబై– నాసిక్ ఎక్స్ప్రెస్వే, కోసి బ్రిడ్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చేరాయి. ఇక గోరఖ్పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నియంత్రణ సంస్థల అనుమతులను పొందవలసి ఉండటంతోపాటు.. కొన్ని నిబంధనలు పాటించవలసి ఉన్నట్లు తెలియజేసింది. నిధులను రూపాయలలో కాలావ ధి రుణం, మార్పిడిరహిత డిబెంచర్లు, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, ఓఎంఈఆర్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో యూనిట్ల జారీ ద్వారా ఏర్పాటు చేసింది. సొంతం చేసుకున్న ప్రాజెక్టులలో మూడు టోల్ రోడ్ ఆస్తులుకాగా.. ఒక యాన్యుటీ రహదారిగా కంపెనీ తెలియజేసింది. ఇండ్ఇన్ఫ్రావిట్ ట్రస్ట్ను ఎల్అండ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసింది. -
బాలానగర్లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవం కలిగిన రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో అద్బుతమైన ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బాలానగర్లో ఏ2ఏ లైఫ్ స్పేసెస్ అపార్ట్మెంట్, సెంటర్ మాల్ ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తి చేసిన సంస్థ.. తాజాగా ఏ2ఏ హోమ్ ల్యాండ్ ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది. బాలానగర్లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇదేనని కంపెనీ తెలిపింది. రఘురామ్ ఇన్ఫ్రా ఇప్పటివరకు 40 లక్షలకు పైగా చ.అ.లలో 38 పైగా ప్రాజెక్ట్లను నిర్మించింది. సుమారు 4 వేలకు పైగా కస్టమర్లున్నారు. ►ఫేజ్–1లో 12 ఎకరాలలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 7 బ్లాకులుంటాయి. మొత్తం 1,158 ఫ్లాట్లుంటాయి. అన్నీ త్రీ బీహెచ్కే ప్రీమియం ఫ్లాట్లే. 1,700 చ.అ. నుంచి 2,260 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. (ఈస్ట్ హైదరాబాద్ రయ్ రయ్! ఎందుకో తెలుసా?) ► ఈ ప్రాజెక్ట్లో 93 వేల చ.అ. విస్తీర్ణంలో రెండు క్లబ్హౌస్లతో పాటు క్రచ్, ఇండోర్ గేమ్స్, లెర్నింగ్ సెంటర్, బిజినెస్ లాంజ్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, లైబ్రరీ, జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు, యోగా సెంటర్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. ► బాలానగర్ మెట్రో జంక్షన్, కూకట్పల్లి వై జంక్షన్లకు కూతవేటు దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రధాన నగరంలో ఉండటంతో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి కొదవే లేదు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్కు గ్రీన్ సిగ్నల్) మరిన్ని రియల్ ఎస్టేట్ వార్తలకు,బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
మహేష్ బాబు ప్రభాస్ కి పోటిగా ఇండియన్ 2
-
రూ.21 వేల కోట్లతో సీతారామ–సీతమ్మసాగర్!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల– సీతమ్మసాగర్ ఉమ్మడి ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కొత్తగా ఇల్లందు కాల్వను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను అనుమతుల కోసం తాజాగా ఢిల్లీలో కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమర్పించింది. రూ.13,700 కోట్ల అంచనాలతో సీతారామ ఎత్తిపోతల పథకం, రూ.5,200 కోట్ల అంచనాలతో సీతమ్మసాగర్ బ్యారేజీ, రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ఇల్లందు కాల్వ కలిపి మొత్తం రూ.21,100 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు డీపీఆర్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. 1.13 లక్షల కొత్త ఆయకట్టు సీతారామ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందని ఎగువ ప్రాంతాల్లోని 1.13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడానికి ఇల్లందు కాల్వను నిర్మించనున్నారు. ఇల్లందు నియోజకవర్గానికి అధిక ప్రయోజనం కలగనుండగా, మధిర, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతలను నిర్మిస్తుండగా, కొత్తగా ప్రతిపాదించిన ఇల్లందు కాల్వతో సీతారామ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టు 7.84 లక్షల ఎకరాలకు పెరగనుంది. సీడబ్ల్యూసీకి రెండో సవరణ డీపీఆర్ విద్యుదుత్పత్తి అవసరాలకు 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన సీతమ్మ బ్యారేజీ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 70.4 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పనులు సైతం 55 శాతం వరకు పూర్తయ్యాయి. దీనికి దాదాపుగా అన్ని రకాల అనుమతులను ఇప్పటికే సీడబ్ల్యూసీ ఇచ్చేయగా, అపెక్స్ కౌన్సిల్ తుది అనుమతులు ఇవ్వాల్సి ఉంది. సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచే సీతారామ ఎత్తిపోతలకు నీళ్లను తరలిస్తున్న నేపథ్యంలో బ్యారేజీని సైతం సీతారామ ఎత్తిపోతల పథకంలో కలిపేసి ఒకే ప్రాజెక్టుగా అనుమతులు పొందాలని గతంలో సీడబ్ల్యూసీ సూచించింది. పర్యావరణ అనుమతుల కోసం రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా కేంద్ర పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. సీడబ్ల్యూసీకి వేర్వేరు ప్రాజెక్టులుగా ప్రతిపాదించడం పట్ల అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా ప్రతిపాదిస్తూ మళ్లీ సీడబ్ల్యూసీకి నాలుగు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీపీఆర్ను సమర్పించింది. తాజాగా ఇల్లందు కాల్వ నిర్మాణం పనులను సైతం డీపీఆర్లో చేర్చి సవరించిన డీపీఆర్ను మరోసారి సీడబ్ల్యూసీకి ఇచ్చింది. ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉందని, మరో నెల రోజుల్లో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ముందుకు డీపీఆర్ వెళ్లే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. గోదావరిలో సీతారామ–సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు నీటి లభ్యతతోపాటు పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఇటీవల గోదావరి బోర్డు సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ అనుమతులు లభించిన నేపథ్యంలో గోదావరి బోర్డు లేఖతో ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
భారీ ప్రాజెక్ట్ తో సుకుమార్ ప్రభాస్ సినిమా
-
‘పులిచింతల’ చకచకా
సాక్షి, నరసరావుపేట/అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు మరమ్మతు పనులు చకచకా సాగుతు న్నాయి. ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22.04 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 45.77 టీఎంసీలు నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పులిచింతలలో 2019–20లో 45.77 టీఎంసీలు, 2020–21లో 45.77 టీఎంసీలు, 2021–22లో 44.53 టీఎంసీలు, 2022–23లో 45.77 టీఎంసీలు నీటిని నిల్వ చేశారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రారంభించిన నాటినుంచి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం విశేషం. 16వ గేట్ స్థానంలో రేడియల్ గేట్ నిర్మాణం గత ప్రభుత్వాలు నిర్మాణం, నిర్వహణలో అలసత్వం వల్ల డ్యామ్ 16వ గేట్ 2021 ఆగస్ట్ 5న వరద ఉధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 16వ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ గేట్ను యుద్ధప్రాతిపదికన అమర్చి నీటిని నింపి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంది. తర్వాత 40 టీఎంసీలకు పైగా నీటితో ప్రాజెక్టు కళకళలాడింది. ఈ గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రూ.7.54 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రేడియల్ గేట్ ఏర్పాటు, దాన్ని అమర్చేందుకు అవసరమైన కాంక్రీటు దిమ్మెలు, క్రేన్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. మే చివరి నాటికి అన్ని పనులు పూర్తి పులిచింతల ప్రాజెక్టు 16వ రేడియల్ గేట్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గేట్ల అమరికకు అవసరమైన పనులు పూర్తయ్యాయి. ఇక గేట్లను ఆ స్థానంలో అమర్చి ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. అన్ని పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తాం. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులో నీటి నిల్వకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం – రామకృష్ణ, ఎస్ఈ, పులిచింతల ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణకు రూ.9.57 కోట్లు పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 రేడియల్ గేట్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు తరచూ వివిధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తుండటం, వందలాది టీఎంసీల నీరు ప్రాజెక్టు నుంచి కిందకు వెళుతున్న నేపథ్యంలో కొన్ని మరమ్మతులు చేయాల్సి వస్తోంది. వీటన్నింటికి ప్రభుత్వం రూ.9.57 కోట్లు ఖర్చు చేస్తోంది. రేడియల్, స్లూయిజ్ గేట్లు, క్రేన్లకు గ్రీజు, పెయింట్, గడ్డర్ల పటిష్టం వంటి పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్యామ్ గేట్ల పిల్లర్ల పటిష్టానికి రూ.1.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. డ్యామ్ రేడియల్ గేట్లకు చేరుకునే నడక దారి పునరుద్ధరణకు రూ.3.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రాజెక్టు పైనుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. గతంలో ఈ మార్గం నుంచి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు నుంచి తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు కొనసాగేవి. (చదవండి: బ్యాంకుల నుంచి పింఛన్ డబ్బు విత్డ్రా.. ఇకపై ఒక్కరు కాదు ఇద్దరు.. ) -
ఇప్పటికే వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ -1 పనులు పూర్తి
-
రిషికొండలో అనుమతులకు లోబడే నిర్మాణాలు
-
Sitamma Sagar: కేసీఆర్ సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ/భద్రాద్రి: తెలంగాణ సర్కార్కు ఎన్జీటీ నుంచి మరో ఝలక్ తగిలింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించతలబెట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజ్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేకులు వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల్ని వెంటనే నిలిపివేయాలని, అనుమతులు తీసుకోవాల్సిందేనంటూ ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పు ఇచ్చింది ట్రిబ్యునల్. గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద కేసీఆర్ సర్కార్.. ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింటి. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో.. సీతమ్మ సాగర్గా నామకరణం చేసింది. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ఒకవైపు బ్యారేజీ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండగా.. పర్యావరణ అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని ఇప్పుడు ఎన్జీటీ ఆదేశించడం గమనార్హం. ఈ మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదీ చదవండి: మా మెట్రో ఏం పాపం చేసింది? -
భారతమాలకు రహదారులు
సాక్షిప్రతినిధి, కాకినాడ: భారతమాల ప్రాజెక్టు వేగం పుంజుకుంది. గడువులోగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు, తొండంగి సమీపాన గేట్వే ఆఫ్ పోర్టు కాకినాడను ఒకపక్క విశాఖపట్నం, మరోపక్క ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు మూడు జాతీయ రహదారులను భారతమాల ప్రాజెక్టు కింద నాలుగు వరుసలుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒకటి లేదా, రెండేళ్లలో పనులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ గట్టిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా భూ సేకరణ, టెండర్ల ఖరారు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వడివడిగా.. కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు 13.20 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఏడాది వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో పనుల వేగం పెంచారు. ఇక్కడ భూసేకరణ అవసరం లేకుండానే ఉన్న రోడ్డునే నాలుగు లేన్లుగా ఆధునీకరిస్తున్నారు. టెండర్లు ఖరారు కావడంతో రూ.90 కోట్ల అంచనాతో పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుత రోడ్డును ఇరువైపులా వెడల్పు చేస్తూ నాలుగు వరుసలుగా చేపట్టడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అవుటర్ రింగ్ రోడ్డు తరహాలో.. ♦ కాకినాడ వాకలపూడి లైట్హౌస్ నుంచి అన్నవరం మీదుగా కోల్కతా–చెన్నై జాతీయ రహదారితో అనుసంధానించనున్నారు. ♦ 40.32 కిలోమీటర్లు నిడివి కలిగిన ఈ నాలుగు వరుసల జాతీయ రహదారిని తొలుత రూ.776.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ♦ కాకినాడ పోర్టు, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, కాకినాడ గేట్వే పోర్టు, ఉప్పాడ ఫిష్షింగ్ హార్బర్ మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది. ♦ వాకలపూడి జంక్షన్లో ఒక ఫ్లై ఓవర్, అన్నవరం, కాకినాడ సెజ్, హార్బర్ల వద్ద అండర్పాస్లను నిర్మించాల్సి ఉంటుంది. ♦ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు తరహాలో ఈ జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ♦ ఇప్పుడు రహదారి అంచనా వ్యయం రూ.1400 కోట్లకు పెరిగింది. ♦ ఎక్కువగా భూ సేకరణ చేయాల్సి వస్తోంది. ఇందుకు రూ.160 కోట్లకుగాను ఇప్పటికే రూ.56 కోట్లు విడుదల చేశారు. ♦ రెండేళ్లలోపు అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ♦ తొండంగి, శంఖవరం, యు కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాల్లోని 21 గ్రామాల మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది. చకచకా భూసేకరణ ఉమ్మడి తూర్పులో పారిశ్రామికాభ్యున్నతికి సామర్లకోట–అచ్చంపేట జాతీయ రహదారి బాటలు వేయనుంది. రూ.395.60 కోట్ల అంచనాతో 12.25 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి కోసం 33 ఎకరాల ప్రైవేటు భూమి, 21 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమవుతోంది. ఇందుకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ హైవేలో సగం గ్రీన్ఫీల్డ్ (పొలాల మధ్య) ఉంటుంది. కాకినాడ–పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రాక్ సిరామిక్స్ వద్ద ప్రారంభమై ఎఫ్సీఐ గోడౌన్స్, సుగర్ ఫ్యాక్టరీ, కెనాల్ రోడ్డు మీదుగా ఉండూరులో ఇది కలవనుంది. అచ్చంపేట జంక్షన్లో ఒక ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది. చురుగ్గా భూ సేకరణ చేపడుతున్నారు. 13 కిలోమీటర్ల మేర పనులు మొదలయ్యాయి. 33.92 హెక్టార్ల భూమి సేకరించి ఏడాదిలోపు ఈ హైవే పనులను పూర్తి చేయనున్నారు. ఈ రహదారి సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల్లో ఆరు గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది. నాలుగు వరుసల మూడు ప్రధాన జాతీయ రహదారులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో తీరానికి అనుసంధానమవుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమమం అవుతుంది. -
గోదారమ్మ మణిహారంలో కలికితురాయి
పోలవరం జలవిద్యుత్కేంద్రం నుంచి సాక్షి ‘ప్రత్యేక’ ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు: గోదారమ్మ మణిహారంలో మరో కలికితురాయి ఒదగనుంది. పోలవరం జాతీయ బహుళార్ధక సాధక ప్రాజెక్టులో అంతర్భాగంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన జలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలవిద్యుత్కేంద్రాలలో ఇదే అతి పెద్దది కావడం గమనార్హం. జలాశయం పనులు పూర్తయ్యేలోగా జలవిద్యుత్కేంద్రం పనులనూ పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలవరం జలవిద్యుత్కేంద్రం పూర్తయితే రాష్ట్ర విద్యుత్ ముఖచిత్రంలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని విద్యుత్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–1కి ఎడమవైపున కొండను తొలచి 960 మెగావాట్లు (1280) సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించే డిజైన్ను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది. రివర్స్ టెండరింగ్తో రూ.405.23 కోట్లు ఆదా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టులో మిగిలిన రూ.3,302 కోట్ల విలువైన పనులను 2018 ఫిబ్రవరి 27న నామినేషన్ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టిన టీడీపీ సర్కార్ రూ.3,216.11 కోట్ల వ్యయంతో జలవిద్యుత్కేంద్రం పనులను కూడా అదే సంస్థకు కట్టబెట్టింది. ఆ సంస్థ నుంచి నాటి సీఎం చంద్రబాబు భారీగా ముడుపులు వసూలు చేసుకున్నారు. ఈ అక్రమాలపై నిపుణుల కమిటీతో విచారణకు ఆదేశించిన సీఎం వైఎస్ జగన్.. కమిటీ సిఫార్సుల మేరకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. జలవిద్యుత్కేంద్రం పనులను రూ.2,810.88 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.405.23 కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు అక్రమాల బాగోతాన్ని రివర్స్ టెండరింగ్ బట్టబయలు చేసింది. శరవేగంగా పనులు.. టీడీపీ హయాంలో జలవిద్యుత్కేంద్రం పనుల్లో ఎలాంటి ప్రగతి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం జలవిద్యుత్కేంద్రం నిర్మాణానికి వీలుగా గోదావరి ఎడమ గట్టుపై ఉన్న కొండను తొలిచే పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. – జలవిద్యుత్కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్ టన్నెళ్లు(సొరంగాలు) తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. 150.3 మీటర్ల పొడవు, 9 వ్యాసంతో కూడిన 12 టన్నెళ్లను తవ్వారు. – ప్రెజర్ టన్నెళ్లలో ఫెరోల్స్ అమర్చి లైనింగ్ పనులను చేపట్టారు. ఇప్పటికే ఏడు టన్నెళ్లలో ఫెరోల్స్ అమర్చి లైనింగ్ పనులను దాదాపుగా పూర్తి చేశారు. సొరంగాల ద్వారా నీరు సక్రమంగా వెళ్లేందుకు లైనింగ్ తోడ్పడుతుంది. – ఒక్కో టన్నెల్లో 52 ఫెరోల్స్ చొప్పున 12 టన్నెళ్లలో 624 ఫెరోల్స్ను అమర్చనున్నారు. 9 మీటర్ల వ్యాసం, 25 మిల్లీమీటర్ల మందంతో కూడిన ఇనుప రేకులతో వీటిని తయారు చేశారు. ఫెరోల్స్ తయారీకి మొత్తం 8520 టన్నుల స్టీల్ను వినియోగించారు. – ఈ టన్నెళ్లకు చివర తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటు చేస్తారు. టర్బైన్ల పునాది పనులను వేగవంతం చేశారు. – వర్టికల్ కెప్లాన్ టర్బైన్ల తయారీని భోపాల్లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈల్కు అప్పగించారు. ఈ టర్బైన్లు ఆసియాలోనే అతి పెద్దవి కావడం గమనార్హం. హిమాలయ జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా.. – గోదావరి నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రవాహమంతా పోలవరం ప్రాజెక్టు మీదుగానే ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతోంది. – జలవిద్యుత్కేంద్రంలో ఒక సొరంగం (యూనిట్) ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే రోజుకు 331 క్యూమెక్కులు (11,690 క్యూసెక్కులు) నీటిని విడుదల చేయాలి. ఈ లెక్కన 12 సొరంగాలలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలంటే 1,40,280 క్యూసెక్కులు (12 టీఎంసీలు) అవసరం. – పోలవరం పూర్తి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు వద్దకు జూలై నుంచి అక్టోబర్ రెండో వారం వరకూ ఏడాదికి సగటున 100 నుంచి 120 రోజుల వరకూ 1.50 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద ప్రవాహం వస్తుంది. అంటే ఏడాదికి సుమారు వంద నుంచి 120 రోజులు పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. – ఆ తర్వాత వరద ప్రవాహం తగ్గిన మేరకు విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. గోదావరి డెల్టాకు రబీ పంటలకు పోలవరం నుంచే నీటిని విడుదల చేయాలి. వాటిని విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తారు. అంటే ఏడాది పొడవునా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. – అందువల్ల హిమాలయ నదులపై ఏర్పాటు చేసిన జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి అవుతుందిన అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
మళ్ళీ తెరపైకి సేతు సముద్రం ప్రాజెక్ట్
-
కీలకాంశాలపై వాడీవేడిగా
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని జలసౌధలో జరగనుంది. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న కడెం–గూడెం ఎత్తిపోతల పథకం, మొడికుంటవాగు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతుల జారీ/అబ్జర్వేషన్ల నమోదు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఆనకట్ట ఆధునికీకరణ, రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరిపై టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు, ఉమ్మడి రాష్ట్ర కాలంలో గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాడీవేడి చర్చకు అవకాశం! కడెం–గూడెం ప్రాజెక్టుపై ఏపీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం లేదని గత ఏడాది ఆగస్టులో ఏపీ ప్రభుత్వం గోదావరి బో ర్డుకు లేఖ రాసింది. అయితే కడెం ప్రాజెక్టులో పూడిక చేరడంతో 3 టీఎంసీల మేరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గినందున ప్రత్యామ్నాయ ప్రాజెక్టును చేపట్టినట్టు ఇటీవల తెలంగాణ అధికారులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు పెద్దవాగు ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకో వడం వల్ల అత్యవసర మరమ్మతు పనులు చేయాల్సి ఉంది. రూ.7,826 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు తెలంగాణ 2019లో ప్రతిపాదనలు సమర్పించింది. ఆయకట్టు శాతం ఆధారంగా ఏపీ 85.75 శాతం, తెలంగాణ 14.75 శాతం వ్యయం భరించాలని తెలంగాణ కోరగా, ఏపీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇదే దామాషా లెక్కన రూ.92 కోట్లతో అత్యవసర మరమ్మతులు చేసేందుకు ఏపీ అంగీకరించింది. ఆధునీకరణతో పాటు అత్యవసర మరమ్మతులపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నీటి లభ్యత ఎంత ? గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఇప్పటివరకు నిర్ణయించక పోవడంతో రెండు రాష్ట్రా ల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతుల జారీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గోదావరి నీటి పంప కాలపై రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. 1980లో వచ్చిన గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోకూడా నీటి లభ్యతపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 3,216 టీఎంసీల జలాల లభ్య త ఉండగా, అందులో ఉమ్మడి రాష్ట్రానికి కేవలం 1,360 టీఎంసీల లభ్యత ఉందని వ్యాప్కోస్ అధ్య యనంలో తేలిందని ఏపీ వాదిస్తోంది. తెలంగాణకు 1,480 టీఎంసీలు, ఏపీకి 1,486.155 టీఎంసీల లభ్యత ఉందని తెలంగాణ పేర్కొంటోంది. ఈ నేప థ్యంలో గోదావరిలో వాస్తవ నీటి లభ్యతపై జాతీయ స్థాయి సంస్థతో అధ్యయనం చేయించాలని గోదా వరి బోర్డు ప్రతిపాదించింది. ఈ అంశంపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
భారీ వరదకూ చెక్కుచెదరకుండా పింఛా ప్రాజెక్టు పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: భారీ వరద వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా పింఛా ప్రాజెక్టును ప్రభుత్వం పునరుద్ధరించనుంది. గతేడాది నవంబర్లో వచ్చిన ఆకస్మిక వరదలకు దెబ్బతిన్న ఈ ప్రాజెక్టును రూ.68.32 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించనుంది. ఇందుకోసం లంప్సమ్ – ఓపెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో ఈ నెల 5న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న ఆర్థిక బిడ్ను తెరిచి, రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం ముడుంపాడు వద్ద పింఛా నదిపై 1954లో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. కుడి కాలువ కింద 2211.31 ఎకరాలు, ఎడమ కాలువ కింద 1562.10 ఎకరాలు మొత్తం 3,773.41 ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ (పిల్ల కాలువలు)లను అభివృద్ధి చేసింది. అప్పట్లో పింఛాకు గరిష్టంగా 58 వేల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో ప్రాజెక్టు నిర్మించారు. గతేడాది నవంబర్ 14 నుంచి నల్లమల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పింఛా నది ఉప్పొంగింది. దాంతో గతేడాది నవంబర్ 18న లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. వరద ధాటికి పింఛా ప్రాజెక్టు రింగ్ బండ్, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పింఛాకు ఎంత వరద వచ్చినా చెక్కుచెదరకుండా ఉండేలా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పింఛాకు గరిష్టంగా వచ్చే వరదపై మళ్లీ అధ్యయనం చేసిన అధికారులు.. రూ.84.33 కోట్లతో పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదించింది. దాంతో పనరుద్ధరణ పనులకు 68.32 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు టెండర్లు పిలిచారు. -
‘మేఘా’కు మహారాష్ట్ర సర్కార్ ప్రశంసలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక సమృద్ధి మహామార్గ్ ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసినందుకు గాను హైదరాబాద్కు చెందిన మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్)ను మహారాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. ఆదివారం నాగ్పూర్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్యలకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ ప్రాజెక్టులో 85.40 కిలోమీటర్ల రెండు ప్యాకేజీలను ఎంఈఐఎల్ పూర్తి చేసింది. శివమడక నుండి నాగ్పూర్లోని ఖడ్కీ ఆమ్గావ్ వరకు 31. కి.మీ.లు, రెండో సెగ్మెంట్లో ఔరంగాబాద్ జిల్లాలోని బెండేవాడి నుండి ఫతివాబాద్ వరకు 54.40 కి.మీ. రహదారిని పూర్తి చేసింది. వయాడక్ట్లు, అండర్పాస్లు, వైల్డ్ యానిమల్ ఓవర్పాస్లు మొదలైన వాటిని నిర్మించింది. ఈ బృహత్ ప్రాజెక్టుతో నాగ్పూర్-ముంబై మధ్య ప్రయాణ సమయం ఏడు గంటలకు తగ్గనుంది. -
స్టార్టప్స్కు ద్వారక కో-వర్కింగ్ స్పేస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ స్పేస్ కంపెనీ ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్.. స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా 620 సీట్లతో మాదాపూర్లో ద్వారక ప్రైడ్ను ప్రారంభించింది. దీంతో సంస్థ ఖాతాలో 13 కేంద్రాలకుగాను 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 6,500 సీట్ల సామర్థ్యానికి చేరుకున్నామని ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. 100కుపైగా కంపెనీల కార్యాలయాలు ద్వారక ప్రాజెక్టుల్లో కొలువుదీరాయని చెప్పారు. కొత్తగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్టులను 2024 మార్చినాటికి జోడిస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా మరో 4,500 సీట్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ డైరెక్టర్ దీప్నా రెడ్డి వివరించారు. అనువైన విధానం..: ఆఫీస్ స్పేస్ పరిశ్రమలో ప్లగ్ అండ్ ప్లే, కో–వర్కింగ్, సర్వీస్డ్ ఆఫీస్ స్పేస్ విభాగాల్లో పోటీ పడుతున్నామని దీప్నా రెడ్డి తెలిపారు. ‘ఐటీ రంగంలో ఒడిదుడుకులు సహజం. అందుకే కంపెనీలకు దీర్ఘకాలిక ఒప్పందం భారం కాకుండా అనువైన విధానాన్ని అమలు చేస్తున్నాం. అంటే ఒప్పందం కుదుర్చుకుని సీట్లను తగ్గించుకున్నా వారిపై భారం ఉండదు. మహిళా వ్యాపారవేత్తలకు చార్జీల్లో డిస్కౌంట్ ఇస్తున్నాం. మహమ్మారి కాలంలో ఆఫీస్ స్పేస్ పరిశ్రమ తిరోగమించింది. ఇదే కాలంలో ద్వారక ఇన్ఫ్రా భారీ ప్రాజెక్టులకుతోడు రెండింతల సామర్థ్యాన్ని అందుకుంది. సాధారణ చార్జీలతోనే ప్రీమియం ఇంటీరియర్స్తో ఖరీదైన అనుభూతి కల్పిస్తున్నాం’ అని వివరించారు. -
వరదలు తగ్గడంతో పోలవరం పనుల్ని వేగవంతం చేశాం : మంత్రి అంబటి
-
దుమారం రేపిన మోదీ వ్యాఖ్యలు... మాటల తూటలు పేల్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ పుట్టినరోజు పురస్కరించుకుని నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.... దేశంలో చిరుతలు అంతరించిపోయాయని, తిరిగి భారత్లో ప్రవేశపెట్టేలా... దశాబ్దాలుగా ఎలాంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు జరగలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కాంగ్రెస్ను విమర్శించారు. అయితే, ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ దగాకోరు! అంటూ మాటల తుటాలు పేల్చింది. అంతేకాదు ఇది మోదీ క్రెడిట్ కాదని, ఆయన చేసిన చారిత్రక ఘట్టానికి తామే ముందు అంకురార్పణ చేశామని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించింది. ఈ మేరకు 2009లో ప్రాజెక్టు చిరుత ప్రారంభించిన లేఖను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సీనియర్ నాయకుడు జై రామ్ రమేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో యూపీఏ హయాంలో పర్యావరణ అటవీ శాఖలను నిర్వహించిన జై రాం రమేష్ చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టేందుకు వైల్డ్లైఫ్ ట్రస్ట్ ఇండియా అధికారులను రోడ్మ్యాప్ సిద్ధం చేయమని కోరారు. తాను భారత్ జోడో యాత్రలో ఉండటం వల్లే ఈ లేఖను వెంటనే పోస్ట్ చేయలేకపోయానని జై రామ్ రమేశ్ వివరణ ఇచ్చారు. మెరుపు దాడికి ప్రసిద్ధి చెందిన చిరుతలు 1940లలో అంతరించుకుపోయాయి. అయితే 2012 లో యూపీఏ ప్రభుత్వం చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టే ప్రణాళిక దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేగాదు కొంతమంది పరిరక్షకులు భారత్లోకి ఆఫ్రికన్ చిరుతలు దిగుమతి చేసుకోవడం అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ కమిటీ (ఐయూసీఎన్) మార్గదర్శకాలకు విరుద్ధమని వాదించారు. అయితే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2017లో కోర్టులో ఈ విషయమై దరఖాస్తులు చేసింది. చిరుతలను భారత్లోకి ప్రవేశ పెట్టే ప్రాజెక్టు చట్టబద్ధమేనని ఐయూసీఎన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని కాంగ్రెస్ వాదిస్తోంది. వాస్తవానికి ఇదంతా తమ పార్టీ హయాంలోనే జరిగిందని మోదీ ఘనతేమీ కాదని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. This was the letter that launched Project Cheetah in 2009. Our PM is a pathological liar. I couldn’t lay my hands on this letter yesterday because of my preoccupation with the #BharatJodoYatra pic.twitter.com/3AQ18a4bSh — Jairam Ramesh (@Jairam_Ramesh) September 18, 2022 (చదవండి: చిరుతల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు) -
హౌసింగ్ ప్రాజెక్టులకు రూ. 350 కోట్లు: ఎల్డెకో, హెచ్డీఎఫ్సీ క్యాపిటల్
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ క్యాపిటల్తో చేతులు కలిపినట్లు రియల్టీ సంస్థ ఎల్డెకో గ్రూప్ తాజాగా పేర్కొంది. తద్వారా దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో హౌసింగ్ ప్రాజెక్టుల అభివృద్ధిని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 350 కోట్లతో నిధి(ఫండ్) ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వెరసి అందుబాటు ధరల రెసిడెన్షియల్ ప్రాజెక్టుల అభివృద్ధికి వీలుగా హెచ్-కేర్3 పేరుతో రియల్టీ ఫండ్కు తెరతీసినట్లు ఎల్డెకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ తెలియజేసింది. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ప్రస్తుతం ఎల్డెకో గ్రూప్ ఢిల్లీ-ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో నాలుగు హౌసింగ్ ప్రాజెక్టులను గుర్తించింది. వీటిపై రూ. 175 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. కాగా.. ఇంతక్రితం కూడా హెచ్డీఎఫ్సీ క్యాపిటల్తో భాగస్వామ్యంలో ఎల్డెకో గ్రూప్ హెచ్-కేర్1 పేరుతో రూ. 150 కోట్ల రియల్టీ ఫండ్ను ఏర్పాటు చేసింది. తద్వారా తక్కువ ఎత్తులో, ప్లాటెడ్ అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. తొలిగా ఈ ఏడాది మార్చిలో ఎల్డెకో ప్యారడైజో పేరుతో పానిపట్లో 35 ఎకరాల ప్లాటెడ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. (క్లిక్: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్) -
టీటీడీ, వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇదే.. పూర్తి వివరాలు ఇవిగో..
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకార వైభోగం చెప్పనలవి కాదు. స్వామి వారి అలంకారంలో పుష్పాలదే అగ్రస్థానం. తిరుమలేశుని మూల మూర్తికి ఉదయం లేచింది మొదలు రాత్రి పవళింపు సేవ వరకు నిత్యం సాగే పూజాదికాల్లో అనేక రకాల పుష్పాలు వాడతారు. స్వామి సేవకు ఉపయోగించిన పవిత్రమైన పుష్పాలను పూజారుల చేతుల నుంచి అందుకోవడమే మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాంటిది పూజకు ఉపయోగించిన పుష్పాలు స్వామి వారి రూపంలో ఉంటే భక్తుల తన్మయత్వం అంతా ఇంతా కాదు. ఇదే తలంపుతో టీటీడీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం సంయుక్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తలపెట్టాయి. చదవండి: ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే? గతేడాది జనవరిలో ‘ఎండు పూలతో విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వామి వారి పుష్పాలతో దేవతా మూర్తులు, పలు రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నాయి. ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని చీని, నిమ్మ పరిశోధన ప్రాంగణంలోని స్కిల్ డెవలప్మెంట్ యూనిట్లో 350 మందికి డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ డ్రై ఫ్లవర్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చారు. ఎండబెట్టిన పూలతో ప్రకృతి రమణీయ దృశ్యాలతో కూడిన చిత్రపటాలు, వివిధ రకాల వస్తువుల తయారీతో జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేదలు. కోవిడ్ కారణంగా భర్త చనిపోయిన వారు, ఉపాధి కోల్పోయిన వారు, టీ బంకుల్లో, ఇళ్లల్లో పనులు చేసుకునే వారు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. దైవత్వం ఉట్టిపడేలా కళారూపాలు ఉద్యాన వర్సిటీతో చేసుకున్న ఒప్పందం మేరకు స్వామివారి సేవలో ఉపయోగించే పూలను టీటీడీ సరఫరా చేస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వాటిని ఎండబెట్టి, ఫొటో పేపర్, కాన్వాస్లపై దైవత్వం ఉట్టిపడేలా వివిధ రూపాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, పద్మావతి, ఒంటిమెట్టలోని సీతారాములు, శ్రీకృష్ణుడు, వకుళామాత వంటి దేవతామూర్తుల చిత్రపటాలను తీర్చిదిద్దుతున్నారు. డాలర్లు, కీచైన్లు, పేపర్ వెయిట్లు, లాకెట్లు, పెన్స్టాండ్లు వంటి వాటిని తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరు సగటున నెలకు రూ.10 వేలు ఆర్జిస్తున్నారు. కొందరు రూ.30 వేల వరకు కూడా సంపాదిస్తున్నారు. నెలకు రూ.40 లక్షల ఉత్పత్తుల తయారీ ఇక్కడ తయారైన వస్తువులను తిరుమలతో పాటు టీటీడీకీ అనుబంధంగా ఉన్న స్వామి వారి ఆలయాల వద్ద విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల విలువైన ఉత్పత్తులు తయారవుతుండగా, రూ.60 లక్షల స్థాయికి పెంచుతున్నారు. ఆన్లైన్లో కూడా విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారికి అలంకరించే 3 నుంచి 5 అడుగుల నిలువెత్తు పూలదండలను ఎండబెట్టి ఫ్రేమ్ కట్టి భక్తులకు అందించే ఆలోచన చేస్తున్నారు. దీనిని పూర్తిస్థాయి పరిశ్రమగా నిలబెట్టేందుకు ప్రత్యేక భవనం నిర్మాణానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఈ సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలంటూ తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి యూనివర్సిటీకి వినతులు వస్తున్నాయి. ఈ కేంద్రాన్ని పరిశీలించిన ప్రవాసాంధ్రులు కూడా ఆర్డర్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. మరో వైపు ఎండుపూలతో తయారు చేసే వస్తువుల జీవిత కాలం పెంచేందుకు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రొ.రాచకుంట నాగరాజు పర్యవేక్షణలో పరిశోధనలు చేస్తున్నారు. ఎండబెట్టిన పూలను వాటి సహజసిద్ధమైన రంగు కోల్పోకుండా పౌడర్ రూపంలో మార్చడం పైనా అధ్యయనం చేస్తున్నారు. కుటుంబానికి లోటులేకుండా ఉంది నా భర్త ఏడాది క్రితం కోవిడ్తో చనిపోయారు. ఇద్దరు పిల్లలు, అత్త పోషణ నాపై పడింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇక్కడ శిక్షణ పొంది నెలకు రూ.12 వేలకు పైగా సంపాదిస్తున్నా. కుటుంబానికి లోటు లేకుండా ఉంది. –ఎం.శివకుమారి, హరిపురం కాలనీ, తిరుపతి అప్పులన్నీ తీర్చేశా నా భర్త సిమెంట్ పనికి వెళ్తారు. నెలలో 15–20 రోజులే పని. రోజుకు 450 సంపాదించే వారు. ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. స్వామి వారి ఫొటో ఫ్రేమ్స్ తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత నెలకు రూ.10–12వేలు సంపాదిస్తున్నా. అప్పులన్నీ తీర్చేశా. –కడపల దివ్యలత, అన్నమయ్య నగర్, తిరుపతి మంచి స్పందన లభిస్తోంది టీటీడీతో కలిసి తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎండుపూల ఉత్పత్తుల ప్రాజెక్టుకు మంచి స్పందన లభిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణ పొందిన మహిళల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయి. ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. –డాక్టర్. టి.జానకిరామ్, వైస్చాన్సలర్, ఉద్యాన వర్సిటీ -
సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్
సాక్షి, సిద్దిపేట: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు నష్టపరిహారం కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టడం.. విద్యుత్ సరఫరా నిలిపివేసి, పలువురిని అరెస్టు చేయడం.. నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జీతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనితో నిర్వాసితులు ఆందోళనను మరింత ముమ్మరం చేశారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గూడాటిపల్లిలో 8.23 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాజెక్టు కాల్వ నిర్మాణం కోసం సర్వే పనులు జరుగుతున్నాయి. అయితే తమకు పూర్తి పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలంటూ నిర్వాసితులు రెండు రోజులుగా పనులను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గూడాటిపల్లిలో మోహరించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇళ్లలోని నిర్వాసితులను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మహిళలు, కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జీకి దిగి చెదరగొట్టడంతో.. పలువురికి గాయాలయ్యాయి. పాదయాత్రగా హుస్నాబాద్కు.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు గూడాటిపల్లి నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు. హుస్నాబాద్ ఎల్లమ్మ గుడివద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు దిగివచ్చి అనుమతి ఇవ్వడంతో నిర్వాసితులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి నిర్వాసితులతో మాట్లాడారు. అరెస్టైన వారిని విడుదల చేయించారు. పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నిర్వాసితులు వెనక్కి తగ్గలేదు. హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, వంటావార్పు నిరసన చేపట్టారు. అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పోలీసుల లాఠీచార్జీని నిరసిస్తూ కాంగ్రెస్ మంగళవారం హుస్నాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. పోలీసులు క్షమాపణ చెప్పాల్సిందే: సీపీఐ నారాయణ భూనిర్వాసితులపై లాఠీచార్జీ చేసిన పోలీసు లు క్షమాపణ చెప్పాలని, వారిని వెంటనే స స్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆ ధ్వర్యంలో సోమవారం హుస్నాబాద్ పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భం గా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు కొదురుపాకలో నిర్వాసితులకు చెల్లించినట్టు గా గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చేసిన పా పాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం జాతీ య స్థాయికి వెళ్తున్నారని మండిపడ్డారు. దాడి క్షమించరానిది: రేవంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డ వారికి సరైన పరిహారం ఇవ్వాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ నిర్వాకంతో నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులు కోరుకున్న విధంగా పరిహార ప్యాకేజీ అమలు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకో ఎకరం డబ్బులు రావాలి గౌరవెల్లిలో 5 ఎకరాల భూమి కోల్పోయాను. 4 ఎకరాలకు సంబంధించిన డబ్బులే చెల్లించారు. ఇంకా ఎకరం డబ్బులివ్వాలి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద స్థలమిస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించాకే ప్రాజెక్టు పనులు చేయాలి. – భూక్యా స్వప్న, సేవగాని తండా భూమికి భూమి ఇవ్వాలి గౌరవెల్లి రిజర్వాయర్ కోసం 3 వేల ఎకరాలకుపైగా భూమి సేకరించారు. అందులో 88 ఎకరాలకు సంబంధించిన రైతులు సంతకాలు చేయలేదు. కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతున్నాం. మల్లన్నసాగర్ నిర్వాసితులతో సమానంగా మాకూ నష్టపరిహారం చెల్లించాలి. – బద్దం ఎల్లారెడ్డి, గూడాటిపల్లి -
ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు.. శంకుస్థాపనకు సీఎం జగన్
కర్నూలు(సెంట్రల్): ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుమ్మితం తండాలో చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం అధికారులు, గ్రీన్కో ప్రతినిధులతో కలెక్టర్ కోటేశ్వరరావు సమావేశమయ్యారు. పోలీసు బందోబస్తు, కార్యక్రమ నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్రెడ్డి, ఇతర అధికారులను ఆదేశించారు. గ్రీన్కో ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి 5,410 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో గ్రీన్ కోఎనర్జీస్ లిమిటెడ్ నిర్మించే పవర్ ప్రాజెక్టు నుంచి సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇలా ఒకే ప్లాంట్ నుంచి మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదట కర్నూలు జిల్లాలో నిర్మితం అవుతుండటం సంతోషకరమన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు ఓర్వకల్లు ఎయిర్పోర్టులో సీఎం పర్యటన ఏర్పాట్లపై డైరెక్టర్ విద్యాసాగర్తో చర్చించారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ హరిప్రసాదు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే..) 800 మంది పోలీసులతో బందోబస్తు కర్నూలు (టౌన్): సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలు, 122 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 283 మంది కానిస్టేబుళ్లు, 28 మంది మహిళా పోలీసులు, 169 మంది హోంగార్డులు, 03 ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది, 02 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది, 7 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు తెలిపారు. -
Kurnool: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, కర్నూలు (సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17న జిల్లాకు రానున్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: (Konaseema: ఆటే శ్వాస... సాధనే జీవితం.. ఫైనల్స్కు చేరిన భారత జట్టులో) సీఎం పర్యటన వివరాలు.. ►మంగళవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని ఆయన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. ►10 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. ►10.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ►11.15 గంటలకు ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా హెలిప్యాడ్కు హెలికాప్టర్లో వస్తారు. ►11.15 నుంచి 11.30 గంటల మధ్య స్థానిక నేతలతో మాట్లాడతారు. ►11.35 గంటలకు ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. ►11.35 నుంచి 12.15 గంటలకు ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు ►12.40 గంటలకు తిరిగి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ►12.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ ) -
జాక్ పాట్ కొట్టేసిన సిగ్నిటీ టెక్నాలజీస్!
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ తాజాగా 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 76 కోట్లు) ఆర్డరు దక్కించుకుంది. అమెరికాకు చెందిన అతి పెద్ద ఆర్థిక సేవల సంస్థల్లో ఒక దాన్నుంచి ఈ వార్షిక కాంట్రాక్టును దక్కించుకున్నట్లు సంస్థ సీఈవో శ్రీకాంత్ చక్కిలం వెల్లడించారు. భారీ డీల్స్ దక్కించుకోవడంలో తమ సామర్థ్యాలకు ఇది నిదర్శనమని ఆయన వివరించారు. తమ ఆదాయాల్లో బీఎఫ్ఎస్ఐ వాటా మరింత పెరిగేందుకు ఈ డీల్ తోడ్పడగలదని శ్రీకాంత్ చెప్పారు. -
ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రీజినల్ రింగ్రోడ్డు(ట్రిపుల్ ఆర్) ప్రాజెక్ట్ చుట్టూ ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని వేయగలిగితే అది దేశంలోనే నంబర్ వన్ ప్రాజెక్ట్గా మారుతుందని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. సవివరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి తీసుకొస్తే రైల్వే అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. తాను, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కలసి ప్రధాని నరేంద్రమోదీ వద్ద దీనిపై చర్చిస్తామని చెప్పారు. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్ట్ అయినందున ఇప్పటికిప్పుడు దానిపై ప్రకటన సాధ్యంకాదని స్పష్టం చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతల సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఆలోచన బాగుందని బండి సంజయ్, సీహెచ్ విఠల్ తదితర నేతలు పేర్కొన్నారు. రైల్వేమంత్రి స్పందించి ట్రిపుల్ ఆర్ వెడల్పు ఎంతని అడగగా వంద మీటర్లని కేంద్రమంత్రి కిషన్రెడ్డి బదులిచ్చారు. వంద మీటర్లలో రైల్వేశాఖకు 30 మీటర్లు కేటాయిస్తే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, నేతలు జి.ప్రేమేందర్రెడ్డి, డి.ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి, డా.జి.మనోహర్రెడ్డి, కొల్లి మాధవి, జయశ్రీ, గూడూరు నారాయణరెడ్డి, రాకేశ్రెడ్డి, సంగప్ప పాల్గొన్నారు. రాష్ట్రవాటా చెల్లించడంలేదు.. హైదరాబాద్లోని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) పూర్తి చేయడానికి కేంద్రం మూడొంతుల నిధులు చెల్లించగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించడంలేదని రైల్వే మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూయూపీఏ హయాంలో రైల్వేకు సంబంధించి 2009–14 మధ్యలో ఉమ్మడి ఏపీకి ఏడాదికి రూ.886 కోట్లు కేటాయించగా, మోదీ ప్రభుత్వం 2014–19 మధ్యలో ఒక్క తెలంగాణకే ఏడాదికి రూ.1,110 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 2019లో రూ.2,056 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.3,048 కోట్లకు పెంచినట్లు తెలిపారు. 2009–14 మధ్యలో తెలంగాణలో ట్రాక్ డబ్లింగ్, ఇతర పనులు శూన్యంకాగా ఇప్పుడు 24 కి.మీ. మేర ఈ పనులు సాగుతున్నాయని, ఈ ఏడాది అవి రెట్టింపు కాబోతున్నాయని చెప్పారు. -
మాకెప్పుడూ మొండిచెయ్యేనా?
కుత్బుల్లాపూర్: రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. సాయం విషయంలోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు మొండిచెయ్యి చూపుతోందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ శివార్లలోని కుత్బుల్లాపూర్ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండిపడ్డారు. వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారం కోసం పలు కీలక ప్రాజెక్టులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. స్కైవేలు, రోడ్ల కోసం కంటోన్మెంట్ పరిధిలో కొంత భూమి అవసరమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి సహకరించాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. కానీ ఇప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని మండిపడ్డారు. వరదల సమయంలో కేంద్రం గుజరాత్కు వెయ్యికోట్ల సాయం ప్రకటించిందని, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. త్వరలో మొదలుకానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తారని తెలిపారు. చెరువులు, కుంటలు, రోడ్లు, స్కైవేల అభివృద్ధి కోసం 7,800 కోట్లు అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశామని, సానుకూలంగా స్పందన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. -
హుస్సేన్సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన
-
ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్
-
టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు: ఏపీ-ఎఫ్ఏవో మధ్య ఒప్పందం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యునైటెడ్ నేషన్స్కు చెందిన పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) బృందం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ప్రతినిధులు కలిశారు. సుస్థిర వ్యవసాయ–ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడంతో పాటు రాష్ట్రంలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు ఎఫ్ఏఓ– ఏపీల మధ్య టీసీపీ(టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు) ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య.. టోమియో షిచిరి, కంట్రీ డైరెక్టర్ (ఇండియా), పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) యునైటెడ్ నేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏ కె సింగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. చదవండి: CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ నూతన ఏడాది కానుక అందరికీ ఆహార భద్రతపై అంతర్జాతీయంగా ఏఫ్ఏఓ కృషి చేస్తోంది. రాష్ట్రంలో ఆర్బీకేలకు సాంకేతికంగా, ఆర్ధికంగా సాయం అందించనుంది. రైతు భరోసా కేంద్రాల బలోపేతం చేసేందుకు ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ సహకరించనున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు ఎఫ్ఏఓ శిక్షణ అందించనుంది. ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతుల్లోనూ రైతులకు శిక్షణ అందించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులను ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఆర్బీకేల ద్వారా రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. గతంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల వాడకం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారని.. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆర్బీకేలు వచ్చాయని సీఎం అన్నారు. అలాగే రైతులకు మద్దతు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇ– క్రాపింగ్ గురించి సీఎం వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయరంగంలో పెను మార్పులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జి శేఖర్బాబు పాల్గొన్నారు. -
కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో..
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందా అని నగరవాసులు నిరీక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు పచ్చజెండా లభించినా టెండర్ల ప్రక్రియ దశలోనే ఉంది. సుమారు రూ. 15,700 కోట్ల ఖర్చుతో అతి భారీ ప్రాజెక్టు అయిన సబర్బన్ రైల్వే యోజనకు ఆరంభంలోనే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ రద్ధీని తగ్గించడంతో పాటు నగర శివార్లను సులభంగా కలిపేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. నాలుగు ప్రాంతాలకు అనుసంధానం.. ► సబర్బన్ రైల్వే ప్రాజెక్టు పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) మోడల్లో చేపట్టారు. మొత్తం 148.17 కిలోమీటర్ల దూరంలో నాలుగు ప్రత్యేక కారిడార్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ► బెంగళూరు–దేవనహళ్లి (41.40 కి.మీ.), బైయ్యప్పనహళ్లి–చిక్కబాణవర (25.01 కి.మీ.), కెంగేరి–బెంగళూరు కంటోన్మెంట్ (35.52 కి.మీ.), హీలలిగే– రాజనుకుంటే (46.24 కి.మీ.) రూట్లతో నగరవాసుల ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ► ఈ ప్రాజెక్టులో మొత్తం 62 స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 101.7 ఎకరాల భూమి అవసరం. ఈ భూమి స్వాధీనం కోసం రూ. 1,419 కోట్ల ఖర్చు అవుతుంది. కేటాయింపులు ఈ విధంగా.. ప్రాజెక్టు నిధులను 20 శాతం చొప్పున కేంద్ర రాష్ట్రాలు భరించి, మిగతా 60 శాతాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. కర్ణాటక ప్రభుత్వం రూ. 5,087 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 3,242 కోట్లు ఇస్తాయి. రుణం ద్వారా రూ. 7,438 కోట్లను తీసుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ దశలో ఉంది. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఆకర్షణీయ హామీగా మారిందే తప్ప సాకారం అయ్యేదెన్నడు అనే ప్రశ్న వినిపిస్తోంది. చదవండి: భూలోక స్వర్గం.. ఆ పర్వతం.. చూస్తుంటే మైమరచిపోవడం ఖాయం! -
రూ.300 కోట్లకు ముంచేశాడు.. ఆన్లైన్ ప్రాజెక్టు పేరిట భారీ మోసం
ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం జిల్లా): పెట్టుబడి పెట్టండి.. లాభాలొస్తాయి.. అని చెప్పాడు. కొద్దిరోజులు కొందరికి లాభాలు ఇచ్చాడు. తరువాత వేలమంది పెట్టుబడి పెట్టారు. వీరంతా రూ.300 కోట్ల వరకు అతడికి ఇచ్చినట్లు తెలిసింది. అంతే.. ఆయన కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ఎం పురం గ్రామానికి చెందిన మద్ది నాగేశ్వరరావు ఏడాదిగా ఎచ్చెర్లలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సూర్య నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్ ప్రాజెక్టులు సంపాదించి వాటితో వ్యాపారం చేసేవాడు. పలువురు విద్యార్థుల వద్ద డబ్బు వసూలు చేసి ఈ ప్రాజెక్టు పనులు చేసేందుకు ఉద్యోగాలిచ్చాడు. ఈ ప్రాజెక్టులు సాగుతుండగానే మరో భారీ మోసానికి తెరతీశాడు. ఈ ఆన్లైన్ ప్రాజెక్టుల్లో తనతోపాటు పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని ప్రచారం చేశాడు. ఈ మాటలు నమ్మిన కొందరు మొదట్లో నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. వారికి నెలనెలా రూ.5 వేల వంతున లాభాల పేరిట ఇచ్చేవాడు. ఇదిచూసి మరికొందరు పెట్టుబడి పెట్టారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారమవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా అనేకమంది ఆకర్షితులయ్యారు. దాదాపు 4 వేలమంది సుమారు రూ.300 కోట్ల మేర పెట్టుబడి పెట్టారు. వీరిలో కొందరు రూ.60 లక్షల వరకు ఇచ్చిన వారున్నారు. డబ్బు తీసుకున్నట్లు కొందరికి చేత్తో రాసి ఇచ్చాడు. పెట్టుబడి పెట్టినవారికి లాభాల పేరుతో ఇస్తున్న డబ్బును మూడు నెలలుగా ఇవ్వడంలేదు. అడిగినవారికి ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వర్క్ పరిస్థితి మెరుగ్గా లేదని, కొన్ని రోజుల్లో బాగుపడుతుందని చెప్పేవాడు. పెట్టుబడి పెట్టినవారి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భార్య, ఇద్దరు పిల్లలతో సహా నాగేశ్వరరావు అదృశ్యమయ్యాడు. అతడి తల్లిదండ్రులు మాత్రం ఇక్కడున్నారు. నాగేశ్వరరావు కనిపించడంలేదని తెలిసిన తరువాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పోలీస్స్టేషన్కు వెళ్తున్నారు. గురువారానికి 50 మంది వరకు ఎచ్చెర్ల పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల్లో నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం ఎస్ఎం పురానికి చెందిన మద్ది నాగేశ్వరరావు ఎచ్చెర్లలో సూర్య నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్ ప్రాజెక్టు పేరుతో డిపాజిట్లు స్వీకరించినట్లు కొందరు స్టేషన్కు వచ్చి చెప్పారు. రాత పూర్వకంగా ఫిర్యాదు రాలేదు. బాధితుల వద్ద ఉన్న ఆధారాలు, రాత పూర్వక ఫిర్యాదు వస్తే దర్యాప్తు ప్రారంభిస్తాం. కె.రాము, ఎస్ఐ, ఎచ్చెర్ల -
విశాఖలో వినూత్న ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
విశాఖ విరాజిల్లేలా సరికొత్త ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సంస్కృతి పరిరక్షణకు చిరునామాగా, పర్యాటక రంగానికి ప్రధాన కేంద్రంగా.. సాంకేతిక రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించేలా భారీ ప్రాజెక్టులు రానున్నాయి. వీటి రాకతో 30 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా విశాఖ అభివృద్ధిపైనే ప్రభుత్వం దృష్టిసారించినట్లుగా భారీ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మాత్రమే కాకుండా.. పర్యాటక రాజధానిగానూ, ఐటీ హబ్గానూ తీర్చిదిద్దాలన్న సీఎం వైఎస్ జగన్ సంకల్పానికి అనుగుణంగా భారీ ప్రాజెక్టులు విశాఖకు రానున్నాయి. సంస్కృతి, వేద పాఠశాలలకు.. ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా మారిన విశాఖ జిల్లాని సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాలను విశాఖ శారదా పీఠానికి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ.1.5 కోట్లు చొప్పున భూమిని కేటాయించింది. ఈ ప్రాంతంలో సంస్కృత పాఠశాలతో పాటు వేద విద్య పాఠశాలను శారదా పీఠం నిర్మించనుంది. అదేవిధంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలయంగా కొత్తవలసని మార్చాలని శారదా పీఠం ప్రణాళికలు సిద్ధం చేసింది. అదానీ సంస్థ కోసం నిర్మితమవుతున్న రహదారి అదానీ.. సాంకేతిక మణిహారం రూ.14,634 కోట్లతో పాతికవేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విశాఖలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మధురవాడలో 130 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్లని ఏర్పాటు చేయనుంది. విశాఖ ఐటీ చరిత్ర తిరగరాసే విధంగా ఏకంగా పాతికవేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకొచ్చిన అదానీ సంస్థల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సర్వే నెంబర్ 409లో ఎకరానికి రూ.కోటి చొప్పున 130 ఎకరాలను కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్ పార్కు, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్కు, 11 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, 9 ఎకరాల్లో రిక్రియేషన్ పార్కు ఏర్పాటు చేయనుంది. మొత్తం 24,900 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు వస్తే అన్ని విభాగాల్లోనూ విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందనుంది. చదవండి: (Andhra Pradesh: అగ్రవర్ణ పేదలకు దన్ను) రిసార్టులతో విదేశీ పర్యాటకాయ నమః టూరిజం డెస్టినీగా పిలిచే విశాఖపట్నం అంటే ప్రపంచ పర్యాటకులకూ ఎంతో ఇష్టం. భారత్కు వచ్చే ప్రతి 10 మంది విదేశీయుల్లో ఏడుగురు కచ్చితంగా విశాఖలో పర్యటిస్తారు. అంతర్జాతీయ పర్యాటకులతో నిత్యం కిటకిటలాడే విశ్వనగరిలో తమ శాఖల్ని విస్తరింపజేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులతో పాటు దేశీయ సందర్శకుల కోసం సరికొత్త మౌలిక వసతులతో ముందుకొస్తున్నాయి. ప్రముఖ ఒబెరాయ్ సంస్థ భీమిలి మండలం అన్నవరంలో 7 స్టార్ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. రూ.350 కోట్లతో ఏర్పాటు చేయనున్న రిసార్ట్ ద్వారా 5,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. అదేవిధంగా.. పీఎంపాలెం శిల్పారామంలో ప్రముఖ హయత్ గ్రూప్స్ స్టార్ హోటల్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. వరుణ్ బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు వస్తే.. మరో 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టులకు టూరిజం పాలసీలో భాగంగా రాయితీలిచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. -
ఇజ్రాయెల్ ‘ఎగ’సాయం: బాబు ‘షో’కు.. నష్టాల సాగు
వ్యవసాయం దండగ.. ఈ మాటకు వందశాతం పేటెంట్ హక్కు ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే. బషీర్బాగ్ కాల్పులు.. రైతులను గుర్రాలతో తొక్కించిన ఘటనల సాక్షిగా ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అమరావతిలో మూడు పంటలు పండే వ్యవసాయ భూములను రియల్ వెంచర్లుగా మార్చేసిన సదరు చంద్రబాబు తనను మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్న అమాయక కుప్పం రైతులను ఎందుకు వదిలేస్తారు.. అస్సలు వదల్లేదు. భూసారాన్ని బట్టి సంప్రదాయ పంటలు పండించుకుంటున్న కుప్పం నియోజకవర్గ రైతులకు.. ఇవేమీ వద్దంటూ ఆధునిక వ్యవసాయం చేసి చూపిస్తామన్నారు. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అంటూ గారడీ చేసి అర్ధంతరంగా మధ్యలోనే వదిలేశారు. ఫలితంగా కొద్దిమంది మినహా చాలామంది రైతులు దెబ్బతిన్నారు. ఆ సంగతేమిటో కాస్త వివరంగా చూద్దాం రండి.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గంలోని రైతులకు 1999లో అప్పటి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు ఇజ్రాయెల్ ఆధునిక వ్యవసాయాన్ని పరిచయం చేశారు. పంటలకు ఎంత నీరు అవసరమో.. ఆ మేరకు డ్రిప్ ఇరిగేషన్ విధానంతో సేద్యాన్ని ప్రారంభిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. సాంకేతికతను రైతులకు పరిచయం చేసి వారు ఆధునిక సేద్యం వైపు మళ్లేలా ఇజ్రాయెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఆ క్రమంలోనే తొలిసారిగా రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లె వద్ద 200 ఎకరాల్లో డెమో ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. (చదవండి: ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన) ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక పరికరాలు, తక్కువ నీరు, భూమి వినియోగంతో నాణ్యత కలిగిన అధిక దిగుబడులు పొందవచ్చని చెప్పుకొచ్చారు. జపాన్ గ్రాంటుగా అందించిన రూ.10 కోట్లతో 1,600 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, వి.కోట మండలాల్లో 10వేల ఎకరాల్లో ఇజ్రాయెల్ సేద్యం విస్తరణకు చర్యలు చేపట్టారు. ఈ వ్యవసాయానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతుల భూ పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలను ఇప్పించారు. కానీ రైతులకు నాసిరకమైన సబ్సిడీ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఫలితంగా పండించిన పంటలలో లాభాలు రాకపోవడంతో రైతులు నష్టపోయారు. బ్యాంకుల్లో ఉన్న భూముల పత్రాలను విడిపించుకోలేక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తగ్గిన భూసారం వాస్తవానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులను సాధించాలంటే అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. సహజంగా భూమిలో లభించే పోషక పదార్థాలను వినియోగించుకుంటూ ఎరువులపై వృథా ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టని నాటి బాబు హయాంలో పాలకులు ఎంతో ఘనంగా ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో బిందు సేద్యం అమలు చేశారు. ఆ విధానంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించకుండానే ఇజ్రాయెల్ సంస్థతో ఆర్భాటంగా ఒప్పందం కుదుర్చుకుని అర్ధంతరంగా వదిలేశారు. ఫలితంగా ఆ విధానం రైతులకు ఎందుకూ కొరగాకుండా పోయింది. పైగా ఆ సాంకేతిక పరిజ్ఞానంతో భూసారం తగ్గిపోయిందని కొంతమంది రైతులు ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నారు. బీహెచ్సీ కంపెనీ ఎవరిదంటే.. ఇక రైతులకు పదేళ్ల పాటు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామంటూ రూ.కోట్లలో కాంట్రాక్టు తీసుకుని మధ్యలోనే వెళ్లిపోయిన ఇజ్రాయెల్ సంస్థ బీహెచ్సీ(బ్రైట్ హషిత కంపెనీ) చంద్రబాబు బినామీలదేనన్న ప్రచారం బలంగా సాగింది. ఆయన ఆపద్ధర్మ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఈ సంస్థకు నిధులు విడుదల చేయడంపై ఆరోపణలకు బలం చేకూరింది. బీహెచ్సీకి ఏటా రూ.2.80 కోట్లను కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించారు. 2014లో చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా దిగిపోయే చివరి రోజుల్లో కూడా ఈ సంస్థకు రూ.1.50 కోట్లను చెల్లించారు. హైదరాబాద్ ఐఎంజీ భూముల కుంభకోణంలో ప్రధానంగా పేర్లు వినిపించిన ఢిల్లీరావు, పేట్రావ్లకు చెందినదే ఈ బీహెచ్సీ అనే వాదన ఉంది. ఉడాయించిన ఇజ్రాయెల్ కంపెనీ.. రైతులు నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉంటే.. ఇజ్రాయెల్ సంస్థ బీహెచ్సీ(బ్రైట్ హషిత కంపెనీ) అర్ధంతరంగా మాయమైంది. బిందు సేద్యం అమలుకు సాంకేతిక సాయం చేస్తామని చెప్పుకొచ్చిన కంపెనీ ప్రకటన మేరకు అప్పటి అధికారులు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె, శివునికుప్పం, ఎల్లాగ్రామం, బైపరెడ్లపల్లిలో అనేక మంది రైతుల నుంచి సుమారు 200 ఎకరాల భూములను సేకరించారు. ఆ విధానాన్ని అమలు చేసేందుకు రైతుల నుంచి సేకరించిన భూములకు సదరు కంపెనీ నగదు చెల్లిస్తుందని ప్రకటించారు. ఒక్కో రైతు నుంచి భూమిని సేకరించి పదేళ్లకు లీజు రాసుకున్నారు. మొదట్లో ఎకరాకు రూ.లక్ష చెల్లిస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత ఎకరాకు రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తామని చెప్పా రు. చివరికి ఆ నగదును సైతం ఎగ్గొట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులకు ఖాళీగా ఉన్న బీడు భూములను వ్యవసాయానికి ఉపయోగపడేలా చేశామని చెప్పి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి పదేళ్లు ఉంటామని చెప్పిన ఇజ్రాయెల్ కంపెనీ ముందుగానే ఉడాయించింది. ఈ వ్యవహారం, రైతులు నష్టపోయిన నేపథ్యంపై 2006వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. చలపతి కమిషన్ నియమించారు. ఆ కమిషన్ క్షేత్ర స్థాయిలో జరిగిన అవకతవకవలను గుర్తించి నివేదికలు అందించింది. అయితే కమిషన్ నివేదిక అమలు కాకుండా బాబు వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకున్నారు. భూసారం తగ్గిపోయింది.. మాది రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె గ్రామం. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. గతంలో ఇజ్రాయెల్ వ్యవసాయం నిర్వాహకులకు నా రెండెకరాల భూమిని ఇచ్చాను. వారికి సాంకేతిక పరిజ్ఞానం తెలుసు గానీ పంటలు పండించడంలో అవగాహన చాలా తక్కువ. పంటలకు ఎరువులు ఎక్కువగా వాడమని చెబుతారు. ఈ కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. గతంలో పూలను పండించి ఎగుమతి చేసేవాడిని. ఇజ్రాయెల్ సేద్యం మొదలు పెట్టాక మొక్కజొన్న, దోసకాయలు పండిస్తున్నా. గతంలోకన్నా చాలా తక్కువ లాభం వస్తోంది. – గణపతి, రైతు ఇక్రిసాట్ సహకారంతో రైతులకు మేలు ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఉద్యాన పంటల సాగు ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడి పంటల సాగుపై శ్రద్ధ తీసుకుంటోంది. ఆ క్రమంలోనే ఇక్రిసాట్ సహకారంతో హైబ్రీడ్ కూరగాయల విత్తన మొలకలు పెంచి రైతులకు రాయితీపై అందిస్తున్నాం. విత్తన మొలకలకు అంట్లుకట్టి మేలురకం మొలకలు సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నాం. మొత్తం 19 స్ట్రక్చర్స్లో కూరగాయల మొలకలు పెంచుతున్నాం – శ్రీనివాసులు, ఉద్యానవన శాఖ డీడీ -
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు భారీగా వరద, 10 గేట్లు ఎత్తివేత
-
ప్రాజెక్టుల భద్రతపై కేంద్రం కసరత్తు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డులు తమ అధీనంలోకి తీసుకుని నిర్వహించే ప్రాజెక్టులకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలతో (సీఐఎస్ఎఫ్) భద్రత కల్పించేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ సిబ్బందితో భద్రత ప్రక్రియను త్వరగా చేపట్టాలని జల్ శక్తి శాఖ కోరింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది నియామకానికి కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. బోర్డులు, రాష్ట్రాల నుంచి అందించాల్సిన సహకారం, ఒప్పందాలు తదితరాలపై వివరణ ఇస్తూ గోదావరి, కృష్ణా బోర్డులకు లేఖ రాసింది. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వసతి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, వాహనాలు, కార్యాలయాల ఏర్పాటు, జీతభత్యాలకు సంబంధించి ముసాయిదా పత్రాన్ని రెండు బోర్డులకు పంపింది. షెడ్యూల్–2 ప్రాజెక్టులకు భద్రత.. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను కేంద్ర జల్ శక్తి శాఖ షెడ్యూల్–2లో చేర్చింది. ఈ ప్రాజెక్టులు, వాటి కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నిచర్తో సహా అన్నింటినీ బోర్డులు తన అధీనంలోకి తీసుకుని రోజు వారీ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. వాటి పరిధిలోని రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహా అంతా బోర్డు పర్యవేక్షణలోనే పని చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడని ప్రాజెక్టులను షెడ్యూల్–2 నుంచి తప్పించాలని, జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతలను మాత్రమే కృష్ణా బోర్డు తన అధీనంలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. గోదావరిపై ఎగువన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కోరింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించాల్సి ఉంది. బోర్డుల పరిధిని నిర్ణయించడం కోసం రెండు బోర్డులు ఉప సంఘాన్ని నియమించాయి. డీఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ.. షెడ్యూల్–2లోని ప్రాజెక్టుల భద్రతను పర్యవేక్షించే డీఐజీ ర్యాంకు అధికారి మొదలు సీనియర్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఇతర సిబ్బంది జీతభత్యాలు, బ్యారక్లు, కార్యాలయాలు, నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలు, తదితరాలపై సవివరంగా ముసాయిదాలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ రూపొందించిన ముసాయిదా కాపీని బోర్డులు శుక్రవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పంపాయి. ఇవీ చదవండి: Andhra Pradesh : 27 నెలల్లో 68 మెగా పరిశ్రమలు వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. -
కృష్ణా రివర్ బోర్డ్ సమావేశానికి హాజరు కానున్న ఏపీ అధికారులు
అమరావతి: విజయవాడలో రేపు (బుధవారం) కృష్ణా రివర్ బోర్డ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఈఎన్సి నారాయణ రెడ్డి, ఇంటర్ స్టేట్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి హజరు కానున్నారు. తెలంగాణ అక్రమ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ఈ సమావేశంలో ఏపీ అధికారులు కోరనున్నారు. ఈ ఏడాది ఏపీకి 80 శాతం, తెలంగాణకు 20 శాతం కృష్ణాజలాలు కేటాయించాలని బోర్డును ఏపీ అధికారులు కోరే అవకాశం ఉంది. అదే విధంగా, మిగులు జలాల వినియోగాన్ని లెక్కించాలన్న తెలంగాణ వాదనను ఏపీ అధికారులు తోసిపుచ్చనున్నారు. మొత్తం పది అంశాలపై తమ వాదనను వినిపిస్తామని ఏపీ అధికారులు తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో ఏపీ మరో రికార్డు -
16వ నంబర్ గేట్ వద్ద సాగుతున్న మరమ్మతు పనులు
-
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరమ్మతులు
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు వద్ద అధికారులు మరమ్మతులు చేపట్టారు. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి నిపుణులు వచ్చారు. 35 మంది సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో సిబ్బంది ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయిన సంగతి తెలిసిందే. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ నిన్న ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిపుణుల బృందాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు. -
ఆ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా..ఏటీఎం రేషన్!
