పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
Published Thu, Aug 18 2016 12:56 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఓ కుటుంబం గురువారం ఉదయం జిల్లాలోని దేవరపల్లి మండలంలో మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చింది. కొవ్వూరు నుంచి ఆటోలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్త మృతి చెందగా మరో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రి మృతిచెందారని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement