KOVVURU
-
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావది: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణ బాబు మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు తెల్లవారుజామున కృష్ణబాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా 1953లో పాలకొల్లులో జన్మించిన కృష్ణబాబు.. కొవ్వూరు నియోజకవర్గంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు(1983,1985, 1989, 1994) నాలుగుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో ఓటమి చెందిన ఆయన తిరిగి 2004లో అయిదవసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణబాబు దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా కృష్ణబాబు పేరొందారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ప్రస్తుతం స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. -
15 కోట్లు కొవ్వూరు సీట్...టీడీపీ సంచలన ఆడియో..
-
కొవ్వూరు పచ్చపార్టీలో వర్గపోరు
గోదావరి ఒడ్డున ఉన్న కొవ్వూరు టీడీపీలో వర్గపోరు తీవ్రమవుతోంది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఘర్షణ పడుతుంటే చంద్రబాబు వినోదం చూస్తున్నారు. సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రిని అక్కడి క్యాడర్ అడ్డుకుంటోంది. మరో నేతను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్న మాజీ మంత్రి వ్యతిరేకులు. రెండు వర్గాల మధ్య కుంపటి వెలిగించి చలి కాచుకుంటున్న చంద్రబాబు. అసలు కొవ్వూరు పచ్చ పార్టీలో ఏం జరుగుతోంది? తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ పై అసమ్మతి తీవ్రమవుతోంది. చంద్రబాబే రగిల్చిన కుంపట్లు చల్లార్చడానికి ఆయనే నియమించిన ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ.. నియోజకవర్గంలో పార్టీని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ఈ రెండు వర్గాలు నియోజకవర్గంలోని వారి సానుభూతిపరులతో రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్ కు కొవ్వూరు స్థానం కేటాయిస్తే అందరం కలిసి చిత్తుగా ఓడిస్తామని టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశాయి రెండు వర్గాలు. జవహర్ వద్దు - టీడీపీ ముద్దు అంటూ జవహర్ వ్యతిరేకులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో కొవ్వూరు తెలుగుదేశంలో సీటు వ్యవహారం హీటెక్కింది. టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జవహర్ కొవ్వూరులో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నా ఆయన పెత్తనం మాత్రం సాగడం లేదు. కొవ్వూరు వ్యవహారాల్లో తలదూర్చవద్దని గతంలో అధిష్టానం కూడా ఆయన్ను హెచ్చరించింది. కొవ్వూరులోనే నివాసం ఉంటున్న జవహర్ ను ద్విసభ్య కమిటీ నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెట్టనివ్వడంలేదు. ప్రస్తుతం సుబ్బరాయ చౌదరి, కంఠమని రామకృష్ణ ఆధ్వర్యంలోని ద్విసభ్య కమిటీ సారధ్యంలోనే కొవ్వూరు టీడీపీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ పరిణామంపై జవహర్ వర్గం ఎప్పడినుంచో గుర్రుగా ఉంది. కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు జవహర్ వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి అభ్యర్థిత్వాన్ని అంగీకరించారన్న ప్రచారం సాగుతుండగా..ఆయన రంగంలోకి దిగి నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గతంలో మాజీ మంత్రి జవహర్తో సన్నిహితంగానే ఉన్నారు. ఆ తర్వాత వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాల కారణంగా చౌదరి సైతం జవహర్కు దూరమయ్యారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబును వ్యతిరేకించడంతో ఆయన కూడా ఇప్పుడు వ్యతిరేకం అయ్యారు. తమ పంతం నెగ్గించుకోవడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్పై విమర్శలు గుప్పించారు. 2014 నుంచి సీనియర్ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికి ఇస్తారన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇదే జరిగితే జవహర్ను వ్యతిరేకిస్తున్న వర్గాలు టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్ను కాదంటే ఆయన వర్గం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్ని పచ్చ పార్టీ అధినేత ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి. -
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. -
చలించిపోయిన సీఎం జగన్.. విద్యార్థిని దివ్య కుటుంబానికి ఇంటి స్థలం
తాళ్లపూడి: ఇటీవల కొవ్వూరులో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తనకు విద్యా దీవెన పథకం ఎలా మేలు చేసిందో చెబుతూ అందరినీ ఆకట్టుకున్న పెద్దేవం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తిరిగిపల్లి దివ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. దివ్య కుటుంబం కష్టాలు విని సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత నుంచి విద్యార్థిని దివ్యకు శుక్రవారం పిలుపు వచ్చింది. ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ, గ్రామ సర్పంచ్ తిరిగిపల్లి వెంకటరావు విద్యార్థిని దివ్యను వెంట పెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. విద్యార్థి దివ్య కుటుంబానికి ఇంటి స్థలం తక్షణమే కేటాయించినట్టు కలెక్టర్ తెలిపారు. అతి త్వరలో మంత్రి చేతుల మీదుగా అందజేస్తామన్నారు. అలాగే ఉన్నత చదువుకు, ఆ తర్వాత మంచి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దివ్య హోంమంత్రి తానేటి వనితను కూడా కలిసింది. -
సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు పర్యటన ఫొటోలు
-
రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దశ దిశ చూపిస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటనలో ఉన్నారు. కాగా, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదగాలి. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యం. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలి. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్వార్ జరుగుతోంది’ అని అన్నారు. -
Live: కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన
-
కొవ్వూరులో విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
-
సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలు
కొవ్వూరు: మానవుని జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు భగవద్గీత పరిష్కారం చూపుతుందని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్భగవద్గీత దశ సహస్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ మార్గశిర ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం వల్ల విశేష ఫలితాలు ప్రాప్తిస్తాయన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. తమిళనాడుకు చెందిన మహిళా బృందం సౌందర్యలహరి పారాయణ చేశారు. సాయంత్రం ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు, సంగీత విభావరీ, హరికథ నిర్వహించారు. -
Mega Job Fair: కొవ్వూరులో 9న మెగా జాబ్మేళా
కొవ్వూరు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం దీనికి సంబంధించిన పోస్టరును ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా వనిత మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. 15 ప్రముఖ కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. 1,367 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎస్సీ కెమీస్ట్రీ, బీకామ్, పదో తరగతి, ఎంఫార్మసీ,బీ ఫార్మసీ, డీఫార్మసీ, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న 19 నుంచి 30ఏళ్ల లోపు యువతీ యువకులంతా జాబ్ మేళాను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆయా కంపెనీలు వేతనం చెల్లిస్తాయన్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ముందుగాపూర్తి వివరాలతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్ధులు తమ ఆధార్, పాన్, ఇతర సర్టిఫికెట్స్ను వెంట తెచ్చుకోవాలన్నారు. వివరాల కోసం 6303889174, 96664 72877, 90596 41596 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యావృద్ధికారి శీలం ప్రశాంత్, జేడీ ఎం. సుమలత, ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) జగనన్న పాలనలో బీసీలకు ప్రాధాన్యం చాగల్లు: బీసీల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లు మండలం ఊనగట్లలో నియోజకవర్గ బీసీ నాయకులతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభకు అధిక సంఖ్యలో తరలి రావాలని మంత్రి పిలుపు నిచ్చారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు సంసాని రమేష్, పొన్నాడ సింహాద్రి, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు వైఎస్సార్సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకా రాజు, ఎం.పోసిబాబు, కట్టా బ్రాహ్మజీ, వైఎస్సార్సీపీ బీసీ నాయకులు అక్షయపాత్ర రవింద్ర శ్రీనివాస్, మట్టా వెంకట్రావు, పిల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: నేనూ బీసీ ఇంటి కోడలినే.. మంత్రి రోజా) -
కొవ్వూరు టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విబేధాలు
-
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు
-
కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బాహాబాహీ
సాక్షి, కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగారు. కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్కు సంబంధం ఏంటని వ్యతిరేక వర్గం నిరసనకు దిగింది. ద్విసభ్య కమిటీ ముందే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. చదవండి: (మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది: మంత్రి కారుమూరి) -
రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే..
కొవ్వూరు(తూర్పుగోదావరి): రాష్ట్రపతి కోటాలో ప్రముఖ సినీ కథా రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపిక కావడంపై ఆయన స్వస్థలం కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు బుధవారం ఎంపిక చేసిన నలుగురు దక్షిణాది ప్రముఖుల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్ స్వయానా పెదనాన్న కొడుకు. చదవండి: దక్షిణాదికి అగ్రపీఠం.. తన కంటే పదిహేను రోజులు చిన్నవాడంటూ శివరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన పెదనాన్న కోడూరి అప్పారావుకు ఆరుగురు కుమారులు. వీరిలో ఆరో సంతానం విజయేంద్ర ప్రసాద్. ఈయన హైస్కూలు విద్యాభాస్యం వరకూ కొవ్వూరులోనే సాగింది. అనంతరం ఏలూరులో చదివారు. 1975–76 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు కర్ణాటక, కొవ్వూరులో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు. అప్పటికే సినీరంగంలో స్ధిరపడిన సోదరుడు శివదత్త ప్రోత్సాహంతో ఆ వైపు వెళ్లినట్లు విజయేంద్ర సన్నిహితులు చెబుతున్నారు. మద్రాసు సినీరంగంలో అడుగుపెట్టి వెండితెరకెక్కిన పెద్ద చిత్రాలకు రచయితగా కొనసాగారు. బాహుబలి..ఆర్ఆర్ఆర్ ఆయన కలం నుంచి రూపం దిద్దుకున్నవే. విజయేంద్ర కుమారుడు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి విద్యాభాసం కుడా కొవ్వూరులోని దీప్తీ పాఠశాలలోనే సాగింది. విజయేంద్ర ప్రసాద్ సినీరంగంపై వేసిన ప్రభావవంతమైన ముద్రకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబీకులు న్యాయవాది కోడూరి నరసింహారావు అన్నారు. తన తాతయ్య విజయేంద్ర ప్రసాద్ తండ్రి, శివరామకృష్ణ తండ్రి అన్నదమ్ములని నరసింహారావు చెప్పారు. -
కవల కానిస్టేబుళ్లు.. రోజూ చూస్తున్నా సరే.. కనుక్కోవడం కష్టమే సుమా!
వారిద్దరూ కవలలు. పైగా ఒకే చోట పోలీసులుగా ఉద్యోగాలు. దీంతో రోజూ చూస్తున్నా సరే.. స్టేషన్కు వచ్చే ప్రజలతో పాటు అధికారులు కూడా ఒకింత కన్ఫ్యూజన్ అవ్వాల్సిందే. యూనిఫాం వేశారంటే ఎవరు.. ఎవరో గుర్తుపట్టడం అంత ఈజీ కాదు మరి. ఇద్దరూ ఒకేసారి జననం, కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, పెళ్లిళ్లూ ఒకేసారి కావడం.. ఇలా వీరి జీవితం అద్భుతాలమయంగా సాగుతోంది. కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసు స్టేషన్లో ఈ ఇద్దరు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఒకరి పేరు యు.లక్ష్మణకుశ, మరొకరి పేరు యు.రాములవ. వీరి స్వస్థలం తాళ్లపూడి. ఊబా సన్యాసిరావు, సావిత్రి దంపతులకు ఆరుగురు మగపిల్లలు సంతానం. వీరు మూడు, నాలుగో సంతానంగా జన్మించారు. వీరి కంటే మరో ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ పుట్టి చనిపోయారు. తర్వాత నాలుగో కాన్పులో వీరు జన్మించారు. దీంతో రామ్, లక్ష్మణ్ల పేర్లు కలిసేలా వీరికి పేర్లు పెట్టారు. మరో విశేషం ఏమిటంటే ఈ అన్నదమ్ములు ఒకేరోజు పోలీసు, రైల్వే కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఇద్దరూ పోలీసు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, వీరిద్దరి పెళ్లిళ్లు సైతం ఒకే రోజు కావడం విశేషం. -
హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత
ఉమ్మడి ఆంధ్రపదేశ్లో తొలిసారి మహిళకు హోం మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్దైతే, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. వరుసగా ఇద్దరు దళిత మహిళలకు కీలకమైన ఈ బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ఈ మాటలన్నారు. మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఊహించలేదన్నారు. రెండోసారి హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన వనిత బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే.. –కొవ్వూరు ప్రశ్న: పోలీసులపై పని ఒత్తిడి అధికంగా ఉంది. వారాంతపు సెలవులు కొన్నిచోట్ల సక్రమంగా అమలు కావడం లేదన్న వాదనలు ఉన్నాయి? మంత్రి: క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇబ్బందులను తెలుసుకుంటాను. పోలీసులకు కచ్చితంగా వారాంతపు సెలవులు అన్నిచోట్లా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతో అవసరం. ఏ సమస్యపైనైనా ప్రజలు నిర్భయంగా స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే ప్రజలకు, పోలీసులకు మధ్య çసుహృద్భావ వాతావరణం ఉండాలి. దీనివల్ల ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. మహిళలు, యువతులపై అకృత్యాల నివారణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. దిశ సహాయ కేంద్రం పేరుతో మహిళా కానిస్టేబుల్ను నియమించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రతి జిల్లాకి ఒక దిశ పోలీసు స్టేషన్తో పాటు ప్రత్యేకంగా దిశ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. దిశ యాప్ ద్వారా పోలీసుల నుంచి ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకున్నాం. మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ ఎలా ఉంది? మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించడం ద్వారా సామాజిక విప్లవానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చారిత్రక నిర్ణయం. భవిష్యత్తు తరాల రాజకీయాలకు సీఎం ఓ దిక్సూచిగా నిలిచారు. హైవే పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసుల పని తీరుపై విమర్శలున్నాయి. దీనిపై మీ స్పందన.? హైవేల్లో ప్రమాదాలు సంభవించిన సమయంలో తక్షణ సాయం అందించేందుకు నిర్దేశించిన హైవే పెట్రోలింగ్ వాహనాల పనితీరు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటాం. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా చూస్తాం. పోలీసుల్లో అవినీతి నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అందుకు ప్రజల వైఖరిలోను మార్పు రావాల్సిన అవసరం ఉంది. డబ్బులిస్తేనే తొందరగా పని అవుతుందన్న భావన నుంచి ప్రజలు బయటికి వస్తేనే అవినీతి కట్టడి అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారు.? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. శాంతిభద్రతలకు విఘాతం కలించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఇటీవల తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో ర్యాగింగ్ అంశం తెరపైకి వచ్చింది. కళాశాలల్లో ర్యాగింగ్ నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? ర్యాగింగ్కి పాల్పడితే కలిగే అనర్థాలు, శిక్షల గురించి విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తాం. విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రతీ కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ కమిటీల పనితీరును మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటాం. -
కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన మంత్రి తానేటి వనిత
-
విజయవంతమైన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం
సాక్షి, ఏలూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యింది. ఉదయాన్నే రేషన్ పంపిణీ వాహనాల్లో బియ్యాన్ని నింపుకున్న వాలంటీర్లు, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు లబ్ధిదారులు రేషన్ షాప్కి వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. దీని కోసం వారు ఒక రోజు పనిని కూడా కోల్పోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వమే ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో రేషన్ తీసుకోవడం చాలా సులభతరమైందని లబ్ధిదారులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కేటాయించిన సమయానికి రేషన్ నేరుగా ఇంటికే రావడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. లబ్ధిదారుల కళ్లెదుటే బియ్యాన్ని కాటా వేసి, ప్రత్యేక సంచుల్లో వారికి అందిస్తున్నారు. నాణ్యమైన బియ్యం ఇంటికే రావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువతులను క్వారీ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీని లారీ ఢీకొని వారిపై నుండి వెళ్లిపోవడంతో యువతుల శరీరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతులు కొవ్వూరు 23వ వార్డుకు చెందిన ఈర్ని భార్గవి, తనూషగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి. తల్లి వరికూటి స్థాయి, పెద్ద కుమార్తె లాస్య లను కాపాడగా చిన్న కుమార్తె దర్శిని మాత్రం గోదావరిలో మునిగి గల్లంతయింది. భావిస్తున్నారు. తల్లి కుమార్తెలు ఇద్దరు ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా చిన్న కుమార్తె మృతదేహం కోసం పోలీసులు గోదావరిలో గాలిస్తున్నారు. 5 నెలల క్రితం వరికూటి సాయి భర్త ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందగా అత్త, మరిది కుటుంబ కలహాల నేపథ్యంలో వేధించడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: యువతి అదృశ్యం: రెండేళ్ల తర్వాత.. -
'తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు'
సాక్షి, పశ్చిమగోదావరి : అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకుంటే చర్యలు తప్పవని మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. కొన్ని శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో ఎంత సఖ్యతగా మెలుగుతారో వారు కూడా ప్రజలతో అంతే స్నేహపూర్వంగా మెలగాలని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. (ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అవంతి) -
మాజీ మంత్రికి బాధ్యతలు; కార్యకర్తల నిరసన
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్కు టీడీపీ అధిష్టానం రాజమండ్రి పార్లమెంటరీ ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడంపై కొవ్వూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా కొవ్వూరు పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జవహర్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని లేదంటే కొవ్వూరు నియోజకవర్గానికి ఇంచార్జ్ వేరే ఒకరిని నియమించాలని తీర్మానించారు. (టీడీపీ కుట్ర.. ఆధారాలు బట్టబయలు) కొవ్వూరు నియోజకవర్గంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందని ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, 2014లో కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాక పార్టీలో వర్గ విభేదాలు సృష్టించి కార్యకర్తలపై కేసులు పెట్టించి పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యారని నాయకులు వాపోయారు. అందువల్ల కొవ్వూరు నియోజకవర్గానికి వేరొకరిని నియమించి పార్టీని ఆదుకోవాలని ఆయన కోరారు. (‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’) -
కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్తో దాడి
-
కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్తో దాడి
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం చేసుకుంది. మద్యం మత్తులో కన్న పిల్లలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడో తండ్రి. కుమార్తెల ముందే అశ్లీల దృశ్యాలు చూస్తూ భార్యను, కూతుర్లను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిలదీసిన భార్యపై డంబెల్తో దాడికి పాల్పడ్డాడు. భార్య మాధవి పోలీసులకు చేసిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న భర్త దంగేటి శ్రీను గతకొంత కాలం నుంచి మద్యానికి బానిస అయ్యాడు. పుటుగా తాగి వచ్చి కుమార్తెల ముందే నీలి చిత్రాలు చూసేవాడు. భర్త తీరు నచ్చని భార్య మాధవి ఈ విషయంపై అనేకమార్లు భార్తతో వాగ్వాదానికి దిగింది. రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. ఈ క్రమంలోనే భార్యపై కోపంతో ఇంట్లో ఉన్న డంబెల్ తీసుకుని తలపై బలంగా కొట్టాడు. అమ్మను కొట్టవద్దూ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని పిల్లలు బతిలాడినా ఏమాత్రం పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను కుమార్తెలు ఫోన్లో రికార్డు చేయడంతో అవికాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భర్త దాడి ఘటనలో తీవ్ర గాయాల పాలైన మాధవిని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. అనంతరం తన భర్త నుంచి కుమార్తెలకు, తనకు ప్రాణహాని ఉందని స్థానిక ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే గతంలోనూ భార్యా, పిల్లలు చిత్ర హింసలకు గురిచేస్తే పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు అయితే డ్రైవర్ఉద్యోగం పోతుందనే భయంతో ఫిర్యాదును ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి వేదింపులు మరింత ఎక్కువయ్యాని బాధితురాలు తెలిపింది. -
'మా నాన్నని విడిచి ఉండలేకపోతున్నాం'
సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి) : అమ్మాయికి టీసీఎస్లో మంచి ఉద్యోగం. నెలకు రూ.లక్ష జీతం. కొడుకు ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇంకేముంది కూతురి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు రీ మోడలింగ్ కూడా చేయించారు. అంతలోనే వారి ఆశలు అడియాసలయ్యాయి. కరోనా మహమ్మారి రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబాన్ని మింగేసింది. పశివేదల గ్రామానికి చెందిన పరిమి వెంకట నరసింహరావు (నరసయ్య) ఈనెల 16న కోవిడ్కు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజులుగా మనస్తాపానికి గురయ్యారు. భార్య సునీత(41), కుమారుడు ఫణికుమార్(25), కుమార్తె లక్ష్మి అపర్ణ(23) మంగళ వారం రాత్రి 11 గంటల సమయంలో గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. ఇంటి నుంచి ముగ్గురూ కారులో బయలుదేరి రోడ్డు కం రైలు వంతెనపైకి చేరుకుని నదిలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు స్వాధీనం చేసుకున్నారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు, బంధువులు నది వెంబడి గాలిస్తున్నారు. అసలేం జరిగిందో..! ఈనెల 7న నరసయ్యకు జ్వరం వచ్చింది. స్థానిక ఆర్ఎంపీతో వైద్యం చేయించుకున్నారు. తొలుత సీజనల్ ఫీవర్గా భావించారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఈనెల 14న సీటీ స్కాన్ చేయించారు. కరోనా సోకినట్లు గుర్తించారు. రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అప్పటికే పరిస్థితి విష మించి నరసయ్య ప్రాణాలొదిలారు. దీంతో బంధువులెవరూ అంత్యక్రియలకు రాలేదు. అప్పటి నుంచి భార్య సునీత, ఇద్దరు పిల్లలు మనోవేదనకు గురయ్యారు. ఫణికుమార్ కర్ణాటకలో మైనింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మీఅపర్ణ టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ విద్యావంతులే. జీవితంలో స్థిరపడిన వారే. అయినా ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికులను కలచివేస్తోంది. నరసయ్య భార్య సునీత పుట్టినిల్లు కొవ్వూరు. దుర్ఘటనతో కొవ్వూరు, పశివేదలల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి సుమారు పదెకరాల పొలం, కొవ్వూరులో విలువైన స్థలాలు ఉన్నట్లు చెబుతున్నారు. నరసయ్య మృతి తర్వాత కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. ఒకవేళ వీరికి కరోనా లక్షణాలు కనిపించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్డీఓ డి.లక్ష్మారెడ్డి పశివేదల వెళ్లి ఘటనపై ఆరా తీశారు. మృతుడు నరసయ్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేవీ రమణ కేసు నమోదు చేశారు. ఇంటిలో లేఖ : నరసయ్య ఇంట్లోని లక్ష్మి అపర్ణ డైరీలో ఓ లేఖ పోలీసులకు లభ్యమైంది. ఆ లేఖలో ‘మా అందరి కోరిక నిహారిక ఓణీల ఫంక్షన్ బాగా చేయాలి. దొరబాబు మావయ్య మమ్మల్ని క్షమించు. తాతయ్య, అమ్మమ్మల ఆరోగ్యం జాగ్రత్త. మా నాన్నని విడిచి మేం ఉండలేకపోతున్నాం.’ అంటూ లక్ష్మి అపర్ణ రాసినట్టు ఉన్న లేఖ లభ్యమైంది. -
ఇంటి పెద్ద మరణం తట్టుకోలేక..
-
ఆ కుటుంబం ఏకంగా ప్రాణాలే తీసేసుకుంది..
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇంటిపెద్ద కరోనాతో చనిపోవడంతో కుటుంబసభ్యుల్ని కలిచి వేసింది. ఇక తమకు దిక్కెవరు అంటూ మనస్తాపంతో గోదావరిలో దూకేశారు. ఎవరైనా చనిపోతే బంధువులు, సన్నిహితులు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెబుతారు. మేమున్నామంటూ మాటలతోపైనా మానసిన స్థైర్యాన్ని ఇస్తారు. కానీ కరోనా వచ్చి ఆ మానవత్వాన్ని మటుమాయం చేసింది. సొంత వారు చనిపోయినా తిరిగి మళ్లి చూడకుండా చేసింది. ఆ మహమ్మారి వైరస్ తమకెక్కడ అంటుకుంటుందో అని బంధువులు కూడా దూరం జరుగుతున్నారు. కరోనాతో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కూడా వెనకాడుతున్నారు. పలకరించే దిక్కు లేక బాధిత కుటుంబాలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి బాధను తట్టుకోలేకపోయిన ఆ కుటుంబం ఏకంగా ప్రాణాలే తీసేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన విషాద సంఘటన అందరినీ కలిచివేస్తోంది. కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది. కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన నరసయ్య ఈనెల 16న కరోనాతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు భార్య, పిల్లలు. ఇంత బాధలో ఉన్న వారిని పలకరించేందుకు... బంధువులు, సన్నిహితులు కూడా రాలేదు. కరోనా భయంతో వారి ఇంటి గడప కూడా తొక్కలేదు. దీంతో తమను అంటరాని వారిగా చూస్తున్నారన్న భావన వారిలో పెరిగింది. ఆ బాధతోనే నరసయ్య భార్య సునీత, అమె కుమారుడు ఫణికుమార్ (25), కుమార్తె అపర్ణ (23) గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నరసయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని స్థానికులు చెప్తున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం వల్లే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు. రైల్వే బ్రిడ్జి పైనుంచి ఈ ముగ్గురూ గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. గోదావరిలో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరిలో దూకి ఇద్దరు యువకులు గల్లంతు
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో ఒకరు, రుణభారంతో మరొకరు గోదావరిలో దూకి గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా చీకటి పడటంతో నిలిపివేశారు. కొవ్వూరు రూరల్: కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెనపై నుంచి ఆదివారం ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కొవ్వూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన ఉక్కుజూరి రాజేశ్వరరావు(30) వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకాడు. రాజేశ్వరరావు హైదరాబాద్లో కెమెరా అసిస్టెంటుగా పనిచేస్తుంటారు. కాలికి దెబ్బ తగలడంతో విశ్రాంతి కోసం ఇరవై రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన నందమూరు వచ్చాడు. ఆదివారం తన స్కూటీ వేసుకుని బ్రిడ్జిపైకి వెళ్లి బండిని వదిలి గోదావరిలో దూకాడు. అతని కోసం పట్టణ ఎస్సై కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నదిలో సాయంత్రం వరకు గాలించారు. చీకటి పడటం, వర్షం కురవడం కారణంగా గాలింపు నిలిపివేశామని సోమవారం మళ్లీ గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. చించినాడ వద్ద వేడంగి యువకుడు... యలమంచిలి: పోడూరు మండలం వేడంగి గ్రామానికి చెందిన శిరిగినీడి ఆంజనేయులు ఆలియాస్ అంజి (25) చించినాడ వద్ద వంతెనపై నుంచి ఆదివారం వశిష్ట గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. ఆ సమయంలో అటువైపుగా వస్తున్న వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ కొప్పిశెట్టి గంగాధరరావు ఆధ్వర్యంలో పోలీసులు, జాలర్లు యువకుని కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. వంతెనపై యువకుడు వేసుకువచ్చిన ఏపీ07ఎం 1575 బైక్, జోళ్లు, సెల్ అక్కడే ఉన్నాయి. పోలీసులు ఆ సెల్ నుంచి ఫోన్ చేసి యువకుని వివరాలు తెలుసుకున్నారు. ఆ యువకునికి వేడంగి సెంటర్లో పాదరక్షల దుకాణం ఉందని, ఆర్థికంగా దెబ్బతిని రుణగ్రస్తుడు కావడం వలన గోదావరిలోనికి దూకి ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. గల్లంతైన యువకుని ఆచూకీ రాత్రి వరకు లభించకపోవడం, మరో వైపు వర్షం కురుస్తున్నందున గాలింపు ఆపివేశారు. సోమవారం ఉదయం గాలింపు ప్రారంభిస్తామని ఎస్ఐ తెలిపారు. -
భౌతిక దూరంతోనే కరోనా నివారణ : తానేటి వనిత
సాక్షి, కొవ్వూరు : రాజకీయాలకు అతీతంగా అందరూ కరోనా వ్యాధి నియంత్రణకు సహకరించాలని మంత్రి తానేటి వనిత కోరారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిత్యావసర వస్తువులు దుకాణాలతో పాటు మెడికల్ షాపులను సందర్శించిన మంత్రి పలు సూచనలు చేశారు. షాపుల దగ్గర ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలని యజమానులకు సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని కోరారు. కేవలం భౌతిక దూరంతోనే కరోనాను కట్టడి చేయగలమన్నారు. -
హత్య చేసి.. గోనె సంచిలో పెట్టి
సాక్షి, కోవూరు(నెల్లూరు): మండలంలోని పడుగుపాడు జాతీయ రహదారి సమీపంలో ఉన్న జిమ్మిపాళెం రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి పడవేశారు. దీంతో కోవూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు.. జమ్మిపాళెం రోడ్డుపక్కనే ఉన్న పంటకాలువలో గోనెసంచి అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంచిని బయటకు తీయించగా అందులో మహిళ మృతదేహం ఉంది. మహిళ నైటీ ధరించి తీవ్రగాయాలతో ఉంది. హత్య చేసి సంచిలో ఉంచి బూట్ల లేస్లతో కట్టి కాలువలో పడవేశారు. మహిళ హత్యకు గురైందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె వయస్సు 30 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పోలీస్ జాగిలాలు పరిసర ప్రాంతాల్లో తిరిగాయి. హత్య జరిగి మూడురోజులై ఉంటుందని, మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని పోలీసులు తెలిపారు. స్థానికులను విచారించారు. వారినుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో బయటి ప్రాంతంలో హత్య చేసి వాహనంలో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
‘మహిళల రక్షణకు సీఎం పెద్దపీట వేశారు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళ పక్షపాతి అని మరోసారి నిరుపించుకున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం కొవ్వూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల రక్షణకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. యానిమేటర్లు, సంఘమిత్ర ఉద్యోగుల జీతాలు పదివేలకు పెంచారని, మహిళల, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని మంత్రి పేర్కొన్నారు. అలాగే పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని తెలిపారు. మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తూ, గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించి మహిళల జీవితాల్లో ఆనందం నింపారని అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూతను అందిస్తున్నారని తానేటి వనిత తెలిపారు. (చదవండి: వీవోఏ, ఆర్పీల గౌరవ వేతనం 10,000) -
‘మీ ఆదరాభిమానాలతోనే మంత్రినయ్యా’
సాక్షి, పశ్చిమగోదావరి(కొవ్వూరు రూరల్) : పదవులు, రాజకీయాలు శాశ్వతం కాదని, మనుషుల మధ్య బంధాలు నిలిచి ఉంటాయని నమ్మే వ్యక్తిలో తాను ఒకరినని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం మండలంలోని పశివేదలలో నిర్వహించిన కొవ్వూరు నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ (కృపా) సమావేశానికి మంత్రి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి దైవసేవకుల ప్రార్థనలే కారణమన్నారు. అందరి అధరాభిమానాలతోనే 2009 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో పనిచేయడం కత్తి మీద సాములాంటిదైనా, తనతో పాటు చాలా మంది నాయకులు కష్టనష్టాలకు ఓర్చి వెంట నడిచారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనపై రకరకాల నిందలు వేశారని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత సొంత పార్టీలోనే ఉంటూ అవే నిందలను కొనసాగిస్తున్నారని, వారి మనసు మారేలా అం దరూ ప్రార్థనలు చేయాలని కోరారు. మహిళగా తాను కుటుంబం, బంధువులను సైతం పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు. క్రైస్ట్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరంలో జరిగిన రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ ప్ర తాప్ సిన్హా, చీప్ అడ్వయిజర్ బిషప్ సుభాకర్ శాస్త్రి, జిల్లా అధ్యక్షుడు జోషప్ కొమ్మనాపల్లి, ట్రెజరర్ రెవ జ్యోతి ఆనంద్ ప్రసంగించారు. కృపా అధ్యక్షుడు రెవ. కె.జోషప్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి తానేటి వనిత చేతులమీదుగా ఐడీ కార్డులను అందజేశారు. మంత్రి తానేటి వనితను కృపా కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. కృపా గౌరవ అధ్యక్షుడు వై.ప్రభాకర్, కార్యదర్శి ఎంవీ సత్యన్నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మోజేస్, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్ నాయకులు కోడూరి శివరామకృష్ణ, బొబ్బా సుబ్బారావు, ముళ్లపూడి కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక
సాక్షి, పశ్చిమగోదావరి : గోదావరిలో వరద ఉగ్రరూపు దాల్చింది. ఐదు రోజుల నుంచి ఏజెన్సీలో 19 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొవ్వూరులో గోష్పాద క్షేత్రాన్ని గోదావరి వరద ముంచెత్తింది. క్షేత్రంలో రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవహిస్తోంది. వందలాది ఎకరాల్లో లంకభూముల్లో పంటలు నీటమునిగాయి. యలమంచిలి మండలం కనగాయలంక కాజ్వేపై నుంచి నాలుగు అడుగుల మేరకు వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అక్కడ పడవలు ఏర్పాటు చేసి జనాన్ని ఒడ్డుకు చేర్చుతున్నారు. పెరవలి మండలంలో కానూరు, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు, మల్లేశ్వరం, ఖండవల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు వరదనీట మునిగాయి. కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం, నిడదవోలు, పెనుగొండ మండలాల్లోను లంకభూములు ముంపుబారిన పడ్డాయి. ఏజన్సీలో పోలవరం, వేలేరుపాడు మండలాల పరిధిలో 39 గ్రామాలకు ఐదు రోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. ఆదివారం ఉదయం 7.30 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతంలో వరద నెమ్మదిస్తుండడంతో ఉదయం పది గంటల నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతి 14.10 నుంచి నిలకడగా కొనసాగింది. ఒంటిగంటకి 14.20 అడుగులకు పెరిగింది. ఆనకట్టకి ఉన్న 175 గేట్లను పూర్తిగా ఆల్ క్లియర్లో ఉంచారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆనకట్ట నుంచి 13,50,363 క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉపనదుల నుంచి భారీగా వరద నీరొచ్చి చేరుతుండడంతో గోదావరిలో వరద ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు స్ధిరంగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద 28.1 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. గోదావరికి ఎగువ ప్రాంతంలో భద్రాచలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ కాళేశ్వరం, దుమ్ముగూడెం, పేరూరు తదితర ప్రాంతాల్లో నీటిమట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో వరద ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 7,800 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. తూర్పు డెల్టాకు 4వేలు, సెంట్రల్కి 1,800లు, పశ్చిమ డెల్టాకు 2వేల క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడిచి పెడుతున్నారు. ముంపులోనే పంటపొలాలు డెల్టాలో గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో ఇంకా 4,746 హెక్టార్ల పంట ముంపులోనే ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. 591 హెక్టార్లలో వరి నారుమళ్లు ముంపు బారిన పడితే దీనిలో 412 హెక్టార్ల నారుమళ్లు కుళ్లిపోయాయన్నారు. 7,550 మంది రైతులకు చెందిన 1,026 హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముంపులో ఉన్న పంటలు తేరుకుంటే నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అ«ధికారులు చెబుతున్నారు. పెరవలి మండలంలో సుమారు 2,200 ఎకరాల్లో పంట ముంపు బారిన పడింది. మిగిలిన తీర ప్రాంత మండలాల్లో సుమారు రెండు వందల ఎకరాల పంట నీటమునింది. ముంపు ప్రాంతాల్లో మంత్రి, ఎంపీ పర్యటన ఎంపీ రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సబ్ కలెక్టర్ సలీమ్ఖాన్లు నరసాపురం పార్లమెంట్ పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. లంక గ్రామాల్లో పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్దమల్లం లంక, అయోధ్యలంక, రవిలంక, మర్రిమూల, పుచ్చలలంక గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 39 గ్రామాలకు రాకపోకలు బంద్ గోదావరి వరద ముంచెత్తడంతో పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరద బాధితుల కోసం పోలవరం, వేలేరుపాడు గ్రామాల్లో రెండు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. 51 కుటుంబాలకు చెందిన 133 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ వరద పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ఇన్చార్జ్ మంత్రి సుభాష్ చంద్రబోస్లు ముంపు ప్రాంతంలో పర్యటించారు. ముంపు ప్రభావిత గ్రామాలకు ప్రజలకు అవసరమైన సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించి ముందుస్తు ఏర్పాట్లు చేశారు. ముంపు ప్రాంతంలో 4,088 కుటుంబాలకు అధికారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 1,022 క్వింటాళ్ల బియ్యం, బంగాళ దుంపలు, ఉల్లిపాయాలు, 4,088 లీటర్ల పామాయిల్, 8,716 లీటర్ల కిరోసిన్, 4,188 కేజీల కందిపప్పు అందజేశారు. 56 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతంలో 53 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 1,156 మందికి వైద్య సేవలు అందజేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 13 డెంగీ, డయేరియా కేసులకు వైద్యం చేశామన్నారు. ముంపు గ్రామాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ మాత్రలతో పాటు అన్ని రకాలైన మందులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
పోయిన ఆ తుపాకీ దొరికింది!
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏఆర్ కానిస్టేబుల్ జోసఫ్ తంబి పోగొట్టుకున్న తుపాకీ లభ్యమైంది. కొవ్వూరు రైల్వే కీమ్యాన్ హరికిషన్ ఈ తుపాకీని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే బ్రిడ్జి మీద దాచినట్లు నిర్ధారించిన పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకొని మరింత లోతుగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
లేడీస్ హాస్టల్కి వెళ్లి ఆ తర్వాత...
సాక్షి, పశ్చిమగోదావరి : పట్టణంలో మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించిన గోశాల ప్రసాద్ అనే యువకుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్సై కె.కేశవరావు తెలిపారు. యువతి తల్లి జూలై 29న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. నిందితుడిని కోర్టుకి హాజరుపరచనున్నట్టు పేర్కొన్నారు. ఇద్దరు యువకులపై కేసు.. ఏలూరు టౌన్: లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి కిటికీలోంచి వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులపై ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు కట్టా సుబ్బారావుతోటలోని ఎంఆర్సీ వీధిలోని మనస్వి లేడీస్ హాస్టల్ వద్దకు రోజూ రాత్రివేళల్లో ఇద్దరు యువకులు గోడలు దూకి వస్తున్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ గోడదూకి ప్రాంగణంలోకి వచ్చి కిటికీలోనుంచి వీడియోలు, ఫొటోలు తీస్తుండగా హాస్టల్ నిర్వాహకురాలు పెనుగొండ రేణుకా దేవి చూసి కేకలు వేశారు. ఒక యువకుడిని పట్టుకున్నారు. వారిద్దరూ ఏలూరు విద్యానగర్కు చెందిన ఏలూరి అనిల్ ఆశ, మరో యువకుడు చైతన్యగా గుర్తించారు. నిర్వహకురాలు ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ ఎంఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి ఆదేశాల మేరకు ఎస్ఐ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్పపీడనం.. అధిక వర్షం
సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షానికి పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలకు పలు చోట్ల నారుమళ్లు, వరినాట్లు నీట మునిగాయి. దీనికి శుక్రవారం కురిసిన వర్షం తోడు కావడంతో ముంపు తీవ్రత మరింత పెరిగింది. పలుచోట్ల చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. భీమవరం, ఉండి ప్రాంతాల్లో 6 స్తంభాలు నేలకూలాయి. యలమంచిలి మండలంలో చించినాడ కాలువకు గండిపడింది. దీంతో పలుచోట్ల నారుమళ్లు, వరినాట్లు నీటమునిగాయి. పాలకొల్లు మండలంలోను పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం యలమంచిలి, పాలకొల్లు. పోడూరు, తణుకు, పెనుమంట్ర, అత్తిలి, పెనుగొండ, పెరవలి, పాలకోడేరు, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు, వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకులాయి. జిల్లా వ్యాప్తంగా చెట్ల కొమ్మలు విరిగిపడడంతో 16 ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడం తదితర కారణాల వల్ల విద్యుత్ శాఖకు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లింది. నారుమళ్లు, నాట్లకు తీరని నష్టం భారీ వర్షాల వల్ల నారుమళ్లకు తీరని నష్టం కలిగింది. నాట్లు వేసిన వరిపొలాలూ దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం.. 4,818 హెక్టార్లలో వరినాట్లు, 430 హెక్టార్లలో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. రికార్డు స్థాయిలో వర్షం.. జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఏకంగా 32.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే గరిష్ట వర్షపాతం. గత రెండు నెలలుగా వర్షాలు లేవు. జూన్ నెలలో అయితే లోటు వర్షపాతం నమోదైంది. యలమంచిలి మండలంలో రికార్డుస్థాయిలో 97.6 మిల్లీమీటర్లు పోడూరులో 90.0, పాలకొల్లులో 78.4, తణుకులో 71.0,పెనుమంట్రలో 60.2, అత్తిలిలో 59.8, పెనుగొండలో 58.6, పెరవలిలో 59.4, పాలకోడేరులో 55.6, ఆచంటలో 50.5 మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. వీరవాసరంలో 46.8, నరసాపురంలో 45.4, భీమవరంలో 39.4, మొగల్తూరులో 38.6, నిడమర్రులో 38.2, గణపవరంలో 38.0, ఉండిలో 31.2, జంగారెడ్డిగూడెంలో 29.0, వేలేరుపాడులో 28.0. టి.నరసాపురం లో 27.4, కుక్కునూరులో 27.2, పెంటపాడులో 26.4, కాళ్లలో 25.2, చాగల్లులో 22.6, తాళ్లపూడిలో 22.2, ఆకివీడులో 21.8, పెదవేగిలో 20.6, చింతలపూడి, తాడేపల్లిగూడెం మండలాల్లో 20.0, ఉంగుటూరులో 19.4, నిడదవోలులో 18.2, కొవ్వూరులో 17.4, భీమడోలులో 17.2, కొయల్యగూడెం లో 16.2, దేవరపల్లిలో 15.8,లింగపాలెం, కామవరపుకోటంలో 14.6, గోపాలపురంలో 12.6, దెందులూరులో12.2, ద్వారకాతిరుమలలో 12.0, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెంలలో 11.6, పెదపాడు,ఏలూరు మండలాల్లో 9.8 మిల్లీమీటర్లు చొప్పున, నల్లజర్లలో 6.2, పోలవరంలో 4.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. -
మూడు తరాలు.. పూరి గుడిసెలోనే జీవనం
సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి): వారు నిరక్షరాస్యులు. చెమటోడ్చడం వారి నైజం. చేపల వేట, రైతుల పొలాల్లోని ఎలుకలు పట్టడం. తట్ట బుట్టలు అల్లుకోవడం వారి వృత్తి. మట్టి పనుల్లో అందెవేసిన చేతులు అవి. సుమారు 50 ఏళ్ల నుంచి మూడు తరాల వారికి అక్కడే స్థిర నివాసం. పూరి గుడిసె వారి ఆస్తి. ఇది పాలకొల్లు రూరల్ పంచాయతీ కొంతేరు రోడ్డు పక్కన నివాసం ఉంటున్న సగరుల(ఉప్పర్ల) పరిస్థితి. అయితే ఇటీవల వారిని రియల్ ఎస్టేట్ భూతం భయపెడుతోంది. వెంటనే వారితో ఆ ఇళ్లను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తోంది. రెక్కాడితేకానీ డొక్కాడని స్థితిలో ఉన్న వారిని అర్జంటుగా పూరిగుడిసెలు ఖాళీ చేయాలని బెదిరించటంతో ఉప్పర్లు తల్లడిల్లిపోతున్నారు. కొంతేరు రోడ్డులో ఆర్ అండ్ బీ పోరంబోకు స్థలం సుమారు 20 సెంట్లు ఉంది. ఈ భూమిలో 50ఏళ్ల నుంచి పూరిగుడిసెలు వేసుకుని సగరులు నివాసం ఉంటున్నారు. మొదట్లో 10 కుటుంబాలు ఉండేవి. వీరి పిల్లలు, మనవళ్లతో ప్రస్తుతం 35 కుటుంబాలకు చేరుకున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అల్లు హయాంలో 11మందికి పట్టాలు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ హయాంలో వీరికి 1986లో పట్టాలిచ్చారు. ఆ తరువాత మరికొంత మందికి పట్టాల కోసం ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. దీంతో అదే పూరిగుడిసెలో రెండు, మూడు కుటుంబాలు జీవనం సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. దక్కని ప్రభుత్వ ఫలాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరికి దక్కటంలేదు. పక్కా గృహం కానీ, మరుగుదొడ్డి గానీ వీరికి మంజూరు కాలేదు. పంచాయతీ నుయ్యి తవ్వింది. ఆ నూతి నూటినే వారు వాడకం నీరుగా ఉపయోగించుకుంటున్నారు. భయపెడుతున్న సరిహద్దు రైతులు సగరులకు చెందిన పూరి గుడిసెలకు చేర్చి ఉన్న రైతులు తమ భూముల్ని రియల్ ఎస్టేట్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వారు ఇళ్లు ఖాళీ చేయాలని సగరులను బలవంతం చేస్తున్నారని వాపోతున్నారు. మూడు తరాల నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, అర్జంటుగా ఖాళీ చేయాలని బెదిరిస్తుండటంతో ఎక్కడికి పోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ బాబ్జిని ఆశ్రయించిన బాధితులు ఇటీవల యాళ్లవానిగరువు విచ్చేసిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జి), మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనందప్రకాష్ల దృష్టికి ఈ సమస్య తీసుకురావడంతో వారు బాధితులకు అభయమిచ్చారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పట్టాల కోసం ప్రయత్నించాం తాతల కాలం నుంచి ఇక్కడే జీవిస్తున్నాం. పట్టాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. అయినా అధికారులు కనికరించలేదు. పూరి గుడిసెలు ఖాళీ చేయాలని వత్తిడి చేస్తున్నారు. – మిండ్యాల శాంతారావు, స్థానికుడు పూరి గుడిసెలోకి కాపురానికి వచ్చా నా వయసు 60 ఏళ్లు. నలభై ఏళ్ల క్రితం వివాహమైంది. పూరి గుడిసెలోకి కాపురానికి వచ్చా. ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలతో పూరి గుడిసెలో కాపురం ఉంటున్నా. పిల్లలందరికీ వివాహాలు చేశా. పూరి గుడిసెలే మాకు పక్కా ఇళ్లు. – మిండ్యాల జయమ్మ, వృద్ధురాలు పట్టాలు ఇవ్వాలి ఆర్ అండ్ బీ పోరంబోకు స్థలంలో పూరి గుడిసె నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాం. పట్టా ఇవ్వాలని అధికారులకు అర్జీ పెట్టుకున్నా. చాలీచాలని పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాం. అధికారులు స్పందించి పట్టా ఇవ్వాలి. – పామర్తి వీరమ్మ, స్థానికురాలు మౌలిక వసతులు లేవు మాకు కనీస మౌలిక వసతులు లేవు. ఆరుబయట బహిర్భూమికి వెళుతున్నాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మాకు మరుగుదొడ్లు మంజూరు చేయలేదు. మంచినీటి వసతి లేదు. ఇబ్బందులు పడుతున్నాం. – మిండ్యాల నరసమ్మ, స్థానికురాలు -
వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి): పట్టణంలో నివాసం ఉంటున్న కాగిత త్రినాథ్ అనే వ్యక్తి గడిచిన పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదని అతని భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.కేశవరావు తెలిపారు. విజ్జేశ్వరం జీటీపీఎస్ ప్లాంటు ఫైర్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్గా పనిచేస్తున్న త్రినాథ్ పదిహేను రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. త్రినాథ్ ఆచూకీ తెలిసిన వాళ్లు పట్టణ పోలీసు స్టేషన్ 08813–231100 నెంబర్కి ఫోన్ చేయాలని ఎస్సై కోరారు. చాగల్లు గ్రామంలో.. చాగల్లు: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. చాగల్లు గ్రామానికి చెందిన సుంకవల్లి గంగాధర్(43) మతి స్తిమితం లేని వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు ఇళ్ల వద్ద వెతికినా సమాచారం తెలియకపోవడంతో తల్లి సుంకవల్లి శకుంతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. వివాహిత అదృశ్యం చాగల్లు: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. కలవలపల్లి గ్రామానికి చెందిన బోల్లా కీర్తి అనే 23 సంవత్సరాల వివాహిత ఈ నెల 24వ తేదీన నిడదవోలులో ఆస్పత్రికి వెళ్తానని భర్త నాగసూర్యచంద్రంకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యంకాక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. -
ఆహాఏమిరుచి..అనరామైమరచి
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి) : వర్షాకాలం వచ్చింది.. దాని వెంటే మొక్కజొన్న పొత్తులు వచ్చాయి. ఒక పక్క వర్షం కురుస్తుంటే మరో పక్క వేడి వేడి జొన్నపొత్తులు తింటుంటే ఆ మజానే వేరంటారు మొక్కజొన్న పొత్తుల ప్రియులు. ఏటా జులై నుంచి సెప్టెంబర్ వరకూ దొరికే మొక్కజొన్న పొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో దొరికే మొక్కజొన్న పొత్తుల కన్నా దొమ్మేరు పొత్తుకు ఓ ప్రత్యేక రుచి ఉంటుంది. ఇక్కడ ఉండే నేల స్వభావంతో ఈ ప్రాంతంలో పండే మొక్కజొన్న పొత్తులు మంచి రుచిని కలిగి ఉంటాయి. స్థానికులకు ఉపాధి మొక్కజొన్నపొత్తుల సీజన్ పలువురికి ఉపాధిగా మారుతుంది. దొమ్మేరుతో పాటు దూర ప్రాంతాలకు సైతం పొత్తులు ఎగుమతి అవుతుండటంతో స్థానికులకు ఆదాయం సమకూరుతోంది. ఈ సీజన్లో ఇక్కడ రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తారు. ఒక్కో దుకాణంలో వెయ్యి పొత్తుల వరకూ కాల్చి అమ్మి ఆదాయం పొందుతారు. ఈ ప్రాంతంలో దొరికే పొత్తులను హోల్సేల్గా కొని, దుకాణాల్లో కాల్చి రిటైల్గా అమ్ముతుంటారు. ఒక్కో పొత్తు ప్రస్తుతం రూ. 10 నుంచి రూ. 15 వరకూ సైజును బట్టి అమ్మకాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అధికంగా ఉండడంతో ఈ ధర గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు ఎకరం మొక్కజొన్న చేను రూ.50 వేలు మొక్కజొన్న సీజన్ ప్రారంభం కావడంతో పొత్తులకు మంచి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎకరం మొక్కజొన్న తోటకు రూ.50 వేల వరకూ వ్యాపారులు చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా మంచి రేటని రైతులు చెబుతున్నారు. అయితే గత ఏడాది తయారవుతున్న మొక్కజొన్న పొత్తును పురుగు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి లేక కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం నష్టాలను చవిచూశారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ ఏడాది దొమ్మేరు, పరిసర గ్రామాల్లో అతి తక్కువ సాగు ఉండడం దీనికి కారణం అని చెబుతున్నారు. ఏది ఏమైనా కేవలం వర్షాకాలంలో దొరికే దొమ్మేరు ప్రాంతంలోని మొక్కజొన్న పొత్తును ఒక్కసారైనా రుచి చూడాలని ఈ ప్రాంతం మీదుగా వెళ్లే ప్రయాణికులు, ప్రజలు భావిస్తుంటారు. దొమ్మేరు మొక్కజొన్న పొత్తులకు భలే డిమాండ్ కొవ్వూరు మండలం దొమ్మేరులో మొక్కజొన్న పొత్తుల దుకాణాలు -
షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం!
సాక్షి, కోవూరు(నెల్లూరు) : కోవూరు చక్కెర కర్మాగారంతోపాటు రాష్ట్రంలో ఉన్న చిత్తూరు, రేణిగుంట, కడప ప్రాంతాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీల్ని పరిశీలించి నివేదికను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు చీఫ్ ఇంజినీర్ ప్రసాద్రావు, చీఫ్ కెమిస్ట్ రవికుమార్, ప్రధాన వ్యవసాయాధికారి కె.వి.రమణ, ఇన్చార్జి షుగర్స్ ఏడీ తిరుపాలురెడ్డి తెలిపారు. శుక్రవారం కోవూరు చక్కెర కర్మాగారంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఫ్యాక్టరీలో ఏయే పరికరాలు పనికివస్తాయి.. ఎంత నిధులు అవసరమో పరిశీలించామన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు ఏమాత్రం చేస్తున్నారు.. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే వారంతా కోవూరు షుగర్స్కు చెరకు సరఫరా చేస్తారా లేదా అనే అంశాలపై చర్చించారు. చక్కెర కర్మాగార కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 6 చక్కెర కర్మాగారాల పరిస్థితి తదితర అంశాలను 6వ తేదీ లోపు పరిశీలించి నివేదిక అందజేస్తామన్నారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితుల్ని అధ్యాయనం చేస్తున్నామన్నారు. అనంతరం పలువురు రైతు నాయకులు, కర్మాగార ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి మరలా పూర్వవైభవం కల్పించేలా చూడాలని పరిశీలనకు వచ్చిన కమిటీని కోరారు. కోవూరు చక్కెర కర్మాగారానికి సంబంధించిన వాటాదారులైన తమతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రైతు నాయకులు కోరారు. ప్రధానంగా ఫ్యాక్టరీ పట్ల రైతులకు నమ్మకం పెంచాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని కోరారు. ఇప్పటివరకు కోవూరు చక్కెర కర్మాగారాన్ని నాలుగు సర్వే బృందాలు పరిశీలించి పోయాయన్నారు. సర్వే బృందాలు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలాలు అయ్యాయే తప్ప వాటి వల్ల ఉపయోగం లేదన్నారు. కర్మాగారాన్ని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులు ఎంతో మంది అప్పులపాలై విగతజీవులుగా మృతిచెందిన సందర్భాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 21 చక్కెర కర్మాగారాలు ఉన్నాయన్నారు. కర్మాగారానికి సంబంధించి వందల కోట్ల రూపాయలు ఉన్నా వాటిని విడుదల చేసి బకాయిలు చెల్లించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదన్నారు. గతంలో రోడ్డు నిర్మాణ సమయంలో కర్మాగారానికి సంబంధించిన స్థలాన్ని బేరం పెట్టుకొని వాటిని అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. రైతులను సంప్రదించకుండా అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. ఫ్యాక్టరీ స్థితిగతుల్ని పరిష్కరించడానికి వచ్చిన సభ్యులు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రస్తుతం వరిసాగు రైతులకు ఇబ్బందిగా ఉన్న విధి లేని పక్షంలో వరిసాగు చేయాల్సి వస్తుందన్నారు. చెరకు సాగుపై దృష్టి సారించే అవకాశం కోవూరు చక్కెర కర్మాగారం అందుబాటులోకి వస్తే ఆరుతడి పంట అయిన చెరకు సాగుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని రైతులు తెలిపారు. దీనిపై ఆధారపడి 4600 మంది రైతులు ఉన్నారని, 2020 నాటికి అయినా ఫ్యాక్టరీని ప్రారంభించేలా కమిటీ ప్రభుత్వానికి సూచించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9.5 శాతం క్రషింగ్ ఉందన్న విషయాన్ని సర్వే బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. రాష్ట్రంలోనే ఈ కర్మాగారానికి ఎంతో ఘన చర్రిత ఉందన్న విషయం కూడా మరచిపోవద్దన్నారు. అనంతరం సర్వే బృందం కర్మాగారం మొత్తాన్ని పరిశీలించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు వెంకమరాజు, శ్రీనివాసరావు, నిరంజన్రెడ్డి, శ్రీరాములు, డానియల్, ఎంవీ రమణయ్య, శ్రీనివాసులురెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను: వనిత
సాక్షి, కొవ్వూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై పెట్టిన బాధ్యత, నమ్మకాన్ని వమ్ము చేయనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. అంతటి బాధ్యతలు తనకు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆమె కొవ్వూరులో మాట్లాడుతూ.. మహిళలకు, శిశువులకు సేవ చేసుకోవడం ఓ మహిళగా తన అదృష్టమన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కొవ్వూరు నియోజకవర్గ నాయకులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. కాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1999లో మినహా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తూ వచ్చింది. మరలా 20 ఏళ్ల తర్వాత టీడీపీ కోటలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తానేటి వనిత పాగా వేశారు. గత 30 ఏళ్లలో ఏ ఎమ్మెల్యేకి దక్కని మెజార్టీని ఆమె సొంతం చేసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకూ ము గ్గురికి మంత్రి పదవులు దక్కాయి. 1978లో ఏఎం అజీజ్ అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన కేఎస్ జవహర్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు తానేటి వనితకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా స్థానం దక్కింది. -
కొవ్వూరు పీఎస్లో లగడపాటిపై ఫిర్యాదు
-
కొవ్వూరులో 7న ‘వై స్క్రీన్స్ మాల్’ ప్రారంభం
సాక్షి, అమరావతి : మిని డిజిటల్ థియేటర్ కాన్సెప్ట్తో బాగా ప్రాచుర్యం పొందిన వై స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కొవ్వూరులో వై స్క్రీన్స్ మాల్ను ప్రారంభించనుంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వురులోని మెయిన్ బైపాస్ రోడ్డులో మంగళవారం(మే 7వ తేదీ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది. వై స్క్రీన్స్ ట్రేడ్ డెవలప్మెంట్ సెంటర్(వైఎస్టీడీ సెంటర్) పేరిట ఏర్పాటు చేయనున్న ఈ మాల్లలో మిని డిజిటల్ థియేటర్, ప్రభుత్వ సేవలు అందించే మీసేవ, బ్యాంక్ ఏటీఎమ్లు, గేమింగ్ జోన్, కాఫీ షాప్స్, బ్రాండెడ్ వస్తువుల విక్రయశాలలు, కార్పొరేట్ ఆఫీస్ కార్యాలయాలు ఉండనున్నాయి. వై స్క్రీన్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్, ఎండీ వైవీ రత్నకుమార్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన థియేటర్లు ప్రజల ఆధారాభిమానాలు పొందటంతోపాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. -
వనిత అనే నేను లోకల్
కొవ్వూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కొవ్వూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభతో మెయిన్రోడ్డు జనసంద్రమైంది. ఈ సందర్భంగా ఆ పార్టీ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత మాట్లాడుతూ తాను ఎప్పడూ ప్రజలకు అందుబాటులో ఉండే మనిషినని, తాను లోకల్ అని ప్రసంగించారు. జగనన్న వస్తున్నాడు... మన జగనన్న వస్తున్నాడు.. మన బతుకులు మారతాయంటూ ఉత్సాహభరితంగా ప్రసంగించారు. కొవ్వూరు ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్యసేవలందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అత్యవసర సమయాల్లో కనీసం ప్రాథమిక వైద్యం అందని దుస్థితి ఉందన్నారు. ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి చేసుకుని ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గోదావరి తీరంలోనే ఉన్నా తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రిసార్ట్స్ నిర్మాణం పేరుతో కార్తీకమాసంలో శివలింగాన్ని తొలగించి హిందూ సంప్రదాయాలను దెబ్బతీశారని ఆరోపించారు. శివుడితో పెట్టుకున్న వాళ్లకు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్లాల్సి వచ్చిందన్నారు. టీడీపీ వాళ్లు పెట్టే ప్రలోభాలకు తలొగ్గవద్దని, ఒక్కసారి ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైకిల్ ఇంటి బయట ఉండాలని, ఏనుగు అడవిలో ఉండాలని, ఫ్యాను ఇంట్లో ఉండాలని, జగనన్న మన గుండెల్లో నిలవాలంటూ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. బీసీకి ఎంపీ సీటిచ్చిన ఘనత వైసీపీదే: భరత్రామ్ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీకే దక్కుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ పేర్కొన్నారు. మాట తప్పని, మడమ తిప్పని జగనన్నని ఆశ్వీరదించాలని కోరారు. చంద్రబాబు హామీలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మన భవిష్యత్ జగనన్న చేతుల్లో పెడదామంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రాజీవ్కృష్ణ, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, పార్టీ నేత వంకా రవీంద్రనాథ్, రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య, నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి.శ్రీనివాస నాయుడు, నాయకులు బొబ్బా సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బండి పట్టాభి రామారావు(అబ్బులు) తదితరులు మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. పార్టీ నాయకులు కాకర్ల నారాయుడు, పట్టణ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, వనిత భర్త శ్రీనివాసరావు, ముదునూరి నాగరాజు ఇమ్మణ్ని వీరశంకరం, ముళ్లపూడి కాశీ విశ్వనాథ్, పరిమి హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞతతో ఓటేయండి
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్: ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పశ్చిమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఏలూరు నగరం కొత్తపేట 12పంపుల సెంటర్లోనూ, కొవ్వూరు పట్టణంలోని విజయవిహార్ సెంటర్లోనూ భారీ బహిరంగ సభలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. భానుడి భగభగల మధ్య వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, మోసాలపై నిప్పులు చెరిగారు. ఐదేళ్ళుగా చంద్రబాబు చేసిన మోసాలను ఎత్తిచూపుతూ.. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు వివరించారు. ధర్మానికీ అధర్మానికీ మధ్య యుద్ధం జరుగుతోందనీ.. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే.. ఈ అరాచక పాలనకు వీడ్కోలు పలకాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక యువత, మహిళలు వైఎస్ జగన్ సభలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీఎం.. సీఎం..అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. జగన్ ప్రసంగిస్తున్నంత సేపూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. వైఎస్ జగన్ అడిగే ప్రతీ ప్రశ్నకు ప్రజలు స్పందిస్తూ పెద్దపెట్టున సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ జగన్ చేస్తున్న ప్రసంగానికి ప్రజలు చప్పట్లు, ఈలలతో, హర్షధ్వానాలతో మద్దతు పలికారు. ఏలూరు సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.... ఆ రోజు ఇదే ఏలూరు పట్టణం గుండా పాదయాత్ర సాగింది. ఆరోజు మీరు చెప్పిన ప్రతి అంశము... ఈ రోజుకి కూడా గుర్తు ఉంది. ఏలూరు వన్టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కట్టాలని పది సంవత్సరాల కిందట దివంగత నేత రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు రూ. 15 కోట్లు విడుదల చేశారు. పనులు ప్రారంభించిన తరువాత దివంగత నేత మన మధ్య లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఐదు సంవత్సరాల వరకు చంద్రబాబు పాలన జరిగింది. కాని ఏ రకంగా పట్టించుకోని పరిస్ధితి. ఇక్కడే తమ్మిలేరు వర్షాలు పడినప్పుడు ఏ రకంగా దిగువ ప్రాంతాలు, ఏ విధంగా ముంపు గురవుతున్నాయోనని ఇప్పటికే చూస్తా ఉన్నాం. ఈ ఐదేళ్ళల్లో చంద్రబాబు పట్టించుకోలేదు. అప్పట్లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముంపును నివారించేందుకు అప్పట్లో రిటైనింగ్ వాల్ కట్టడం కోసం రూ. 30 కోట్లతో పనులు ప్రారంభించారు. ఆ మహానేత చనిపోయిన తరువాత పూర్తిగా పట్టించుకోని పరిస్థితి చూస్తా ఉన్నాం. కొవ్వూరు బహిరంగ సభల్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ... తాళ్ళపూడి, తాడిపూడి, ప్రక్కిలంక, చిడిపి, కొవ్వూరు, బల్లిపాడు, ర్యాంపులలో రోజు వేల సంఖ్యలో లారీలు కనిపిస్తా ఉన్నాయ్. పొక్లెయిన్లు పెట్టి ఇసుకను దోపిడీ చేసుకుంటా పోతా ఉన్నారు. ఇక్కడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు, మంత్రులుగా ఉన్న వ్యక్తులు సాక్షాత్తు ముఖ్యమంత్రిగారికి వాటాలు ఇస్తూ దోపిడీ చేస్తున్న విషయాలు కనిపిస్తా ఉన్నాయ్. దేవుడి కార్యక్రమం పుష్కరాలు జరిగాయ్ ఆ పుష్కరాలు జరిగినప్పుడు అంతా చూశారు. చెత్త ఏరివేసే పని దగ్గర నుండి ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి, రోడ్ల నిర్మాణం నుంచి ప్రతి పనిలో నామినేషన్ల పద్ధతిలో ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి నాసిరకం పనులు చేయించారు. ఎంత అన్యాయంగా పాలన జరిపించారో మీకే తెలుస్తా ఉంది. బెల్టు షాపుల రద్దు సంతకానికి విలువ ఏదీ కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడిపడితే అక్కడ బెల్టుషాపులు కనిపిస్తున్నాయ్. బడి పక్కన బెల్టుషాపు... గుడి పక్క బెల్టుషాపు... వీధి చివరా బెల్టుషాపే.. తెలుగుదేశం పార్టీ నాయకులే స్వయంగా బెల్టుషాపులు నిర్వహిస్తూ ఏకంగా ఎంఆర్పీ రేటు కన్నా 20 నుండి 30 రూపాయలకు అమ్ముకుంటా ఉన్న దారుణమైన పరిస్థితి. సాక్షాత్తు చంద్రబాబునాయుడు మొదటి సంతకం బెల్టుషాపుల రద్దు అని చెప్పిన దానికి విలువ ఏమిటో కొవ్వూరులో మీకే తెలుసు. గోదావరి తీరాన మంత్రి కుమారుడు రిసార్ట్స్ కడతాడు.. అక్కడ దేవత విగ్రహాలు అడ్డమొస్తున్నాయి కదా అని వాటిని తొలగిస్తారు. చింతలపూడి ఎత్తిపోతలు కొలిక్కిరాలేదు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఐదేళ్ళు పూర్తయినా కూడా పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతమైన చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ఏం పని జరిగిందని ఒక ఆలోచన చేయమని అడుగతా ఉన్నా... ఇదే చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంతం నుంచి మెట్ట ప్రాంతం వరకు మంచి జరిగే అవకాశం ఉండేది. కావాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయకుండా ఉండేందుకు ఒక మండలం నుంచి ఒక్కొక్క రేటు ఇస్తా ఉంటారు. మాకు ఎందుకు తక్కువ రేటు ఇస్తున్నారని రైతన్నలు ధర్నా చేసే పరిస్ధితికి రెచ్చగొడతా ఉన్నారు. చివరకు ఆ రైతన్నలు ధర్నా చేస్తే వాళ్ళే ఏదో తప్పు చేసినట్లుగా వాళ్ళ మీదే కేసులు పెట్టి చివరికి ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చే పరిస్థితికి తీసుకువచ్చారు. వరి పంట పండిస్తున్న రైతన్నల పరిస్థితి క్వింటాల్కు కనీస మద్ధతు ధర రూ.1750 కాని రైతు చేతికి ఏ సంవత్సరమైనా రూ. 1200లకు మించి మద్దతు ధర వచ్చిందా అని అడుగుతున్నా. ఈ చెడిపోయిన వ్యవస్థకు మార్పు తీసుకుని రమ్మని, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆళ్ల నానికి, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటగిరి శ్రీధర్కు, కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థి నా చెల్లి తానేటి వనితమ్మను, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మార్గాని భరత్ను గెలిపించాలని కోరారు. ఈ సభల్లో దెందులూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, నిడదవోలు వైఎస్సార్సీపీ అభ్యర్థి జీ.శ్రీనివాస్నాయుడు, వైఎస్సార్సీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షులు శివభరత్రెడ్డి, మాజీ మంత్రి మరడాని రంగారావు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, వంకా రవీంద్రనాథ్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, కోడూరి శివరామకృష్ణ, ఆత్కూరి దొరయ్య తదితరులు పాల్గొన్నారు. పేదవాడి ఇంటి రుణాన్ని మాఫీ చేస్తా ఇదే ఏలూరులో పాదయాత్రకు వచ్చినప్పుడు ఆరోజు మీరన్నమాట గుర్తుంది. అప్పట్లో దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో ఈ నియోజకవర్గంలో 12,000 ఇళ్ళను కట్టించి ఇచ్చారు. ఈ రోజు ఏ రకంగా పట్టాలు పంచిపెట్టాలని, అవినీతి ఫ్లాట్లు కట్టాలని ఆలోచన చేస్తున్న పరిస్థితులున్నాయి. పేదవాడికి చంద్రబాబు అమ్మే రేటు అడుగుకి 2 వేల రూపాయలు చొప్పున 300 అడుగుల ప్లాటు అక్షరాల 6 లక్షల రూపాయలు పేదవాడికి అమ్మే పరిస్థితి చేస్తా ఉన్నాడు. ఈ రూ. 6 లక్షల్లో మూడు లక్షల రూపాయలు పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటాడట, ఆ పేదవాడు 20 సంవత్సరాలు పాటు నెల నెలా మూడు వేల రూపాయలు కడుతూ పోవాలట. మీ అందరికి ఒకటేహామీ ఇస్తా ఉన్నా.. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పేదవాడికి ఏదైతే 20 ఏళ్ళపాటు రూ.3 లక్షల రూపాయలు అప్పు కట్టాల్సి ఉందో. ఆ మొత్తం రూ. 3లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇస్తా ఉన్నా. -
కొవ్వూరు బహిరంగ సభలో వైఎస్ జగన్
-
అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్లను రద్దు
-
బాబుకు ఓటేస్తే...లారీ ఇసుక రూ.లక్ష: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి : అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్లను రద్దు చేస్తామని చంద్రబాబు చేసిన సంతకానికి విలువ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బడి, గుడి, వీధి చివరా.. ఎక్కడా చూసినా బెల్ట్ షాప్లు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వీటి నిర్వహణకు అండగా టీడీపీ నాయకులు నిలబడుతున్నారని, ఎంఆర్పీ కంటే 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ దండుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇసుక దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయిందని అన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వాటాలు పంచుతూ యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారని అన్నారు. తాళ్లపూడి, తాడిపూడి, బల్లిపాడు, చిడిపి, పక్కిలంక, కొవ్వూరు, పోగిమ్మి ర్యాంపుల నుంచి ప్రొక్లెయిన్లు పెట్టి రోజూ వేల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. పుష్కరాలను వదలలేదు.. గోదారి తీరాన రిసార్ట్స్ కట్టిన మంత్రి కుమారుడు మరింత అన్యాయంగా వ్యవహరించారు. అడ్డుగా ఉన్నాయని దేవతల విగ్రహాలను సైతం తొలగించారు. జిల్లాలో జరిగిన పుష్కరాలో సైతం అవినీతి లేకుండా పనులు సాగుతాయని అందరూ అనుకుంటారు. కానీ, అలా జరగలేదు. చెత్త ఏరివేయడం.. ఘాట్ల నిర్మాణం.. తదితర పనులను నామినేషన్ల పద్ధతిలో చేపట్టి ఇష్టానుసారంగా రేట్లు పెంచేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కొలిక్కి రాలేదు. చంద్రబాబు పాలనలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. చంద్రబాబు ప్రతి అడుగులో మోసం.. మోసం. మోసం. పొరపాటున బాబుకు ఓటేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. ఇప్పటికే 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు. బాబుకు మళ్లీ ఓటేస్తే.. ఆర్టీసీ, కరెంట్ చార్జీలు బాదుడే.. బాదుడు. భూములు లాక్కునేందుకు భూసేకరణ చట్టానికి సవరణలు చేశారు. భూ రికార్డులను సైతం తారుమారు చేశారు. పొరపాటున బాబుకు ఓటేస్తే మీ భూములను లాక్కుంటారు. లారీ ఇసుక లక్ష అవుతుంది.. ఇప్పటికే లారీ ఇసుక రూ.40 వేలు. మళ్లీ బాబును నమ్మి మోసపోతే.. లారీ ఇసుక లక్ష రూపాయలు అవుతుంది. రైతులకు ఉచిత విద్యుత్ సరిగా అందడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ నిర్వీర్యం చేశారు. పొరపాటున బాబుకు ఓటేస్తే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో బ్యాంకులు ఇచ్చే రుణాలకు సైతం ఇవ్వనివ్వరు. రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు తనకు అనుకూలమైన పోలీసులను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను అధికారులను రానివ్వడం లేదు. రాబోయే రోజుల్లో మనుషులను చంపేసినా అగిగేవారుండరు. పొరపాటున బాబుకు ఓటేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి వారికి ఉద్యోగాలుండవు. జడ్జీ పదవులకు బీసీలు అనర్హులని ఇప్పటికే బాబు లేఖలు రాశారు. మరోసారి చంద్రబాబు అబద్ధాలకు మోసపోవద్దని కోరుతున్నా. వైఎస్సార్సీపీ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్ను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 20 రోజులు ఓపిక పట్టండి.. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలు మరింత పెరుగుతాయి. ఆయన చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పండి. ఉన్నత చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చయినా అన్న చదివిస్తాడని చెప్పండి. డ్వాక్వా మహిళలకు చెప్పండి.. ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని చెప్పండి. బ్యాంకులకు సగర్వంగా వెళ్లే రోజులు మళ్లీ వస్తాయని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 45 ఏళ్లు దాటి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేలు ఇస్తామని చెప్పండి. ప్రతి రైతన్నకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పండి. అవ్వా తాతల పెన్షన్ రూ.3 వేల వరకు పెంచుతామని చెప్పండి. -
పారదర్శక పాలన జగన్తోనే సాధ్యం
సాక్షి, కొవ్వూరు: కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు తానేటి వనిత. ఏడేళ్లుగా ఇక్కడి ప్రజలతో ఆమె అంతగా మమేకమయ్యారు. ఉచిత ఇసుక పాలసీ మాటున టీడీపీ నేతల అక్రమ వ్యాపారాలపై పోరాటాలు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా మద్యం ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయించడంపై, బెల్టుషాపులు నియంత్రణపై ఆమె ఎనలేని పోరాటం సాగించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల తరఫున ఆమె ఆందోళనలు చేశారు. కొవ్వూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న తానేటి వనిత అంతరంగం ఆమె మాటల్లోనే.. నీతివంతంగా పనిచేశాం పదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాను. నాతండ్రి బాబాజీరావు పదేళ్లు (రెండుసార్లు) ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏనాడు చిన్న అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేశాం. నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో రాజకీయాల్లో రాణించగలుగుతున్నాం. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైఎస్సార్ సీపీ నుంచి పోటీచేశాను. విజయానికి దూరమైనా ప్రజల మనస్సుకి ఎంతో దగ్గరయ్యాను. ఎల్లప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. టీడీపీ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గాన్ని అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చారు. ఇసుక, మద్యం మాఫీయాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం ద్వారా ప్రజల్లో మంచిస్థానం సంపాదించుకోగలిగాను. ఇక్కడే పుట్టి పెరిగాను కొవ్వూరు నియోజకవర్గంలోనే పుట్టి పెరిగాను. కుమారదేవం మా స్వస్థలం. మా బంధువర్గం అంతా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. మా నాన్న ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చాగల్లు మండలం గోపాలపురం నియోజకవర్గం పరిధిలోనే ఉండేది. దీంతో ఈ నియోజకవర్గంతో మా కుటుంబానికి రాజకీయంగాను, బంధుత్వాలపరంగాను అనుబంధం ఉంది. భర్త శ్రీనివాసరావు ఎండీ జనరల్ వైద్యనిపుణుడు. తాడేపల్లిగూడెంలో ఆసుపత్రి నడుపుతున్నారు. కుమార్తె ప్రణవీ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. జగనన్న ఆశీస్సులతో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నా. అన్నివర్గాలకు మేలు చేకూర్చేవి నవరత్న పథకాలు. జగన్సీఎం అయితే రాష్ట్రానికి మేలు చేస్తాడన్న ప్రజల నమ్మకంతో ఈసారి గెలుపొందడం ఖాయం. ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యం కొవ్వూరు చరిత్రలో తొలిసారి మహిళకి సీటు కేటాయించిన ఘనత జగన్మోహన్రెడ్డిదే. కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయించి అన్నీరకాల∙వైద్యసేవలు అందుబాటులోకి తెస్తాం. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకి అధిక ప్రాధాన్యం ఇస్తా. అర్హులందరికీ ఇళ్ల నిర్మాణం. కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటా. ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తా. జగన్తోనే వ్యవస్థలో మార్పు అన్నీవర్గాలకు పారదర్శకమైన పాలన అందించాలంటే జగన్ సీఎం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. ఆయన మాట ఇస్తే మడమ తిప్పరని నమ్ముతున్నారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వాళ్లకే లబ్ధి చేకూర్చుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే జగన్ పాలన రావాలి. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 72 గంటల్లో వారి సమస్యలు పరిష్కారిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పథకాల లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, పార్టీ చూడమని ప్రకటించారు. 2009లో గోపాలపురం ఎమ్మెల్యేగా గెలుపొందాను. 2012 నవంబర్లో పదవి తృణప్రాయంగా విడిచిపెట్టి వైఎస్సార్ సీపీలో చేరి జగన్ సారథ్యంలో నడుస్తున్నా. అప్పటినుంచి కొవ్వూరు సమన్వయకర్తగా పనిచేస్తున్నా. -
ఎన్నారై ప్రతినిధుల ప్రచారం.. అనూహ్య స్పందన!