చండీగఢ్: దేశంలో తొలిసారిగా రేషన్ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పైలట్ ప్రాజక్ట్ను గరుగ్రామ్లోని ఫరూక్నగర్లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రేషన్ ఏటీఎం ఐదు నుంచి ఏడు నిమిషాల లోపు 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదల చేస్తుందన్నారు. కాగా ఈ మెషిన్ టచ్స్క్రీన్ ద్వారా పని చేస్తుందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి రేషన్ ఏటీఎం ఈ ఏటీఎం మెషీన్లో బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుందని, దీని ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణ జరగగానే, లబ్ధిదారునికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్గా సంచుల్లో నింపేస్తుందని ఆయన అన్నారు. దీని వలన ప్రజలకు పారదర్శకంగా రేషన్ సరుకులు అందుతాయని, ఈ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఇదేనంటూ వెల్లడించారు. దీనిని ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ ధాన్యం పంపిణీ యంత్రంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి రేషన్ ఏటీఎం కాగా.. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫరూకనగర్లో విజయవంతంగా నిర్వహించిన అనంతరం యూఎన్ ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద వీటిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మెషిన్ కారణంగా పంపిణీలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు కనుక రేషన్ సరుకుల కొరతను కూడా ఇది తగ్గించనుందని తెలిపారు. ఈ ఏటీఎంలో రేషన్ సరుకులు.. గోధుమలు, ధాన్యం, చిరుధాన్యాలు సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కాగా ప్రస్తుతం ఫరూక్నగర్లో ప్రారంభించిన ఏటీఎంలో గోధుమలు మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులకు అనుమతులు లేవంటూ టీడీపీ నేత ఎన్జీటీకి ఫిర్యాదు
-
‘దిశ’ పనితీరుపై ప్రతీ పీఎస్లో డిస్ప్లే ఏర్పాటు చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘దిశ’ ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. '' గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను యాక్టివ్గా చేయాలి. ఫిర్యాదు చేయడానికి మహిళలు పీఎస్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలి. జీరో ఎఫ్ఐఆర్ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలి. దిశ యాప్పై మహిళా పోలీసులకు అవగాహన, శిక్షణ కల్పించాలి. ప్రతి 2 వారాలకోసారి కలెక్టర్, ఎస్పీలు ప్రజా సమస్యలతో పాటు.. మహిళల భద్రతపైనా సమీక్ష నిర్వహించాలి. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దిశ ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రతి పీఎస్లో డిస్ప్లే ఏర్పాటు చేయాలి'' అని తెలిపారు. గంజాయి రవాణా, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్న ఘటనల్లో నిజాలను ప్రజల ముందుంచాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం జరగకూడదని తెలిపారు. -
గిరిజనుల సమగ్ర అభివృద్ధికి పైలట్ ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ఆదిమజాతి గిరిజనుల ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి, అవసరమైన వైద్య సహాయాన్ని అందించడానికి హెల్త్ వర్సిటీ, ఈఎస్ఐ మెడికల్ కళాశాల బాధ్యత తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. గిరిజనుల్లో ఆరోగ్యం, పోషణ స్థాయిలను పెంచి, ఇతర నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని, దీంతో వారు ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా అభివృద్ధిని సాధిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. ఆదిమజాతి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఆమె రాజ్భవన్లో వర్సిటీల వైస్ చాన్స్లర్లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, కాళోజీ వైద్య వర్శిటీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఆదిలాబాద్లోని కొల్లంతెగ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండరెడ్లు, నాగర్కర్నూల్ జిల్లాలోని చెంచు తెగలకు చెందిన గిరిజనుల సమగ్ర అభివృద్ధికి రాజ్భవన్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టనున్న కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వివిధ వర్శిటీలు ఆసక్తి చూపాయి. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వి.వెంకటరమణ పాల్గొని తమ సూచనలు చేశారు. గవర్నర్ను కలిసిన ఇరాన్ దౌత్యవేత్తలు హైదరాబాద్లో ఇరాన్ కాన్సుల్ జనరల్ మహది షాహ్రోఖి, వైస్ కాన్సుల్ మీనా హదియన్ మంగ ళవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వర్సిటీలకు చాన్స్లర్స్పురస్కారాలు విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత విద్యా ప్రమాణాలు, పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చాన్స్లర్స్ పురస్కారాలు అందజేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ పరిశోధనతో పాటు ఉత్తమ విశ్వవిద్యాలయం విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేయనున్నారు. ఉన్నత విద్యా మండలి ఈ పురస్కారాలకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తుందని సంస్థ చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. -
నేడు పశ్చిమ గోదావరిలో అమూల్ పాల సేకరణ
సాక్షి, అమరావతి: పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేస్తోంది. శుక్రవారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పాల సేకరణ మొదలు పెట్టబోతోంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు. అమూల్ సంస్థ ఇప్పటికే చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాలు సేకరిస్తోంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి విడతగా 142 గ్రామాల్లో పాలు సేకరించనుంది. పాల నాణ్యత, వెన్న శాతం ఆధారంగా లీటర్కు రూ.5 నుంచి రూ.7 వరకు పాడి రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణకు సంబంధించి దాదాపు 15 వేల మంది రైతులను గుర్తించి.. రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అమూల్ సంస్థ 10 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లు చెల్లిస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేస్తోంది. చదవండి: వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్ ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి: సీఎం వైఎస్ జగన్ -
కోవిడ్ విలయంలో కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ఒకవైపు దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగి పోతోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఏ సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 2022 డిసెంబరు నాటికి ప్రధానమంత్రి కొత్త నివాసాన్ని పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. కరోనా, లాక్డౌన్ ఆంక్షల మధ్య అనేక కార్యకలాపాలు నిలిచిపోయిన తరుణంలో దీన్ని అత్యవసర సర్వీస్గా పరిగణించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ క్లియరెన్స్ ఇచ్చేసింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు ఉన్నప్పటికీ, మేక్ఓవర్ ప్రణాళికపై ముందుకు సాగాలని ప్రభుత్వం నిశ్చయించుకోవడం చర్చకు దారి తీస్తోంది. తాజా ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్న భవనాల్లో మొదటిది ప్రధానమంత్రి నివాసం. అత్యాధునిక హంగులతో దీన్ని రూపొందించనున్నారు. అలాగే ప్రధాని భద్రత నిమిత్తం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం, ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ కూడా ఇదే గడువులో నిర్మాణాన్ని పూర్తి చేసుకోనున్నాయి. మరోవైపు సెంట్రల్ విస్టాపై గత వారమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది అత్యవసరం కాదు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అవసరం అని రాహుల్ ట్వీట్ చేశారు. అటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కూడా తాజా నిర్ణయంపై మండిపడ్డారు. ఒక పక్క దేశ ప్రజలు ఆసుప్రతి బెడ్స్ దొరకక, ఆక్సిజన్, మందులు లభించక అల్లాడిపోతోంటే.. చివరికి శ్మశానాల్లో స్థలం దొరక్క విలవిల్లాడుతోంటే ప్రజలు డబ్బును తగలేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా అసంబద్ధమైంది. ఈ నేరాన్ని ఆపండి అంటూ ట్వీట్ చేశారు. (ఫైజర్ ఔదార్యం: కంపెనీ చరిత్రలో అతిపెద్ద సాయం) డిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ మొత్తం ప్రాజెక్టుని 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే పూర్తి చేయాలనేది ప్లాన్. అయితే ప్రస్తుతం భవనాలు చెడిపోయే స్థితిలో ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. అటు ఈ ప్రాజెక్టును ఆపడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. అన్నీ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయనీ తేల్చి చెప్పింది. అయితే ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనంలో ఒకరు దీనికి ప్రజా సంప్రదింపులు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద నిర్మించనున్న కొత్త భవనాల కోసం అంచనా వ్యయం రూ.13,450 కోట్లు. 10 భవనాలు నిర్మించనున్నారు. దాదాపు 46,000 మందికి ఉపాధి లభించనుందని అంచనా. (కరోనా ఉధృతి: 6వ రోజూ 3 వేలకు పైగా మరణాలు) Central Vista- not essential. Central Govt with a vision- essential. — Rahul Gandhi (@RahulGandhi) April 28, 2021 This is grotesque. No money for Oxygen and Vaccines as our brothers and sisters die waiting for a hospital bed to be cremated in parking lots BUT Modi will squander public money to feed his megalomaniac vanity. Stop this Crime. https://t.co/1Ts2QrYoLR — Sitaram Yechury (@SitaramYechury) May 3, 2021 -
సెల్ఫీ తీసుకుంటూ ఫోన్తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు
చిన్నకోడూరు (సిద్దిపేట): సెల్ఫీ సరదా ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. నీటి ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లిన బాలుడు అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు ప్రాజెక్ట్ నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగింది. దీంతో సిద్దిపేటలో విషాదం నిండింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. సిద్దిపేటకు చెందిన వెగ్గలం కార్తీక్ (15) తన మిత్రులు చరణ్, హేమంత్చారి, సాయిచరణ్లతో కలిసి చంద్లాపూర్ శివారులో ఉన్న రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ చూసేందుకు శుక్రవారం వెళ్లాడు. అక్కడ మొత్తం ప్రాంతం కలియతిరిగి సరదాగా గడుపుతున్నారు. ఈక్రమంలో స్నేహితులతో కలిసి కార్తీక్ ఫొటోలు దిగుతున్నాడు. అనంతరం సెల్ఫీ ఫొటో కోసం ప్రయత్నాలు చేశాడు. పంపింగ్ చేసే స్థలంలో కార్తీక్, చరణ్ కలిసి సెల్ఫీ దిగుతుండగా ఒక్కసారిగా కింద ఉన్న మట్టిపెళ్లలు నీటిలోకి జారాయి. దానిపైన నిలబడ్డ కార్తీక్, చరణ్ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనతో తోటి మిత్రులు షాక్కు గురయ్యారు. అయితే చరణ్ ఓ కట్టె సాయంతో నీటిలో నుంచి బయటపడగా కార్తీక్ నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి కార్తీక్ కోసం గాలించారు. గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో కార్తీక్ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
‘జలశక్తి అభియాన్’ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచ జలశక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం (మార్చి22)న ‘జలశక్తి అభియాన్’ ప్రాజెక్ట్ను వీడియో కాన్సరేన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును కెన్, బెట్వా నదుల మధ్య నిర్మిస్తున్నారు. కేంద్ర జలశక్తి మత్రిత్వశాఖ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో కరువు, నీటి కోరత ఉన్న ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. కెన్, బెట్వా నదులను అనుసంధానం చేయడంలో భాగంగా ధౌధాన్ డ్యామ్ను నిర్మించనున్నారు. వీటి అనుసంధానంతో ఏటా 10.62 హెక్టార్లకు నీటిపారుదల జరగనుంది. 62 లక్షల మందికి సురక్షిత తాగు నీరు లభిస్తుంది. ఈ నీటితో 103 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల బుందేల్ఖండ్, పన్నా, టికామ్గా, ఛతర్పూర్, సాగర్, దామో, డాటియా ప్రాంతాలకు నీరు లభిస్తుంది. మధ్యప్రదేశ్లోని రైసస్, బందా, మహోబా ప్రాంతాలు, ఉత్తర్ప్రదేశ్లోని లలిత్పూర్ ప్రాంతాలు ప్రయోజనం పొందనున్నాయి. ఈ జలశక్తి కార్యక్రమంలో భాగంగా ‘జలశక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్’ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణా ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పూర్తి స్థాయిలో అమలు కానుంది. ‘వర్షం ఎక్కడ, ఎప్పుడు పడినా.. ఆ నీటిని ఒడిసి పట్టుకోండి’ అనేది ఈ కార్యక్రమ నినాదం. చదవండి: త్వరలో కుంభమేళ.. ఈ సూచనలు పాటించాలి -
రాష్ట్రానికి రూ.60 కోట్ల విలువైన ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న పరిశ్రమలు–క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎంఎస్ఈ–సీడీపీ) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.59.83 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.37.59 కోట్లతో సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం మూడు కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ఎంఎస్ఈ–సీడీపీ స్టీరింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్, మాచవరంలో పప్పులు తయారీ, వాటి ఉత్పత్తుల క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.30.07 కోట్లు ఇవ్వనుంది. దీనికి అదనంగా ఇప్పటికే ఉన్న మూడు పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. మచిలీపట్నంలోని ఆభరణాల పారిశ్రామిక పార్కు, హిందూపురం గ్రోత్ సెంటర్, గుంటూరు ఆటోనగర్ ఇండ్రస్టియల్ పార్కులను రూ. 22.24 కోట్లతో ఆధునీకరించడానికి కేంద్రం తుది ఆమోదం తెలిపింది. ఇందుకు కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.15.57 కోట్లు సమకూర్చనుంది. మంగళవారం కేంద్ర ఎంఎస్ఎంఈ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఎంఎస్ఈ–సీడీపీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జే.సుబ్రమణ్యం, ఏపీఐఐసీ వీసీ, ఎండీ కె.రవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్ర బోర్డుకు తెలంగాణ వినతి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్నవాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టిన కాల్వల ఆధునీకరణ పనులను వేగవంతం చేయించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు తుంగభద్ర బోర్డుకు విన్నవించింది. కాల్వల ఆధునీకరణ పనుల్లో త్వరితగతిన పనులు పూర్తిచేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు ఆదేశాలివ్వాలని కోరింది. ప్రస్తుతం వర్కింగ్ సీజన్ ఆరంభమైన దృష్ట్యా పనులు మొదలు పెట్టేలా చూడాలంది. ఈ మేరకు రెండ్రోజుల కిందట తెలంగాణ బోర్డు కార్యదర్శికి లేఖ రాసింది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. దీంతో ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ–1 పనులను 25%, ప్యాకేజీ–2 పనులను మరో 55% వరకు పూర్తి చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో పనులన్నీ నిలిచిపోయి రాష్ట్రానికి ఏటా కనీసం నాలుగు టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 30వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా సాగునీరందుతోంది. కాల్వల ఆధునీకరణ పనుల పురోగతిపై పదేపదే విన్నవిస్తున్నా ఏపీ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని వారం రోజుల కిందట జరిగిన బోర్డు భేటీలో తెలంగాణ నిలదీసింది.దీనిపై ఏపీ, కర్ణాటకల నుంచి స్పందన లేకపోవడంతో మరోమారు లేఖ రాసింది. ఈ కాల్వల ఆధునీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఏపీలకు ఆదేశాలివ్వాలని కోరింది.( చదవండి: దశాబ్దాల స్వప్నం .. శరవేగంగా సాకారం) -
ప్రాజెక్టు వివరాలు పంపితే సహకారం అందిస్తాం
సాక్షి, తిరుమల: తిరుమలలోని శ్రీవారిని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాపవినాశనం డ్యామ్ని రాష్ట్ర మంత్రి అనిల్కుమార్ యాదవ్తో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనార్థం ప్రతి నిత్యం లక్షమంది భక్తులు తరలివస్తారని తెలిపారు. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన త్రాగునీటి సమస్యని పరిష్కరించేందుకు కళ్యాణి డ్యామ్ నుంచి నీటి తరలింపు ప్రకియ ప్రారంభించాలని టీటీడీ భావిస్తోందని పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు వివరాలు పంపితే కేంద్రం నుంచి సహకారం అందించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించే ప్రాజెక్టు కింద నిధులు కేటాయించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. చదవండి: (శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ) ఈ సందర్భంగా మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తిరుమలలో శాశ్వత ప్రాతిపాదికన త్రాగునీటి సమస్యని పరిష్కరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతోందని తెలిపారు. టీటీడీ వాటాకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం నుంచి నివేదిక పంపితే కేంద్రం సహకారం అందిస్తామని పేర్కోందని చెప్పారు. అదే విధంగా బీజేపీ అధికారిక ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో త్రాగునీటి సమస్యని శాశ్వత పరిష్కారం అందించేందుకు కేంద్రం సహకరించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. రాష్ట్రం నుంచి నివేదిక అందితే పరిశీలిస్తామని మంత్రి షేకావత్ హామి ఇచ్చారని చెప్పారు. -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత్కు చెందిన చంద్ర దత్తా (34) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమె ప్రస్తుతం ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్గా ఉన్నారు. వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన వ్యాక్సిన్ వారం క్రితం మొదటి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. చంద్రదత్తా కోల్కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి 2009లో బ్రిటన్ వెళ్లారు. ఆక్స్ఫర్డ్లో వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాలు పంచుకునే ముందు ఆమె పలు ఉద్యోగాలు చేశారు. ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్తోపాటు, ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు, విధానాలు పాటిస్తున్నదీ లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తుంటారు. ‘కోవిడ్ వ్యాక్సిన్ రూపకల్పనలో పాలుపంచుకోవడం సంతోషం కలిగిస్తోంది. గత నెలంతా మేమెంతో ఒత్తిడి అనుభవించాం. అయితే వ్యాక్సిన్ను త్వరగా తయారు చేయగలిగాం’ అని ఆమె చెప్పారు. పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో సెప్టెంబర్, అక్టోబర్లలో భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని, అయితే కరోనా వ్యాక్సిన్ను నెలల వ్యవధిలోనే తయారు చేయగలిగామని చెప్పారు. కరోనాపై ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్లు తయారు చేశామని, మరో 1000 వ్యాక్సిన్లు కూడా చేసిన అనంతరం భారీ స్థాయిలో ఉత్పత్తి చేపడతామని చెప్పారు. -
సమ్మక్క బ్యారేజీ.. సీఎం కేసీఆర్ నామకరణం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీర వనిత, వన దేవత.. ‘సమ్మక్క’పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ మేరకు బ్యారేజీకి ‘సమ్మక్క బ్యారేజీ’గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధర్రావును ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉండటంతోనే రాష్ట్రంలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తై బీడు భూముల్లోకి కాళేశ్వరం నీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు. కాగా, సీఎం కేసీఆర్ గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బుధవారం రాత్రి ఆయన కరీంనగర్ జిల్లా తీగలగట్టుపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడే బస చేసి గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తా రు. తర్వాత లక్ష్మీ బ్యారేజీని సందర్శించి, అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరిగి తీగలగట్టుపల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తారు. నీటి విడుదలపై సమీక్ష... సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఈఎన్సీలు మురళీధర్రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండేతో సమీక్ష నిర్వహించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుతోంది. బ్యారేజీలు నిండుకుండలా మారినయ్. రానున్న వానా కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసే దిశగా.. అటు నుంచి కాలువలకు మళ్లించేలా.. ఇరిగేషన్ శాఖ అప్రమత్తం కావాలి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కమలాకర్, అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి బ్యారేజీలో ప్రస్తుతం 16.12 టీఎంసీ నిల్వలకు గాను 14 టీఎంసీల మేర నిల్వలు ఉన్నాయి. దీంతో లక్ష్మి పంప్హౌజ్ పరిధిలో 11 పంప్లను రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా సిద్ధం చేశారు. ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్మానేరు రిజర్వాయర్ ద్వారా ఎల్ఎండీకి తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మి బ్యారేజీలో ఉన్న నీటిని ఎల్లంపల్లికి తరలించడంపై కేసీఆర్ గురువారం నాటి పర్యటన సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చే అవకాలున్నాయి. ఇదిలా ఉండగా, తుపాకులగూడెం బ్యారేజీకి వనదేవత శ్రీసమ్మక్క పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. -
పట్టాలెక్కని‘గట్టు’!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని పట్టాలెక్కించే పనులు మూలనపడ్డాయి. జూరాల నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని తీసుకుంటూ 30 రోజుల్లో కనీసం 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన ఈ ప్రాజెక్టు సమగ్ర సర్వే పనులునత్త నడకన సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి డీపీఆర్ రూపొందించేందుకు సర్వే ఏజెన్సీలకు రూ.2 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ఫైలు పంపి ఆరు నెలలు గడిచినా ఇంతవరకూ మోక్షం లభించలేదు. గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు 2018 జూన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన సమయంలో గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనిపై సమీక్షించిన సీఎం రేలంపాడ్కు బదులుగా నేరుగా జూరాల ఫోర్షోర్ నుంచే నీటిని తీసుకోవాలని, రిజర్వాయర్ సామర్థ్యాన్ని సైతం పెంచాలని, ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రాథమిక సర్వే చేసిన అధికారులు జూరాల నుంచి 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. నీటి నిల్వ కోసం 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు. 2 మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, వాటి సామర్థ్యం ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు. దీని కోసం రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాథమిక ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. భూసేకరణ అవసరాలను గుర్తించడంతో పాటు అలైన్మెంట్ ఖరారు చేయాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టుకు నీటిని అందించే అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. సమగ్ర సర్వే చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీకి గతంలో కేటాయించిన రూ. 50 లక్షలను సవరించి రూ.2 కోట్లు కేటాయించాలని ప్రాజెక్టు అధికారులు 6 నెలల కింద ప్రభుత్వ పరిశీలనకు ఫైలు పంపినా ఇంతవరకు దానికి మోక్షం లభించకపోవటంతో సర్వే పనులు చేస్తున్న ఏజెన్సీ సర్వే ప్రక్రియలో వేగం తగ్గించింది. దీంతో ఈ పనులు ఇప్ప ట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. -
పల్నాడులో తీరనున్న దాహార్తి
మాచర్ల: ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్నాటి గ్రామాల దాహార్తి తీరనుంది. తొమ్మిది నియోజకవర్గాల పరిధిలోని 34 మండలాలు, 902 గ్రామాలకు మంచినీటిని అందించే వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.2,665 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ గ్రిడ్ అందుబాటులోకి వస్తే మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అన్న మాటే వినిపించదు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ ప్రాంతమైన విజయపురిసౌత్లోని మేకల గొంది వద్ద వాటర్ గ్రిడ్ నిర్మించనున్నారు. త్వరలోనే వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 34 మండలాలకు లబ్ధిచేకూరే ఈ పథకాన్ని చేపట్టాలని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) కోరడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ తగ్గిపోయినప్పుడూ ఎండాకాలం సైతం నీటి నిల్వలు రిజర్వాయర్లో ఉన్నప్పుడు ఈ వాటర్ గ్రిడ్లోని పథకాలు చేపట్టేందుకు సర్వేచేయించి పల్నాటి ప్రాంతంలోని ప్రజలకు మేలు చేకూర్చే విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరిక మేరకు జి.ఓ.నెం. ఈ నెల 16న జారీ చేసి సంబంధిత వాటర్ గ్రిడ్ పధకానికి సంబం«ధించి చేపట్టబోయే పనుల వివరాలను పేర్కొన్నారు. మాచర్ల నియోజక వర్గంలోని 5 మండలాలు, గురజాల నియోజక వర్గంలోని 4 మండలాలు, వినుకొండలో 4, నర్సరావుపేటలో 2, చిలకలూరి పేటలో 3, సత్తెనపల్లిలో 4, పెదకూరపాడులో 4, గుంటూరు రూరల్ లో 3, ప్రకాశం జిల్లాలో 5 మండలాలు ఈ వాటర్ గ్రిడ్ పధకం ద్వారా మంచినీటిని ప్రజలకు అందించటం జరుగుతుందన్నారు. నర్సరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి పురపాలక సంఘ కార్యాలయాలకు వాటర్ స్కీంను అనుసంధానం చేస్తారు. విజయపురిసౌత్లోని మేకల గొంది వద్ద మొదటిగా సాగర్ రిజర్వాయర్లో హెడ్ వర్క్స్ నిర్మిస్తారు. అంచనాలను ప్రభుత్వం ఆమోదించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. -
‘కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపడతాం’
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలంలో ఉన్న సారళాసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పెరగడంతో మంగళవారం గండిపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరళాసాగర్ కరకట్టకు గండిపడటంపై సాంకేతిక నిపుణులతో విచారణ చేయిస్తామని ఆయన తెలిపారు. కరకట్టకు గండిపడటం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. రబీలో సాగుకు సన్నద్దమైన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. 4, 200 ఎకరాలకు నీరందిస్తామని.. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వెంటనే చేపడతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి -
సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలం సమీపంలో ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టుకు వదర నీరు పోటెత్తటంతో మంగళవారం గండిపడింది. దీంతో కరకట్ట తెగి నీరు వృధాగా పోయింది. కరకట్ట తెగడంతో వరద నీరు రోడ్డు మీదికి చేరింది. దీంతో కొత్తకోట-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వదర నీరు చేరింది. సరళాసాగర్ ప్రాజెక్టు ఆసియాలోనే మొట్టమొదటి సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రాజెక్టును సందర్శించి కొట్టుకుపోయిన ప్రాజెక్టు గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఉంతకల్లుకు పచ్చజెండా!
ఉంతకల్లు జలాశయం... హెచ్చెల్సీ ఆయకట్టు రైతుల కలల ప్రాజెక్టు... ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఉంతకల్లు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీ కొనసాగించాలని తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ ప్రాంత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే హైలెవల్ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్కెనాల్ రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. కన్నడిగుల నీటి విరామ సమయంలో కష్టాలకుచెక్ పడనుంది. కరువు జిల్లా అనంతకు తుంగభద్ర జలాశయం వర ప్రదాయినిగా నిలుస్తోంది. ఈ ఏడాది తుంగ..ఉప్పొంగగా జిల్లాకు గణనీయంగా నీరు వచ్చింది. దామాషా ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా 26.215 టీఎంసీలు వచ్చే అవకాశముంది. ప్రభుత్వాలపై ఎలాంటి భారం లేకుండా గ్రావిటీ ద్వారానే నీరందివ్వడం ఈ ప్రాజెక్టు విశిష్టత. అయితే నీటి సరఫరాలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కన్నడిగులకు నీటి అవసరాలు లేని సమయంలో జిల్లాకు నీటిని తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక రైతులు 10 రోజుల పాటు నీటి విరామం ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి జిల్లాకు నీటి సరఫరా ఆగిపోనుంది. కర్ణాటక ప్రాంత రైతులు నీరు వద్దనుకున్నప్పుడు మనం కూడా నీటిని తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక వేళ నీటిని తీసుకుంటే హెచ్చెల్సీ కర్ణాటకలో 105 కిలో మీటర్లు ప్రవహిస్తుండడంతోజలచౌర్యం జరుగుతుందనే ఆందోళన అధికారుల్లో ఉంది. నీటి చౌర్యం కాకుండా చూడాలంటే అన్ని కిలోమీటర్ల మేర గస్తీ కాయడం అధికారులకు కత్తీమీద సాములా ఉంటుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో జిల్లా అధికారులు కూడా నీటిని వద్దనుకుంటున్నారు. ఉంతకల్లు ప్రాజెక్టుతో సమస్యకు చెక్.. హెచ్చెల్సీ ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యంగా ఉంతకల్లు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా డీపీఆర్ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హెచ్చెల్సీ కింద దాదాపు 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా... నీటి లభ్యత, వర్షాభావం ఇతరత్రా సమస్యలతో ఏటా సగటున 90 వేల ఎకరాల్లోపు మాత్రమే పంటలకు సాగునీరు అందిస్తున్నారు. దీని వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అధిగమించాలంటే వీలైనంత ఎక్కువ నీటిని తక్కువ కాలంలో తీసుకురావాలి. తుంగభద్ర జలాశయం నుంచి వరద నీరు కిందకు వెళ్లి అటు నుంచి సముద్రంలో కలవకుండా కాపాడుకోవాలి. ఇందుకు జలాశయాల నిర్మాణం, కాలువ వెడల్పు చేయాల్సిన అవసరముందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు గ్రామ సమీపంలో 5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని ప్రణాళికలు రచించారు. బహుళ ప్రయోజనాలు.. ఉంతకల్లు రిజర్వాయర్ వల్ల జిల్లా రైతులకు చాలా మేలు జరుగుతుంది. 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 1,120 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రాజెక్టుకు 5 వేల ఎకరాలు అవసరమవుతుంది. ప్రాజెక్టు పొడవు 13 కిలోమీటర్లు వస్తుండడంతో కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల పరిధిలోని అనేక గ్రామాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశముంది. ఇక తుంగభద్ర కాలువను ఆధునీకరించుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 130 టీఎంసీల సామర్థ్యమున్న తుంగభద్ర జలాశయంలో పూడిక కారణంగా 100 టీఎంసీలకు పడిపోయింది. ఫలింతంగా హెచ్చెల్సీ నికర కేటాయింపుల్లో కోత పడుతోంది. వర్షాలు అధికంగా వచ్చినప్పుడు వరద నీరు కిందకు వెళుతోంది. ఇలాంటి సమయంలో నీటిని ముందే తీసుకోవడానికి జిల్లా రైతులకు ఇబ్బందులున్నాయి. హెచ్చెల్సీ సిస్టంలో హైలెవల్ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రైతులకు స్టోరేజ్ ట్యాంకు లేకపోవడంతో కాలువలో ప్రవహించే సమయంలో పంటలు సాగు చేసుకోవాలి. ఎగువన నీళ్లు నిలిపితే పంటలు ఎండిపోయే ప్రమాదముంది. ఉంతకల్లు రిజర్వాయర్ వల్ల ఈ సమస్యను అధిగమించడానికి వీలుందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు తల భాగాన నిరిస్తుండడం వల్ల అన్ని ప్రాంతాలకు నీటి పంపిణీ సాధ్యమవుతుందంటున్నారు. డీపీఆర్కు ఉత్తర్వులొచ్చాయి ఉంతకల్లు ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కొనసాగించాలని చీఫ్ ఇంజినీర్(సీఈ) నుంచి ఆదేశాలు వచ్చాయి. ఉంతకల్లు ప్రాజెక్టు, పీఏబీఆర్ డ్యాం గ్రౌటింగ్ పనులకు ఆమోదం వచ్చింది. ఉంతకల్లు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తుంగభద్ర జలాశయానికి వరద వచ్చిన సమయంలో ఎక్కువ నీటిని తీసుకుని ఉంతకల్లులో నిల్వ ఉంచుకోవచ్చు. తద్వారా హెచ్ఎల్ఎంసీ, జీబీసీకి లబ్ధి కలిగితే జిల్లా మొత్తానికి పరోక్షంగా ప్రయోజనం కలుగనుంది. – రాజశేఖర్, ఎస్ఈ, హెచ్చెల్సీ -
నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయని, నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాల్సిన అవసరముందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంత పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడు తూ, గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల పరిరక్షణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. నదులకు 5 కి.మీ. దూరం నుంచి రైతుల పొలాలలో నీడనిచ్చే చెట్లు, ఉద్యాన పంటలు వంటివి వేయాలన్నారు. వాగులకు రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా పచ్చదనాన్ని పెంచాలన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ద్వారా 25 లక్షల ఎకరాల భూమిలో పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ సంచాలకులు జయప్రసాద్, శాస్త్రవేత్త డీఆర్ఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్ట్ పేరిట కుచ్చుటోపీ
పలమనేరు: ప్రాజెక్టు వర్క్ ఇస్తామంటూ తెలివిగా నమ్మించి సాఫ్ట్వేర్ ఇంజినీర్ నుంచి లక్షలు దండుకున్నారు. ఈ ఘటన బుధవారం పలమనేరులో వెలుగుచూసింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం..పట్టణంలోని శ్రీనగర్కాలనీకి చెందిన తేజ సాఫ్ట్వేర్ ఇంజినీర్. బజారువీధిలో మా బ్రాండ్ టెక్నాలజీస్( మా సలహాలతో మీ వ్యాపారం రెట్టింపు)అనే సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించాడు. ఇందులో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు, పర్సనల్ లోన్లు, వెబ్సైట్లు, యాప్స్ సేవలుంటాయని బోర్డు పెట్టాడు. దీంతో నెల్లూరుకు చెందిన దినేష్మూర్తి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ వీరితో వ్యాపార లావాదేవీలు మాట్లాడారు. తమ వద్ద యూఎస్ కంపెనీకి చెందిన ప్రాజెక్టు వర్క్ ఉందని, దానిని నెల్లూరులో చేసి తమకు పంపితే ఖాతాకు డబ్బులేస్తామంటూ తేజ ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన యూసర్ ఐడీ, పాస్వర్డ్, ఎక్స్ఎల్ షీట్లను పంపాడు. ఈ పనులు చేసినందుకు దినేష్మూర్తికి డబ్బులు ఆన్లైన్లో వేస్తూ నమ్మకం కలిగించాడు. ఆపై మరో ప్రాజెక్టు ఇస్తానంటూ రూ.7.60లక్షలు దినేష్మూర్తి నుంచి తీసుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించిన ఒరిజినల్ ఐడీలు కాకుండా డూప్లికేట్ ఐడీలను తేజ ఇవ్వడంతో మోసపోయామని బాధితుడు తెలుసుకుని పలమనేరుకు వచ్చి అతడిని నిలదీశాడు. త్వరలో సెటిల్ చేస్తానన్న తేజ ఆ తర్వాత డబ్బుల్వికపోవడంతో బాధితుడు బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట తేజ, అతని అన్న చంద్ర, సాఫ్ట్వేర్ డెవలపర్ హయాత్, డాటా ట్రాన్స్ఫరర్ బాలాజీతో కలసి తమను మోసం చేశాడని పోలీసులకు బాధితుడు వివరించాడు. ఆధారాలను పరిశీలించిన ఎస్ఐ ప్రియాంక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా బాధితులు ఎందరున్నారో దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
దోపిడీకి చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించకపోయి ఉంటే... పునఃసమీక్ష చేయకపోయినట్టయితే వంశధార, బాహుదా నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డిజైన్ చేసిన రూ.6,326.62 కోట్ల ప్రాజెక్టు గోల్మాల్ అయ్యేది. గత ప్రభుత్వ హయాంలో ఖరారైన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే వేల కోట్ల రూపాయల ప్రజాధనం నాటి పెద్దలకు సమర్పణమయ్యేది. వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద టెండర్లు పిలిచి, ఖరారు చేసిన బాహుదా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి వేల కోట్లు మింగేద్దామని భావించిన చంద్రబాబు అండ్ కోకు గట్టి షాకే తగిలింది. ప్రారంభం కాని ప్రాజెక్టుల కాంట్రాక్టులను రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో అందులో ఒకటైన బాహుదా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. దీంతో మంచి పనే అయిందని అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. లేదంటే కష్టసాధ్యమయ్యే ప్రాజెక్టుతో వచ్చే ప్రయోజనం కన్నా నిధుల దుర్వినియోగం ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యూహాత్మక టెండర్లు.. వంశధార ప్రాజెక్టు రెండో దశలో హిరమండలం రిజర్వాయర్ నుంచి 110 కి.మీల.పొడవునా హైలెవల్ కెనాల్ తవ్వి ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిలోకి వంశధార జలాలను తరలించి రెండు నదులను అనుసంధానం చేయాలని సర్కార్ నిర్ణయించింది. హిరమండలం రిజర్వాయర్ నుంచి తరలించడం ద్వారా ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందించాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఈ కెనాల్కు అనుబంధంగా 8.30 టీఎంసీల సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఆమేరకు ఎన్నికల షెడ్యూల్కు ముందు పరిపాలన అనుమతి ఇచ్చేసింది. ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని ఒక దశలో అధికారులు మొత్తుకున్నా వినలేదు. చంద్రబాబు ఒత్తిడి మేరకు కేవలం రెండు ప్యాకేజీల కింద నాటి సూపరింటెండింగ్ ఇంజినీర్ పనులను ఖరారు చేశారు. 0 కి.మీ నుంచి 55 కి.మీ వరకూ కాలువ తవ్వకం, పెద్ద లోగిడి, రంగసాగరం, మల్లివీడు రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.1618.24 కోట్లు, 55 కి.మీ నుంచి 110 కి.మీ వరకూ కాలువ తవ్వకం, ఆళ్లకోలి, హంసరలి, కంచిలి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ.2,452.85 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించి లంప్సమ్–ఓపెన్ విధానంలో టెండర్లు పిలిచారు. టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయకముందే తన అనుయాయులైన ఇద్దరు కాంట్రాక్టర్లు రెండు ప్యాకేజీలకు షెడ్యూల్ దాఖలు చేసేలా... ఒక్కొక్కరు ఒక్కో ప్యాకేజీ దక్కించుకునేలా వ్యూహరచన చేసి, ఆ కాంట్రాక్టర్కు ఉన్న అర్హతలనే టెండర్లలో పొందుపరిచారు. ఇంకేముంది అనుకున్నట్టే జరిగింది. వారికే కాంట్రాక్ట్లు దక్కాయి. రూ.1618.24 కోట్ల ప్యాకేజీని రూ.1695.11 కోట్లకు హెచ్ఈఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ, రూ.2452.85 కోట్ల ప్యాకేజీని రూ.2572.06 కోట్లకు బీఎస్ఆర్ జాయింట్ వెంచర్ ఏజెన్సీ దక్కించుకున్నాయి. రెండు ప్యాకేజీలను అధిక ధరకే కేటాయించారు. డీపీఆర్లోనే మస్కా.. వంశధార స్టేజ్–2 ఫేజ్ –2లో ప్రాజెక్టులో భాగమైన హిరమండలం రిజర్వాయర్ నుంచి బాహుదా నది వరకూ 110 కిలోమీటర్ల పొడవునా హైలెవెల్ కెనాల్ నిర్మించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించే బాధ్యతను రూ.2.80 కోట్లకు కాంటెక్ డిజైన్స్, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. అయితే, ఆ సంస్థ ఇచ్చిన డీపీఆర్ అంతా లోపభూయిష్టంగా, లొసుగులమయంగా ఉందని సాక్షాత్తు ఇంజినీరింగ్ అధికారులే నోళ్లు వెళ్లబెట్టారు. సర్వే నెంబర్లతో కూడిన ఆయకట్టు వివరాలను ఎక్కడా పొందుపరచలేదు. కేవలం ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టుగా, వారికి అనుకూలంగా డీపీఆర్ను ఆదేశించారు. 2015లో 75 వేల ఎకరాలకు రూ.1075 కోట్లతో డిజైన్ చేసిన ప్రాజెక్టును ఒక్కసారిగా 2 లక్షల ఎకరాలకు పెంచి రూ.6,326.62 కోట్లకు పెంచడం చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆయకట్టు పెంచి చూపించారన్న వాదనలు ఉన్నాయి. బెనిఫిషియర్ కాస్ట్ రేషియో కింద కొండలు, గుట్టలతోపాటు చెరువులు, ఇతరత్రా సాగునీటి వనరుల కింద ఉన్న ఆయకట్టును కూడా చూపించినట్టుగా సమాచారం. వాస్తవానికైతే, వంశధార నదిలో మన వాటా 55 టీఎంసీలే. అందులో హిరమండలం రిజర్వాయర్ సామర్థ్యం 19 టీఎంసీలు కాగా, వంశధార్ లెఫ్ట్ మెయిన్ కెనాల్, వంశధార రైట్ మెయిన్ కాలువ సామర్థ్యం 20 టీఎంసీలు. ఇంకా 13.5 టీఎంసీలే మన వాటా కింద మిగిలి ఉంది. వాస్తవానికి ఒక టీఎంసీకి 10 వేల ఎకరాలను తీసుకుంటారు. ఆరు తడి పంటలు ఉన్న ఏరియా అయితే 15 వేల ఎకరాలను తీసుకుంటారు. ఈ లెక్కన చూసినా 2 లక్షల ఎకరాలకు మనకున్న వాటా ఎంత మేరకు సరిపోతుందన్నదే ప్రశ్నగానే మిగిలి ఉంది. డీపీఆర్ పరిశీలనలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఇంజినీర్లు.. డీపీఆర్ ప్రకారం 17 మీటర్ల వెడల్పు, 3.30 మీటర్ల లోతుగా 110 కి.మీ పొడవునా హైలెవల్ కెనాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అంతేకాకుండా కెనాల్ను వంశధార నదిపై నుంచి అవతలి వైపునకు తీసుకెళ్లాలంటే దాదాపు 7 కి.మీ. పొడవునా వయోడెక్ట్ను నిర్మించాలి. ఇది కష్టసాధ్యమే కాకుండా పర్యవేక్షణ చేయడం సంక్లిష్టమని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. దానికి తోడు వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టి వరద కాలువ ద్వారా హిరమండలం జలాశయంలోకి నీరును మళ్లించాల్సి ఉంది. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే జలాశయంలో పూర్తి సామర్థ్యం (19టీఎంసీలు) మేర నీరు చేరే అవకాశం ఉంటుంది. దీంతో జలాశయంలో గరిష్ట నీటిమట్టం 67 మీటర్ల ఎత్తున ఉంటుంది. అయితే, వంశధార– బాహుదా నదుల అనుసంధానం కోసం ప్రతిపాదించిన హైలెవెల్ కెనాల్లోకి నీరు పారాలంటే కనీసం 60.5 మీటర్ల ఎత్తున నీటిమట్టం ఉండాలి. ఇదంతా జరగాలంటే నేరడి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కానీ, ఒడిశా అభ్యంతరాలను పరిష్కరించకుండా బాహుదా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చేసి, టెండర్లు పిలిచేసింది. ఇదంతా చూస్తుంటే ముడుపుల కోసం డిజైన్ చేసినట్టుగా ఉందే తప్ప ఉపయోగపడే ప్రాజెక్టు కాదనే అభిప్రాయాన్ని సాక్షాత్తు ఇంజినీర్లే వ్యక్తం చేస్తున్నారు. ఇదీ అవినీతి గ్రాఫ్... -వంశధార, బాహుదా నదులను అనుసంధానం చేసి, 75 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు గాను రూ.1075 కోట్లతో 2015లో బాహుదా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. -2019 ఫిబ్రవరి 11న ఇదే ప్రాజెక్టును 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచి రూ. 6,326.62 కోట్లతో డిజైన్ చేసి టెండర్ల నోటిఫికేషన్ పిలిచారు. ఇందులో 90 వేల ఎకరాలు స్థిరీకరణ కింద, లక్షా 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టు కింద నిర్దేశించారు. అంటే నాలుగేళ్ల కాలంలో లక్షా 25 వేల ఎకరాల మేర అదనపు ఆయకట్టు చూపించారు. రూ.5,251 కోట్ల మేర అదనంగా అంచనా వ్యయం పెంచారు. అది కూడా ఎన్నికల షెడ్యూల్కు ముందు డిజైన్ చేసి, ఫిబ్రవరి 11న టెండర్లు పిలిచారు. అదే నెల 27న ప్రైస్బిడ్ టెండర్లు తెరిచారు. నాటి సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకుని ఆగమేఘాల మధ్య ప్రాజెక్టు డిజైన్ దగ్గరి నుంచి టెండర్లు పిలిచే వరకు తతంగం నడిపారు. దానికి అప్పట్లో పనిచేసిన బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు సర్కిల్ సూపరింటెండెంట్ను పావుగా వాడుకున్నారు. దీంతో ఇది కేవలం ముడుపుల కోసమేనని, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టేనని అప్పుడే అంతా భావించారు. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ లొసుగులు.. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన విచారణలో కూడా ప్రాజెక్టు లోపాలను, లొసుగులను ఎత్తిచూపినట్టు చూపినట్టు తెలిసింది. డీపీఆర్నే మేనేజ్ చేసినట్టుగా గుర్తించినట్టు సమాచారం. 2015లో 75 వేల ఎకరాలతో డిజైన్ చేసిన ప్రాజెక్టును ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు పెంచడాన్ని కూడా తప్పు పట్టినట్టు తెలిసింది. పక్కా వ్యూహంతో ఆయకట్టును పెంచి చూపించారని, ఇందులో నాటి సూపరింటెండింగ్ ఇంజినీర్ పాత్రను ప్రస్తావించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు తెలియవచ్చింది. ఇన్ని అనుమానాలున్న ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో బ్రేక్ పడింది. ప్రారంభం కాని ప్రాజెక్టులను రద్దు చేయాలని ఆదేశించడంతో చంద్రబాబు అండ్ గ్యాంగ్కు గట్టి షాక్ తగిలినట్టు అయింది. ప్రభుత్వ ఆదేశాలతో రద్దు చేశాం.. ప్రారంభం కాని ప్రాజెక్టులలో బాహుదా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టు ఉండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేశాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అధికారులు విచారణ కూడా చేపడుతున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, డీపీఆర్ తది తర వివరాలు అన్నింటిని తీసుకున్నారు. డీపీఆర్పైనే అనుమానాలు ఉన్నాయి. తమకు పలు ప్రశ్నలు కూడా సంధించారు. ఇదే క్రమంలో పనులు దక్కించుకున్న ఒక ప్యాకేజీ కాంట్రాక్టర్ల ఇప్పటికే తమ బ్యాంకు గ్యారంటీని వెనక్కి తీసుకున్నారు. –పి.రంగారావు, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ -
నీటి సమస్యకు పరిష్కారం.. వాటర్ గ్రిడ్
జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో ఇటు ప్రజలు.. అటు రైతాంగం అల్లాడుతోంది. గత పాలకులు ముందు చూపు కొరవడి, ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి. పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయలేని పరిస్థితి. శాశ్వతంగా నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. వాటర్ గ్రిడ్ ఏర్పాటే దీనికి పరిష్కార మార్గంగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపింది. ఇది కార్యరూపం దాల్చితే జిల్లా వాసులకు నీటి కష్టాలకు చెక్ పెట్టినట్టే. సాక్షి , నెల్లూరు : జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే ఏకైక రిజర్వారుగా సోమశిల ప్రాజెక్ట్ ఉంది. ఏటా ఈ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసి కండలేరు, కనిగిరి, తెలుగుగంగతో ఇతర ప్రధాన కాల్వలకు, జిల్లా తాగునీటి అవసరాలకు కేటాయిస్తున్నారు. కండలేరు ద్వారా తిరుపతికి, తెలుగుగంగ ద్వారా చెన్నై నగరాలకు నీటిని తరలిస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో ఐదేళ్లుగా కరువు వెంటాడుతూనే ఉంది. గతేడాది కూడా జిల్లాలో 26 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన క్రమంలో జిల్లాలో తాగునీటి అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించింది. రెండు నెలలుగా ట్యాంకర్ల ద్వారా కరువు మండలాల్లోని 436 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తోంది. సమీపంలో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని ట్యాంకర్లలో నింపుకొని సరఫరా చేస్తోంది. ఇందుకు సంబంధించి రైతుకు నెలకు రూ. 9 వేలు చెల్లిస్తోంది. మరో నెల రోజుల పాటు ట్యాంకర్లతో నీటి సరఫరా కొనసాగే అవకాశం ఉంది. అడుగంటిన 70 శాతం బోర్లు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయిన నేపథ్యంలో జిల్లాలోని 18,500 చేతి పంపుల్లో దాదాపు 70 శాతం నీరులేక నిరుపయోగంగా మారిపోయాయి. వర్షాకాలం వచ్చి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నా.. జిల్లాలో ఆశించిన మేరకు వర్షాలు కురవని పరిస్థితి. ఇదే తరహా ఇబ్బందులు ఏటా జిల్లాలో ఉంటున్నాయి. వీటి అన్నింటికి శాశ్వత పరిష్కారం చూపేలా గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టనుంది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధ్యక్షతన గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులు, ఇరిగేషన్ అధికారులు, సోమశిల ప్రాజెక్ట్ అధికారులు, పశు సంవర్థక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు సమావేశమయ్యారు. జిల్లాలోని 46 మండలాలు, 7 మున్సిపాలిటీలు, నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పరిశ్రమలకు, పశువులకు అవసరమైన నీటి వినియోగంపై అంచనాలు సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రతి ఇంటికీ తాగునీటి అవసరాలకు కోసం వాటర్ పైప్లైన్ ఏర్పాటు చేసి, కనెక్షన్ ఇవ్వడానికి, దానికి అవసరమైన ఏర్పాట్ల నిర్వహణకు సుమారు రూ. 4,600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సోమశిల నుంచి తాగు, పరిశ్రమల నీటి అవసరాలకు 10 టీఎంసీలు ఏడాది పొడువునా అవసరం అవుతాయని గుర్తించారు. జిల్లాలోని అన్ని కెనాల్స్, బ్రాంచ్ కెనాల్స్కు సోమశిల నుంచి నీరు విడుదల కావాల్సి ఉండడంతో సోమశిల నీటి కేటాయింపులపై దృష్టి సారించి ప్రతి ఏటా పది టీఎంసీల వినియోగించుకోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఏటా సోమశిలకు వచ్చే ఇన్ఫ్లో, ఆవుట్ ఫ్లోను పరిశీలించి నీటి కేటాయింపులు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాటు వాటర్ గ్రిడ్ ద్వారా రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నదే వాటర్ గ్రిడ్ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రతిపాదనలు పంపారు. తక్షణ అవసరాలపైనా దృష్టి రానున్న ఆరు నెలల కాలంలో కనీనం ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కృష్ణా నది ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి సోమశిలకు నీరు చేరితే రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లిలకు కండలేరు ద్వారా, మిగిలిన నియోజకవర్గాల్లోని మండలాలకు సోమశిల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనిని కొనసాగిస్తే డెడ్ స్టోరేజ్లో కూడా నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. -
ఐఓసీ ఎల్పీజీ ప్రాజెక్ట్లో బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు చేరిక
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొ(ఐఓసీ) చేపట్టిన భారీ ఎల్పీజీ పైప్లైన్ ప్రాజెక్ట్లో బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు కూడా చేతులు కలుపుతున్నాయి. గుజరాత్లోని కాండ్లా నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకూ 2,757 కిమీ ఈ పైప్లైన్ ప్రాజెక్ట్ను రూ.9,000 కోట్ల పెట్టుబడులతో ఐఓసీ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్లో చెరో 25 శాతం వాటా తీసుకోనున్నట్లు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఈ మూడు కంపెనీల జాయింట్వెంచర్ కానున్నది. 3 రాష్ట్రాలు...22 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఈ ప్రాజెక్ట్లో భాగంగా కాండ్లా వద్ద ఎల్పీజీని దిగుమతి చేసుకుంటారు. పశ్చిమ తీర ప్రాంతంలో కొన్ని రిఫైనరీల నుంచి కూడా ఎల్పీజీని తీసుకుంటారు. ఆ తర్వాత దీనిని అహ్మదాబాద్, ఉజ్జయిని, భోపాల్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, లక్నోలకు పైప్లైన్ ద్వారా సరఫరా చేస్తారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లోని ఈ మూడు కంపెనీలకు చెందిన 22 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లకు ఈ పైప్లైన్ను అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా రోడ్డు రవాణా వ్యయాలు కలసిరావడమే కాకుండా, భద్రత పరంగా కూడా మెరుగైనదని నిపుణులంటున్నారు. ఈ పైప్లైన్ ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఎల్పీజీని సరఫరా చేస్తుంది. దేశంలో ఇదే అతి పొడవైన ఎల్పీజీ పైప్లైన్ ప్రాజెక్ట్ కానున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్ట్కు ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేశారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని అంచనా. ప్రస్తుతం గెయిల్ కంపెనీ గుజరాత్లోని జామ్ నగర్ నుంచి న్యూఢిల్లీ సమీపంలోని లోని వరకూ 1,415 కిమీ. ఎల్పీజీ పైప్లైన్ను నిర్వహిస్తోంది. ఈ పైప్లైన్ ద్వారా ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల ఎల్పీజీని సరఫరా చేస్తోంది. -
జెండా ఏదైనా.. హామీలే ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారం రాష్ట్ర ప్రజల ఎజెండా దిశగా వెళుతోంది. తమను గెలిపిస్తే ఫలానా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ప్రజలకు హామీలిస్తున్నాయి. రాష్ట్రంలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు విభజన చట్టంలో ఉండి అమలు కాని కార్యక్రమాలు, ఐటీఐఆర్, ఇతర అంశాలు రాజకీయ పార్టీలకు పచారా స్త్రాలుగా మారుతున్నాయి. ఆ రెండు ప్రాజెక్టులూ..! రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశం ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాళేశ్వ రం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పం దించి ఉంటే బాగుండేదని బీజేపీని బోనులో నిలబెట్టే యత్నం చేస్తోంది. అయితే, తమను గెలిపించి కేంద్రంలో రాహుల్ను ప్రధాని చేస్తే రాష్ట్రంలోని ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజలకు చెప్తోంది. అందులో కాళేశ్వరంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను ఆ ప్రాధాన్యాలుగా ఎంచుకుంటోంది. విభజన అంశాలు తెరపైకి తమను 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే జాతీయ రాజకీయాల్లో కీలకమవుతామని టీఆర్ఎస్ ప్రకటించిన నాటి నుంచే రాష్ట్ర విభజన చట్టం లోని హామీలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఆ పార్టీ దగ్గర 15 మంది ఎంపీలున్నారని, అయి నా విభజన చట్టంలోని హామీలను కూడా సాధించలేకపోయారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన, ఉద్యాన వర్సిటీల ఏర్పాటు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన లాంటి అంశాలు ఈ హామీల రూపంలో పెండింగ్లో ఉండటంతో వీటిని కూడా ఎన్నికల ప్రచారాస్త్రాలుగా చేసుకుని రాజకీయ పార్టీ లు ముందుకెళుతున్నాయి. పార్లమెంటులో ఆమోదించిన చట్టంలోని అంశాలను సైతం నెరవేర్చే పనిని బీజేపీ మర్చిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఆ మూడూ కీలకమే..! వీటికి తోడు ఐటీఐఆర్, పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నల అంశం కూడా ఈసారి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఐటీఐఆర్ను ప్రకటించి కేంద్రం వదిలేసిందని టీఆర్ఎస్ చెబుతుంటే 50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టును తాము పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కానీ, బీజేపీ మాత్రం రాష్ట్రం నుంచి సరైన రీతిలో ప్రతిపాదనలు వెళ్లనందునే ఈ ప్రాజెక్టు సకాలంలో మంజూరు కాలేదని ఓటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక, భారీ ఎత్తున నిజామాబాద్ లోక్సభకు నామినేషన్ల దాఖలుకు కారణమైన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్న రైతుల అంశాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో చర్చనీయాంశమవుతున్నాయి. అనేక అంశాలపై... వీటితో పాటు హైదరాబాద్–కరీంనగర్ రైల్వేలైన్, స్మార్ట్సిటీల ఏర్పాటు, పోడు భూముల సమస్య పరిష్కారం, సింగరేణిలో కారుణ్య నియామకాలు, మెడికల్ కళాశాలల ఏర్పాటు, తుమ్మిడిహెట్టి బ్యారేజీ, సచివాలయ నిర్మాణం కోసం బైసన్పోలో గ్రౌండ్ అప్పగింత లాంటి కేంద్రంతో సంబంధమున్న అనేక అంశాలపై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో తమదైన రీతిలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారు...కేసీఆర్ ప్రతిపాదిస్తున్న విధంగా జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ను బలీయమైన శక్తిగా నిర్ణయిస్తారా.. మోదీ, రాహుల్గాంధీల ప్రధాని అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతారా అన్నది వేచిచూడాల్సిందే..! రోడ్లు... ఓటుకు బాటలు తాము ప్రతిపాదించి కార్యరూపంలోకి తీసుకొస్తున్న రీజినల్ రింగురోడ్డు ఓట్ల వర్షం కురిపిస్తుందని టీఆర్ఎస్ ఆశిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు ఉపయుక్తమైన ఈ ప్రాజెక్టు రూ.12వేల కోట్ల వ్యయం అంచనాతో, 338 కిలోమీటర్లు మేర రెండు లేన్లలో ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే, ఇందులో కేంద్రం వాటానే రూ.10,500 కోట్లు ఉంటుంది. దీంతో కేంద్రంలో టీఆర్ఎస్ను కీలకం చేస్తే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తామని ఆ పార్టీ చెబుతోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని 3,155 కిలోమీటర్ల పొడవైన 25 జాతీయ రహదారులను ప్రతిపాదిస్తే కేవలం 1,388 కిలోమీటర్లను మాత్రమే కేంద్రం గుర్తించిందని, మిగిలింది గుర్తించలేదనే అంశాలను ప్రచారం చేస్తోంది -
కృష్ణా ప్రాజెక్టులకు గోదావరి నీరు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో చేపట్టి, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏదైనా సందర్భంలో నీటి ప్రవాహం తగ్గడం వల్ల కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు నీరు లభ్యం కాకపోతే గోదావరి నీటిని అందించేందుకు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రతి ప్రాజెక్టును నిర్మించడంతో పాటు, నిర్వహణ కోసం అవసరమైన ప్రాజెక్టు ఆపరేషన్ మాన్యువల్ రూపొందించుకోవాలన్నారు. మహబూబ్నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలపై సీఎం ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులతో మంగళవారం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాద వ్, రాజేందర్రెడ్డి, అబ్రహం, రామ్మోహన్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, బానోతు హరిప్రియానాయక్, రాములునాయక్ పాల్గొన్నారు. జిల్లా అంతటికీ సాగునీరు.. ‘ఖమ్మం జిల్లాను ఆనుకునే గోదావరి నది ప్రవహిస్తుంది. ఆ జిల్లాలో అడువులు, వర్షపాతం ఎక్కువ. దుమ్ముగూడెం వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉంది. గరిష్టంగా 195 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తే జిల్లా అంతా సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ని అనుకూలతలున్నా ఖమ్మం జిల్లాలో కరు వు తాండవం చేయడం క్షమించరాని నేరం. ఖమ్మం జిల్లా అంతటినీ సస్యశ్యామలం చేసేలా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. దుమ్ముగూడెం వద్ద నుంచి గోదావరి నీటిని బయ్యారం చెరువు వరకు ఎత్తిపోసి జిల్లా అంతటికీ సాగునీరు అందించాలి. అవసరమైన చోట రిజర్వాయర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టులతో నీరు అందని ప్రాంతాలను గుర్తించి, స్థానిక వనరులతో సాగునీరు అందించాలి. ఆర్వోఎఫ్ఆర్, అసైన్డ్ భూములకు సైతం సాగునీరు అందించాలి. సమైక్య పాలనలో ఎక్కువగా నష్టపోయిన జిల్లా మహబూబ్నగర్. ఒక్క జూరాల నీటితోనే ఎక్కువ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం వల్ల నీరు సరిపోని పరిస్థితి నెలకొంది. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం వనరులతో నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలతో పూర్తి ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా ఎక్కడికక్కడ అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాలి. చెరువులను నింపే ప్రణాళిక రూపొందించాలి. పాలమూరు జిల్లాలో చెన్నోనిపల్లి రిజర్వాయర్ను ఉపయోగంలోకి తెచ్చే విధానం రూపొందిస్తాం’ అని సీఎం వివరించారు. -
నీటి బొట్టు.. ఒడిసి పట్టు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల తో చెరువులను అనుసంధానించే ప్రక్రియ ను నీటిపారుదలశాఖ వేగిరం చేసింది. ప్రాజెక్టుల కాల్వల నుంచి వచ్చే నీరు, వర్షం నీరు, రీజనరేటెడ్ నీళ్ల ద్వారా చెరువులను నింపేలా వ్యూహం ఖరారు చేస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ రెండు బేసిన్లలో తెలం గాణలోని చెరువులకు ఇచ్చిన 265 టీఎంసీల కేటాయింపులను సద్వినియోగం చేయాలని సూచించారు. ఈ సూచనలకు అనుగుణంగా నెల రోజులుగా కసరత్తు చేస్తున్న అధికారులు, రాష్ట్రంలో మొత్తం 3,488 క్లస్టర్లలో గొలుసుకట్టు చెరువులున్నాయని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 559 మండలాల పరిధిలో ప్రభు త్వ, ప్రైవేటు, అటవీ భూముల్లో కలిపి 48,843 చెరువులున్నాయి. ఇందులో 12,154 గొలుసుకట్టు మార్గా లుండగా, వీటి పరిధిలో 27,814 చెరువులున్నాయి. మరో 16,771 గొలుసుకట్టు మార్గం లేని వివిక్త చెరు వులు. వీటిని వదిలేసి గొలుసుకట్టుగా ఉన్న చెరువుల మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులున్నాయి. ఈ గొలుసుకట్టులో ఉన్న మొదటి చెరువును గుర్తించి, దాన్ని ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేసేలా మ్యాపింగ్ ప్రక్రియ చేస్తు న్నారు. ప్రాజెక్టుల కింద ఏ కాల్వ నుంచి ఏయే చెరువులను నింపవచ్చన్నది ఖరారు చేస్తున్నారు. రాబోయే నాలుగైదు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపేలా వ్యూహం ఖరారు చేస్తున్నారు. జూన్నాటికి కాళే శ్వరం నీళ్లు వచ్చే అవకాశాల దృష్ట్యా ప్రాజెక్టు పరిధిలోని 500లకు పైగా చెరువులతో పాటు, ఎస్సారెస్పీ పరిధిలోని చెరువులన్నింటినీ నింపేలా పనులు కొనసాగాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. అనుసంధానం..ఆచరణీయం కృష్ణా,గోదావరి బేసిన్లో లభ్యమయ్యే ప్రతి నీటిచుక్కను వినియోగంలోకి తేవడం, నీటి నిల్వలను పెంచడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. బేసిన్లోని ఉప నదుల్లో లభ్యత నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసేలా ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టేలా వ్యూహాలు రచిస్తోంది. ఏడాదంతా చెరువులు నీటితో కళకళలాడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు నీటిపారుదల శాఖ ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధంచేసి క్షేత్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలన చేస్తోంది. చెక్డ్యామ్లేశరణ్యం... కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్డ్యామ్ల నిర్మాణం చేయగా, కర్ణాటక ఇదే తరహా వ్యూహంతో ముందుకు పోతోంది. ఈ రాష్ట్రాలనే అనుసరిస్తూ, చిన్నచిన్న వాగుల పరిధిలో ఎక్కడికక్కడ నీటిని ఒడిసి పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా బేసిన్ పరిధిలో 311 నీటి ప్రవాహ వాగులు (స్ట్రీమ్స్) ఉండగా, వాటి పొడవు 5,700 కిలోమీటర్లు ఉంది. వీటి పరిధిలో ఇప్పటికే 281 చెక్డ్యామ్లు, 156 ఆనకట్టలు ఉండగా, కొత్తగా 250 వరకు చెక్డ్యామ్లు నిర్మించే అంశంపై కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇక గోదావరి పరిధిలో 372 వాగులు 6,481 కి.మీ.ల పొడవున విస్తరించి ఉండగా, 229 చెక్డ్యామ్లు, 89 ఆనకట్టలు ఉన్నాయి. ఇక్కడ 250 నుంచి 300 చెక్డ్యామ్లు కొత్తగా నిర్మించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కృష్ణా బేసిన్లో మూసీ, ఓకచెట్టి వాగు, పెద్దవాగు, బూగ వాగు, డిండి వాగు, గుడిపల్లి వాగు, కాగ్నా, కందుకూర వాగుల పరిధిలో, గోదావరి బేసిన్లోని మంజీర, మానేరు, తాలిపేరు, లెండి, పెన్గంగ, బొమ్మారావు వాగు, ఘనపూర్ వాగు, గొబ్బాల్ వాగు, కిన్నెరసాని, లోటు వాగుల పరిధిలో ఎక్కువగా చెక్డ్యామ్ల నిర్మాణం చేసుకునే అవకాశాలను గుర్తించారు. అయితే హైడ్రాలజీ లెక్కలు, నీటి లభ్యత ఆధారంగా ఎక్కడెక్కడ వీటి నిర్మాణం చేయొచ్చో అంచనా వేయాలని ఇప్పటికే జిల్లాల ఇంజనీర్లకు బాధ్యతలు కట్టబెట్టారు. ప్రాజెక్టుల పరీవాహకంలో ఉన్న వాగులను ప్రథమ ప్రాధాన్యత కింద ఎంపిక చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. ఇప్పటికే ఉన్న చెరువులు, జలాశయాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగినంత నీటి లభ్యతఉన్న వాగులపై చెక్డ్యామ్లను ప్రతిపాదించనున్నారు. చెక్డ్యామ్ల మధ్య దూరాన్ని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయించనుండగా, ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల్లో షేక్హ్యాండ్ చెక్డ్యామ్లు ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అంతా మూడు నెలల్లో పూర్తి చేయనున్నారు. కొత్త చెక్డ్యామ్లు కృష్ణా బేసిన్ పరిధిలో250 గోదావరి పరిధిలో 300 -
‘ఇంటి’ని చక్కదిద్దరూ..!