సాక్షి, రాజమండ్రి: కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారై ప్రతినిధులు చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వైఎస్సార్సీపీ ఎన్నారై కో ఆర్డినేటర్ హర్షవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎన్నారై ప్రతినిధులు ఇంటింటికి తిరిగి.. ప్రజలను కలుసుకొని.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్ను గుర్తుకు ఓటువేసి.. వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో వైఎస్సార్సీపీ గల్ఫ్, కువైట్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్, ముమ్మడి బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, గల్ఫ్ ప్రతినిధులు షేక్ నాసర్, జీఎస్ బాబు రాయుడు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లలితరాజ్, సలహాదారులు అబూ తురాబ్, యూత్ ఇన్చార్జ్ మర్రి కళ్యాణ్, వైస్ ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎన్నారైలు వజ్ర శేఖర్రెడ్డి, బాలరాజు, సత్తార్, ఇంతియాజ్, మురళీమోహన్ నాయుడు, గంగాధర్ రెడ్డి, ఆనంద్, భరత్, సిద్ధూ, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, రాజు, డానీ, జయకర్ రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలియాస్, బాలిరెడ్డి, హర్షవర్ధన్ మాట్లాడుతూ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గోవింద్ నాగరాజు, నరసారెడ్డి మాట్లాడుతూ ఎన్నకల సమయంలో అబద్ధాలు చెప్పడం చంద్రాబుకు అలవాటు అని, 2014 ఎన్నికల్లోనూ ఎన్నో అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలో వచ్చి.. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. -
అందరికీ అందుబాటులో ఉంటా
సాక్షి, కొవ్వూరు: రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తానేటి వనిత గతంలో ఎమ్మెల్యేగా సత్తాచాటారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నుంచి కొవ్వూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఐదేళ్లుగా అధికారపార్టీ అక్రమాలకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ప్రశ్న : ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? వనిత : ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గ్రామం వెళ్లినా విశేష స్పందన వస్తోంది. ప్రశ్న : మీకు కలిసి వచ్చే అంశాలు ఏమిటీ? వనిత : ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. మా తండ్రి జొన్నకూటి బాబాజీరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ప్రజలు విసుగెత్తారు. ఆ పార్టీ ఇక్కడ స్థానికేతరురాలికి టికెట్ ఇచ్చింది. ఇవన్నీ నాకు కలిసి వచ్చే అంశాలు. ప్రశ్న : గెలుపుపై ధీమాగా ఉన్నారా? వనిత : గెలుపు తథ్యం. నవరత్న పథకాలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. దీనికితోడు రెండుసార్లు ఎమ్మెల్యేగా మానాన్న పని చేసినా, నేను ఎమ్మెల్యేగా ఐదేళ్లు కొనసాగినా ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు. ప్రజలతో మమేకమయ్యాం. ఏడేళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నా. ఇవి నా గెలుపునకు దోహదం చేస్తాయి. ప్రశ్న : మీ ప్రాధాన్యాంశాలు? వనిత : గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మిస్తా. కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని వందల పడకలు అప్గ్రేడ్ చేయిస్తా. అన్ని వైద్యసేవలూ అందుబాటులోకి తెస్తా. ప్రశ్న : ఎంత వరకు చదువుకున్నారు? వనిత : ఎమ్మెస్సీ(జువాలజీ) ప్రశ్న : మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది? వనిత : నా భర్త శ్రీనివాసరావు సహకారం ఎంతో ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన సర్దుబాటు చేసుకుంటూ నాకు మద్దతు పలుకుతున్నారు. మా నాన్న బాబాజీరావు, ఇతర కుటుంబ సభ్యులంతా సహకరిస్తున్నారు. ప్రశ్న : మీ రాజకీయ ప్రస్థానం? వనిత : 2009లో గోపాలపురం ఎమ్మెల్యేగా గెలుపొందా. 2012 నవంబర్లో పదవిని త్రుణప్రాయంగా వదిలా. వైఎస్సార్ సీపీలో చేరా. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఏడేళ్ల నుంచి కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నా. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి బరిలో దిగినా గెలుపు చేజారింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నా. ఈసారి టీడీపీ కోటలో వైఎస్సార్ సీపీ పాగా వేయడం ఖాయం. -
బీఎస్పీలో రగడ.. యూపీ నేతలకు ఇక్కడేం పని..?
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏపీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న జాతీయ పార్టీ బీఎస్పీలో రగడ మొదలైంది. ఉత్తరప్రదేశ్కు చెందిన నేతలు ఏపీలో బీఎస్పీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కారెం లెనిన్ ఆరోపించారు. స్థానిక కేడర్ను సంప్రదించకుండా కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను ఎంపిక చేశారని ఆదివారం జరిగిన బీఎస్పీ జిల్లా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తులకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. జనసేన ప్రకటించిన అభ్యర్థులకు మద్దతివ్వబోమని, ప్రచారంలోపాల్గొనమని తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా.. ‘పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదురవడం మామూలే. నాయకులు సంయమనం పాటించాలి’ అని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు నేతల రమేష్ అన్నారు. -
చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారు
-
ఒకే కుటుంబం..ముగ్గురుమంత్రులు
సాక్షి, కొవ్వూరు : జిల్లా రాజకీయాల్లో మాగంటి కుటుంబం దశాబ్దాల నుంచి ఉంది. తల్లిదండ్రులు, తనయుడు ముగ్గురూ మంత్రులుగా అవకాశం దక్కించుకున్న ఆరుదైన ఘనత వీరికి సొంతం. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి జెడ్పీ చైర్మన్గా, 1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1991 ఉప ఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి గెలుపొంది స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వారి కుమారుడు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) 2004లో వైఎస్సార్ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏలూరు ఎంపీగా ఆయన గెలుపొందారు. ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు పనిచేయడం మాగంటి కుటుంబం ప్రత్యేకం. -
వైఎస్సార్ భరోసా.. రైతు కులాసా
సాక్షి, యలమంచిలి : ఐదేళ్లుగా వరి సేద్యం గిట్టుబాటు కావడం లేదు. నష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం కష్టించినా.. చేసిన అప్పులు తీరడం లేదు. ఫలితంగా అన్నదాతలు బక్కచిక్కిపోతున్నారు. కొందరు ఆక్వా రంగం వైపు తరలిపోతున్నారు. దీంతో లక్షలాది ఎకరాల పచ్చని పంట భూములు మాయమైపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సర్కారు తీరే. గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల అన్నదాతలు కోలుకోలేకపోతున్నారు. దీనికితోడు పెరిగిన ఎరువులు, కూలి ధరలు, సకాలంలో అందని పెట్టుబడి రైతును కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగు ప్రారంభంలో రైతులు పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ దయనీయ స్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. నవరత్నాల్లో భాగమైన ఈ పథకం రైతులకు ఆశా దీపంగా మారింది. ఇదీ రైతు భరోసా స్వరూపం ప్రతి రైతు కుటుంబానికీ ఐదేళ్లలో రూ.50 వేలు ప్రతి ఏడాదీ రూ.12,500 చొప్పున సాయం నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ వడ్డీ లేని పంట రుణాలు ఉచితంగా బోర్లు పగటి సమయంలో 9 గంటల ఉచిత విద్యుత్ ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయక నిధి శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటు అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సహకార డెయిరీలకు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 సబ్సిడీ వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సు రద్దు ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఈ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం తండ్రి బాటలోనే జగన్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయం పండగలా ఉండేది. ఆయన మరణానంతరం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో తండ్రి మాదిరిగానే జగన్ కూడా నవ రత్నాలలో మొదటి అంశంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ భరోసా రైతులపాలిట ఆశాదీపంలా కనిపిస్తోంది. – గంధం సత్యకీర్తి, రైతు, మేడపాడు -
సీఎం ఇంటివద్దే ‘తమ్ముళ్ల’ తన్నులాట
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో ముఠా కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దే తెలుగు తమ్ముళ్లు పరస్పరం ఘర్షణకు దిగారు. అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకుల సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరు, నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కేఎస్ జవహర్, బూరుగుపల్లి శేషారావులకు సీట్లు ఇవ్వొద్దని అక్కడి క్యాడర్, స్థానిక నాయకత్వం ఆందోళనకు దిగింది. నిడదవోలు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటిస్తే టీడీపీ గోదారిలో కలిసిపోయినట్లేనంటూ ఆయన్ను వ్యతిరేకించే నాయకులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల నాయకులు అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. పలువురు నేతలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇసుక క్వారీల్లో బూరుగుపల్లి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, గ్రామాల్లో తమను పట్టించుకోకుండా అణచివేశారని పలువురు ఆరోపించారు. సమావేశానంతరం వారంతా టెంట్లనుంచి బయటికొచ్చి బూరుగుపల్లికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వారిని ఆపేందుకు పరిశీలకులుగా ఉన్న పార్టీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమావేశంలో జరిగిన విషయాల్ని చంద్రబాబుకు వివరిస్తామని, ప్రశాంతంగా ఉండాలని సర్దిచెప్పినా అసమ్మతివర్గం వినిపించుకోలేదు. మంత్రి జవహర్ను నిలదీసిన వైరివర్గం.. మరోవైపు కొవ్వూరు నియోజకవర్గంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి కేఎస్ జవహర్ ఎదుటే ఆయన అసమ్మతి వర్గం ఆందోళనకు దిగింది. పరిశీలకుల ఎదుటే జవహర్ను నిలదీయడమేగాక.. అవినీతికి పరాకాష్టగా మారిన ఆయనకు సీటిస్తే ఓడిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. ఇందుకు జవహర్ అనుకూల వర్గం అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగి రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. పరిశీలకులు ఆపినా పట్టించుకోని కార్యకర్తలు జవహర్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. జవహర్ డౌన్ డౌన్, అవినీతిపరుడు జవహర్కు సీటివ్వొద్దు అంటూ నినాదాలు చేశారు. రెండు నియోజకవర్గాల సమావేశాలు రసాభాసగా మారడంతో సీఎం నివాస ప్రాంతం వద్ద గందరగోళం నెలకొంది. పోలీసులు వచ్చి ఆందోళన చేసిన వారిని అడ్డుకుని దూరంగా పంపించివేశారు. కొవ్వూరు నుంచే పోటీ చేస్తా: జవహర్ సమావేశానంతరం మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని, కొందరు నాయకులు అహంకారంతో కావాలని తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు
-
అవినీతి మంత్రి మాకొద్దంటూ టీడీపీ నేతల ర్యాలీ
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట రోడ్డుకెక్కింది. స్థానిక టీడీపీ నేతలు.. మంత్రి జవహర్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా విడిపోయారు. టీడీపీ అధిష్టానం జవహర్కు టికెటు కేటాయించవద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బుధవారం భారీ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా అవినీతి మంత్రి మాకొద్దంటూ జవహర్కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. జవహర్ నుంచి పార్టీని రక్షించాలని డిమాండ్ చేశారు. కొవ్వూరు పట్టణంతో పాటు రూరల్ గ్రామాల్లో జవహర్కు వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు చేపడుతున్నారు. జవహర్ వ్యతిరేక వర్గానికి కొవ్వూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సూరపునేని రామ్మోహన్రావు, సీనియర్ నాయకులు ఉప్పులూటి నారాయణరావు నాయకత్వం వహిస్తున్నారు. జవహర్కు టికెట్ కేటాయిస్తే పార్టీ దారుణంగా ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాగా, మంగళవారం రోజున ప్రజా దీవెన యాత్ర పేరుతో జవహర్ అనుకూల వర్గం ర్యాలీ నిర్వహించింది. అందులో జవహర్ కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జవహర్ చేపట్టిన ర్యాలీకి వ్యతిరేకంగానే ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఈ ర్యాలీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. -
విధినిర్వహణలో కుప్పకూలిన సబ్ రిజిస్టార్
సాక్షి, కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు సబ్ రిజిస్టార్గా పనిచేస్తున్న ఆకాశం శారదాదేవి మంగళవారం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మరణించారు. ఆమె గత డిసెంబర్లో చింతలపూడి నుండి కొవ్వూరుకు బదిలీపై వచ్చారు. రానున్న ఏప్రిల్ నెలలో ఆమె పదవీవిరమణ చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన శారదాదేవి.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తుంది అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సిబ్బంది ఆమెను వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శారదాదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా. శారదాదేవి మాత్రం కొవ్వూరులో ఉంటూ సబ్ రిజిస్టార్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు చెప్పినట్లు కుమారులు చెప్పారు. ఆమె ఆకస్మిక మృతిపట్ల సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. -
‘జవహర్కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తాం’
సాక్షి, అమరావతి : మంత్రి జవహర్పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి జవహర్కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని అధిప్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు జవహర్ గౌరవం ఇవ్వడంలేదని మండిపడ్డారు. బ్రాందీ షాపుల్లో పనిచేసే వారే కొవ్యూరులో పార్టీని నడుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జవహర్కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వోద్దని అధిష్టానాన్ని కోరారు. -
కొవ్వూరులో ఉద్రిక్త పరిస్ధితులు
-
పవన్ కల్యాణ్ అంటే గౌరవం కానీ..
కొవ్వూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా గౌరవం ఉంది కానీ టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి పవన్ యూటర్న్ తీసుకున్నారని ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో గురువారం లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ..ఎన్డీఏ నుంచి బయటకు రానంతవరకు చంద్రబాబు నాయుడి పరిపాలన గురించి అద్భుతం అని చెప్పిన ఆయన తర్వాత మాట మార్చారని విమర్శించారు. తాను చిన్న వయసులోనే దేవుడి దయ, ప్రజల వల్ల ఐటీ శాఖా మంత్రిని అయ్యానని చెప్పారు. పవన్ తన మీద అవినీతి ఆరోపణలు చేసే ముందు సాక్షాధారాలతో నిరూపించాలని కోరానని కానీ ఆయన నిరూపించలేక పోయారని అన్నారు. -
‘పర్యావరణాన్ని ఎలా నాశనం చెయ్యాలో చెప్తావా బాబూ..’
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా కలక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. కొవ్వూరులో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కోడూరి లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయనతో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ అవినీతిని తూర్పారాబట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద డ్రామా కంపెనీల తయారయిందని అన్నారు. లిక్కర్, ఇసుక మాఫియా ఆగడాలకు కొవ్వూరు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. అడ్డగోలు ఇసుక, మట్టి తవ్వకాలతో పర్యావరణాన్ని కాలరాస్తున్న చంద్రబాబు పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడతాననడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి టీడీపీ నేతల జేబుల్లోకి నేరుగా తీసుకెళ్లడమే బాబు ఉద్దేశమని కన్నా ఆరోపించారు. -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగలు పడ్డారు
కొవ్వూరు: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అవును మీరు విన్నది నిజమే. అయితే ఎటువంటి సొత్తు చోరీ కాలేదు. పాత రికార్డులోని కొన్ని పేజీలు మాత్రం గల్లంతయ్యాయి. దీనిపై ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగుచూసింది. ఇది ఇంటి దొంగల పనా..? బయట వ్యక్తులు చేశారా అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో 1998కి చెందిన దస్తావేజు కాపీ రికార్డు (ఫైల్ వ్యాల్యూమ్)లోని కొన్ని పేజీలు గల్లంతయ్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న ఆరుగురు సిబ్బం దిపై బదిలీ వేటు వేశారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1999 నుంచి రికార్డులను ఆన్లైన్ చేస్తున్నారు. అంతకు ముందు రికార్డులన్నీ మాన్యువల్గా ఉన్నాయి. కొవ్వూరు కా ర్యాలయంలో ఉండే మాన్యువల్ రికార్డుల్లో కొన్నిపేజీలు గల్లంతవడం చర్చనీయాంశంగా మారింది. 10న డీఐజీ విచారణ కొవ్వూరుకి చెందిన గారపాటి రవికిషోర్ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, సీఎంకు, డీఐజీకి రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్ శాఖ డీఐజీ బి.సూర్యనారాయణ ఈనెల 10న విచారణకు ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె అదేరోజు పేజీల గల్లంతుపై కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని 1007 నంబర్లోని ఒరిజినల్ ఫైల్ వ్యాలూమ్లో ఉండాల్సిన 2135, 2136, 2137, 2138 అనే నాలుగు నంబర్లకు సంబంధించిన పేజీలను చించుకునిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసుస్టేషన్లో క్రైమ్ నం.202/2018 కింద కేసు నమోదయ్యింది. ఐపీసీ 427,379 నంబర్ల కింద కేసు రిజిస్ట్రర్ అయ్యింది. ఎవరా అజ్ఞాతవాసి రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అసలు గారపాటి రవికిషోర్ అనే వ్యక్తి కొవ్వూరులో ఎవరూ లేరనేది ప్రాథమికంగా గుర్తిం చారు. వాస్తవంగా రికార్డు గదిలోకి బయట వ్యక్తులు వెళ్లే అవకాశం లేదు. పేజీలు గల్లంతైన వ్యవహారం బయట వ్యక్తులకు తెలిసే అవకాశాలు తక్కువ. దీనిని బట్టి ఇక్కడ పనిచేసే సిబ్బంది సహకారంతోనే ఈ తంతు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ తేదీన ఎవరు సబ్ రిజిస్ట్రార్గా, ఎవరెవరు విధుల్లో ఉండగా ఇది జరిగిందనే విషయం పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. గతంలో ఇక్కడ ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్లుగా పనిచేసిన వారి పేర్లతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది పేర్లను, వారు చేస్తున్న ఉద్యోగం వివరాలను జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తెలితే విచారణ సులభం కావడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడు గుర్తుతెలియని వ్యక్తి కావడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరైనా నింది తులు ఉంటే నేరం రుజువు కావడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని భావించిన అధికారులు ఆరుగురిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఆయా పేజీల్లో ఏముంది..! రికార్డులో గల్లంతైన పేజీలు ఎవరి ఆస్తికి సంబంధించినవి అనే అంశం ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికారులు ఈ రికార్డుని సీజ్ చేశారు. గల్లంతైన పేజీలకు సంబంధించిన ఆస్తుల వివరాలు గురించి అడిగితే అధికారులు నోరు విప్పడంలేదు. విచారణలో ఉందని దాట వేస్తున్నారు. వాస్తవంగా ఈ ఘటన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు గుణపాఠం నేర్పిందనే చెప్పవచ్చు. ఈ ఘటనలో నేరానికి పా ల్పడిన వ్యక్తి ఎవరనేది తేలకపోవడంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది అంతా బాధ్యులు కావాల్సి వచ్చింది. గల్లంతైన నాలుగు పేజీలకు సంబంధించిన ఆస్తుల నకళ్లు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆయా నంబర్లకు సంబంధించి ఎవరైనా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులను విక్రయించి సొమ్ములు చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది మధ్య మా మూళ్ల వాటాలు తేలకపోవడం లేదా వ్యక్తిగత ద్వేషాల నేపథ్యంలో ఈ దుర్చశ్యకు పాల్పడ్డారా.. అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. జిల్లా రిజిస్ట్రార్ బదిలీ పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మికి పదోన్నతి రావడంతో ఫి ర్యాదు చేసిన మ రుసటి రోజే బదిలీ కావడం గమనార్హం. పేజీలు గల్లంతైన రికార్డుని ఆమె సీజ్ చేశారని కొవ్వూరు సబ్రిజిస్ట్రార్ ఎన్పీఎస్ఆర్ రాజు చెబుతున్నారు. ఇప్పటివరకూ గల్లంతైన నాలుగు పేజీల నంబర్లకు సంబంధించిన ఆస్తు ల వివరాలు కూడా పోలీసులకు అందలేదని తెలి సింది. ప్రస్తుతం పదోన్నతిపై వెళ్లిన జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫోన్ నంబర్ స్విచాఫ్లో ఉంది. నూతనంగా జిల్లా రిజిస్ట్రార్గా మరో వ్యక్తి విధుల్లో చేరే వరకూ విచారణకు ఇబ్బందులు తప్పవని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదుదారులే విచారణకు రావాల్సి ఉంటుం దన్నారు. దీంతో ఈ కేసు నీరుగారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా ఇక్కడ నుంచి ఆరుగురు సిబ్బందిని బదిలీ చేయగా వారి స్థానంలో విధుల్లో చేరేందుకు కొత్త సిబ్బంది సంకోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1998కి ముందు ఉన్న రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నట్టు సమాచారం. -
ఏ కష్టమొచ్చిందో..
కొవ్వూరు రూరల్/కొవ్వూరు : ఏ కష్టమొచ్చిందో.. ఆరోగ్య సమస్యలా.. ఆర్థిక ఇబ్బందుల కారణమా.. ఏదైనా కాని ఓ కుటుంబం మూడు జిల్లాలు దాటి వచ్చి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని కొవ్వూరు వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. శనివారం కొవ్వూరు లాంచీల రేవు శ్రీ కృష్ణ చైతన్య స్నానఘట్టంలో గోదావరిలో తేలి యాడుతున్న మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, సీఐ సుభాకర్, ఎస్సైలు ఎస్ఎస్ఎస్ పవన్కుమార్, పి.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. సంఘటనా స్థలంలో దొరికిన బ్యాగ్లో లభించిన ఆధార్కార్డులు, రేషన్కార్డు ఆధారంగా మృతులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన పొందూరు రవికుమార్ (27), అతని భార్య పావని (24), కుమార్తె పూజిత (3)గా గుర్తించారు. ఈ మేరకు మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. అనంతరం సీఐ సుభాకర్ మాట్లాడుతూ సంఘటనా స్థలంలో లభించిన బ్యాగ్లో ఆధార్కార్డులతో పాటు రవికుమార్ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ ఫైల్ ఉందన్నారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నామని చెప్పారు. బ్యాగ్లో మృతుడి తల్లి రమణమ్మ, మరో కుమార్తె హారిక (2) ఆధార్కార్డులు కూడా లభించాయన్నారు. వీరంతా శుక్రవా రం స్థానిక ఆంజనేయస్వామి స్నానఘట్టం వద్ద సంచరించారనే సమాచారం ఉందని, ఆ ప్రాంతంలోనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామన్నారు. అయితే మరో కుమార్తె హా రిక ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. మృతదేహా లను కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశామని సీఐ సుభాకర్ చెప్పారు. ఇదిలా ఉండగా శుక్రవారం గోదావరిలో తేలియాడిన మరో పురుషుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కడతేరిన ప్రేమబంధం రవికుమార్, పావని ఐదేళ్ల క్రితం కులాంతర వివాహాం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. రవికుమార్ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వీటికి ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో బలవర్మణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రవికుమార్ తల్లి రమణమ్మ కూడా ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరిలో దిగి భయంతో వెనక్కి వ చ్చినట్టు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు. అప్పటికే రవికుమార్ దంపతులు, ఇద్దరు కుమార్తెలు నదిలో మునిగిపోవడంతో రమణమ్మ కేకలు వేసినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి కావడంతో ఆ సమయంలో ఎవరూ స్పందించలేదు. రవికుమార్ బీ టెక్ పూర్తి చేయగా పావని డిగ్రీ చదివింది. వీరు నరసన్నపేటలో నివాసముంటున్నారు. రవికుమా ర్ది గొర్రెలబంద గ్రామం కాగా, పావనిది కురుడు గ్రామం. చినవెంకన్నను దర్శించి.. నరసన్నపేట: తీర్థ యాత్రల పేరుతో బుధవారం నరసన్నపేట నుంచి బయలుదేరి గురువారం ఉద యం ద్వారకాతిరుమల వెళ్లామని రవికుమార్ త ల్లి రమణమ్మ నరసన్నపేటలో ‘సాక్షి’కి తెలిపారు. చినవెంకన్నకు పూజలు చేసి ఉన్న డబ్బు, బం గారు ఆభరణాలు హూండీలో వేసి సాయంత్రం నదికి వద్దకు వెళ్లి్లనట్టు చెప్పారు. అందరమూ ఒక రి చేతులు ఒకరు పట్టుకొని నదిలోని దిగామని ఇంతలో నీటి ఉద్ధృతికి తన చేతులు విడిపోయాయని.. వెంటనే తాను ఒడ్డుకు కొట్టుకు వచ్చానని, అక్కడి నుంచి నరసన్నపేట చేరుకున్నానని చెప్పింది. -
కొవ్వూరు లాంచీ రేవులో మృతదేహాల కలకలం
-
186రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కొవ్వూరు : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన కొవ్వూరు నియోజకవర్గంలోని గౌరపల్లి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నేతలు పాదయాత్రలో ఆయనతో పాటు అడుగులు చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను రాజన్న బిడ్డతో వెల్లబోసుకుంటున్నారు. వారికి భరోసా అందిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. నేటి ప్రజాసంకల్పయాత్ర గౌరపల్లి నుంచి పసివేదల, నందమూరు క్రాస్ రోడ్డు, కొవ్వురూ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ మీదుగా విజయ్ విహార్ సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. -
అధికారం అండగా.. ఇసుక దందా
కొవ్వూరు: తివిరి ఇసుమున దైలంబు దీయవచ్చు... అని భర్తృహరి తన సుభాషితాల్లో చెప్పినదానికి టీడీపీ నాయకులు కొత్త అర్థం చెప్తున్నారు. తివిరి ఇసుక నుంచి ధనమును తీయవచ్చు అని రుజువు చేస్తున్నారు. ఇసుక ర్యాంపులను టీడీపీ నేతలు తమ అధీనంలో పెట్టుకుని జనాన్ని నిలువు దోపిడీ చేస్తూ రూ. కోట్లు దండుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంపాదనలో కొందరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వాటాలు అందుతున్నట్లు తెలుస్తోంది. మంత్రుల ఇలాకాలో చుక్కల్లో ఇసుక ధరలు జిల్లాలో ఇద్దరు మంత్రుల ఇలాకాలో ఇసుక ధరలు చుక్కలనంటాయి. కొవ్వూరులో ఏకంగా యూనిట్ రూ. 3 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కొవ్వూరు, వాడపల్లి, ఔరంగబాద్ ర్యాంపులు మూత పడడం, తాడిపూడి ర్యాంపుని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేటాయించడంతో ఇసుకకి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గంలో వేగేశ్వరపురం, ప్రక్కిలంక ర్యాంపులు మాత్రమే నడుస్తున్నాయి. రెండు చోట్ల అధికార పార్టీకి చెందిన నాయకులే వీటిని నడుపుతున్నారు. బోట్స్మెన్ సొసైటీ ముసుగులో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడ పడవలు నడుపుతున్నారు. జిల్లా శాండ్ మైనింగ్ కమిటీ నిర్ణయించిన ప్రకారం యూనిట్ ఇసుక లోడింగ్తో కలిపి రూ.850కి విక్రయించాల్సి ఉండగా ఇక్కడ ఏకంగా రూ.1,600 వసూలు చేస్తున్నారు. అవకాశాన్ని బట్టి మార్కెట్ లారీలSకు అయితే ఏకంగా రూ.2 వేలు వరకు తీసుకుంటున్నారు. రోజుకి 400 యూనిట్లు వరకు ఇసుక సేకరిస్తున్నారు. యూనిట్ రూ.100 చొప్పున ఓ ప్రజాప్రతినిధికి ముట్టజెప్పుతున్నట్టు చెబుతున్నారు. మండలానికి చెంది న ఇద్దరు ప్రజా ప్రతినిధుల భర్తలతో పాటు కొందరు టీడీపీ నాయకులు ఈ ర్యాంపులను నడుపుతున్నారు. కోడేరులోనూ అదే తీరు ఆచంట మండలం కోడేరు ఇసుక ర్యాంపులో కూడా ఉచిత ఇసుక పేరుతో యథేశ్చగా దోపీడీ సాగుతోంది. యూనిట్ ఇసుక రూ.750 చొప్పున అమ్మకాలు చేస్తూ టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఓ మంత్రి అండదండలతో అధికార పార్టీ నేతలు సిండికేట్గా ఏర్పడి దోచేస్తున్నారు. వసూలు చేస్తున్న సొమ్ములో కూలీలకు రూ. 400 చెల్లిస్తూ మిగిలిన మొత్తం కొట్టేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఇక్కడి నుంచి సుమారు 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేశారు. దాదాపుగా రూ. 30 లక్షల మేర కొల్లగొట్టేసినట్లు సమాచారం. నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు సాగుతున్నా మామూళ్ల మత్తులో అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. బహిరంగ దోపీడికీ పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అన్ని ర్యాంపుల్లో అధికార పార్టీ నేతల దోపిడీ పోలవరం, గుటాల ర్యాంపుల్లో ఓ ఎమ్మెల్యే అనుచరులు చక్రం తిప్పుతున్నారు. గుటాలలో డ్రెడ్జింగ్ కూడా చేస్తున్నారు. గతంలో యంత్రాలను సీజ్ చేసినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలవరం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఇక్కడి వ్యవహారాలు చూసుకుంటున్నారు. యూనిట్ రూ.1,500 లకు పైబడి వసూలు చేస్తున్నారు. నిడదవోలు మండలం పందలపర్రు, పెండ్యాల గ్రామాల్లో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. యూనిట్ ఇసుక లోడ్ చేసేందుకు యూనిట్కు కూలీలకు రూ.175లు వసూలు చేయాల్సివుండగా స్థానిక టీడీపీ నాయకులు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. వాహనాలు వెళ్లేందుకు బాట ఏర్పాటుకు యూనిట్కు రూ.100 అదనంగా వసూలు చేశారు. ఫిర్యాదులు రావడంతో సమిశ్రగూడెం పోలీసులు జనవరి 11వ తేదీన పందలపర్రులో ఇసుక ర్యాంపుపై దాడిచేసి నదిలో నుంచి ఇసుక తరలిస్తున్న 16 లారీలు, 10 ట్రాక్టర్లపై చర్యలు తీసుకు న్నారు. దీంతో ఈ రెండు ర్యాంపులు తాత్కాలికంగా మూతపడ్డాయి. పందలపర్రు, పెండ్యాల ర్యాంపులతో పాటు రావివారిపాలెంలో అక్రమంగా ఇసుక తరలించేందుకు టీడీపీ నాయకులు రోడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓ ఎమ్మెల్యే సహకారంతో స్ధానిక టీడీపీ నాయకులు ఇక్కడ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఎనిమిది ర్యాంపులే నడుస్తున్నాయి జిల్లాలో అధికారికంగా 18 ర్యాంపులకు అనుమతులుంటే ప్రస్తుతం వీటిలో ఎనిమిది మాత్రమే నడుస్తున్నాయి. తాడిపూడి ర్యాంపుని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేటాయిస్తే, ఖండవల్లి ర్యాంపును అర్భన్ హౌసింగ్, భీమవరం హైవే పనులతో పాటు ఇతర ప్రభుత్వ పనుల కోసం కేటాయించారు. ఖండవల్లి ర్యాంపు కూడా మూతపడి నెలరోజులు కావస్తోంది. అఖండ గోదావరి తీరంలో పోలవరం, గుటాల, ప్రక్కిలంక, వేగేశ్వరపురం ర్యాంపులు నడుస్తున్నాయి. వశిష్ట గోదావరి తీరంలో ఆచంట మండలం కోడేరు, యలమంచిలి మండలంలో చించినాడ, యలమంచిలి లంక, దొడ్డిపట్ల నడుస్తున్నాయి. వాస్తవంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో కోడేరుతో పాటు యలమంచిలి మండలం ర్యాంపుల్లో ఇసుకలో ఉప్పుశాతం అధికంగా ఉంటుంది. వీటిని శ్లాబులకు వినియోగిస్తే ఐరన్ తుప్పుపడుతుంది. అందువల్ల నిర్మాణ పనులకు మాత్రమే వాడతారు. ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగింది స్థానికంగా ఉన్న ర్యాంపులు మూతబడటంతో ఇసుక కావాలంటే అక్రమ నిల్వదారులు యూనిట్ రూ.1000 వరకు తీసుకుంటున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. ఉచిత ఇసుక అని ప్రభుత్వం ప్రకటించడం తప్ప ఆచరణలో లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కోసమే రూ.50 వేలు పైనే ఖర్చుచేయాల్సి వస్తోంది. పెరిగిన గృహనిర్మాణ సామాగ్రి ధరలతో ఇల్లు కట్టాలంటే భయంగా ఉంది. – కొండపల్లి శ్రీనివాసరావు, కంసాలిపాలెం -
కడుపులో కాటన్ పెట్టి కుట్టేశారు
-
చంద్రబాబుని నమ్మి మోసపోయాం
-
మా ఊరు పేరు నిలబెట్టాడు..
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: స్టూడెంటు నంబర్ ఒన్ సినిమాతో సినీ వినీలాకాశంలో దర్శకుడిగా వెలసిన ధృవతార ఎస్ఎస్ రాజమౌళి. జిల్లాకు చెందిన ఈయనకు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన 2017లో అత్యధికంగా ఆర్జించిన వినోదరంగ ప్రముఖుల జాబితాలో చోటు దక్కింది. ఈ విషయం తెలుసుకున్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఆయన బం ధువులు, స్నేహితులు, తెలిసిన వారు అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్తం మీద ఎంటర్టైన్మెంటు విభాగంలో అత్యధిక సంపాదనపరుల జాబితాలో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 100 మంది జాబితాలో బాహుబలి జక్కన్న 15 స్థానంలో నిలవడం పట్ల ఆయన సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1973లో కొవ్వూరులో పుట్టిన ఆయన బాల్యం, విద్యాభ్యాసం చాలా వరకూ కొవ్వూరులోనే జరిగింది. కొవ్వూరుకు చెందిన ఆయన దర్శకుడిగా శిఖరానికి చేరుకోవడం ఇక్కడి వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కొవ్వూరుకు పేరు తెచ్చారు రాజమౌళి కొవ్వూరుకే పేరు తెచ్చిన వ్యక్తి. సినిమా రంగంలో ఎంతో మంది దర్శకులు ఉన్నా, జక్కన్నగా పేరు తెచ్చుకోవడం, మా ఊరు వాడు కావడం మాకు ఎంతో గర్వకారణం. నేటి యువతకు రాజమౌళి ఆదర్శంగా నిలుస్తాడు. ఫోర్బ్స్ మ్యాగ్జీన్ ప్రకటించిన 100మంది జాబితాలో ఆయన పేరు ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం – పరిమి హరిచరణ్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి, కొవ్వూరు చాలా ఆనందంగా ఉంది ఎంటర్టైన్మెంటు విభాగంలో అత్యంత సంపాదనాపరులుగా రాజమౌళి పేరు ఉండడం ఆనందంగా ఉంది. ఫోర్బ్స్ మ్యాగ్జీన్ ప్రకటించిన జాబితాలో ఆయన 15వ స్థానంలో నిలవడం కొవ్వూరుకే గర్వకారణం. ఇక్కడ పుట్టి పెరిగిన ఆయనకు పేరు ప్రఖ్యాతులు రావడం గొప్ప విషయం – మద్దుల సత్యన్నారాయణ, లయన్స్ అధ్యక్షుడు, కొవ్వూరు -
అచ్చిబాబును పక్కన పెట్టినట్టేనా?
కొవ్వూరు: టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లింది. మంత్రి ఎదుటే నాయకులు అసంతృప్తి గళం వినిపించడం చర్చనీయాంశమైంది. పార్టీలో మొదటి నుంచి కష్టించి పనిచేసే వాళ్లకు గుర్తింçపునివ్వడం లేదని ఓ సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు సమావేశంలో బయట పడ్డాయి. నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబుకు తగిన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని ఓ నాయకుడు నిలదీసినట్టు సమాచారం. తమ గ్రామంలో రేషన్ దుకాణం కేటాయింపు విషయంలోనూ అన్యాయం చేశారని ఆ నాయకుడు ఆరోపించినట్టు చెబుతున్నారు. ఇటీవల వాడపల్లిలో నిర్వహించిన జనచైతన్య యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అచ్చిబాబు ఫొటో ఎక్కడా ప్రచురించక పోవడానికి గల కారణం ఏమిటని ఆయన నిలదీసినట్టు తెలిసింది. జవహర్కి టికెట్ కేటాయింపు సమయంలో అచ్చిబాబు పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించిన విషయం మరిచిపోవద్దంటూ హితవు పలికినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో అచ్చిబాబు రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు ఆయన ప్రాధాన్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు తెలిసింది. కేవలం తాను అచ్చిబాబు మనిషి అన్న కారణంతోనే జిల్లాలో కీలక పదవి నుంచి తనను తొలగించారని ఆ నాయకుడు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. పార్టీ సభ్వత్వాల కోసం మూడు నెలలు అహ ర్నిశలు కష్టపడ్డానని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలకు గుర్తింపునివ్వ డంలేదని మండిపడినట్టు సమాచారం. అభివృద్ధి పనుల్లోనూ అన్యాయం అభివృద్ధి పనులు కేటాయింపులోను ప్రతిపక్ష నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యం కుడా పార్టీ నాయకులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ కోసం ఇన్నాళ్లు పని చేసిన కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తున్నారని నిలదీసినట్టు తెలుస్తోంది. పార్టీకి వీరవిధేయుడిగా పేరున్న ఆ నాయకుడి ప్రశ్నలకు ఏ ఒక్కరు నోరు మెదపలేదని సమాచారం. అచ్చిబాబును పక్కన పెట్టినట్టేనా? ఇటీవల చోటు చేసు కుంటున్న పరిణామాలు చూస్తుంటే అచ్చిబాబుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గినట్టే ప్రచారం సాగుతోంది. ఇటీవల మండలంలోని ఓ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కొవ్వూరు నాయకులు తమ గ్రామంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతోనే సమావేశానికి రాలేదని ఓ ముఖ్య నాయకుడు ఆరోపించడంపైనా పట్టణానికి చెందిన ప్రముఖ నాయకులు నియోజకవర్గ సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరు కాలేదని, అంతమాత్రాన ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తారా అని నిలదీసినట్టు తెలిసింది. దీంతో సమావేశం రసాభాసగానే ముగిసింది. సమావేశంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి కేవీకే రంగారావు, జడ్పీటీసీ కైగాల మంగాభవానీ, కైగాల శ్రీనివాసరావు,కాకర్ల బ్రహ్మాజీ, అనుపిండి చక్రధరరావు, కోడూరి ప్రసాద్, వట్టికూటి వెంకటేశ్వరరావు, పాలడుగుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
జవహర్ జవదాటు
చెప్పుల కాళ్లతో శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాల తొలగింపుపై చింతిస్తున్నాం. కమిటీ రాతపూర్వకంగా వినతి పత్రం అందజేస్తే విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. హిందువుల మనోభావాలను గౌరవిస్తాం. – కేఎస్ జవహర్, రాష్ట్ర పొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి (శుక్రవారం మాట్లాడిన మాటలివీ..) శ్రీనివాస స్నాన ఘట్టంలో నీటిపారుదల శాఖ స్థలంలో అనుమతి లేకుండా పూజలు, ఇతర కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. నిర్వహిస్తే శాంతిభద్రతల దృష్ట్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్బీవీ శుభాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, పట్టణ పోలీసు స్టేషన్, కొవ్వూరు (ఈ మేరకు నోటీసూ జారీ చేశారు) కొవ్వూరు: జవహర్ అన్నమాట జవదాటారా? హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదా.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. శ్రీనివాస స్నానఘట్టంలో నిషేధాజ్ఞలు విధిస్తూ.. పోలీసులు తాజాగా జారీ చేసిన నోటీసు హిందువుల్లో ఆగ్రహం రేపుతోంది. కానరాని ప్రభుత్వ చొరవ కొవ్వూరు శ్రీనివాస స్నానఘట్టంలో చెప్పుల కాళ్లతో శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాల తొలగింపు వ్యవహారంపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఈ దుశ్చర్యను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు. భక్తులకు మద్దతు తెలిపారు. సున్నితమైన ఈ సమస్య పరిష్కారానికి చొరవచూపాల్సిన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పైపెచ్చు సమస్యను మరింత జఠిలం చేసేలా యత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తుకొచ్చిన శాంతిభద్రతలు ఓ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ.. విగ్రహాలు తొలగించిన రోజున గుర్తుకురాని శాంతిభద్రతలు ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకొచ్చాయి. విగ్రహాల తొలగింపును నిరసిస్తూ.. శుక్రవారం భక్తులు శివలింగానికి 108 బిందెలతో అభిషేకాలు చేశారు. మంత్రి కేఎస్ జవహర్కు, ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గణపతి హోమం చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు చిర్రెత్తుకు వచ్చింది. శాంతి భద్రతలు గుర్తుకు వచ్చాయి. స్నానఘట్టంలో అనుమతిలేకుండా ఎలాంటి పూజలు, ఇతర కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, అలాచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల ద్వారా తాఖీదులు జారీ చేసింది. ఈ చర్య సమస్యకు ఆజ్యం పోసినట్టయింది. శాంతియుతంగానే ఆందోళన హిందూ సంప్రదాయంలో కార్తీక మాసంలో శివరాధనకు అంత్యంత ప్రాముఖ్యం ఉంది. విగ్రహాలు తొలగించిన ప్రదేశంలోనే పునః ప్రతిష్ఠించాలని కొద్దిరోజుల నుంచి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు మద్దతు ప్రకటించాయి. భక్తులకు అండగా నిలిచాయి. చేతికి సంకెళ్లు వేసుకుని, నోటికి æనల్ల రిబ్బ న్లు కట్టుకుని అఖిలపక్షం ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. అధికారులకు, దేవాదాయ శాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పిం చారు. ఇప్పటి వరకు ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన దాఖాలాల్లేవు. విగ్రహాలు తొలగించిన రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. అనంతరం నిర్వహించిన కార్యక్రమాలన్నీ శాంతియుత మార్గంలోనే నడిచాయి. ఇలాంటి తరుణంలో పోలీసులు తాఖీదులు ఇవ్వడం దూమారం రేపుతోంది. విగ్రహాలు ప్రతిష్ఠించాలి : సోము వీర్రాజు ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, నాయకులతో కలిసి విగ్రహాలు తొలగింపు ప్రాంతాన్ని సందర్శించారు. వెంటనే విగ్రహాల ప్రతిష్ఠకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాలను పునః ప్రతిష్ఠించి తీరుతామని ఆయన ప్రకటించడం, శాసనమండలిలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. స్నానఘట్టంలో పోలీసులు మోహరించడంపై ఆయన మండిపడ్డారు. ఇంతమంది పోలీసుల అవసరమేముందని, తమను అరెస్టు చేస్తారా అని ఘాటుగా ప్రశ్నించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రమైన కొవ్వూరులో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని, రిసార్ట్ల పేరుతో భక్తికి విరుద్ధమైన బార్లు ఏర్పాటు చేయకూడని డిమాండ్ చేశారు. గోదావరి పవిత్రతను దృష్టిలో ఉంచుకుని నదీతీరంలో చెత్త డంపింగ్ చేయడం, పందుల ఆవాసాలు ఏర్పాటు చేయడం వంటి వాటిపై అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధిపై కలెక్టర్, మంత్రి జవహర్, దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావులతో మాట్లాడతానన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ముప్పరాజు శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బీవీ ముత్యాలరావు, నాయకులు పరిమి రా«ధాకృష్ణ, పిల్లలమర్రి మురళీకృష్ణ, సలాది సందీప్కుమార్, దేవగుప్తాపు లక్ష్మణరావు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కొండపల్లి రత్నసాయి, మాసా ఆనంద్, వీరమాచినేని చైతన్య, పెరుగు పోతురాజు, మండల పార్టీ అధ్యక్షుడు గన్నమని భాస్కరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పరిమి హరిచరణ్, దళిత విభాగం రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి విజయరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల ఉదయభాస్కరరావు, నాయకులు నగళ్లపాటి శ్రీనివాస్, అడ్డూరి సుబ్బారావు,స్ధానికులు అనపర్తి శివరామ కృష్ణ, ఉప్పులూరి కృష్ణారావు, ఆర్యాద్యుల రాధాదేవి తదితరులు వెంట ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఘటనా స్థలానికి రాని టీడీపీ నాయకులూ విగ్రహాలు తొలగించిన ప్రాంతాన్ని సందర్శించి చెప్పులతో విగ్రహాలు తొలగింపును ఖండిస్తున్నట్టు ప్రకటించారు. -
కొవ్వూరులో దేవుడు విగ్రహాల తొలగింపు
-
మంత్రికి మంచిబుద్ధి ప్రసాదించాలని..
కొవ్వూరు : శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాలు తొలగించిన ప్రభుత్వానికి, మంత్రి కేఎస్ జవహర్కు మంచి బుద్ధిని ప్రసాదించి, విగ్రహాలు పునః ప్రతిష్టించే విధంగా చేయాలని కోరుతూ పట్టణంలో శ్రీనివాసపురం కాలనీ వాసులు శుక్రవారం గణపతి హోమం నిర్వహించారు. విగ్రహాలు తొలగించిన ప్రదేశంలో గణపతి హోమం నిర్వహించి పూజలు చేశారు. విగ్రహాల తొలగింపు సమయంలో కనీసం సంప్రోక్షణ చేయకపోవడం ఘోర అపచారమని ఈ హోమం చేసినట్టు స్థానిక భక్తులు తెలిపారు. అక్కడే ఉన్న మరో శివలింగానికి గోదావరి నీళ్లతో భక్తులు 108 బిందెలతో అభిషేకం చేశారు. విగ్రహాలు పునఃప్రతిష్టించే విధంగా ప్రభుత్వానికి, స్థానిక మంత్రి జవహర్కు మంచిబుద్ధి ప్రసాదించాలని కోరారు. అనపర్తి శివరామకృష్ణ, సిద్ధినేని రాఘవ, బిక్కిన రామకృష్ణ, మద్దూకూరి గణేష్, పి.సరోజిని దేవి, బి.వెంకటలక్ష్మి, ఆరాజ్యుల రాధాదేవి, సీహెచ్ సత్యవతి, ఎం.దుర్గ, జి.కుసుమ, జి.మల్లేశ్వరీ, పి.హేమ పాల్గొన్నారు. -
టీడీపీ పెద్దలకు స్థలం ఇచ్చేందుకు శివలింగం ధ్వంసం!
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ఓ స్నానఘట్టంలో ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టూరిజం పేరుతో టీడీపీ పెద్దలకు స్థలం కేటాయించేందుకు ఏకంగా స్నానఘట్టంలోని శివలింగంతోపాటు దేవతా విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. దీన్ని అడ్డుకున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసుల తీరుకు నిరసనగా తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. -
ఉద్విఘ్నం... ఉద్రిక్తం
రోడ్డు ప్రమాదంపై స్థానికుల ఆందోళన పోలీసుల ఓవరాక్షన్కు నిరసనగా రోడ్డుపై బైఠాయింపు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన మృతుడి బంధువు కొవ్వూరు రూరల్: పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈజీకే (ఏలూరు, గుండుగొలను, కొవ్వూరు) రోడ్డులో కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద గుర్తు తెలియని వాహనం డీకొట్టడంతో అదే గ్రామానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ తూతా రమేష్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతుడి బంధువులు, గ్రామస్థులు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి నాగరాజు, జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, సొసైటీ అద్యక్షుడు గారపాటి శ్రీరామకృష్ణల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మృతదేహం వద్దే టెంట్లు వేసి ఉదయం 10.30 గంటల నుంచి అక్కడే భైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ పి. ప్రసాదరావు బాధితులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని, రోడ్డు పరిమితికి మించి వాహనాలు వెళుతున్నాయని, కేవలం గామన్బ్రిడ్జి టోల్గేట్ ఆదాయం కోసం భారీ వాహనాలను ఇటువైపు మళ్లిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో బి. శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించాల్సిందిగా తహసిల్దార్ విజయకుమార్ను ఆదేశించడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని వారితో చర్చించారు. అసలు గామన్ వంతెనపై నుంచి వెళ్లడానికి అనుమతులు లేవని, అనధికారికంగా టోల్గేట్ వసూలు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే వాహనాల రాకపోకలను అడ్డుకుంటామంటూ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి నాగరాజు, జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవిలు కొందరు ఆందోళనకారులతో కలిసి గామన్ వంతెన ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఐరన్ పైపులతో వాహనాలు వెళ్లకుండా కాంక్రీట్తో బారికేడ్లను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను హెచ్చరించారు. అవసరం అయితే మృతదేహం వద్ద ధర్నా చేసుకోండని, రోడ్డు మార్గాన్ని మూస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో అందరిని అరెస్టు చేయాలంటూ ఆందోళనకారులతో కలిసి జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, ముదునూరి నాగరాజులు రోడ్డుపై భైఠాయించారు. పరిస్థితి అందోళనకరంగా మారుతున్న దశలో ఆర్డీవో శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గుండుగొలను వద్ద నుంచి ట్రాఫిక్ మళ్లించడం జరిగిందని, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా గామన్ వంతెనపైకి భారీ వాహనాలు రాకుండా అక్కడి కలెక్టర్తో పశ్చిమ కలెక్టర్ మాట్లాడారని, బుధవారం నుంచి గామ¯Œన్ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఆర్డీవో సూచనతో ఆందోళనకారులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చించి వెంటనే మీకు తెలియజేస్తామని అక్కడి నుంచి గ్రామంలోని మృతదేహం వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, రాజమండ్రి నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఐరన్ పైపులను పోలీసులే తొలగించి ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో పోలీసుల చర్చలు ఆందోళనకారులతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పలు ధపాలుగా చేసిన చర్చలు విఫలం అవడంతో ఆందోళన తీవ్రతరమయ్యింది. డీఎస్పీ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ విజయకుమార్తో ఆర్అండ్బీ ఈఈ ఆందోళనకారులతో చర్చించారు. మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకోవాలని, ప్రమాదమానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి చంద్రన్న బీమా, ప్రమాదబీమా ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అయితే గామన్ బ్రిడ్జి పైకి భారీ వాహనాల రాకపోకలే ప్రధాన కారణంగా చెబుతూ మృతుడి కుటుంబానికి టోల్గేట్ నిర్వాహకుల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని, లేని పక్షంలో మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకోమని హెచ్చరించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని తరలించే సమయంలో ఉద్రిక్తత ఆందోళనకారులతో చర్చలు సఫలం కాకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో మృతుడి బంధువైన ఓ యువకుడు న్యాయం చేయకుండా మృతదేహాన్ని తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొవ్వూరు పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో సంఘటనా ప్రాంతంలో వేసిన టెంటులను పోలీసులే తొలగించారు. మహిళలని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా మృతదేహం వద్ద నుంచి బలవంతంగా ఈడ్చుకుపోయారు. పోలీసులను అడ్డుకున్నారంటూ మరో ఇద్దరు యువకులను కొట్టి ఈడ్చుకుంటూ లాక్కుపోయారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అదే సమయంలో పోలీసులు బంధువులను చెదరగొట్టి మృతదేహాన్ని ఆటోలో కొవ్వూరు ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చెయ్యమంటే కొడతారా తమకు న్యాయం చెయ్యమని ఆందోళన చేస్తుంటే పోలీసులు కొడతారా అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. -
నా రూటే సపరేటు!