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో తమ డిమాండ్లకు చోటు కల్పించాలని పలు రంగాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈఎంఐలు చెల్లిస్తూ ఇంటి స్వాధీనం కోసం కొనుగోలుదారులు వేచి చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దీంతో ప్రభుత్వం నుంచి ఊరట కల్పించే చర్యలను ఈ రంగం ఆశిస్తోంది. లిక్విడిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు గాను రూ.2,000 కోట్లతో ఓ నిధి (స్ట్రెస్డ్ అస్సెట్ ఫండ్)ని ఏర్పాటు చేయాలని రియల్టర్ల మండలి నారెడ్కో డిమాండ్ చేసింది. ఇంకా ఈ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరిందంటే... ►ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)ల రంగంలో నిధుల లభ్యత పరంగా కఠిన పరిస్థితులు ఏర్పడడంతో, లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకోవాలి. ►అందుబాటు ధరల ఇళ్లపై జీఎస్టీని 8 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలి. ఇతర ప్రాజెక్టులపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తూ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను కల్పించాలి. ►ప్రతికూల నెట్వర్త్ ఉన్న డెవలపర్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ►స్టాంప్ డ్యూటీ చార్జీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రాపర్టీల సర్కిల్ రేట్లను నిర్ణయించాలి. ►ఇళ్ల అద్దె ఆదాయంపై ఫ్లాట్గా 10 శాతం పన్ను రేటు అమలు చేయాలి. సెక్షన్ 24(ఏ)కింద అద్దె ఆదాయంలో తగ్గింపును 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. అదే, వికలాంగులు, వృద్ధులు, మహిళలకు 100 శాతం పన్ను మినహాయింపు కల్పించాలి. ►ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపుపై ఆదాయపన్ను మినహాయింపు ఉండగా, దీన్ని రూ.3 లక్షలు చేయాలి. జీఎస్టీ శ్లాబుల్ని హేతుబద్ధీకరించాలి వర్తకులు ప్రమాద బీమా సదుపాయం, రాయితీపై రుణాలతో కూడిన ప్యాకేజీ ఇవ్వాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేసింది. జీఎస్టీ శ్లాబులను హేతుబద్ధీకరించాలని కూడా కోరింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాసింది. లేఖలో ఈ సంఘం ఏం పేర్కొందంటే.. ►జీఎస్టీ కింద నమోదైన వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలి. ►కంప్యూటర్లు, వాటికి సంబంధించిన ఉత్పత్తుల కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వాలి. ►రిటైల్ ట్రేడింగ్, ఈ కామర్స్కు దేశవ్యాప్త విధానాన్ని తీసుకురావాలి. ►రిటైల్ రంగానికి ప్రత్యేకంగా ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. ►ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ను నెలకొల్పాలి. ►బ్యాంకులు వడ్డీ రేటు తగ్గింపుపై రుణాలను వర్తకులకు ఇవ్వాలి. ప్రస్తుతం కేవలం 5 శాతం చిన్న వ్యాపారులే బ్యాంకుల రుణాలు పొందుతుండగా, మిగిలిన వారు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ►18 శాతం జీఎస్టీ రేటును ఎత్తివేయాలి. కేవలం సంపన్న(లగ్జరీ) ఉత్పత్తులకే 28 శాతం శ్లాబును పరిమితం చేయాలి. ఆటో విడిభాగాలు, సిమెంట్ను ఈ శ్లాబ్ నుంచి తొలగించాలి. పేద ప్రజలు వాడేవి, నిత్యం వినియోగించే వాటిని 5 శాతం రేటులో ఉంచాలి. ►జీఎస్టీ కింద నమోదు చేసుకున్న వ్యాపారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ►మండి ట్యాక్స్, టోల్ట్యాక్స్ను రద్దు చేయాలి. -
ఆ ఐదు కంపెనీలపై అమితప్రేమ
సాక్షి, అమరావతి: రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు ఏడు వేల నుంచి పది వేల రూపాయలకుపైగా అంచనాలు రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని ఎలాంటి పోటీ లేకుండా అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేస్తోంది. కేవలం ఐదు నిర్మాణ సంస్థలకు నాలుగున్నరేళ్లలో రూ.25 వేల కోట్లకుపైగా పనుల్ని అప్పగించింది. ప్రతిపాదనల దశలోనే ముఖ్యమంత్రి నోటి మాటతో వందల కోట్ల రూపాయల పనుల్ని ఈ సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలైతే ఆ ఐదు సంస్థలే తయారుచేసి ముఖ్యమంత్రి ఎదుట పెడుతుండగా.. ఆయన ఆమోదముద్ర వేసి వాటికే నిర్మాణ బాధ్యతల్ని అప్పగిస్తుండడం గమనార్హం. ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, షాపూర్జీ పల్లోంజి, బీఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీలకు 80 శాతానికిపైగా పనులు కేటాయించగా మిగిలిన పనుల్ని బీఎస్సీపీఎల్, మేఘ ఇంజినీరింగ్ కంపెనీలకు అప్పగించారు. ఎల్ అండ్ టీకి రూ.8 వేల కోట్ల పనులు.. ఇప్పటివరకూ రూ.39,875 కోట్ల విలువైన పనుల్ని చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. అందులో ఒక్క ఎల్ అండ్ టీ సంస్థకే రూ.8 వేల కోట్లకు పైగా పనుల్ని కట్టబెట్టారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని ఈ సంస్థే నిర్మించగా.. ఇటీవలే మొదలైన శాశ్వత సచివాలయంలోని మూడు, నాలుగు టవర్లు, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి, తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణంతోపాటు రెండు భూ సమీకరణ లేఅవుట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, పలు రోడ్ల ప్రాజెక్టులనూ ఎల్ అండ్టీ కే అప్పగించారు. సీడ్ యాక్సెస్ రోడ్, శాశ్వత సచివాలయంలో జీఏడీ టవర్, ఐఏఎస్ అధికారుల నివాస భవనాలు, రోడ్ల ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం ఎన్సీసీ చేజిక్కించుకుని మొత్తంగా రూ.4,700 కోట్ల విలువైన పనులు చేస్తోంది. షాపూర్జీ పల్లోంజి సంస్థ రూ.3 వేల కోట్లకు పైగా పనుల్ని చేపట్టగా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంతో పాటు శాశ్వత సచివాలయంలోని ఒకటి, రెండు టవర్లు.. పూర్తిస్థాయి హైకోర్టు భవనం, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస భవనాలు, ఇతర పనులను అప్పగించారు. ఆ కంపెనీల అర్హతలే టెండర్ నిబంధనలు.. రూ.వేల కోట్ల విలువైన పనుల్ని ఈ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను వారికి అనుకూలంగా మార్చేస్తోంది. ఏ ప్రాజెక్టును ఎవరికివ్వాలో ముందే నిర్ణయించేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ప్రాజెక్టు డిజైన్లు, అంచనాలను సైతం ఆ కంపెనీలతోనే తయారు చేయిస్తున్నారు. పనులు అప్పగించిన తర్వాత ఆ కంపెనీలకున్న అర్హతలనే నిబంధనలుగా టెండర్లలో పెడుతుండడంతో ఇతర కంపెనీలకు అవకాశం దక్కడం లేదు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి సంస్థలకు అప్పగించేందుకు టెండర్లలో ప్రి కాస్ట్ భవనాలు నిర్మించిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో దేశంలో ఎన్నో భవనాలు నిర్మించిన కంపెనీలు కూడా ఈ పనులకు అర్హత సాధించలేకపోయాయి. కానీ ఎల్ అండ్ టీ ప్రి కాస్ట్ కాకుండా సాధారణ గోడల్నే కట్టేసి.. ఆ తర్వాత నిబంధనలను మార్పు చేయించుకుంది. భవన నిర్మాణాలతో సంబంధం లేకుండా ఎస్టీపీ, రోడ్ల నిర్మాణం, అంతర్గత వసతుల పనులు చేసి ఉండాలనే నిబంధనను విధించడం ద్వారానే ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి, ఎన్సీసీ కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన పనుల్ని కట్టబెట్టారు. పలు రోడ్ల పనుల్ని సైతం వారికే అప్పగించి వాటితో సంబంధం లేని పనులు కూడా చేసి ఉండాలనే నిబంధనలు విధించారు. సర్కార్ పెద్దల కమీషన్లకు భయపడి.. రాజధాని నిర్మాణ వ్యవహారాలు చేపట్టిన సీఆర్డీఏ, ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కంపెనీలతో కుమ్మక్కై నిబంధనలు వారికి అనుకూలంగా రూపొందిస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుందామని మొదట్లో టాటా కనస్ట్రక్షన్స్ వంటి కంపెనీలు ముందుకు వచ్చినా.. సర్కారు అనుకూల కంపెనీల ముందు నిలవలేకపోయాయి. సింగపూర్, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు సైతం సర్కారు పెద్దల కమీషన్ల డిమాండ్లతో అవాక్కై వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో పోటీ లేకుండా తాము తయారుచేసిన అంచనాల ప్రకారమే ప్రాజెక్టులు దక్కించుకుని ఆ కంపెనీలు లాభాలు పండించుకుంటుండగా.. సర్కారు పెద్దలు కమీషన్ల మత్తులో మునిగి మిగిలిన పనుల్నీ వారికే కేటాయించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. -
రెరా పరిధిలో ఉంటే నో మార్టిగేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్టిగేజ్ వ్యవస్థకు కాలం చెల్లనుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్లకు మార్టిగేజ్ మినహాయింపునివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. 200 చ.మీ. కంటే ఎక్కువ స్థలంలోని ప్రాజెక్ట్లకు 10 శాతం బిల్టప్ ఏరియాను మార్టిగేజ్ (తనఖా) చేయాలనే నిబంధన అమలులో ఉంది. ఈ స్థలాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన తర్వాతే రిలీజ్ చేస్తారు. అయితే రెరా ప్రకారం.. కొనుగోలుదారులు అపార్ట్మెంట్ ధరలో 10 శాతం సొమ్మును ఓసీ వచ్చిన తర్వాతే డెవలపర్కు చెల్లించాలనే నిబంధన ఉంది. అలాంటప్పుడు ముందుగా జీహెచ్ఎంసీకి 10 శాతం స్థలాన్ని మార్టిగేజ్ చేయడమనేది సరైంది కాదని డెవలపర్ల సంఘాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వం స్థలాన్ని, కొనుగోలుదారులు సొమ్మును మొత్తంగా 20 శాతం నిలిచిపోతే ప్రాజెక్ట్ను అభివృద్ధి చేసే డెవలపర్కు భారంగా మారుతుందని.. అందుకే రెరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్లకు మార్టిగేజ్ నిబంధనను తొలగించాలని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రతినిధులు బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమీషనర్ దాన కిశోర్, సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్ రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సంఘాల ప్రతినిధుల డిమాండ్లు ఏంటంటే.. అపార్ట్మెంట్ల ఎత్తు 21 మీటర్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎకరం లోపు స్థలంలో నిర్మించే అపార్ట్మెంట్లకు తప్పనిసరి సెల్లార్ నిబంధనను తొలగించాలి. 33 శాతం స్థలం పార్కింగ్ నిబంధన కారణంగా సెల్లార్, స్టిల్ట్ రెండూ తీయాల్సి వస్తుంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం.. 18 మీటర్ల లోపు ఉండే నివాస సముదాయాలకు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) అవసరం లేదు. దీన్ని 21 మీటర్లకు పెంచాల్సిన అవసరముంది. దీంతో జీ+5 భవనాలకు సెల్లార్ అవసరం లేకుండా రెండు స్టిల్ట్స్ నిర్మించే వీలుంటుంది. దీంతో సెల్లార్ తవ్వకం, వ్యర్థాలను పారేయడం వంటి అదనపు ఖర్చులు తగ్గుతాయి. పైగా అపార్ట్మెంట్ల ఎత్తును గణించడంతో జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. మున్సిపల్ విభాగం ప్రకారం అపార్ట్మెంట్ ఎత్తు పార్కింగ్ నుంచి మొదలైతే.. అగ్నిమాపక శాఖ మాత్రం గ్రౌండ్ లెవల్ నుంచి లెక్కిస్తుంది. వెంటిలేషన్ 10 శాతం చాలు.. ఇంట్లోకి గాలి, వెలుతురు ప్రసరణ (వెంటిలేషన్) సరిగా ఉండేందుకు గది బిల్టప్ ఏరియాలో 7.5 మీటర్లకు ఒక్క కిటికీ ఉండాలనే నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) చెబుతోంది. అయితే ఈ రోజుల్లో భవన నిర్మాణాలే గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు వెంటిలేషన్స్ను కూడా ఎన్బీసీ నిబంధనలు వర్తింపజేయడం సరైంది కాదు. గ్రీన్ బిల్డింగ్ ప్రకారం.. గోడల ఏరియాలో 10 శాతం కిటికీలు ఉంటే సరిపోయేలా నిబంధనల్లో మార్పు చేయాల్సిన అవసరముంది. డీపీఎంఎస్అప్గ్రేడ్ వర్షన్ అపార్ట్మెంట్లకు సెట్బ్యాక్స్, ఎత్తు వంటి నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆన్లైన్ డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. 21 రోజుల్లోనే అనుమతులు కూడా వచ్చేస్తున్నాయి. అదే.. మల్టీ స్టోర్, గేటెడ్ కమ్యూనిటీ వంటి ప్రత్యేక ప్రాజెక్ట్ల విషయంలో మాత్రం ఆన్లైన్ డీపీఎంఎస్లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్కు సుమారు 4 నెలల సమయం పడుతుంది. అందుకే ప్రత్యేక ప్రాజెక్ట్లకూ డీపీఎంఎస్ వినియోగంలో ఇబ్బందుల్లేకుండా సాఫ్ట్వేర్ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. -
‘రీజినల్’ భూసేకరణలో సగం ఖర్చు రాష్ట్రానిదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు అవసరమయ్యే భూసేకరణ వ్యయంలో తెలంగాణ సగభాగం భరించనుంది. ఈ ప్రాజెక్టు పనులకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపామని, భూసేకరణలో సగం ఖర్చు తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు అంగీకరించిందని కేంద్ర మంత్రి ఎం.ఎల్. మాండవీయ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. మొత్తం 334 కి.మీ.ల మార్గాన్ని రెండు దశల్లో నిర్మించనున్నామని, ఈ రెండు రహదారులను ఇప్పటికే జాతీయ రహదారులుగా గుర్తించామని ప్రకటించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలకు చెక్... రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూసేకరణ అత్యంత కీలకమైన ప్రక్రియ. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12,000 కోట్లుకాగా అందులో భూసేకరణకు దాదాపు రూ. 2,500–రూ. 3,000 కోట్లు వ్యయమవనుంది. ఈ ప్రాజెక్టు కోసం నిర్మించేది అత్యంత అధునాతనమైన ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి రహదారికి ఎక్కడా వంపులు, మలుపులు లేకుండా జాగ్రత్త తీసుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న రోడ్డును కాకుండా మొత్తం గ్రీన్ఫీల్డ్ భూములను తీసుకోవాలని నిర్ణయించారు. హైదరాబాద్కు 50 కి.మీ.ల దూరంలో, ఔటర్ రింగ్రోడ్డుకు 30 కి.మీ.ల దూరంలో నిర్మించనున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో ఎదురయ్యే రాజధాని ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. సేకరించి అప్పగించే బాధ్యత తెలంగాణదే.. ఆరు వరుసల్లో నిర్మించే రీజినల్ రింగ్రోడ్డు నిర్మాణానికి 4,500 హెక్టార్లు.. అంటే 11,000 ఎకరాలు అవసరమవుతాయి. దీని భూసేకరణ, అందుకు అవసరమైన మొత్తం రూ. 3,000 కోట్లలో సగం అంటే రూ. 1,500 కోట్ల భారాన్ని తెలంగాణ భరించనుంది. ఇప్పటికే డీపీఆర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణలో న్యాయ, సాంకేతిక చిక్కులు ఎదురవకుండా ప్రాజెక్టు సాఫీగా సాగిపోయేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న రహదారి (154 కి.మీ.)ని ఎన్హెచ్ఏఐ నోటిపై చేసి 166 ఏఏ నంబర్ ఇచ్చింది. ఇక భువనగిరి–షాద్నగర్ (180 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా గుర్తించినప్పటికీ ఇంకా దీనికి నంబర్ ఇవ్వాల్సి ఉంది. ఎన్.హెచ్. 563 నేర్పిన పాఠాలెన్నో ఇటీవల జగిత్యాల–ఖమ్మం వరకు ఉన్న రోడ్డును విస్తరించి జాతీయ రహదారిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్హెచ్ఏఐ కూడా ఆమోదించి నోటిఫై చేసి 563 నంబర్ ఇచ్చింది. ఇందుకోసం పలుచోట్ల భూసేకరణ పనులు కూడా మొదలయ్యాయి. పలుచోట్ల మిషన్ భగీరథ పైపులు అడ్డుతగలడం, మరికొన్ని చోట్ల ఒకవైపే భూమిని సేకరిస్తున్నారంటూ బాధితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విషయం కోర్టుకు వెళ్లింది. భూసేకరణ క్లిష్టంగా మారడంతో అవాంతరాల మధ్య ఈ ప్రాజెక్టు ఇటీవల నిలిచిపోయింది. ఎన్హెచ్ 563 ప్రాజెక్టు అర్ధంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో అధికారులు రీజినల్ రింగ్రోడ్డు ప్రాజెక్టు భూసేకరణ విషయంలో సమస్యలు రాకుండా డీపీఆర్ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. -
జీఎస్టీ వద్దా? నిర్మాణం పూర్తయిన వాటిల్లో కొనండి!