కొవ్వూరులో మంత్రి పోటీ కార్యక్రమం జెండా వందనానికి ఏర్పాట్లు ఆర్డీఓ పేరుతో ఆహ్వాన పత్రిక సాక్షి ప్రతినిధి, ఏలూరు : నా రూటే సపరేటు అంటున్నారు అబ్కారీ మంత్రిగారు... ఈసారి జిల్లా ఇంఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు జెండా వందనం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో తన నియోజకవర్గంలో పోటీగా కార్యక్రమం నిర్వహించేందుకు మంత్రి కె ఎస్ జవహర్ చేస్తున్న ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆర్డీఓ పేరుతో దీని కోసం ఆహ్వాన పత్రిక కూడా వేయించారు. జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తుంది. అక్కడే జెండా వందనం చేసిన మంత్రి గారి సందేశం, పోలీసు వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసా పత్రాల ప్రదానం, లబ్దిదారులకు వివిధ ప్రభుత్వ పథకాల రాయితీల పంపిణీ ఉంటుంది. ఈ ఏడాది కూడా ఏలూరులో పోలీసు పెరెడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీ. అధికారికంగా మాత్రం జిల్లాను యూనిట్గా తీసుకుని జిల్లా కేంద్రంలో ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. దీనికి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మంత్రి జెండా ఎగువవేయడం రివాజుగా వస్తుంది. గత మూడేళ్లు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జెండా అవిష్కరణ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది జిల్లా ఇంఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరును ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్ర పొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాత్రం కొత్త పం«థాకు తెరలేపారు. కొవ్వూరులో మాత్రం అన్ని శాఖల అ«ధికారుల భాగస్వామ్యంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేశారు. దీనికి ఆర్డీఓ పేరుతో ఆహ్వాన పత్రం ముద్రించడం తోపాటు అన్ని శాఖల అధికారులతో ఆయన ఏర్పాట్లు సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు శకటాలను సైతం ఏర్పాటు చేశాయి. ఇతర శాఖలను అడిగినా వారు సానుకూలంగా స్పందించలేదు. మరో ఆరుశాఖలు స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అధికారులంతా గత మూడు, నాలుగు రోజుల నుంచి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నాలుగు రోజుల పాటు వరుసగా సెలవులు వచ్చినప్పటికీ మంత్రి ఆగ్రహానికి లోనుకావాల్సి వస్తుందని అధికారులు ఏర్పాట్లులో తలమునకలయ్యారు. కొవ్వూరు మండలంతో పాటు పట్టణ వ్యాప్తంగా ఉన్న విద్యార్ధులను తరలించే బాధ్యతను ఎంఈఓకు అప్పగించారు. ఒక్కో శకటం తయారీకి రూ.50 వేలు ఖర్చువుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఖర్చులకు సంబంధించిన బిల్లులు అందజేస్తే సొమ్ములు చెల్లిస్తామని ఆర్డీఓ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తీరా ఖర్చు చేసిన తర్వాత సొమ్ములు వస్తాయో రావోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అందించే యంత్ర పరికరాలు, సబ్సిడీపై అందించే పరికరాలు, ఇతర శాఖలు ద్వారా అందించే సబ్సిడీ సామగ్రి అంతా ఈ వేడుకలకు తరలిస్తున్నారు. పట్టణంలో సంస్కృత పాఠశాలలో భారీ ఎత్తున నిర్వహించే ఈ వేడుకలకు సుమారు నాలుగు వేల మంది హాజరవుతారని ఆర్డీఓ బి.శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రాంగణంలో ఏర్పాట్లును ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. కుర్చీలు, టెంటులు, వేదికలు, తాగునీరు, డ్రింక్స్ వంటి ఏర్పాటు చేశారు. వీటికి సుమారు రూ.ఐదు లక్షలకు పైనే ఖర్చులు అవుతున్నట్టు అంచనా. ఈ భారమంతా అధికారులపైనే వేస్తున్నారన్న విమర్శలున్నాయి. మొత్తానికి పోటీగా జరుపుతున్న ఈ వేడుకలు జిల్లాలో చర్చకు దారితీసాయి. -
గ్యాస్ మంట
కొవ్వూరు : ఇకపై జనం నెత్తినే వంట గ్యాస్ సబ్సిడీ పడనుంది. దీనికి కేంద్రం సుముఖంగా ఉన్నట్టు లోక్సభలో కేంద్రమంత్రి దర్మేంద్రప్రధాన్ లిఖితపూర్వకంగా వెల్లడించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జూలై నుంచి గ్యాస్ సిలిండర్పై రూ.4 పెంచనున్నట్టు ఆయన ప్రకటించడంపైనా ఆందోళన రేగుతోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15,72,415 గృహావసర వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ప్రతి వినియోగదారునికీ మొత్తం 12 సిలిండర్లు సబ్సిడీపై లభిస్తున్నాయి. అంత కంటే ఎక్కువ వినియోగిస్తే సబ్సిడీ లేకుండా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సబ్సిడీని పూర్తిగా తొలగించే వరకు లేదా మార్చి 2018 వరకు, లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతినెలా రూ.4 చొప్పున సిలిండర్ ధరను పెంచుతున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. 2014 నుంచి సబ్సిడీ 2014 నవంబర్ నుంచి వంటగ్యాస్పై కేంద్రం రాయితీ ఇస్తోంది. దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తోంది. ముందుగా లబ్ధిదారుడు ప్రభుత్వం అందించే సబ్సిడీ సోమ్ముతో కలిపి సిలిండర్ ధర చెల్లించి కొనుగోలు చేస్తే తర్వాత సబ్సిడీ సొమ్ము జమ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సబ్సిడీ సోమ్ము రూ.200లకు పైబడి ఉండేది. ఈనెల రూ.41కి తగ్గిపోయింది. గ్యాస్ ధర ఆధారంగా సబ్సిడీ నిర్ధారణ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పుడు కేంద్రం యత్నిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.ఐదు కోట్ల భారం: తాజాగా సిలిండర్ ధర రూ.4 చొప్పున పెంచడం వల్ల జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.63 లక్షలకుపైగా భారం పడుతున్నట్టు అంచనా. ఈ లెక్కన ఏడాదికి రూ.7కోట్లకుపైగా భారం పడుతుందని తెలుస్తోంది. సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తే..! అదే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తే భారం పదిరెట్లు పెరగనుంది. ఉదాహరణకు ఆగస్టులో ఒక్కో సిలిండర్పై రూ.41 చొప్పున సబ్సిడీ అందించాలని చరుము కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన లెక్కిస్తే జిల్లాలో మొత్తం లబ్ధిదారులపై నెలకు రూ.6,44,69,015 చొప్పున సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ లెక్కన ఈ భారం ఏడాదికి సుమారు రూ.77.33కోట్లు ఉంటుందని అంచనా. క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతగ్గుల వల్ల గ్యాస్ ధరలల్లో స్వల్ప మార్పులున్నా.. సబ్సిడీ ఎత్తివేస్తే వినియోగదారులపై రెట్టింపు భారం పడుతుందనడంలో సందేహం లేదు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో మళ్లీ పేదలు వంటగ్యాస్ భారం తగ్గించుకోవడం కోసం కట్టెల పొయ్యిల వైపు అడుగులు వేయక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. సమజసం కాదు మార్చి నుంచి అన్ని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ తొలగిస్తామని ప్రకటించడం సమజసం కాదు. ఇప్పటికే సిలిండర్ పొందాలంటే సబ్సిడీ సోమ్ము కలిపి చెల్లించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సిలిండర్పై నెలకు రూ.4ల చొప్పున ధర పెంచడం పేదలపై మరింత భారం పడుతుంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటనపై స్పదించకపోవడం బాధాకరం. తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొవ్వూరు ఇబ్బందే గ్యాస్పై ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి పూర్తిగా ఎత్తి వేస్తామని చెప్పడం సరికాదు. మహిళలు చాలా బ్బంది పడాల్సి వస్తోంది. సిలిండర్కు రూ.4 చొప్పున పెంచుతామని చెప్పడం కూడా తగదు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. కావూరి కుమారి, మహిళా సర్పంచ్ వేగేశ్వరపురం -
కష్టాలను నిలువరించేనా!
ఇసుక ధరలకు రెక్కలు గోదావరి వరదతో మూతపడిన ర్యాంపులు నిండుకున్న నిల్వలు చెలరేగుతున్న అక్రమార్కులు అక్రమ నిల్వలతో ఇష్టారాజ్యంగా దోపిడీ ర్యాంపులంతా.. మాయాజాలం అమలుకాని జీఓ కొవ్వూరు : జిల్లాలో ఇసుక ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గోదావరి వరద దృష్ట్యా ర్యాంపులన్నీ మూతపడడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. ఫలితంగా తగినన్ని నిల్వలు లేకపోవడంతో ధర పెరిగింది. దీనిని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు చెలరేగుతున్నారు. అక్రమ నిల్వలు పెట్టుకుని జోరుగా వ్యాపారం చేస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. యూనిట్ రూ.2,500! నదీతీరంలోని ఓపెన్ ర్యాంపుల్లో యూనిట్ ఇసుకను రూ.175 నుంచి రూ.200 వరకూ అమ్మాలని, నది మధ్యలోని ర్యాంపుల్లో రూ.800 నుంచి రూ.900 వరకూ అమ్మాలని అధికారులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఎక్కడా ఇసుక నిల్వలు లేకపోవడంతో అక్రమార్కులు యూనిట్ ఇసుకను రూ.2వేల నుంచి రూ.2,500 వరకు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఇసుక దొరకని దుస్థితి నెలకొంది. ఈ ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. ఎక్కడికక్కడే నిర్మాణాలు నిలిచాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ర్యాంపుల మూతతో ఇక్కట్లు జిల్లాలో అధికారిక ర్యాంపులు పది ఉన్నాయి. వీటిలో మూడు ర్యాంపులు 20 రోజుల క్రితం, వారం నుంచి మరో ఐదు ర్యాంపులు మూతపడ్డాయి. మిగిలిన కొవ్వూరు, ఔరంగబాద్లో ర్యాంపుల్లో మాత్రమే ప్రస్తుతం అరకొర తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో ఇసుక ర్యాంపుల్లో నిల్వలు నిండుకున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు అడ్డూఅదుపు లేకుండా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అ«ధికారులు ఆ దిశగా యత్నించడం లేదు. దీంతో సామాన్యులు పాట్లు పడుతన్నారు. ర్యాంపుల్లో.. మాయాజాలం..? జిల్లాలో పూడిక తీత పేరుతో నదిమధ్యలో పోలవరం, గూటాల, తాడిపూడి, ప్రక్కిలంక, కొవ్వూరు, ఔరంగబాద్లో ర్యాంపులకు అనుమతి చ్చారు. పోలవరంలో లక్ష క్యూబిక్ మీటర్లు(సీఎం), గుటాలలో 90 వేల సీఎం, తాడిపూడి, ప్రక్కిలంకలో 80వేల సీబీ, కొవ్వూరు, ఔరంగాబాద్ల్లో 1.20 లక్షల సీఎం చొప్పున తవ్వకాలకు అనుమతిచ్చారు. అంటే ఒక్కో ర్యాంపులో రోజుకు సరాసరి 300 యూనిట్ల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ లెక్కన ర్యాంపుల్లో నిర్దేశిత ఇసుకను ఎప్పుడో తవ్వేసి ఉంటారని అంచనా. విచిత్రమేటంటే అధికారులు ర్యాంపుల్లో ఇసుక ఎంతమేర తవ్వాలనేది నిర్దేశిస్తారుగానీ, రోజుకు ఎంత తవ్వుతున్నారు? ఎంత తరలిస్తున్నారో పరిశీలించరు. ఆ లెక్కలూ వారి వద్ద ఉండవు. దీంతో నిర్దేశించిన గడువు వరకు అక్రమార్కులు ఇసుక తవ్వకాలు చేస్తూనే ఉంటారు. ఒక వేళ అధికారులు ఇప్పుడు మేల్కొని అక్రమ తవ్వకాలకు కళ్లెం వేద్దామన్న వరద వల్ల తవ్విన ప్రాంతమంతా చెదిరిపోయింది. దీంతో ఎంత తవ్వారన్నదీ లెక్క కట్టే వీలు ఉండదు. అదనంగా తవ్విన ప్రాంతంలోనూ వరద వల్ల కొత్త గుట్టలు ఏర్పడతాయి. దీంతో ఇసుక తవ్వకాలకు ఢోకా ఉండదు. గతంలో ర్యాంపుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినా.. ఉచిత ఇసుక పాలసీ పేరుతో వాటిని మూలనపడ వేశారు. ఓపెన్ ర్యాంపుల్లోనూ.. జిల్లాలో ఓపెన్ ర్యాంపులుగా తవ్వకాలకు అనుమతిచ్చిన కోడేరులో 4.999 ఎకరాల విస్తీర్ణంలో 42,400 సీఎం, ఖండవల్లిలో 1.800 ఎకరాల విస్తీర్ణంలో 12,600 సీఎం, ముత్యాల ంపాలెంకోడేరు ర్యాంపుల్లో 1.450 ఎకరాల విస్తీర్ణంలో 14,500 సీఎం, వేగేశ్వరపురంలో 2.165 ఎకరాల విస్తీర్ణంలో 21,650 సీఎంల ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ నాలుగు ర్యాంపుల్లో 91,150 సీఎం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. వాస్తవంగా ఓపెన్ ర్యాంపుల్లో రోజుకు 300 నుంచి 500 లారీల వరకు ఇసుక తవ్వకాలు చేశారు. అంటే రోజుకు సరాసరి మూడు వేల నుంచి నాలుగు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు చేశారు. అంటే నిర్దేశించిన ఇసుకను కేవలం వారం వ్యవధిలోనే తవ్వేసి ఉంటారనేది అంచనా. అంటే నిర్దేశిత క్యూబిక్ మీటర్ల కంటే అదనంగానే ఇక్కడ ఇసుక తవ్వకాలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వరకు ఇసుక తవ్వుకునేలా అధికారులు పర్యావరణ అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు తవ్విన ఇసుకకు అధికారులు వద్ద లెక్కల్లేవు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు యథేచ్ఛగా ఇసుక తవ్వుకునే వీలు అనుమతిదారులకు ఉంది. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇప్పటివరకు తవ్విన ఆనవాళ్లన్నీ గోదారమ్మ గర్భంలో కలిసిపోవడం అక్రమ తవ్వకాలకు మరింత ఊతమిచ్చినట్టయింది. జీఓ తుంగలో.. 2016లో ఇసుక ర్యాంపుల్లో అక్రమాల నియంత్రణ కోసం ప్రభుత్వం జీఓ 42ను విడుదల చేసింది. ఇది ఇప్పటివరకూ అమలైన దాఖలా లేదు. కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా శాండ్ మైనింగ్ కమిటీ మండల స్థాయిలో ఎస్సై, డెప్యూటీ తహశిల్ధార్, రాయల్టీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు దీనిని అమలు చేయాలి. కాల్సెంటర్, వెబ్సైట్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరించాల్సి ఉంది. జీఓ ప్రకారం.. అనధికారిక ర్యాంపుల్లో తవ్వకాలు చేసినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా లారీ, టిప్పర్, ఇతర వాహనాలకు రూ.లక్ష జరిమానా, రెండేళ్లు శిక్ష విధించాలి. ఇసుకను నిర్మాణ పనులకు తప్ప పూడ్చడానికి వినియోగించకుడదు. అక్రమ నిల్వలు పెట్టకుడదు. ర్యాంపులు ఆ««ధీనంలో పెట్టుకున్నా, సిండికేట్లుగా మారి ఇసుక విక్రయాలు సాగించినా రెండేళ్లు జైలు, రూ.2లక్షల వరకు జరిమానా విధించాలి. ర్యాంపుల్లో ఇసుక లోడింగ్కు గానీ, తవ్వకాలకు గానీ యంత్రాలను వినియోగించ కుడదు. వాడితే వాటిని సీజ్ చేయవచ్చు. టీడీపీ నేతలే ర్యాంపుల్లో తిష్టవేయడంతో జీఓను అమలు చేయలేక అధికారుల చేష్టలుడిగి చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు కదలిక! ఇసుక అక్రమ తవ్వకాలు, విక్రయాలతో అప్రతిష్టను మూటకట్టుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరిచినట్టు కనిపిస్తోంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. ఇప్పుడు నింబధనల పేరుతో మళ్లీ జూలు విదులుస్తున్నారు. అయితే ఇప్పటికైనా వారు అక్రమార్కులకు కళ్లెం వేసి, సామాన్యుల కష్టాలను నిలువరిస్తారో లేదో వేచిచూడాల్సిందే. యంత్రాలు వినియోగిస్తే సీజ్ చేస్తాం ఇసుక ర్యాంపుల్లో యంత్రాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. లోడింగ్కి వినియోగించినా యంత్రాలను సీజ్ చేయిస్తాం. సంబంధిత వ్యక్తులపై కేసు పెడతాం.అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. నిర్వాహాకులపై కేసు నమోదు చేస్తాం. జి.మణికంఠ రాజు, ఏఈ, ఏజీఆర్బీ, కొవ్వూరు -
గోదారి పరవళ్లు
4,27,022 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి.. నెమ్మదిస్తున్న వరద డెల్టాకు నీటి విడుదల భారీగా పెంపు కొవ్వూరు: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువున నీటిమట్టాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో దిగువనున్న ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం ఆనకట్టకు నాలుగు ఆర్మ్లు వద్ద ఉన్న 175 గేట్లున మీటర్లున్నర ఎత్తులేపి 4,27,022 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. శనివారం సాయంత్రం ఆనకట్ట వద్ద నీటిమట్టం 8.90 అడుగులుగా నమోదైంది. తగ్గుతున్న నీటిమట్టాలు కాళేశ్వరంలో 5.44 మీటర్లు, పేరూరులో 8.04 మీ, దుమ్ముగూడెంలో 8.50 మీ, భద్రాచలంలో 29.30 అడుగులు, కూనవరంలో 10.66 అడుగులు, కుంటలో 5.60 మీటర్లు, పోలవరంలో 9.80 మీటర్లు, రోడ్డు కం రైలు వంతెన వద్ద 14.71 మీటర్లు చొప్పున నమోదయ్యాయి. సోమవారం సాయంత్రానికి వరద ఉదృతి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
వరద గోదారి
నదికి వరద పోటు 4,39,969 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల ఎగువప్రాంతంలో తగ్గుముఖం పట్టిన నీటిమట్టాలు కొవ్వూరు : గోదావరిలో వరద ఉగ్రరూపం దాల్చింది. దీంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సీజన్లోనే అత్య«ధికంగా వరద పోటు తగిలింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో కూడా భారీ వానలు కురవడంతో వరద ముంచెత్తింది. పోలవరం మండలంలోని కాజ్వేలపైకి వరద నీరు చేరడంతో 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. యలమంచిలి మండలం కానగాయలంక కాజ్వే పై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువున నీటిమట్టాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో మరో ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆరుగంటలకు గరిష్టంగా 5,60,324 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడిచిపెట్టగా సాయంత్రానికి ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గింది. దీంతో ధవళేశ్వరం ఆనకట్టకు నాలుగు ఆర్మ్లు వద్ద ఉన్న 175 గేట్లను రెండు మీటర్లు ఎత్తు లేపి 4,39,969 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉదయం నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం సాయంత్రం 36.70 అడుగులకు చేరిన భద్రచలం నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి నెమ్మదిగా తగ్గుతూ 34.40 అడుగులకు చేరింది. శుక్రవారం సాయంత్రం ఆనకట్ట వద్ద నీటిమట్టం 8.70 అడుగులుగా నమోదైంది. ఉభయగోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు నీటివిడుదలను భారీ పెంచారు. మూడు డెల్టాకు 10,400 క్యూసెక్కుల నీరు సాగునీటి అవసరాల నిమిత్తం విడిచిపెడుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తగ్గుతున్న నీటిమట్టాలు ఎగువున కాలేశ్వరంలో 6.49 మీటర్లు పేరూరులో 9.49, దుమ్ముగూడెం లో 9.76, కూనవరంలో 12.72, కుంటలో 7.22 మీటర్లకు నీటిమట్టాలు తగ్గాయి. పోలవరంలో 10.36 మీటర్ల నుంచి 11.01 మీటర్లకు, రోడ్డు కం రైలు వంతెన వద్ద 14.02 నుంచి 15.19 మీటర్లకు పెరిగాయి. శనివారం సాయంత్రానికి ధవళేశ్వరంలో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. పోలవరంలో.. పోలవరం : గోదావరి వరదనీరు మరింత పెరిగింది. పోలవరంలోని కడెమ్మ స్లూయిస్ వద్ద 1.28 మీటర్లు ఉన్న గోదావరి వరద నీటి మట్టం శుక్రవారం 3.25 మీటర్లకు పెరిగింది. ప్రస్తుతం వరద నిలకడగా ఉన్నప్పటికీ, రెండు రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మండలంలోని కొత్తూరు కాజ్వే వరదనీటిలో మునగటంతో కోండ్రుకోట, తూటిగుంట, కొరుటూరు పంచాయతీల పరిధిలోని 19 ఏజెన్సీ గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు మండలంలో దాచారం, గొమ్ముగూడెం పంచాయతీల పరిధిలో దాదాపు 10 గ్రామాలకు రోడ్డు మార్గం మునిగిపోయింది. దీంతో 20 కి.మీ అదనంగా ప్రయాణించి ఆయా గ్రామాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలకు కూడా ఈ రోడ్డుపై నుంచి చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. -
విమర్శలతో సరి
కొవ్వూరు/కొవ్వూరు రూరల్ : తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు నేతల ప్రసంగాలకే పరిమితమైంది. ప్రతిపక్షంపై విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై ఏ విధమైన చర్చ చేపట్టలేదు. కొవ్వూరులో ఉదయం 11.05 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 1.55 గంటల వరకు సాగింది. నేతలు ముందు నుంచి ఇరవై ఐదు వేల మంది హాజరవుతున్నారని ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఆశించినస్థాయిలో జనం హాజరు కాలేదు. పైగా సభ ప్రారంభమైన కొద్ది సేపటికే భోజనాలు ప్రారంభం కావడంతో జనం భోజనాలకు వెళ్లి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. దీంతో గంట ఆలస్యంగా ప్రారంభమైన సమావేశంను మూడు గంటల్లోనే ముగించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ ఎ¯ŒSటీఆర్ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ఈయన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. జిల్లా ఇ¯ŒSచార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అధికారులు కార్డుదారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. క్యాష్లెస్ లావాదేవీలు ఇష్టమైన వాళ్లు చేతులెత్తండి... అనగానే ఒక్క చెయ్యి లేవకపోవడంతో మంత్రి విస్తుపోయారు. దీనిపై తక్షణమే కలెక్టర్, జేసీలతో మాట్లాడాతానన్నారు. అధికారులు ఈ వి«ధానంపై ఒత్తిడి చేస్తే సస్పెండ్ చేయిస్తామని హెచ్చరించారు. డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడిపై ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వైఎస్సార్ సీపీ సీబీఐ విచారణ కోరడంలో అర్థం లేదన్నారు. మంత్రి పితాని సత్యనారాయణ కేవలం సమావేశానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపి ప్రసంగం ముగించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని, ఐదు సార్లు తనకు జిల్లా సారథి పగ్గాలు అప్పగించడమే నిదర్శమని అన్నారు. ఎంపీ మాగంటి బాబు (వెంకటేశ్వరావు)మాట్లాడుతూ కొల్లేరు అంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ అక్కడ ప్రజలకు తాము ఏం చేయగలుగుతున్నామంటే సమాధానం లేదన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆస్తులు తెలంగాణకు, అప్పులు మనరాష్ట్రానికి వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక నేతలు అతిథులకు శాలువాలు కప్పి జ్జాపికలు అందజేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకరరావు కేవలం పది నిమిషాలుండి ప్రసగించకుండానే వెళ్లిపోయారు. మాజీ మంత్రి పీతల సుజాత ఒక నిమిషం మాట్లాడి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నరసారపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జెడ్పీ చైర్మ¯ŒS ముళ్లపూడి బాపిరాజు, రాజమõßహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహ¯ŒSలు విదేశీ పర్యటనలో ఉండడంతో హాజరు కాలేదు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోదరుడు మృతి చెందారు. దీంతో ఆయన సమావేశానికి హాజరు కాలేదు. పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, వేటుకూరి శివరామరాజు, నిమ్మల రామానాయుడు, బురుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు, మొడియం శ్రీనివాసరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులపర్తి ఆంజనేయులు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహ¯ŒSరావు, మంతెన సత్యనారాయణ రాజు, ఎంఏ షరీఫ్, పార్టీ నేతలు పెండ్యాల అచ్చిబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈలినాని, అంబికా కృష్ణ, పాలి ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్బ రాయ చౌదరి, మునిసిపల్ చైర్మ¯ŒS జొన్నలగడ్డ రాధా రాణి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఐదు అంశాలపై తీర్మానం lవ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచి రైతులను బలోపేతం చేయాలి. lజిల్లాలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవన ప్రమాణాలు మొరుగుపర్చడం. lపర్యావరణానికి నష్టం కలగకుండా ఆక్వా కల్చర్ను అభివృద్ధి చేయడం, తద్వారా ఉపా«ధి అవకాశాలు మెరుగుపరచడం. lఅభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు బలహీన వర్గాలకు అందేలా చర్యలు తీసుకోవడం. lరాష్ట్రానికి వచ్చే జాతీయ సంస్థలను జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. -
రాబందులు
► అధికారపార్టీ నాయకుల సిఫారుసు ఉంటేనే రైతు బంధు ► లేకుంటే గిడ్డంగుల్లో ఖాళీ ఉండదు ► కాసులిస్తే ఓకే..రోజూ పదుల సంఖ్యలో ► తిరిగి వెళుతున్న రైతులు కొడవలూరు(కోవూరు): నాయుడుపాళేనికి చెందిన సతీష్రెడ్డి అనే రైతు తాను పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు బంధు కింద ధాన్యాన్ని గిడ్డంగుల్లో నిల్వ బెట్టుకోవాలనుకున్నాడు. నార్తురాజుపాళెంలోని కోవూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈ నెల మూడో తేదీన సంప్రదించారు. గిడ్డంగులు ఖాళీ లేవనడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లారు. రెండ్రోజుల తరువాత సిఫారుసుతో వచ్చిన ఓ రైతు ధాన్యం మాత్రం నిల్వబెట్టుకున్నాడు. ఇదీ మార్కెట్ కమిటీ అధికారుల తీరు. ∙ రైతులకు కల్పతరువు లాంటి రైతు బంధు పథకాన్ని సంబంధిత అధికారులు రైతు రాబందు పథకంగా మార్చేశారు. మార్కెటింగ్ శాఖ అధికారుల వైఖరి కారణంగా సామాన్య రైతుకు ఆ పథకం అందడం లేదు. అధికార పార్టీ నాయకుల íసిఫారుసు ఉన్నా లేక కాసులు సమర్పించుకుంటేనే పథకాన్ని సద్విని యోగం చేసుకోగలుగుతున్నారు. లేకపోతే గిడ్డంగులు ఖాళీ లేవంటూ తిప్పి పంపేస్తున్నారు. ఈ సాకుతో రోజూ మార్కెటింగ్ శాఖ కార్యాలయానికి తిరిగిపోతున్న రైతుల సంఖ్య పదుల్లో ఉంటోంది. ఇదీ రైతుబంధు పథకం.. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేనపుడు నష్టానికే తెగనమ్ముకోకుండా రైతు బంధు పథకం దోహదపడుతుంది. ధాన్యానికి ధర క్షీణించినప్పుడు రైతులు నష్టానికి అమ్ముకోకుండా రైతు బంధు పథకం కింద మార్కెటింగ్ శాఖ గిడ్డంగుల్లో భద్రపరచుకోవచ్చు. రైతులు భద్రపరచుకున్న ధాన్యానికి విలువ కట్టి అందులో 75 శాతాన్ని రైతులకు ఆర్నెల్లపాటు ఎలాంటి వడ్డీ లేకుండా ముందుగానే ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో రైతుల తక్షణ అవసరాలు తీర్చుకుని ధాన్యానికి బాగా ధర వచ్చాక ధాన్యాన్ని అమ్ముకుని లాభపడవచ్చు. ధాన్యాన్ని అమ్ముకున్నప్పుడు మాత్రమే రైతు ఎలాంటి వడ్డీ లేకుండా మార్కెటింగ్ శాఖ నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్నెల్లలోనూ మంచి ధర రాకుంటే ఆ తరువాత నిల్వ పెట్టిన ధాన్యానికి రూపాయి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్నెల్లకంటే ఎక్కువగా నిల్వ పెట్టే పరిస్థితి ఉండదు గనుక రైతులు లాభపడతారు. ఖాళీల్లేవట ప్రస్తుతం తొలి పంట వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లోకి వస్తోంది. «ధాన్యం తెలంగాణకు వెళుతుంటే బాగా గిరాకీ ఉంటుంది. కేవలం చెన్నైకి మాత్రమే వెళుతుండడం, అక్కడ కూడా ఆశాజనకమైన ధర లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి కనబరచడం లేదు. రైతులు అమ్మకోలేక రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో ఆరబోసుకుంటున్నారు. బీపీటీ రకాన్నయినా కొందరు కొనుగోలు చేస్తుండగా, నెల్లూరు జిలకర రకాన్నయితే అడిగే వారు కరువయ్యారు. ధాన్యం నిల్వ బెట్టుకుందామని వెళుతున్న రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. గిడ్డంగులు ఖాళీలేవన్న సాకుచూపి తిప్పి పంపేస్తున్నారు. సిఫార్సుతో లేదా జేబులు తడిపినా ఖాళీ ఉంటోందన్న విమర్శలూ ఉన్నాయి. గిడ్డంగుల కొరత జిల్లాలో 1.85 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగులే ఉన్నాయి. కనీసం 5 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగులుంటే తప్ప జిల్లాలోని రైతుల అవసరాలు తీరవు. గిడ్డంగుల కొరత ఓ సమస్యయితే ఉన్న గిడ్డంగుల విషయంలో పక్షపాతం చోటుచేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సద్వినియోగం చేసుకోలేకున్నాం మార్కెటింగ్ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ బెడుదామని ఎప్పుడు వెళ్లినా గిడ్డంగులు ఖాళీలేవంటారు. కొందరు రైతులు ఆ తరువాత కూడా పెడుతూనే ఉన్నారు. ఇందులో మార్కెటింగ్ అధికారుల వైఖరేమిటో అర్థం కావడం లేదు. మాకు ఎలాంటి సిఫార్సు లేదనే అలా పంపుతున్నట్లున్నారు. – కొనిజేటి శేషగిరిరావు, రైతు, నార్తురాజుపాళెం -
ఏప్రిల్ 4న మేధావుల సదస్సు
కొవ్వూరు : ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఏప్రిల్ 4న హైదరాబాద్ ఉస్మానియా యునివర్సిటీలో నిర్వహించే మేధావుల సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెట్టె రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొవ్వూరు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాదిగలు, మాదిగల ఉపకులాలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు అధికశాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే కార్ లోన్స్పై జీవో నంబర్ 25 అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. లిడ్క్యాప్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. -
భద్రాద్రి రైల్వేలైన్ సర్వే పూర్తి
ఏలూరు సిటీ : కొవ్వూరు–భద్రాచలం మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు సంబంధించి సర్వే పూర్తి చేశామని కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు. జిల్లాలో కొత్త రైలు మార్గాలు, వంతెనల నిర్మాణం తదితర అంశాలపై రైల్వే శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. భద్రాచలం రైల్వే లైన్కు సంబంధించి రైల్వే శాఖ నుంచి తగిన ప్రతిపాదనలు ఇస్తే యుద్ధప్రాతిపదికన భూములు సేకరించి అప్పగిస్తామన్నారు. జిల్లాలో రైల్వే లైన్ల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రానున్న రెండేళ్లలో మన జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించనుందని, ఈ దృష్ట్యా రైల్వేలకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. కొత్త రైలు మార్గాలను గుర్తించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ రైల్వే అడిషనల్ మేనేజర్ కె.వేణుగోపాలరావును కోరారు. ఏలూరు నుంచి జీలుగుమిల్లి మీదుగా భద్రాచలం వరకు కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తే మెట్ట ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. కైకలూరు నుంచి భీమవరం, పాలకొల్లు, నరసాపురం వరకు రైల్వే రెండో ట్రాక్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, డెల్టాలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఏలూరు నుంచి ద్వారకాతిరుమల వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే భక్తులు ఉపయోగం కలుగుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఏలూరు లేదా భీమడోలులో రైలు దిగి రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల వెళ్లాల్సి వస్తోందన్నారు. రైల్వే ఏడీఆర్ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ వట్లూరు వద్ద ఆర్ఓబీ నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని, పాలకొల్లులో రైల్వే గేటు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మల, రైల్వే డివిజినల్ ఇంజినీర్ వరుణ్బాబు, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఏవీ సత్యనారాయణ, పార్సిల్ సూపర్వైజర్ ఎస్కే మీర్హుస్సేన్ పాల్గొన్నారు. -
కొవ్వూరు డీఎస్పీపై వేటు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు, కొవ్వూరు : కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావుపై వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయనకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో బదిలీ అవకాశం లేకపోవడంతో డీఎస్పీని డీజీపి కార్యాలయానికి రిపోర్టు చేయాలని సూచనలు అందినట్టుగా చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో డీఎస్పీని మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు, డీఎస్పీ ఉంటే తమ అరాచకాలు సాగవని భావించిన ఇసుక మాఫియా కలిసి డీఎస్పీని సాగనంపినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్యకు గురైన సమయంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ జవహర్ డీఎస్పీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసు వైఫల్యం కారణం గానే కౌన్సిలర్ హత్యకు గురైనట్టు వ్యాఖ్యానించారు. ప్రాణహాని ఉందని చెప్పినా కౌన్సిలర్కు రక్షణ కల్పించలేకపోయారని ఎమ్మెల్యే అప్పట్లో ఆరోపించారు. దీనిపై డీఎస్పీ సమాధానం ఇస్తూ కౌన్సిలర్ ప్రాణహాని ఉందని తనను ఎప్పుడు కలవలేదని, కనీసం ఫిర్యాదు చేయలేదని, అలా తప్పుగా మాట్లాడవద్దని డీఎస్పీ గట్టిగానే బదులిచ్చారు. అవసరమైతే తన కార్యాలయంలో సీసీ పుటేజ్లు చూపిస్తానని ఎమ్మెల్యేకు బదులిచ్చారు. ఈ విషయాన్ని అప్పట్లో తెలుగుదేశం నాయకులు రాద్ధాంతం చేయడంతో పాటు డీఎస్పీ వాహనానికి అడ్డువెళ్లి ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో టీడీపీ పేకాట క్లబ్కు అనుమతి ఇవ్వాలని కోరితే డీఎస్పీ నిరాకరించినట్టు చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి డీఎస్పీపై గురిపెట్టారు. మునిసిపల్ స్ధలంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయం విషయంలో కూడా డీఎస్పీని టార్గెట్ చేసినట్టు సమాచారం. ఏడాది కాలం నుంచి దాతల సహాకారంతో ఈ భవన నిర్మాణం పూర్తి చేశారు. ఏడాది కాలం నుంచి పురపాలక సంఘం నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారన్న వాదనను తెరపైకి తెచ్చినట్టు సమాచారం. ఇసుక మాఫియాకు సహకరించనందుకే..! ఇసుక మాఫియాకు సహకరించడంలేదన్న అక్కసుతో కొందరు టీడీపీ నేతలు డీఎస్పీపై కక్ష పెంచుకున్నారు. ఎమ్మెల్యేలపై స్థానిక నాయకుల వత్తిళ్లు పెరగడంతో డీఎస్పీని టార్గెట్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు ఇసుక మాఫియా వ్యవహారం ఆదాయవనరుగా మారడంతో డీఎస్పీ బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే గతంలో నదీతీరంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు డీఎస్పీని బదిలీ చేయించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రిని, పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం. ఇటీవలకాలంలో మళ్లీ గోదావరి డైరెక్ట్ ర్యాంపుల ఏర్పాటు రంగం చేసుకుంటున్నారు. ర్యాంపుల ఏర్పాటుకు నాయకులు వత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఇసుక మాఫియా అగడాలకు అడ్డుగా ఉన్న డీఎస్పీ బదిలీకి చినబాబుపై తెచ్చిన వత్తిడితో ఈ ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు నోరుమెదపడం లేదు. -
కష్టాలు ’డబ్బు’ల్
రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత విధానం తొలిరోజే బెడిసి కొట్టిన ప్రయోగం 2.40 శాతం మందికే సరుకుల పంపిణీ లక్షలాది మందికి బ్యాంకు ఖాతాలు లేకున్నా ఖాతరు చేయని ప్రభుత్వం కొవ్వూరు : నగదు రహిత విధానమంటూ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. రేషన్ సరుకులపై ఆధారపడి జీవించే బడుగు జీవులపై బలవంతంగా క్యాష్లెస్ విధానాన్ని ప్రయోగిస్తోంది. మార్చిలో నూరుశాతం నగదు రహిత విధానంలోనే సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో తొలిరోజైన బుధవారం డబ్బు తీసుకుని రేషన్ షాపులకు వెళ్లిన వారిని డీలర్లు సరుకులు ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. ఇదిలా ఉంటే బ్యాంకుల సర్వర్లు పని చేయకపోవడంతో ఉదయం 10.30 గంటల నుంచి నగదు రహిత విధానంలో రేషన్ సరుకుల పంపిణీకి బ్రేక్ పడింది. జిల్లా వ్యాప్తంగా 11,96,775 రేషన్ కార్డులు, 2,163 చౌక ధరల దుకాణలున్నాయి. మొత్తం రేషన్ కార్డుల్లో 32,49,664 మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. తొలిరోజు 28,545 కార్డుదారులకు మాత్రమే బియ్యం పంపిణీ చేశారు. ప్రతి నెలా ఐదో తేదీ నాటికే 90 శాతం సరుకుల పంపిణీ పూర్తి చేసేవారు. అంటే రోజుకు సగటున 23 శాతం రేషన్ పంపిణీ పూర్తయ్యేది. అటువంటిది ఈనెల మొదటి రోజు నగదు రహిత విధానం పుణ్యమా అని జిల్లాలో 2.40 శాతం కార్డుదారులకు మాత్రమే సరుకులు ఇవ్వగలిగారు బ్యాంక్ ఖాతాలు లేకపోయినా.. కార్డుదారుల్లో చాలా మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. ఈ పరిస్ధితుల్లో క్యాష్ లెస్ విధానం అమలు సాధ్యం కాదని అధికారులకు తెలిసినా బలవంతపు ప్రయోగాలతో జనాన్ని అవస్థల పాల్జేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా పేదలపై ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నగదు రహిత విధానంలో రేషన్ సరుకులు పొందాలంటే బ్యాంకు ఖాతాలో కనీసం రూ.100 నగదు ఉండాలి. ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునే కూలీలకు ఈ విధానం ఎంతవరకు ఉపకరిస్తుందనేది ప్రశ్న. బ్యాంక్ ఖాతాలు ఉన్నా ఆధార్ అనుసంధానమైతేనే వారి పేర్లు డేటా మ్యాపింగ్లోకి వెళతాయి. అలా వెళ్లిన వారి ఖాతాలో సొమ్ములుంటే రేషన్ సరుకులు పొందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే నగదు రహిత విధానం నూరుశాతం అమలు చేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. -
పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు
కొవ్వూరు: పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం బుధవారం 4,280 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,340 క్యూసెక్కులు వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 2,400, సెంట్రల్ డెల్టాకు 1,660 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. జిల్లాలోని నరసాపురం కాలువకు 1,534, ఉండి కాలువకు 997, జీ అండ్ వీకి 489, ఏలూరు కాలువకు 694, అత్తిలి కాలువకు 28 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. వంతుల వారీ విధానం కారణంగా అత్తిలి కాలువకు నీటి విడుదల తగ్గించినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ కాలువ పరిధిలో ఆయకట్టుకు నీరందకపోవడంతో చేలు నెరలు తీస్తున్నాయి. -
పటిష్టంగా సీపీవో వ్యవస్థ : డీఐజీ రామకృష్ణ
కొవ్వూరు : జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ అ«ధికారుల (సీపీవో) వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని డీఐజీ పీఎస్వీ రామకృష్ణ తెలిపారు. పట్టణంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆయన రికార్డులు పరిశీలించారు. పట్టణం, రూరల్ సర్కిళ్ల పరిధిలో కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం డీఐజీ రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ నిస్వార్థంగా పోలీసు సేవలందించాలనుకునే వారు సీపీవోలుగా చేరవచ్చని సూచించారు. క్షుణ్ణం జాతీయ రహదారులపై ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు జిల్లాకు అదనంగా 13 పెట్రోలింగ్ వాహనాలు కేటాయించారని, నెల రోజుల్లో జిల్లాకు వస్తాయని తెలిపారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న 13 స్టేషన్లకు పె ట్రోలింగ్ వాహనాలు కేటాయిస్తామన్నారు. ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్సై, సీఐ, డీఎస్పీలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, సీఐలు ఎం.సుబ్బారావు, పి.ప్రసాదరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
వర్గోన్నతితో సరి.. వైద్యం హరీ
9 పీహెచ్సీలను సీహెచ్సీలుగా ప్రకటించి ఆరేళ్లు మరుగునపడిన నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు ఆస్పత్రుల ఆప్గ్రేడేషన్ వర్గోన్నతి ఆస్పత్రుల్లో భర్తీకాని పోస్టులు సదుపాయాల సంగతి సరేసరి కొవ్వూరు : పేదోళ్లకు వైద్య సేవలు అందించే విషయంలో సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల వర్గోన్నతి (ఆప్గ్రెడేషన్)ప్రకియను కాగితాలకే పరిమితం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, వైద్యులు, సిబ్బంది కొరత తీర్చడంపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా పేదలు అరకొర వైద్యసేవలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, ఆచంట, పెనుగొండ, ఆకివీడు, భీమడోలు, బుట్టాయగూడెం, దెందులూరు, పోలవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సామాజిక ఆరోగ్య కేంద్రాలు (30 పడకల ఆస్పత్రులు)గా ఆప్గ్రేడ్ చేసి ఆరేళ్లు పూర్తి కావస్తోంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఉన్న 9 ఆస్పత్రులను కమిషనర్ ఆఫ్ వైద్య విధాన షరిషత్లో విలీనం చేశారు. వర్గోన్నతి ప్రకారం ఈ ఆస్పత్రులకు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకం, వైద్య పరికరాలు సమకూర్చటంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కొయ్యలగూడెంలో ఆప్గ్రేడ్డె పీహెచ్సీని 50 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడిలో ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. సీహెచ్సీల్లో 10 డాక్టర్ పోస్టులు ఖాళీ జిల్లాలోని మొత్తం 14 సీహెచ్సీల్లో 10 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ వైద్యులతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినా భర్తీ ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెక్కిరిస్తున్న బోర్డులు పేదలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తేవాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల(సీహెచ్సీ)ను ఏరియా ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఆయన మరణానంతరం 2010 నవంబర్ 19న ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటికి భవనాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు రికార్డుల్లో ఈ నాలుగు ఏరియా ఆస్పత్రులుగానే నడిచాయి. అవసరమైన వైద్యులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు సమకూర్చకపోవడంతో వీటిని తిరిగి సీహెచ్సీ జాబితాలోకి నెట్టేశారు. ఏరియా ఆస్పత్రులుగా పేర్కొంటూ ఈ నాలుగు ఆస్పత్రులకు ఏర్పాటు చేసిన బోర్డులు ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతున్నాయి. ఈ నాలుగు ఆస్పత్రుల్లోను ఆ స్థాయికి తగినంతమంది వైద్యులు, సిబ్బంది లేరు. వైద్య సేవలు పూజ్యం జిల్లాలో ఆరేళ్ల క్రితం ఏర్పడిన తొమ్మిది సీహెచ్సీల్లో మెడికో లీగల్ కేసుల (ఎంఎల్సీ)కు వైద్యం అందించే పరిస్థితి లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, ఇతర ప్రమాదాల బారినపడిన వారికి అవస్థలు తప్పడం లేదు. క్షతగాత్రులను ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రులకు తరలించేలోపు కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మృతదేహాలకు నిడదవోలు, పోలవరంలో మినహా మిగిలిన ఏడు సీహెచ్సీల్లో పోస్టుమార్టం చేయటం లేదు. పోస్టుమార్టంకు అవసరమైన షెడ్లు, ఇతర ఏర్పాట్లు, సిబ్బంది, సరిపడినంత మంది వైద్యులు లేకపోవటమే దీనికి కారణం. దీంతో గోపాలపురం మండలం నుంచి సుమారు 40 కిలోమీటర్లు దూరంలోని కొవ్వూరు ఆస్పత్రికి, బుట్టాయగూడెం మండలం నుంచి జంగారెడ్డిగూడేనికి, దెందులూరు, భీమడోలు మండలాల నుంచి ఏలూరుకు, ఆచంట, పెనుగొండ మండలాల నుంచి పాలకొల్లు, ఆకివీడు మండలం నుంచి భీమవరం ఆస్పత్రులకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించాల్సి వస్తోంది. అప్గ్రేడ్ చేసిన ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనతోపాటు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తే ఈ సమస్యలకు తెరపడే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవకు దూరం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించే 133 వైద్య సేవలు జిల్లాలో కేవలం మూడు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే అందిస్తున్నారు. కొన్ని సీహెచ్సీల్లో ఈ సేవలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా అవి నామమాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వైద్య సేవలు అందుబాటులో లేక రోగులు అవస్థ పడుతున్నారు. నాలుగు సీహెచ్సీలను ఏరియా ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేయడం ద్వారా ఒక్కో ఆస్పత్రికి నలుగురు సివిల్ సర్జన్లు, 10 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లతోపాటు 24 మంది స్టాఫ్ నర్సులు, నలుగురు హెడ్ నర్సుల పోస్టులు సమకూరతాయి. తద్వారా ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు, ఉద్యోగులకు ప్రభుత్వపరంగా అందించే వైద్య సేవలు, ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతిపాదనలు పంపాం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు నెలలు పడుతుంది. గత ఏడాది వైద్య విధాన పరిషత్లో కలిసిన తొమ్మిది సీహెచ్సీల్లో ఏడు చోట్ల పోస్టుమార్టం షెడ్లు లేవు. ఈ ఆస్పత్రుల్లో 100 మంది పారిశుధ్య కార్మికులు, 50 మంది సెక్యూరిటీ గార్డులు, 9 మంది సూపర్వైజర్లను నియమిస్తున్నాం. త్వరలో పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కొవ్వూరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా, చింతలపూడి ఆస్పత్రిని 100 పడకలు, కొయ్యలగూడెం ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రులుగా మార్చాలని ప్రతిపాదనలు పంపింంచాం. వైద్యుల పోస్టులు భర్తీ చేస్తే ఎన్టీఆర్ వైద్య సేవలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను అందుబాటులోకి వస్తాయి. డాక్టర్ కె.శంకరరావు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త -
క్యాష్లెస్ ప’రేషాన్’
రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీలు బ్యాంక్ ఖాతాలున్న వారికే సరఫరా 3 మండలాలు, అన్ని పట్టణాల్లో నిలిచిన సరుకుల పంపిణీ బలవంతపు ప్రయోగాలపై మండిపడుతున్న జనం జిల్లావ్యాప్తంగా మూతపడిన డిపోలు కొవ్వూరు : నగదు రహిత లావాదేవీల జపం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహితాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. జిల్లాలో అన్ని రేషన్ డిపోల్లో క్యాష్లెస్ విధానం అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. నేరుగా డబ్బులిస్తే సరుకులు ఇచ్చేది లేదని.. బ్యాంకు ద్వారా చెల్లిస్తేనే పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతుండటంతో పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. నగదు రహితంగా రేషన్ సరుకులు పొందాలంటే కార్డుదారుడికి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదికూడా ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉండాలి. సరుకులు పొందాలంటే కార్డుదారుడి అకౌంట్లో కనీసం రూ.100 నగదు ఉండాలి. తెలుపు రంగు రేషన్ కార్డుదారులంతా నిరుపేదలే కావడంతో వారంతా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే అవకాశం లేక నిత్యావసర సరుకుల పొందేందుకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు నగదు రహితంతోపాటు నగదు తీసుకుని కూడా సరుకులు అందించేవారు. ఈ నెల నుంచి నగదు విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. నగదు రహిత లావాదేవీ ద్వారా మాత్రమే సరుకులు ఇస్తామని అధికారులు భీష్మించడంతో పేదలు అవస్థలు పడుతున్నారు. పేదలపై బలవంతపు ప్రయోగాలు చేయడం విమర్శలు తావిస్తుంది. 25 శాతం కార్డులకే సరుకులు జిల్లాలో 2,163 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 11,96,775 తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. గత నెల నుంచి నగదు రహిత విధానాన్ని అమలు చేస్తూ.. కొత్త ఈపోస్ మెషిన్లు అందించారు. దెందులూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలతోపాటు 8 పురపాలక సంఘాలు, ఏలూరు నగరంతో కలిపి 759 రేషన్ డీలర్లకు ఎన్లాజిక్స్ మెషిన్లు, మిగిలిన 45 మండలాల్లోని 1,401 డిపోలకు విజన్టెక్ మెషిన్లు అందించారు. విజన్టెక్ మెసిన్లలో క్యాష్లెస్ విధానం బాగా పనిచేస్తోంది. గత నెలలో ప్రయోగత్మాకంగా పరిశీలించిన అధికారులు ఈనెల నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఎన్లాజిక్స్ మెషిన్లలో నగదు రహిత విధానం పనిచేయడం లేదు. ఈ కారణంగా రేషన్ సరుకుల పంపిణీని దెందులూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలతోపాటు జిల్లాలోని అన్ని పట్టణాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నిలిపివేశారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,18,314 కార్డుదారులకు (25.95 శాతం మందికి)మాత్రమే సరుకులు పంపిణీ చేశారు. జిల్లాలో శుక్రవారం సాయంత్రానికి కేవలం 89,637 మంది కార్డుదారులు మాత్రమే క్యాష్లెస్ను వినియోగించుకున్నారు. ప్రతినెలా 1నుంచి 5వ తేదీ లోపు సరుకుల పంపిణీ పూర్తి చేసే వారు. నాలుగైదు శాతం మిగిలితే వారికి 15వ తేదీ వరకు అందించేవారు. అటువంటిది ఈనెల 3వ తేదీ నాటికి కేవలం 26 శాతం మాత్రమే సరుకులు పంపిణీ పూర్తయ్యింది. ఎన్లాజిక్స్ మెషిన్లలో స్టాఫ్వేర్ను మార్పుచేసి సరుకులు పంపిణీ చేస్తామని చెబుతున్నా.. ఇది పూర్తికావడానికి చాలారోజులు పట్టే అవకాశం ఉంది. పేదలను ఇబ్బందులు పెట్టడం సరికాదు రేషన్ డిపోల్లో సరుకుల పంపిణీని నగదు రహిత లావాదేవీలతో ముడిపెట్టడం సరికాదు. నిరక్షరాస్యులైన పేదలకు క్యాష్లెస్ లావాదేవీలపై అవగాహన ఉండదు. ఈ విధానం పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరవాలంటే కష్టం. సరుకులు తెచ్చుకునే సమయానికి ఖాతాలో సొమ్ములు ఉండాల్సి ఉంటుంది. రేషన్ సరుకుల తెచ్చుకోవాలంటే బ్యాంక్కు వెళ్లి అకౌంట్లో సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. పరిజ్ఞానం లేని అమాయకులపై పెనుభారం మోపడమే. డబ్బులు తీసుకెళ్లినా సరుకులు అందించాలి. బలవంతపు విధానాలతో ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురిచేసే పద్ధతి మార్చుకోవాలి. తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే సరుకులు పంపిణీ ఆపమనలేదు ఎనలాజిక్స్ ఈపోస్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేయడం వాస్తవం. సరుకులు పంపిణీ ఆపమని ఏవిధమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఏలూరులో సొమ్ములు చెల్లించిన వారికి సరుకులు అందిస్తున్నారు. కొవ్వూరులోను, ఇతర పట్టణాల్లోను రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేసిన విషయమై మాకెలాంటి సమాచారం లేదు. సయ్యద్ యాసీన్, జిల్లా పౌర సరఫరాశాఖ అధికారి 15వ తేదీ వరకు సరుకులిస్తాం నగదు రహిత లావాదేవీలను ప్రజలకు అలవాటు చేసే ప్రక్రియలో భాగంగానే ఎన్లాజిక్స్ ఈపోస్ యంత్రాలున్న చోట్ల సరుకులు పంపిణీ ఈ రోజు ఆగింది. సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేస్తున్నాం. శనివారం నుంచి వీటిలోనూ యధావిధిగా సరుకులు అందిస్తాం. ఈపోస్ యంత్రాలు వినియోగించుకోని వాళ్లకు నగదు తీసుకుని సరుకులు అందిస్తాం. ఈ విషయంలో అపోహలు పడాల్సిన అవసరం లేదు. పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ -
పుణ్య స్నానానికి వచ్చి పరలోకాలకు..