రెరా, జీఎస్టీ అమల్లోకి వచ్చాక నిర్మాణం పూర్తయిన గృహాలకు గిరాకీ పెరిగింది. కారణం.. వీటికి జీఎస్టీ లేకపోవటమే! ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో ఇన్వెస్టర్లూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ధర కాస్త ఎక్కువైనా సరే నిర్మాణం పూర్తయిన (ఇన్వెంటరీ) గృహాలను కొనేందుకే ఎగబడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: నిర్మాణం పూర్తయి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన గృహాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వర్తించదు. అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లకు 12 శాతం జీఎస్టీ ఉంది. ఉదాహరణకు ఫ్లాట్ ఖరీదు రూ.60 లక్షలు అనుకుందాం. ఇది నిర్మాణంలో ఉంటే గనక 12 శాతం జీఎస్టీ అంటే రూ.7.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే నిర్మాణం పూర్తయిందనుకోండి జీఎస్టీ కట్టక్కర్లేదు. అంతేకాకుండా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న గృహాలకు సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్ట్లతో పోలిస్తే నిర్మాణం పూర్తయిన వాటిల్లో ధర కాస్త ఎక్కువగా ఉంటుంది మరి. హైదరాబాద్తోపాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో గత రెండేళ్లుగా నిర్మాణం పూర్తయిన గృహాలకే డిమాండ్ ఉంది. పనిచేసే ప్రాంతాలకు దగ్గరగా, తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న ప్రాంతంలోనే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం.. 2018–19 తొలి త్రైమాసికం నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 9,45,964 గృహాలు అమ్ముడుపోకుండా (ఇన్వెంటరీ) ఉన్నాయి. ఈ గృహాలు విక్రయమవ్వడానికి ఎంతలేదన్నా 41 నెలల సమయం పడుతుంది. అంటే లెక్కలేనన్ని గృహాలు నిర్మాణం పూర్తయి కొనుగోలుదారులను రారమ్మంటున్నాయన్నమాట. అద్దె లోంచి సొంతింట్లోకి.. ఈ రోజుల్లో సొంతిల్లు కొందామన్న నిర్ణయం తీసుకున్నాక.. గృహ ప్రవేశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసే ఓపిక కొనుగోలుదారులకు ఉండట్లేదు. అందుకే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్లను ఎంచుకుంటున్నారు. నిర్మాణంలో ఆలస్యం, వసతుల ఏర్పాట్లు పూర్తయ్యే వరకూ వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. అప్పటివరకు అద్దె గృహాల్లో ఉన్న వాళ్లు రాత్రికి రాత్రే సొంతింట్లోకి వెళ్లిపోవచ్చు. అద్దె సొమ్మును నెల వారీ ఈఎంఐగా చెల్లించవచ్చు. గృహాన్ని అద్దెకిస్తే ఆదాయాన్ని ఆర్జించవచ్చు. వాస్తవ పరిస్థితులు తెలుస్తాయ్.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్ల్లో కొనుగోలు చేస్తే.. ప్రాజెక్ట్ల్లోని వసతులే కాకుండా గదుల విస్తీర్ణం, నిర్మాణంలోని నాణ్యత, శానిటరీ, ఎలక్ట్రిక్ ఇతరత్రా ఉత్పత్తుల వినియోగం వంటివి బ్రోచర్లు లేదా నమూనా ఫ్లాట్లలో కాకుండా వాస్తవంగా కళ్లతో చూసుకునే వీలుంటుంది. వాస్తవంగా ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం అభివృద్ధి, చుట్టుపక్కల రవాణా సదుపాయాలు, షాపింగ్, మార్కెట్, పార్క్లు, సెక్యూరిటీ ఇతరత్రా మౌలిక వసతుల ఏర్పాట్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. పెట్టుబడికైనా సరే.. ఒకవేళ మీరు సొంతంగా ఉండేందుకు కాకుండా పెట్టుబడి కోసం ఇల్లు కొనాలనుకున్నా సరే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటినే కొనడం ఉత్తమం. ఎందుకంటే కొనుగోలు చేసిన మొదటి నెల నుంచే అద్దె ఆదాయం మొదలవుతుంది గనక. నిర్మాణం పూర్తయిన గృహాలకు బ్యాంక్లకు కూడా రుణాన్ని త్వరగా మంజూరు చేస్తాయి. వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకుంటారు గనక డెవలపర్లు కూడా వసతుల్లో, పార్కింగ్ వంటి వాటిల్లో ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. రెరా అమల్లోకి వచ్చాక నిర్మాణ గడువును కూడా డెవలపర్లు పెంచేశారు. గతంలో ఒక ప్రాజెక్ట్ను ప్రారంభిస్తే మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించే డెవలపర్లు.. రెరా వచ్చాక నాలుగైదు ఏళ్లని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆలస్యమైతే రెరా చట్టం ప్రకారం కఠిన శిక్షలున్నాయి మరి. చ.అ.కు 500–800 ఎక్కువ.. ప్రాజెక్ట్ ప్రారంభ దశలోని ధరతో పోలిస్తే నిర్మాణం పూర్తయ్యే నాటికి విక్రయించే గృహాల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. చ.అ.కు సుమారు రూ.500–800 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అధిక ధర కారణంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్వోఐ) కూడా తక్కువగా ఉండే ప్రమాదముంది. నిర్మాణం పూర్తయిన ఇళ్లలో సీవరేజ్, డ్రైనేజ్ వంటి నాణ్యత లోపాలను గుర్తించడం కష్టం. ఆయా ప్రాజెక్ట్ల నిర్వహణ సక్రమంగా లేకపోతే కొన్నేళ్ల తర్వాత నాణ్యత లోపాలు బహిర్గతమవుతాయి. -
ఇథియోపియాలో భారతీయుల నిర్బంధం
ముంబై: ఇథియోపియాలోని వివిధ ప్రాజెక్టుల్లో తమ సిబ్బందిని స్థానికులు నిర్బంధించారని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు చెందిన ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్స్ లిమిటెడ్(ఐటీఎన్ఎల్) తెలిపింది. అక్కడ నిర్వహిస్తున్న పనులకు సంబంధించి స్థానికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఏడుగురు భారతీయ ఉద్యోగులను నిర్బంధించినట్లు పేర్కొంది. నీరజ్ రఘువంశి అనే ఉద్యోగి తనతోపాటు ఏడుగురిని స్థానిక సిబ్బంది నిర్బంధించినట్లు గత నెలలో బయటపెట్టడం తెల్సిందే. దీంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ వెంటనే అక్కడి భారత దౌత్య కార్యాలయానికి, విదేశాంగ శాఖకు ఈ సమాచారం అందించి, సాయం కోరింది. వీరి ప్రయత్నాలు ఫలించి శనివారం ఇద్దరిని విడుదల చేశారు. ఇతర దేశాల్లో బకాయిల చెల్లింపులకు అనుమతి కోరుతూ అక్కడి బ్యాంకులకు ఐటీఎన్ఎల్ లేఖలు రాసింది. అయితే, అనుమతుల్లో జాప్యం కారణంగా చెల్లింపులు ఆలస్యమయ్యాయని, ఇథియోపియాలోని పనివారికి వెంటనే వేతనాలు చెల్లిస్తామని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ పేర్కొంది. ఐటీఎన్ఎల్ తన సబ్సిడరీ అయిన ఎల్సమెక్స్ ఎస్ఏ అనే కంపెనీ ద్వారా ఇథియోపియాలో రోడ్లు, భవనాలు, పెట్రోల్, గ్యాస్ స్టేషన్ల నిర్మాణ పనులు చేపడుతోంది. -
వట్టిపోయిన జలాశయాలు
జిల్లాలో తాండవ మొదలుకుని గోస్తని వరకు ఏ ప్రాజెక్టులోనూ గేట్లు ఎత్తి నీరు వదిలే స్థాయిలో నీటి నిల్వలు లేని పరిస్థితి నెలకొంది. నవంబర్లోనే ఇలా ప్రమాద ఘంటికలు మోగిస్తుంటే..ఇక ఏప్రిల్కు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు కూడా అప్పుడే 25 మీటర్ల లోతుల్లోకి వెళ్లిపోయాయి. సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు నాలుగు. తూర్పు విశాఖ జిల్లాల్లో 51,465 ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన తాండవ ప్రాజెక్టుతో పాటు జిల్లా పరిధిలో 15,344 ఎకరాల ఆయకట్టు కలిగిన రైవాడ, 12,638 ఎకరాల ఆయకట్టు కలిగిన కోనాం, 19,969 ఎకరాల ఆయకట్టు కలిగిన పెద్దేరు జలాశయాలున్నాయి. అలాగే వరాహ జలాశయం కింద మరో 4485 ఎకరాలు, గంభీరం గెడ్డ కింద 640 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతి ఏటా 2 లక్షల హెక్టార్లలో ఖరీఫ్, 48వేల హెక్టార్లలో రబీ సాగవ్వాల్సి ఉంది. అంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు చరిత్రలో ముందెన్నడూ లేనంత అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన మూడు నెలలుగా క్యాచ్మెంట్ ఏరియాల్లో చుక్కనీరు లేకపోవడంతో ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో పూర్తిగా పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాధారంపై ఆధారపడి సాగయ్యే పంటలు ఎలాగూ ఎండిపోతుండడంతో కనీసం ప్రాజెక్టుల కింద పంటలనైనా కాపాడాలన్న ఆలోచనతో ఖరీఫ్లో ఇప్పటి వరకు ఉన్నంతలోనే సాగునీరు వదులుతూ వచ్చారు. ఇక ఏ ఒక్క ప్రాజెక్టులోనూ క్యూసెక్ నీరు కూడా విడుదల చేసే పరిస్థితి కన్పించడం లేదు. దుర్భర పరిస్థితుల ‘తాండవ’ం జిల్లాలో ఏకైక మేజరు ప్రాజెక్టయిన తాండవ రిజర్వాయరులో నీటి మట్టం కనీవిని ఎరుగని స్థాయిలో పడిపోయింది. ప్రాజెక్టు నిర్మించి 44 ఏళ్లు కా>వస్తోంది. ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితిని చూడలేదని ఈ ప్రాంత రైతులంటున్నారు. రిజర్వాయర్ ప్రమాద స్థాయి నీటిమట్టం(ఎఫ్ఆర్ఎల్) 380 అడుగులు కాగా కనిష్ట నీటిమట్టం 345 అడుగులు. గతేడాది ఇదే సమయానికి 367.80 అడుగులుండగా, ఈ ఏడాది 347 అడుగులకు చేరుకుంది. తాండవ తర్వాత అత్యధిక ఆయకట్టు కల్గిన కోనాం రిజర్వాయర్లో ఎఫ్ఆర్ఎల్ 101.25 మీటర్లు కాగా, కనిష్ట నీటి మట్టం(డెడ్స్టోరేజ్) 84 మీటర్లు. గతేడాది ఇదే సమయానికి 99.35 మీటర్లుకాగా, ప్రస్తుతం 88.60 మీటర్లకు చేరుకుంది. ఆ తర్వాత 15వేల ఎకరాలు పైగా ఆయకట్టు కలిగిన రైవాడ ప్రాజెక్టు ఎప్ఆర్ఎల్ 114 మీటర్లుకాగా, కనిష్ట నీటిమట్టం 99 మీటర్లు. గతేడాది ఇదే సమయానికి 113.08 మీటర్ల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 102.40 మీటర్లకు పడిపోయింది. పెద్దేరు జలాశయంలో ఎఫ్ఆర్ఎల్ 137 మీటర్లు కాగా, కనిష్టం 128 మీటర్లు. గతేడాది ఇదేసమయానికి 134.08 మీటర్ల మేర నీరుండగా, ప్రస్తుతం 129.90 మీటర్లకు పడిపోయింది. వరాహ జలాశయం ఎఫ్ఆర్ఎల్ 460 అడుగులు కాగా, కనిష్ట నీటిమట్టం 420 మీటర్లు. గతేడాది ఇదే సమయానికి 453 మీటర్లుండగా, ఈసారి 423 మీటర్లకు చేరుకుంది. తాగు నీటికి కష్టకాలమే.. విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చే ఏలేరు, తాటిపూడి, మేహాద్రిగెడ్డ, గోస్తని, ముడసర్లోవ, గోస్తని, గంభీరం ప్రాజెక్టుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఏలేరులో కనిష్ట నీటిమట్టం 71.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 84 మీటర్లకు చేరుకుంది. తాటిపూడి కనిష్టం 251 అడుగులు కాగా, ప్రస్తుతం 261 మీటర్లకు చేరుకుంది.మేహాద్రి గెడ్డ కనిష్టం 44 అడుగులు కాగా, ప్రస్తుతం 48 అడుగులకు చేరుకుంది. గోస్తని కనిష్ట నీటిమట్టం 21.06 అడుగులు కాగా, ప్రస్తుతం 26 అడుగులకు పడిపోయింది. ముడసర్లోవ కనిష్ట నీటి మట్టం 152 అడుగులు కాగా ప్రస్తుతం 155 అడుగులకు చేరుకుంది. గంభీరం గెడ్డ రిజర్వాయర్లో కనిష్ట నీటిమట్టం 107 మీటర్లు ప్రస్తుతం 107కు చేరుకోవడంతో పూర్తిగా ఎండిపోయింది. చుక్కనీరు లేక కళ్యాణపులోవ రిజర్వాయర్ కూడా పూర్తిగా ఎండిపోయింది. దీంతో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు కూడా ఈసారి జలగండం తప్పేటట్టు కన్పించడం లేదు. లోటు వర్షపాతంకారణంగా భూగర్భ జలాలు కూడా అప్పుడే 25 మీటర్ల లోతుల్లోకి వెళ్లిపోయాయి. వేసవిలో 50 నుంచి వంద మీటర్ల లోతుకు వెళ్తే కానీ చుక్కనీరు పడే పరిస్థితి కన్పించదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీ సాగు డౌటే.. రబీ సాగు పూర్తిగా బోర్లు, ప్రాజెక్టుల కింద సాగు చేస్తారు.రబీ సాధారణ విస్తీర్ణం జిల్లాలో 48వేల హెక్టార్లు. 2014–15లో 42,961హెక్టార్లలో,2015–16లో 40,814హెక్టార్లలో, 2016–17లో 33,517 హెక్టార్లలో రబీ సాగవగా, 2017–18లో కేవలం 30 వేల హెక్టార్లలోనే రబీ సాగయ్యింది.కానీ ఈసారి ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటి పోవడం, మరో వైపు జలాశయాలు ఎండిపోవడంతో ఈసారి ర బీ సాగుకు అవకాశం లేదంటున్నారు. జిల్లాలో డ్రగ్, బోర్వెల్స్ కలిపి 38,637ఉన్నాయి.వీటి పరిధిలో రబీ కింద 36వేల హెక్టార్ల విస్తీర్ణం ఉంది. ఈఏడాది ఏకంగా నవంబర్లోనే మైనస్ 25 శాతం లోటు వర్షపాతం ఉంది. రానున్న నాలుగు నెలల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ సీజన్లో ఎలాంటి అల్పపీడన ద్రోణులు, తుఫాన్లు వచ్చే అవకాశం ఉండదు. మళ్లీ ఏప్రిల్–మేలలో మళ్లీ తుఫాన్లు వచ్చే ఆనవాయితీ ఉంది. పొరుగు జిల్లాల్లో సెప్టెంబర్ నాటికి ఖరీఫ్ సీజన్ పూర్తవుతుంది. అక్టోబర్–నవంబర్లలో రబీ సాగు ఆరంభమవుతుంది. కానీ మన జిల్లాలో ఖరీఫ్ సాగే ఆలస్యంగా ప్రారంభమవుతుంది. రబీ సాగు జనవరిలో కానీ మొదలు కాని పరిస్థితి. ఈసారి లోటు వర్ష పాతం, భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఖరీఫ్లో నిండా మునిగిన రైతులు రబీ సాగుకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారనిపిస్తోంది. డెడ్ స్టోరేజ్లో నీటి నిల్వలు వర్షాభావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. చాలా వరకు డెడ్ స్టోరీజికి సమీపంలో ఉన్నాయి. ఎలేరు తప్ప మిగిలినవన్ని వేసవికి నాలుగైదు నెలలముందే అడుగంటిపోయే ప్రమాదాలున్నాయి. ఈలోగా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడితే కానీ ఈసారి వేసవి గట్టెక్కడం కష్టమే.– ఎస్.పళ్లంరాజు, ఎస్ఈ, జీవీఎంసీ -
బీటీఆర్ గ్రీన్స్ సొంతింటి చిరునామా!
సాక్షి, హైదరాబాద్: చుట్టూ పచ్చని ప్రకృతి.. అందమైన గృహాలు.. ఆధునిక వసతులు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆరోగ్యానికి, ఆనందానికి దగ్గర నివాసమంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్నే అభివృద్ధి చేస్తోంది మ్యాక్ నిర్మాణ సంస్థ. శ్రీశైలం జాతీయ రహదారిలో బీటీఆర్ గ్రీన్స్ పేరిట రూపుదిద్దుకుంటోంది. ♦రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 15 నిమి షాలు, ఔటర్ రింగ్ రోడ్డుకు 5 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్. 200 ఎకరాల్లో రానున్న బీటీఆర్ గ్రీన్స్లో మొత్తం 300 ప్రీమియం విల్లాలుంటాయి. 2,900 చ.అ. నుంచి 3,600 చ.అ.ల్లో 3, 4 పడక గదులుంటాయి. మలేషియాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ ఎస్ఏ ఆర్కిటెక్ట్స్ ఎస్డీఎన్ బీహెచ్డీ ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. ప్రీమియం విల్లాలతో పాటూ 325 గజాల నుంచి 1,000 గజాల్లో ఓపెన్ ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ♦ ఇక వసతుల విషయానికొస్తే.. ల్యాండ్ స్కేపింగ్, నిత్యావసర దుకాణాలు, ఏటీఎం వంటి వసతులతో పాటూ క్లబ్ హౌస్, స్పా అండ్ సెలూన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టిపర్పస్ ప్లే గ్రౌండ్, గోల్ఫ్ కోర్ట్ వంటివి ఉంటాయి. ♦ ప్రాజెక్ట్కు చేరువలో అంతర్జాతీయ విద్యా సంస్థలున్నాయి. నివాసితులకు వైద్య సేవలందించేందుకు బీటీఆర్ ప్రత్యేకంగా అపోలో హెల్త్ సర్వీసెస్తో ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్ట్లో 24 గంటల పాటు అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. -
ఈ గృహాలు కొందరికే!
ఇల్లు కొనేముందు! ప్రాజెక్ట్ ఎక్కడుందో వెళ్లి కళ్లారా చూస్తాం. స్కూల్, ఆసుపత్రి, నిత్యావసరాలకు దగ్గరగా ఉంటే ఓకే అనుకొని ధర విషయంలో బేరమాడతాం. అదీ పూర్తయ్యాక.. నిర్మాణంలో నాణ్యత, గృహ ప్రవేశం గురించి ఆరా తీస్తాం! కానీ, బై ఇన్విటేషన్ ఓన్లీ (బీఐఓ)– అల్ట్రా లగ్జరీ గృహాల విషయంలో ఇవేవీ ఉండవు. ఈ గృహాలను కొనడం సంగతి తర్వాత కనీసం ప్రాజెక్ట్ చూడాలంటేనే ఆహ్వాన పత్రం ఉండాల్సిందే! సాక్షి, హైదరాబాద్: బీఐఓ ప్రాజెక్ట్ల ప్రత్యేకత కేవలం అంతర్జాతీయ వసతులే కాదండోయ్.. కస్టమైజేషన్! అంటే కొనుగోలుదారులకు అభిరుచికి తగ్గట్టుగా గృహ నిర్మాణం ఉండటమే. ఫ్లోర్ లే అవుట్, ఇంటీరియర్ డిజైన్స్, ఫ్లోరింగ్, సీలింగ్ ఇంట్లో వాడే ప్రతి వస్తువూ మనకు నచ్చినట్టుగా.. బ్రాండెడ్గా ఉం టుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బీఐఓ ప్రాజెక్ట్లకు డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేదు. మన దేశంలో ముంబై, చెన్నై, పుణె, కోల్కతా నగరాల్లో బీఐఓ ప్రాజెక్ట్లున్నాయి. వాస్తవానికి, దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ లగ్జరీ ప్రాజెక్ట్ల కోసం ప్రత్యేకంగా ఏరియాలున్నాయి. ప్రధాన నగరంలో స్థలం కొరత ఉంటుంది. అందుకే డెవలపర్లు కొద్దిపాటి స్థలంలో లేదా రీ–డెవలప్మెంట్ సైట్లలో బీఐఓ ప్రాజెక్ట్లను నిర్మిస్తుంటారు. అందుకే కొన్ని బీఐఓ ప్రాజెక్ట్ల్లో స్థల పరిమితులు కారణంగా బొటిక్ స్టయిల్లో యూనిట్లుంటాయి. ఇందులో ఆశించిన స్థాయిలో వసతులు కల్పించకపోవచ్చు కూడా. కొనుగోలు శక్తి బట్టి గృహాలు.. ఎంపిక చేసిన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని బీఐఓ నిర్మాణాలను చేపట్టాలి. ప్రత్యేకమైన మతాలు, ఆహారపు అలవాట్లను లక్ష్యంగా చేసుకుని బీఐఓ ప్రాజెక్ట్లను నిర్మించే డెవలపర్లకు మార్కెట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. కస్టమర్ల సామాజిక సంబంధాల మీద కాకుండా కొనుగోలు శక్తి ఆధారపడి బీఐఓ ప్రాజెక్ట్లను చేపట్టాలి. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు, బిజినెస్ టైకూన్స్, సెలబ్రిటీలు బీఐఓ కస్టమర్లుగా ఉంటారు. ఆయా కస్టమర్ల వివరాలు, ఫైనాన్షియల్స్ను డెవలపర్లు గోప్యంగా ఉంచుతారని.. అందుకే వీటిని ట్రాక్ చేయడం కష్టమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురి తెలిపారు. బీఐఓ ప్రాజెక్ట్ చేసే నిర్మాణ సంస్థలకు అంతర్గతంగా ఎంపిక చేసిన కస్టమర్లు, బ్రోకర్లు ఉంటారు. ఆయా కస్టమర్ల ఆర్థిక స్థితిగతులు, జీవన శైలి, ఇతరత్రా ఆసక్తులను అంచనా వేస్తారు. అప్పటికే ఆయా డెవలపర్లకు ఉన్న కస్టమర్లలో లగ్జరీ అవసరాలను కోరుకునే వారికి ప్రాజెక్ట్కు సంబం ధించిన సమాచారాన్ని ఫోన్, ఈ–మెయిల్, ఇతరత్రా సామాజిక మాధ్యమాల ద్వారా ఆహ్వానం పంపిస్తారు. అంతర్జాతీయ వసతులు.. బీఐఓ ప్రాజెక్ట్ల వసతులన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. హెలిప్యాడ్, ఇన్–సూట్ లేదా రూఫ్టాప్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ ఎలివేటర్స్, ఇంట్లోనే రెస్టారెంట్, ప్రతి అపార్ట్మెంట్కు ప్రత్యేకంగా మల్టిపుల్ పార్కింగ్ సదుపాయం, బారిక్యూ పిట్స్, సన్ డెక్స్, అల్ట్రా హైటెక్ సెక్యూరిటీ సేవలు వంటివి ఉంటాయి. నిర్మాణంలో వాడే ప్రతి ముడి సరుకూ బ్రాండెడ్ ఉంటుంది. ఇంధన సామర్థ్యం ఎల్ఈడీ లైట్లు, వర్టికల్, రూఫ్ గార్డెన్స్, సెంట్రలైజ్ వాక్యూమ్ సిస్టమ్, హై ఎండ్ మాడ్యులర్ కిచెన్, ఇటాలియన్ మార్బుల్, సెంట్రలైజ్ ఏసీ సిస్టమ్, డిజిటల్ లాక్స్ అండ్ డోర్స్, ఆటోమేటిక్ కర్టెన్స్ అండ్ డెకరేటివ్స్ వంటి ఏర్పాట్లుంటాయి. ఏటా 10–15 ఫ్లాట్ల విక్రయం దేశ జనాభాలో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ), ఆపైన తరగతి కేవలం 4 శాతం వరకుంటుంది. ఇందులో అల్ట్రా లగ్జరీ విభాగం 1 శాతం ఉంటుంది. దేశంలోని మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్లో బీఐఓ మార్కెట్ వాటా 5–6 శాతం ఉంటుంది. ఏటా దేశంలో 10–15 బీఐఓ గృహాలు మాత్రమే అమ్ముడవుతాయి. ఎంపిక చేసిన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని బీఐఓ ప్రాజెక్ట్లను నిర్మిస్తుంటారు. అందుకే నగరాలను బట్టి వీటి ధరలు మారుతుంటాయి. బిల్డర్ బ్రాండింగ్, ప్రాజెక్ట్ ప్రాంతం, వసతులను బట్టి వీటి ప్రారంభ ధర రూ.3 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకుంటాయి. -
రాష్ట్రంలో నిరంకుశ పాలన
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని తెలంగాణ టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకుంటున్నారని తెలిపారు. సోమవారం కరీంనగర్ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు కపిల్వాయి దిలీప్కుమార్, గాదె ఇన్నయ్య తదితరులతో కలిసి మాట్లాడారు. కరీంనగర్ నగరంలో సీఎం కేసీఆర్ మొక్క నాటితే దాన్ని కాపాడేందుకు ఇద్దరు పోలీసులు, ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులను పెట్టి, నీళ్లు పోసేందుకు వాటర్ ట్యాంకర్ను ఏర్పాటు చేశారని, మొక్కకు అంత రక్షణ తీసుకున్నప్పుడు రైతులు కూడా తమ చేనుచెలుకను కాపాడుకోవడానికి అంతే తాపత్రయ పడుతారనే విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. పంటలు వేసుకునే సమయంలో నీళ్లివ్వమంటే ఇవ్వని దుస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం వానలు పడుతున్నయ్, వరదలు వస్తున్నయ్, ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి అప్పుడే అర టీఎంసీ నీటిని వదిలి ఉంటే ఇంత ఘర్షణకు అవకాశం ఉండేది కాదని వివరించారు. కరీంనగర్ నగరంలోని ఆర్ట్స్ కళాశాల స్థలంలో ఒక భాగం పురాతన కట్టడంగా ఉన్న దాన్ని కాపాడుకోగలిగాం కానీ, ఇంకా ఆర్ట్స్ కళాశాలకు సంబంధించిన జాగలో ఇక్కడున్న నాయకులు సినిమా థియేటర్ల కోసం, మల్టిఫ్లెక్స్ల కోసమో దాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితేనన్నారు. ఎవరో దాత విద్యాసంస్థలు నడపమని ఇస్తే, రాజకీయ నాయకులు విద్యాసంస్థలను పెంపు చేయకుండా ఉన్నజాగను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, వినోద్రావు, శ్రీనివాస్రావు కోసం ఈ కుట్ర జరుగుతోందని, నిరంకుశులు అనుకునేటోళ్లు అట్ల వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది నీచ రాజకీయాలకు అద్దంపట్టి చూపుతోందన్నారు. ప్రజలకోసం ఉపయోగపడాల్సిన అధికారం, నగరం, నీళ్లు మాకోసమనే పద్ధతుల్లో అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు. రేపు ఆర్ట్స్ కళాశాల జాగాతో ఆగుతరనే నమ్మకం లేదని, పక్కన బస్ డిపో కూడా ఇక్కడ ఎందుకండి మానేరు కాడా జాగలో పెట్టుకోండని పంపించినా పంపించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాలేజీలు ఊరవతల ఉండాలి, మీ థియేటర్లయితే నడుమ కట్టుకోవాలా..? అని ప్రశ్నించారు. ఇవాళ్ల ఇలాంటి పరిస్థితులు కరీంనగర్ నడిబొడ్డున సాక్షాత్కరిస్తున్నదన్నారు. ఇదే జిల్లాలో నీళ్ల కోసం ఆరాటపడుతున్న రైతుల విషయంలో ప్రభుత్వ అనుసరించిన వైఖరి కూడా సాక్ష్యంగానే కనబడుతోందన్నారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. కొత్త తరహా రాజకీయాలు కావాలని అన్నారు. 1990కంటే ముందుకు ఇదే జిల్లాలో రాజకీయాలు చేసిన ఎంతోమంది సోషలిస్టులు పోరాటం చేసి ఉన్న ఆస్తులన్నీ ప్రజల కోసం కరగదీసిన దాఖలాలూ ఉన్నాయన్నారు. కానీ ఇవాళ్లి రాజకీయాల్లో గుప్పెడు మంది తెలంగాణ తమ సొంత ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజం కోసం ఎలా పనిచేయాలో చెప్పేదే రాజకీయమని, రాజకీయాలు అవి సరిగా నడవకపోతే కొట్లాడి తెచ్చిన తెలంగాణకు అర్థం లేదన్నారు. వాటిని మార్చడానికి జనసమితి సమస్యల ప్రాతిపదికన ప్రజలను సమీకరిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలకు పునాది వేయాలనేది తమ తాపత్రయమన్నారు. చాలా అనుభవాలను సమీక్షించుకున్నామని తెలి పారు. గన్పార్కులో ఉన్న అమరుల స్తూపం మా దిరిగా మరో స్థూపానికి రూపకల్పన చేస్తున్నామ ని తెలిపారు. మనం కొట్టాడిన తెలంగాణ మన ఆ కాంక్షల పునాదిగా నిర్మించుకుందామని పిలుపుని చ్చారు. సమావేశంలో తెలంగాణ జన సమితి జి ల్లా కన్వీనర్ ముక్కెర రాజు, నరహరి జగ్గారెడ్డి, రొ ంటాల కేశవరెడ్డి, బి.వెంకటమల్లయ్య, మహిపాల్రెడ్డి, గడ్డం రవీందర్రెడ్డి, వరాల శ్రీనివాస్, మొ గురం రమేశ్, మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్మీట్లో మాట్లాడుతున్న టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం -
ఇకపై జాతీయ హోదా కుదరదు: గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇకపై రాష్ట్రాలు నిర్మించే సాగునీటి ప్రాజెక్టులకు జాతీ య హోదా ఇవ్వడం కుదరదని, ఆ విధానం ఇప్పు డు అమలులో లేద ని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గురువారం ఉదయం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ సలీం సాగునీ టి ప్రాజెక్టులపై అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయం చెప్పారు. ఈశా న్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాల్లో నిర్మించే ప్రాజెక్టులకు 90% నిధులు కేంద్రం ఇస్తుందన్నా రు. కరువు ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టులకు కేంద్రం 60% వాటా భరిస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ వినోద్ లేఖ గడ్కరీ ప్రకటనపై స్పందిస్తూ టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ మంత్రికి లేఖ రాశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చినట్టుగానే, అదే చట్టం ద్వారా తెలంగాణ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకుగానీ, పాలమూరు ఎత్తిపోతల పథకానికిగానీ జాతీయ హోదా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. జాతీయ హోదా ఇచ్చే విధానం అమలుపై పునఃపరిశీలన చేయాలని కోరారు -
మురుగు శుద్ధికి గ్రీన్ సిగ్నల్
విశాఖసిటీ: మహా విశాఖలో పారిశ్రామిక అవసరాల కోసం వృథా నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.762 కోట్లతో హైబ్రిడ్ సివరేజ్ ప్రాజెక్టు తొలి విడత పనులకు సర్కారు పచ్చజెండా ఊపింది. పెందుర్తిలో 46 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.150 కోట్ల నిధులను మున్సిపల్ బాండ్స్ ద్వారా సమీకరించుకోవాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు జీవీఎంసీ కసరత్తులు చేస్తోంది. మహా విశాఖ నగర పాలక సంస్థలో దేశంలోనే అతి పెద్ద హైబ్రిడ్ సివరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో ఉత్పత్తవుతున్న మురుగు వృథా నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. పెందుర్తి, గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ లేని ప్రాంతాల్లో అభివృద్ధి చెయ్యడంతో పాటు ఆ నీటిని శుద్ధి చేసి పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖరీదు రూ.762 కోట్లు. తొలి విడతలో రూ.412 కోట్లతో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు పరిశ్రమలకు రీసైకిల్ వాటర్ను పంపిణీ చేసే వ్యవస్థకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. ప్యాకేజీ–1లో కింద పెందుర్తి ఏరియాలో పనులు నిర్వహించనున్నారు. ఇందుకోసం మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉండటంతో ఈ ప్రాజెక్టులో రూ.150 కోట్లను కార్పొరేషన్ ఖర్చు చేయనుంది. ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్) మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. పెందుర్తి ప్రాంతంలో పనులు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత ప్యాకేజీ–2లో భాగంగా గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు పరిశ్రమలకు ట్రీటెడ్ వాటర్ పంపిణీ చేసే వ్యవస్థకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే జీవీఎంసీ బాధ్యతగా ఖర్చు చేయాల్సిన రూ.150 కోట్లను మున్సిపల్ బాండ్ల ద్వారా సమీకరించుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. జీవీఎంసీ స్థిరాస్థిని బట్టి వాటిని తనఖా పెట్టి రూ.150 కోట్లు సమీకరించుకునే వెసులుబాటు కల్పించింది. ఓపెన్ టెక్నాలజీ ఆపరేషన్ ద్వారా నిర్వహణ 46 ఎంఎల్డీతో సామర్ధ్యం కలిగిన ట్రీట్ మెంట్ ప్లాంట్కు సంబంధించి పరిశీలన, సర్వే, డిజైన్, నిర్మాణం, సివరేజ్ కలెక్షన్, కన్వెయిస్ సిస్టమ్ పర్యవేక్షణ పనులకు సంబంధించిన నివేదికను త్వరలోనే జీవీఎంసీ అధికారులు సిద్ధం చెయ్యనున్నారు. అదే విధంగా 15 సంవత్సరాల పాటు ఓపెన్ టెక్నాలజీతో నిర్వహించనున్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న నరవ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచే ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నారు. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే ఇప్పటి వరకూ పరిశ్రమలకు మళ్లిస్తున్న నీటిని విశాఖ ప్రజల తాగునీటి సరఫరాకు కొంత మేర ఉపయోగపడనుంది. -
వీడని జాలి‘ముడి’!
మధిర : ప్రతిష్టాత్మకంగా రూ.43కోట్ల వ్యయంతో జాలిముడి గ్రామ సమీపంలో చేపట్టిన తాగునీటి (సీపీడబ్ల్యూ స్కీం) ప్రాజెక్టు నిర్మాణ పనులు ముగిసి, ట్రయల్ రన్ పూర్తయి మూడేళ్లు గడిచినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అయితే మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ను జాలిముడి ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఇచ్చే అవకాశం ఉండటంతో రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యే అవకాశం ఉంది. మధిర మండలంలోని 33 గ్రామాలు, బోనకల్ మండలంలోని 23 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు వైరా నదిపై రోజుకు 7 మిలియన్ లీటర్ల నిల్వసామర్థ్యం గల ప్రాజెక్టును నిర్మించారు. మధిర మండలం జాలిముడి వద్ద 900 కిలోలీటర్లు, ఖాజీపురం వద్ద 800 కిలోలీటర్లు, బోనకల్ గార్లపాడువద్ద 250 కిలోలీటర్ల కెపాసిటీ గల సంపులను నిర్మించారు. వీటి ద్వారా 56 గ్రామాలకుగాను.. 51 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే మధిర నగర పంచాయతీ పరిధిలోని అంబారుపేటకు తాగునీరు అందడం లేదు. మధిర పెద్ద చెరువు విస్తరణ పనులు జరుగుతుండడంతో పైపులైన్ ధ్వంసమైంది. చిలుకూరుకు తాగునీటి పైపులైన్ కనెక్షన్ కలపాల్సి ఉంది. బోనకల్ మండలం ముష్టికుంట్ల, తూటికుంట్ల, చిన్నబీరవల్లి గ్రామాలకు పలు కారణాలతో తాగునీరు అందడం లేదు. మధిర, బోనకల్ రైల్వే క్రాసింగ్ల వద్ద పైపులైన్ కనెక్షన్ అనుసంధానం చేయలేదు. తాగునీటిని శుద్ధి చేసేందుకు ఆలమ్, క్లోరినేషన్ సమపాళ్లలో కలిపిన తర్వాత ల్యాబ్లో పరీక్షలు నిర్వహించాక తాగునీటిని సరఫరా చేయాలి. అయితే ల్యాబ్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. హెడ్వర్క్స్, ప్రధాన సంపుల చుట్టూ ప్రహరీ నిర్మించలేదు. ఇటువంటి చిన్నచిన్న పెండింగ్ పనులతోపాటు ప్రాజెక్టుపై ఇంజనీర్లు, సూపర్వైజర్లను నియమించేందుకు ప్రభు త్వం ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలున్నాయి. సమస్యలు ఇలా.. తాగునీటిని సరఫరా చేసే వైరా నది వద్ద తూటికాడ పేరుకుపోయింది. ప్రాజెక్టు వద్దకు వచ్చే విద్యుత్ తీగలపై తాటిచెట్లు, సుబాబుల్, కంపచెట్లు విరిగి పడుతుండడంతో తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో నెల రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. పలుచోట్ల పైపులైన్కు లీకేజీలు ఏర్పడుతున్నాయి. గతంలో బోడేపూడి సుజల స్రవంతి పథకం కింద పని చేసిన 40 మంది కార్మికులను ప్రస్తుతం నిర్మించిన జాలిముడి తాగునీటి ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ‘భట్టి’కి పేరొస్తుందనే.. జాలిముడి ప్రాజెక్టుపై సాగు, తాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి.. మధిర, బోనకల్ మండలాల పరిధిలో సాగు, తాగునీరు అందించేందుకు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కృషి చేశారు. అయితే 2011 నుంచి చేపట్టిన ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ ట్రయల్ రన్లోనే ఉంది. మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ అనుసంధానం చేయలేదు. త్వరలోనే మిషన్ భగీరథ పైపులైన్ను ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైపులైన్కు కనెక్షన్ ఇచ్చి.. రూ.కోట్ల వ్యయంతో జాలిముడి వద్ద నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలివేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే భట్టి ప్రతిపక్ష నాయకుడు కావడంతోపాటు ప్రభుత్వాన్ని పలు అంశాల్లో ప్రశ్నిస్తుండటం, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయనకు పెరుగుతున్న ప్రతిష్టను చూసి.. ప్రాధాన్యతను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పలు పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. ఇది వినియోగంలోకి వస్తే భట్టికి పేరొస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వేసవిలో సుమారు 50 గ్రామాలకు తాగునీరు అందించిన తాగునీటి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా.. రాజకీయ విభేదాలతోనే ప్రాజెక్టుకు మోక్షం కలగడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరందించాలి.. పెండింగ్ పనులు పూర్తి చేసి అన్ని గ్రామాలకు తాగునీరందించాలి. బోడేపూడి సుజల స్రవంతి పథకం పైపులైన్కు లీకేజీలు ఏర్పడ్డాయి. తాగునీరు కలుషితమవుతోంది. పలుచోట్ల గేట్వాల్వ్లపై మూతలు లేవు. జాలిముడి ప్రాజెక్టు నీరందడం లేదు. మిషన్ భగీరథ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తాగునీటి సమస్య తీరుతుంది. – బట్టా గోవిందరాజు, గ్రామస్తుడు, మహదేవపురం -
సెల్లార్లో బండరాళ్లొస్తే?
సాక్షి, హైదరాబాద్ : నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ నివాస ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. సెల్లార్ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వచ్చాయి. దాన్ని తొలగించేందుకు ఓ కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుంది. ఈ పనిని మరో సబ్–కాంట్రాక్టర్కు అప్పజెప్పారు మొదటి కాంట్రాక్టర్. బ్లాస్టింగ్ చేయాలని నిర్ణయించుకొని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి నిర్మాణ స్థలానికి తీసుకొచ్చాడు సబ్–కాంట్రాక్టర్. అంతే! సమాచారం ఎవరందించారో తెలియదు గానీ క్షణాల్లో టాస్క్ఫోర్స్ చేరుకోవటం, సబ్–కాంట్రాక్టర్ను నిలదీయడంతో అతను నిర్మాణ సంస్థ యజమాని పేరు చెప్పడం, పోలీసులు యజమాని మీద కేసు నమోదు చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. వాస్తవానికి ఈ సంఘటనతో డెవలపర్కు ఎలాంటి సంబంధం లేదు. బ్లాస్టింగ్ చేయమని గానీ లేదా తవ్వకం పనిని సబ్–కాంట్రాక్ట్కు ఇవ్వమని గానీ ఒప్పందమేమీ చేసుకోలేదు. ...పై సంఘటన నగరంలోని చాలా మంది డెవలపర్లకు అనుభవమే. డెవలపర్, కేసు, సబ్–కాంట్రాక్టర్ విషయాలను పక్కన పెడితే.. అసలు చర్చించాల్సిన అంశం.. ‘‘సెల్లార్ తవ్వకంలో అడ్డువచ్చే బండరాళ్లను తొలగించే క్రమంలో పేలుడు జరపాల్సి వచ్చినప్పుడు వాటి అనుమతులు ఎవరిస్తారనే దాని గురించి!’’ భూమి లోపల 10 అడుగుల లోతు కంటే ఎక్కువ సెల్లార్ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు సంబంధిత కాంట్రాక్టర్లు వీటిని కూలీలు, పనిముట్ల సహాయంతో తొలగిస్తుంటారు. పెద్ద పెద్ద బండరాళ్లు, కఠినమైన రాళ్లు వచ్చిన సందర్భాల్లో మాత్రం పేలుళ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇదే డెవలపర్లకు నరకంగా మారింది. ఎందుకంటే బ్లాస్టింగ్ అనుమతులు ఏ ప్రభుత్వ విభాగం ఇస్తుంది? ఎన్ని రోజుల్లో అనుమతులొస్తాయి? అసలు ఫీజు ఎంత? ఎలాంటి పత్రాలను జత చేయాలి? వంటి విధివిధానాలేవీ లేవని ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’తో వాపోయారు. చేతులు తడిపితేనే అనుమతులు.. బ్లాస్టింగ్ అనుమతుల కోసం కాళ్ల చెప్పులరిగేలా తిరిగితే తప్ప రాని పరిస్థితి. పైగా చేతి చమురూ వదులుకోవాల్సిందే. స్థానిక పోలీసులు, అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి పని చేసుకోవాల్సి వస్తుందని.. దీంతో అనవసరంగా అవినీతి పెరుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఒక్క ప్రాజెక్ట్కు బ్లాస్టింగ్ అనుమతుల కోసం ఆరేడు నెలల దాకా వేచి ఉండాల్సి వస్తుందని వాపోయారు. విధివిధానాలుండాల్సిందే.. ♦ పేలుళ్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కోసం ప్రత్యేకంగా విభాగం, అధికారులు ఉండాలి. పేలుళ్లు జరిపే క్రమంలో పర్యవేక్షణ జరపాలి. ♦ మున్సిపాలిటీలోనే నిర్మాణ అనుమతులతోనే పేలుడుకు సంబంధించిన అనుమతులు ఇస్తే బాగుంటుంది. ♦ అన్ని సందర్భాల్లోనూ పేలుడు పదార్థాలను వినియోగించకుండా రసాయనాలను వినియోగించే వీలుండాలి. ♦ స్థానికంగా ఉన్న ఇతర భవనాలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ ఏర్పాట్లు తీసుకోని డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. -
‘మిడిల్ కొలాబ్’కు ఓకే
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్లో ఎగువన ఒడిశా చేపడుతున్న మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుపై వివాదం ముగిసింది. రాష్ట్ర వాటా నీటికి గండికొట్టేలా ఒడిశా ప్రభుత్వం మిడిల్ కొలాబ్ చేపడుతోందని తెలంగాణ తొలుత అభ్యంతరాలు లేవనెత్తినా, ఒడిశా వాటా నీటిలోంచే వినియోగం ఉందని నిర్ధారణకు వచ్చిన దృష్ట్యా దీనికి సానుకూలత తెలిపింది. ఏపీ సైతం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని గోదావరి బోర్డు నిర్ణయించింది. గోదావరి బేసిన్లోని సమస్యలపై చర్చించేందుకు మంగళవారం బోర్డు అధ్యక్షుడు హెచ్కే సాహూ అధ్యక్షతన జలసౌధలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు, తెలంగాణ సీఈ శంకర్నాయక్, డీసీఈ నరహరి బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోదావరి సబ్ బేసిన్లో ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతికి అడ్డుకట్ట వేసి భారీ స్థాయిలో నీటిని వినియోగించుకునేలా చేపట్టిన మిడిల్ కొలాబ్ బహుళార్థ సాధక ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఒడిశా సుమారు 40 టీఎంసీలకు పైగా నీటిని వాడుకునే ఎత్తుగడ వేస్తోందని తెలంగాణ అభ్యంతరం చెప్పింది. దీనిపై కల్పించుకున్న బోర్డు, ఒడిశాకు 40 టీఎంసీల కేటాయింపులున్నాయని, అందులోంచే 20 టీఎంసీల కన్నా తక్కువ నీటిని వాడుకునేలా దీన్ని చేపడుతోందని తెలిపింది. ఒడిశా తన వాటాల్లోంచే వాడుకుంటే తమకు అభ్యంతరాలు లేవని రెండు తెలుగు రాష్ట్రాలు సమ్మతించాయి. కొత్త ప్రాజెక్టులపై గరంగరం గోదావరి బేసిన్లో ఇరు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై బోర్డు భేటీలో వాడీవేడి చర్చ జరిగింది. తెలంగాణ అడ్డగోలుగా రీ డిజైన్ పేరిట ప్రాజెక్టులు చేపడుతోందని, ప్రాంతాలు, నీటి వాటాను పెంచేస్తూ ప్రాజెక్టులు కడుతోందని ఏపీ అభ్యంతరం తెలిపింది. కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతలపై నిలదీసింది. ‘సీతారామ ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని తెలంగాణ అంటోంది. నిజానికి రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 33 టీఎంసీల నీటినే తీసుకోవాలని ఉంది. ప్రస్తుత రీ డిజైన్లో దాన్ని 70 టీఎంసీలకు పెంచారు. గతంలో ఆయకట్టు 3.24 లక్షల ఎకరాలుండగా, దాన్ని 6.74 లక్షల ఎకరాలకు పెంచారు. వ్యయం రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.3,505 కోట్లుండగా, అది రూ.13,384.80 కోట్లకు పెరిగింది. ఈ దృష్ట్యా దీన్ని కొత్త ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించరాదు’అని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపినందున దాన్ని పాత ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించాలని అడిగింది. కొత్త ప్రాజెక్టులన్నింటికీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అన్ని ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులున్నాయని, వాటినే తమకు అనుగుణంగా రీ డిజైన్ చేశామని స్పష్టం చేసింది. ఏపీ కూడా గోదావరి బేసిన్లో పురుషోత్తపట్నం సహా అనేక కొత్త నిర్మాణాలు చేపడుతోందని, వాటిని కొత్త ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరింది. అసలు కొత్త ప్రాజెక్టు నిర్వచనం ఏమిటన్న దానిపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని, ఇరు రాష్ట్రాలు తమ ప్రాజెక్టుల జాబితా ఇస్తే, దీనిపై మరోమారు చర్చిద్దామని బోర్డు తెలిపింది. టెలిమెట్రీ పరికరాల అంశంపైనా చర్చ జరిగింది. మొత్తంగా 120 టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించినా, తొలి విడతగా ఎస్సారెస్పీ, ధవళేశ్వరం పరిధిలో నాలుగేసి చొప్పున 8 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
రత్నగిరి ప్రాజెక్టులోకి ‘అబుదాబి ఆయిల్’
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరిలో 44 బిలియన్ డాలర్లతో (రూ.3 లక్షల కోట్లు) 2025 నాటికి ఏర్పాటు చేస్తున్న 60 మిలి యన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కూడిన రిఫైనరీ, 18 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టులో సౌదీ అరామ్కో నుంచి కొంత వాటా తీసు కునేం దుకు వాటా తీసుకునేందుకు అబు దాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్వోసీ) ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేసింది. దీనితో ప్రాజెక్టులో సౌదీ అరామ్కో, ఏడీఎన్వోసీ మొత్తంగా 50 శాతం వాటా తీసుకుంటాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భారత ఇంధన మార్కెట్, రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు అవకాశంగా ఏడీఎన్వోసీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో మిగిలిన 50%వాటా ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ పంచుకుంటాయి. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఇంధన విని యోగ మార్కెట్ భారత్లో సౌదీ అరేబియా, యూఏఈలకు ఇది వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడిగా సౌదీ అరామ్కో సీఈవో, ప్రెసిడెంట్ అమిన్ హెచ్ నాసర్ పేర్కొన్నారు. కాగా ప్రతిపాదిత ఉమ్మడి 50 శాతం వాటాలో ఎవరెంత కలిగి ఉండాలన్న దానిపై చర్చించాల్సి ఉందని నాసర్ తెలిపారు. -
ఆయకట్టుకు ఆయువు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నో అవాంతరాల కారణంగా అటకెక్కిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చాయి. ప్రాణహిత ప్రాజెక్టును గాడిన పెట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో తొలి నుంచీ మధ్యతరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం వాటి కింద ఈ ఏడాది గరిష్ట ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు పూర్తి చేసింది. మొత్తంగా పన్నెండు ప్రాజెక్టుల కింద 1.82 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా ఈ సీజన్లో మొత్తంగా 1.26 లక్షల ఎకరాలకు నీరందించనుంది. అవాంతరాలన్నీ దాటి ఆయకట్టు సిద్ధం... రాష్ట్ర విభజనకు ముందు ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో చాలా చోట్ల పునరావాసం, భూసేకరణ, రైల్వే క్రాసింగ్లు, కాల్వ పూడికలు, నిధుల లేమి కారణంగా నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వడంలో తీవ్ర జాప్యం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ వచ్చింది. అలాగే అవాంతరాలపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పునరావాసం కోసం రూ. 20 కోట్లు చెల్లించి ముంపు గ్రామాలను ఖాళీ చేయించిన ప్రభుత్వం... రెండేళ్ల క్రితం జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నింపింది. ఈ ప్రాజెక్టు కింద 14 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా గతంలో 2 వేల ఎకరాలకు మించి సాగు జరగలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాల్వలను ఆధునీకరించడంతో 12 వేల ఎకరాలకు నీరందించేందుకు సిద్ధమైంది. మిగతా ఆయకట్టుకు చెందిన పనులు డిసెంబర్కల్లా పూర్తి కానున్నాయి. ఇక మత్తడివాగు కింద గత పదేళ్లుగా రైల్వే క్రాసింగ్ పనులు పూర్తిగాక ఎడమ కాల్వ కింద 8,500 ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరందలేదు. నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా రైల్వే అధికారులతో చర్చించి క్రాసింగ్ పనులు పూర్తి చేయించారు. ఇక కుడి కాల్వల కింద రూ. 7.34 కోట్ల మేర పెండింగ్ పనులను పూర్తి చేయించడంతో ఇక్కడ పూర్తి ఆయకట్టుకు నీరందనుంది. ఇక కొమురం భీమ్ ప్రాజెక్టు పరిధిలో 161 ఎకరాల అటవీ అనుమతులు సాధ్యంగాక 45 వేల ఎకరాల్లో 8 వేల ఎకరాలకు నీరందింది. అయితే ప్రభుత్వం గతేడాది అనుమతుల ప్రక్రియను పూర్తి చేయడంతో ఈ ఏడాది ఖరీఫ్లో 25 వేల ఎకరాలకు నీరందనుండగా మిగతా పనులను డిసెంబర్లోగా ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నీల్వాయి ప్రాజెక్టులో నీటి నిల్వ సాధ్యంగాక 13 వేల ఎకరాల్లో నీరందలేదు. గతేడాది ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి 7 వేల ఎకరాలకు నీరివ్వగా వచ్చే నెలాఖరుకు మొత్తం పనులు పూర్తి చేయనున్నారు. గొల్లవాగు పరిధిలోనూ 9,500 ఎకరాలు లక్ష్యంగా ఉండగా రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు 2 వేల ఎకరాలకే నీరందింది. ప్రస్తుతం 6 వేల ఎకరాలకు నీరందనుండగా జూలైకల్లా పూర్తి ఆయకట్టుకు నీరిందించాలని హరీశ్రావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రాజెక్టుల కింద కలిపి మొత్తంగా 7.13 లక్షల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టులో 3.49 లక్షల ఎకరాలకు ఈ ఖరీఫ్ నుంచే సాగునీరందనుందని ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టుల సీఈ భగవంత్రావు తెలిపారు.