కొవ్వూరు : కొవ్వూరు గోష్పాదక్షేత్రం స్నానఘట్టంలో తల్లిదండ్రులతో కలిసి స్నానానికి వచ్చిన కూచిపూడి గోపాలకృష్ణ (27) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి దుర్మరణం పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. గురువారం పెదవేగి మండలం రాట్నాలకుంటకు చెందిన గోపాలకృష్ణ, అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, పార్వతీతో కలిసి గోదావరి స్నానానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చారు. స్నానాలు ముగించుకున్న తర్వాత గోదావరి జలాలు ఇంటికి తీసుకు వెళ్లేందుకు బాటిల్ నీళ్లు తీసుకురావాలని తల్లిదండ్రులు కోరడంతో నదిలోకి దిగాడు. నది లోతు తెలియకపోవడం, నీళ్ల కోసం కొంచెం లోపలికి వెళ్లడంతో గల్లంతయ్యాడు. కళ్ల ఎదుటే కన్నకొడుకు నీటిమునిగిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అక్కడే ఉన్న జాలర్ల సాయంతో గోపాలకృష్ణ ఆచూకీ కోసం గాలించారు. మూడు గంటల తర్వాత గోపాలకృష్ణ మృతదేహాన్ని జాలర్ల సాయంతో వెలికితీశారు. మృతుడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా మూడు నెలల కుమార్తె ఉంది. ఘటనాస్థలం వద్ద భార్య, తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. పోలీసు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఉసురుతీసిన వివాహేతర బంధం
కొవ్వూరు : వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాల్ని బలిగింది. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు సీఐ పి.ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరు 23వ వార్డు ముస్లిం స్కూల్ వీధిలోని ఓ ఇంట్లో సంఘటన జరిగింది. పట్టణానికి చెందిన పూర్ణచంద్రరావు (23) అనే యువకుడు పాలిటెక్నిక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ముస్లిం స్కూల్ వీధికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా సహజీవనం చేస్తుండగా విషయం తెలిసిన పూర్ణచంద్రరావు సోదరుడు వెంకట సుబ్బారావు, అతని స్నేహితులు ఆమెను మందలించారు. పూర్ణచంద్రరావును రానిద్దని, వస్తే తమకు సమాచారం ఇవ్వాలని గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి పూర్ణచంద్రరావు ఆమె ఇంటికి వచ్చాడు. దీనిని ఆమె ప్రతిఘటించడంతో చనిపోతానని బెదిరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆమె ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆమె, తన కుమార్తెతో మరో గదిలో నిద్రపోయింది. గురువారం ఉదయం నిద్రలేచిన ఆమె పూర్ణచంద్రరావు ఉన్న గదికి గడియపెట్టి ఉండటంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. -
తప్పుల కుప్పలు
కొత్త రేషన్ కార్డుల్లో పేర్లు, ఫొటోల గల్లంతు తెల్లబోతున్న లబ్ధిదారులు నాలుగు మండలాలకు అందని కొత్త కార్డులు కొవ్వూరు : కొవ్వూరు పట్టణంలోని 1వ వార్డుకు చెందిన ముప్పిడి పార్వతి పేరిట కొత్త రేషన్ కార్డు మంజూరైంది. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉండగా.. కుమార్తె పేరు నమోదు కాలేదు. అదే వార్డు చెందిన రాణి పేరుతో జారీ చేసిన కార్డులో ఇంటి యాజమాని అయిన ఆమె భర్త పేరు ముద్రించలేదు. ఇదే ప్రాంతానికి చెందిన ఎన్.ప్రభుకుమారికి ఇచ్చిన కార్డులోని ఫొటోలు భార్యభర్తలు, ఇద్దరు పిల్లల ఫొటో ఉంది. ఇద్దరు సంతానమైనా.. ఒకరి పేరు మాత్రమే నమోదైంది. 3వ వార్డుకు చెందిన మామిడి వెంకటేష్ పేరిట జారీ చేసిన కొత్త కార్డులో వెంకటేష్ దంపతులు, ఇద్దరు పిల్లల ఫొటో ముద్రించారు. అయితే, ఆయన భార్య పేరు మాత్రం నమోదు చేయలేదు. ఇదే పట్టణానికి చెందిన కె.రమ్యశ్రావణి పేరుతో జారీ అయిన కార్డులో ఏ ఒక్కరి ఫొటోను ముద్రించలేదు. ఈ పరిస్థితి ఒక్క కొవ్వూరు పట్టణానికే పరిమితం కాలేదు. జిల్లాలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలోనూ ఇలాంటి తప్పులు కోకొల్లలుగా ఉన్నాయి. భార్య పేరు ఉంటే భర్త పేరు గల్లంతవడం, ఇద్దరుపి ల్లలు ఉంటే.. ఒకరి పేరు మాత్రమే ఉండటం, కొన్ని కార్డుల్లో అసలు ఫొటోలే ముద్రించకపోవడం వంటి లోపాలు ప్రతిచోట కనిపిస్తున్నాయి. పేర్లు, వయసు తప్పుగా నమోదు కావడం ప్రతిచోట ఉంది. సోమవారం ప్రారంభమైన జన్మభూమి గ్రామసభల్లో కొత్త కార్డులు అందుకున్న వారి అందులోని వివరాలను చూసి తెల్లబోయారు. 48,173 కొత్త కార్డులు మంజూరు జిల్లాకు జన్మభూమిమా ఊరు కార్యక్రమంలో భాగంగా 48,173 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటిని సోమవారం నుంచి ఈ నెల11 వరకు నిర్వహించే జన్మభూమి గ్రామసభల్లో పంపిణీ చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డుల కోసం 81,094 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో వివిధ కారణాలతో 2,739 దరఖాస్తులను తిరస్కరించారు. 56,929 దరఖాస్తుల అర్హమైనవిగా తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్ నిర్ధారించారు. అయితే, వీటిలో 48,173 మందికి కార్డులు మాత్రం మంజూరయ్యాయి. వాటి ప్రింటింగ్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో అన్ని మండలాలకు పూర్తిస్థాయిలో కార్డులు అందలేదు. 20 శాతం కార్డులు అందలేదని ప్రాథమికంగా అంచనా వేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుగానే చర్చించుకుని గ్రామ సభల షెడ్యూల్ను ఖరారు చేసినప్పటికీ కార్డులు అందని కారణంగా చాలాచోట్ల గ్రామసభలను వాయిదా వేశారు. రేషన్కు కోతే జన్మభూమిలో అందించే కొత్తకార్డుల్లో ముద్రించిన ఫొటోల్లో ఎంతమంది ఉన్నా.. పేర్లు నమోదైన కుటుంబ సభ్యులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు రేషన్ సరుకులు కేటాయిస్తారు. తప్పుల కారణంగా కొత్త కార్డుల్లో సుమారు 50 వేల మంది పేర్లు గల్లంతై ఉంటాయని అంచనా. వీరందరికీ రేషన్ బియ్యం అందని పరిస్థితి. వీరంతా ఎన్టీఆర్ వైద్య సేవలకు దూరం కావాల్సిన పరిస్థితి. 4 మండలాలకు అందని కార్డులు తణుకు, ద్వారకాతిరుమల, కామవరపుకోట, పెదవేగి మండలాలకు సంబంధించి కొత్తకార్డులు ప్రింటింగ్ కాలేదు. దీంతో ఈ నాలుగు మండలాల్లో జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జీలుగుమిల్లి మండలానికి 638 అందాల్సి ఉండగా 51కార్డులు మాత్రమే ప్రింటి అయ్యాయి. వేలేరుపాడు మండలంలో 292 కార్డులు మంజూరైతే 44 కార్డులు మాత్రమే ప్రింటింగ్ కావడంతో ఇక్కడ గ్రామసభ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. అందరి పేర్లు నమోదు కాలేదు ఏడాది క్రితం రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. జన్మభూమి కార్యక్రమంలో ఆధికారులు కార్డు ఇచ్చారు. నేను, నా భార్య, నలుగురు పిల్లలు ఫొటో తీయించుకుని దరఖాస్తు అందజేశాను. ప్రస్తుతం కార్డులో ఇద్దరి పిల్లల పేర్లు మాత్రమే నమోదయ్యాయి. అధికారులను అడిగితే పేర్లు నమోదుకు మీ సేవలో దరఖాస్తు చేసుకోమని చెబుతున్నారు. ఎరిపెల్లి ముసలయ్య, కుమారదేవం, కొవ్వూరు మండలం సమాచారం లేదు: కొత్త రేషన్ కార్డుల్లో తప్పులు ప్రచురితం అయినట్టు ఏ తహసీల్దార్ నుంచి సమాచారం అందలేదు. ఎక్కడైనా తేడాలుంటే పూర్తి వివరాలను తహసీల్దార్ ద్వారా పంపితే సరిదిద్దేంకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. ఆధార్ నంబర్ అనుసంధానం కాకపోవడం, చిన్న అక్షర దోషాలు వచ్చిన పేర్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. సయ్యద్ యాసిన్, జిల్లా పౌర సరఫరాశాఖ అధికారి -
’కూలి’న ఆశల సౌధం
నిర్మాణ రంగంపై నోట్ల రద్దు ప్రభావం సంక్షోభంలో క్వారీ పరిశ్రమ అభివృద్ధి పనులకూ బ్రేక్ పనుల్లేక నలిగిపోతున్న కార్మికులు పెద్దనోట్ల రద్దు ప్రభావంతో కార్మికుల ఆశల సౌధం కూలిపోయింది. నిర్మాణ రంగం, క్వారీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఫలితంగా పనుల్లేక కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొవ్వూరు : నోట్ల రద్దు ప్రకటన తర్వాత నిర్మాణ రంగం కుదేలైంది. పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వివిధ గ్రాంట్లతో ప్రభుత్వం చేపట్టిన సిమెంటు రోడ్లు, భవనాల నిర్మాణం, ఇతర పనులను కాంట్రాక్టర్లు నిలిపివేశారు. అపార్ట్మెంట్లు, ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణాలూ నామమాత్రంగానే సాగుతున్నాయి. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.దీంతో జిల్లాలో కంకర అమ్మకాలు 80శాతం పడిపోయాయి. క్వారీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. క్వారీ, క్రషర్ కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. పూర్తిస్థాయిలో నగదు అందుబాటులోకి రాకపోవడం, ప్రతి లావాదేవీకీ లెక్కలు చూపాల్సి ఉండడం వంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో నిర్మాణ సామగ్రి విక్రయాలు సగానికి పడిపోయాయి. ఫలితంగా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి నాలుగు వందల సిమెంటు బస్తాలు అమ్మే వాళ్లమని, నోట్లు రద్దు తర్వాత వంద » బస్తాలు కూడా పోవడం లేదని కొవ్వూరు పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఆందోళన. గతంలో వారంలో పదిటన్నుల ఐరన్ అమ్ముడైతే ప్రస్తుతం టన్ను కూడా విక్రయించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్మాణ సామగ్రి అమ్మకాలు రోజుకి సుమారు రూ.250 కోట్ల మేర స్తంభించినట్లు అంచనా. 2.50లక్షల మంది కార్మికులు ఉసూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 1.72 లక్షల మంది కార్మిక శాఖ ద్వారా గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంతో తాపీమేస్త్రీలు, కాంక్రీటు కార్మికులు, పెయింటర్స్, సెంట్రింగ్, రాడ్ బెండింగ్ వర్కర్ల ఉపాధి పూర్తిగా దెబ్బతింది. వీరికి తోడు నిర్మాణ రంగానికి సంబంధించిన క్వారీలు, క్రషర్లు, రవాణా వాహనాలపై పనిచేసే కార్మికులతోపాటు పరోక్షంగా ఆధార పడిన కార్మికులు మొత్తంగా సుమారు 65 వేల మంది ఉన్నారు. మొత్తంగా భవన నిర్మాణంపై ఆధారపడిన సుమారు రెండున్నర లక్షల మంది కార్మికుల ఉపాధికి తీవ్ర విఘాతం కలిగింది. పడిపోయిన కంకర విక్రయాలు: గతంలో రోజుకు 100నుంచి 150 యూనిట్ల కంకర విక్రయించే ఒక్కో క్రషరులో ఇప్పుడు ఇరవై యూనిట్లు మించి అమ్మకాలు సాగడం లేదు. దీంతో ధర అమాంతం పడిపోయింది. నోట్లు రద్దుకు ముందు కంకర ధర యూనిట్ రూ.2,300 నుంచి రూ.2,400 ఉండేది. ప్రస్తుతం రూ.1,900 లకు పడిపోయింది.లోడింగ్తో కలిపి యూనిట్ రూ.2వేలు పలుకుతోంది. సంక్షోభంలో క్వారీ పరిశ్రమ: జిల్లాలో నల్లరాతి కంకర పరిశ్రమ సంక్షోభంలో పడింది. జిల్లా వ్యాప్తంగా 135 క్వారీలు, 120 క్రషర్లు లు ఉన్నాయి. అమ్మకాలు పడిపోవడంతో క్వారీ కార్మికుల ఉపాధిపైనా ప్రభావం కనిపిస్తోంది. దీనికి తోడు కార్వీ, క్రషర్ కార్మికులతో యాజమాన్యం మూడేళ్లకు ఒకసారి చేసుకునే వేతన ఓప్పందం జనవరి 2, 8వ తేదీలతో ముగిస్తుంది. వేతన సవరణతోపాటు సంక్రాంత్రికి ప్రతి కార్మికుడికీ యాజమాన్యం నెల జీతం బోనస్, దుస్తులు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఒక్కో క్వారీ, క్రషరుకు రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతోంది. పెద్ద క్వారీలైతే రూ.10 లక్షల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ఈ సోమ్ములన్నీ కార్మికులకు చెక్రూపంలో గానీ, కార్మికుల ఖాతాల్లోగానీ జమ చేయాలని కార్మిక శాఖ నిబందన పెట్టింది. ప్రభుత్వం మంజూరు చేసే పనులు చేపట్టే కాంట్రాక్టుర్లు కంకర కొనుగోలుకు సంబంధిచిన మైనింగ్, సేల్స్టాక్స్, ఆదాయపన్నులను మినహాయించుకుని బిల్లులు చెల్లించే వారు.ఇప్పుడు విక్రయాలన్నింటికీ లెక్కలు చెప్పాల్సి ఉంది.దీంతో లావాదేవీలు ఖాతాల ద్వారా చేయాలన్న నిబంధన పెట్టారు. దీంతో కంకర ఎవరికి విక్రయించినా మైనింగ్, సేల్స్టాక్స్, ఆదాయపన్నులతో బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో యూనిట్కు రూ.340 అదనంగా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకమైన ఇబ్బందులపై ఉభయ గోదావరి జిల్లాల క్వారీ, క్రషర్స్ యూనియన్ ఆదివారం రాజమహేంద్రవరం సమావేశమయ్యారు. ఇప్పుడు క్వారీ, క్రషర్ల క్రయ, విక్రయాలన్నీంటికీ బిల్లుల ద్వారానే చేయాలని నిర్ణయించారు. అమ్మకాలు పడిపోయాయి నోట్ల రద్దు వల్ల 80శాతం కంకర విక్రయాలు పడిపోయాయి. దీంతో కంకర యూనిట్ ధర రూ.400 లు తగ్గిపోయింది. వ్యాపారం గణనీయంగా పడిపోయింది.అమ్మకాల్లేక పోవడంతో నిర్వహణ యాజమానులకు భారంగా మారింది. నోట్ల రద్దు ప్రభావంతో క్వారీ, క్రషర్లు యాజమానులకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. ముదునూరి సూర్యనారాయణరాజు,క్రషర్ యాజమాని, దొమ్మేరు ఉపాధి అవకాశాలు తగ్గాయి: నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.దీంతో భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవు. ఉన్నా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. చిల్లర కొరత వేధిస్తోంది. ఈ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం చొరవ చూపాలి. కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. మద్దూకూరి, దొరయ్య, కోశాధికారి, భవన నిర్మాణ కార్మిక సంఘం కొత్త వేతన ఓప్పందం అమలు చేయాలి మూడేళ్లకు యాజమాన్యంతో కార్మికులు చేసుకునే వేతన ఓప్పందం గడువు ముగిసింది.జనవరి 2తో క్వారీ, 8తో క్రషర్ కార్మికులకు వేతన ఓప్పందం గడువు ముగుస్తుంది. కొత్త వేతన ఓప్పంద అమలు చేయాలి.నోట్లు రద్దు ప్రభావంతో క్వారీ, క్రషర్లలో కార్మికుల ఉపాధి సన్నగిల్లింది. ప్రభుత్వం చొరవ తీసుకుని ఉపాధి అవకాశాలను పెంచాలి. ప్రతి సంక్రాంతికీ కార్మికులకు ఇచ్చే బోనస్లు చెల్లించాలి. ఎస్కే మస్తాన్, క్వారీ కార్మికుల యూనియన్ నాయకులు, ఐ.పంగిడి -
మంగళంపల్లి అస్థికలు గోదావరిలో నిమజ్జనం
కొవ్వూరు: ఇటీవల మృతి చెందిన ప్రముఖ సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అస్థికలను ఆయన తనయులు సోమవారం గోదావరిలో నిమజ్జనం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం రేవులో బాలమురళి ముగ్గురు తనయులు అభిరామ్, సుధాకర్, వంశీమోహన్ పితృకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. అంతకు ముందు రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవులోనూ ఈ కార్యక్రమాలు జరిపించారు. వారివెంట కొవ్వూరు పట్టణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనుపిండి చక్రధరరావు ఉన్నారు. -
తెగుళ్లు తట్టుకునే రకాల సాగు
కొవ్వూరు అరటి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త భగవాన్ సూచన ఆత్రేయపురం : రైతులు తెగుళ్లు తట్టుకునే అరటి రకాలు సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కొవ్వూరు అరటి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బలుసు వెంకట కృష్ణ భగవాన్ పేర్కొన్నారు. ఆత్రేయపురం అల్లూరి సీతారామరాజు సెంటర్లో సోమవారం అరటి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ భగవాన్ మాట్లాడుతూ నాణ్యమైన అరటి గెలలు పండించి రైతులు గిట్టుబాటు« ధరలు పొందవచ్చునన్నారు. గతంలో అమృతపాణి అరటి రకం పనామా తెగుళ్ల కారణంగా నాశనమైందన్నారు. ప్రస్తుతం కర్పూర దుంప కుళ్లు వ్యా«ధులను తట్టుకుంటుందన్నారు. దుంపుకుళ్లు తెగులు నేలలో ప్రవేశించి 20 సంవత్సరాలు పాటు సజీవంగా ఉంటుందని కొన్ని అరటి రకాలపై ప్రవేశించి వ్యాధులు కలగజేస్తుందన్నారు. ప్రస్తుతం కొవ్వూరు పరిశోధన కేంద్రంలో యాంగ్గామ్బి కెఎమ్–5 రకం తెగుళ్లను తట్టుకుంటుందని రైతులు ఈ రకాన్ని సాగుచేసుకోవచ్చునన్నారు. అమలాపురం ఉద్యానవనశాఖ సహాయ సంచాలకులు సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు గ్రూపులుగా ఏర్పడి అరటి గెలలను హెచ్చుధరలకు అమ్ముకోవచ్చునని అందుకు ఉద్యానశాఖ సహాయం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆత్మా సభ్యులు, అభ్యుదయ రైతు దండు సత్యనారాయణరాజు, హైదారాబాద్ ఆషిమా ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫెడరిక్ రాచ్చిట్ ప్రసంగించారు. స్థానిక ఉద్యానశాఖ అధికారిణి ఎం.బబిత, కోకో మోడల్ జీ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ, ఎంపీఈవోలు వినో«ద్శాలినీ ప్రసాద్, బాబాయ్ , తాడేపల్లిగూడెం వైఎస్సార్ యూనివర్సిటీ విద్యార్థులు కె.శ్రీప్రియ, డి.శ్రీవిద్య, ఐవీఎస్ పావని, బి.సింధూజ, కె.సుధారాణి పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా కాలువకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి ఇన్ఫ్లో కనిష్టస్థాయికి పడిపోయింది. సోమవారం 14,129 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుంటే ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 6,700 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. మిగిలిన 7,429 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకు 695, ఉండి కాలువకు 1,149, నరసాపురం కాలువకు 1,604, జీ అండ్ వీకి 332, అత్తిలి కాలువకి 284 క్యూసెక్కుల చొప్పున సాగునీరు సరఫరా చేస్తున్నారు. -
వాయు ’గండం’ గుబులు
-4 నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ -ఆందోళన చెందుతున్న అన్నదాతలు కొవ్వూరు: ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో గుబులు మొదలైంది.రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో వరిపంట కోత దశలో ఉంది.జిల్లా వ్యాప్తంగా 2.30లక్షల హెక్టార్లులలో నాట్లు వేయగా ఇప్పటి వరకు కేవలం 30వేల ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తయ్యాయి.ఈ వారం, పదిరోజుల్లో సగం ఆయకట్టులో కోతలు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది.జిల్లాలో నవంబర్ నెలాఖరు నాటికి వరికోతలు పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో తుఫాన్ ప్రభావంతోఈదురు గాలులు వీస్తే పంటంతా నేలకి ఓరిగే ప్రమాదం ఉంది. వాయుగుండం తీవ్ర రూపం దాల్చితే భారీగా పంటలు నష్టపోవావాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈనెల మూడో తేదీ నుంచే వాయుగుండం ప్రభావం కనిపించే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు బెంబోలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లా పలు మండలాల్లో వర్షాలు పడడంతో రైతుల్లో మరింత ఆందోళన మొదలైంది.అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.ఆరుగాలం శ్రమించి పండించి న పంట చేతికి అందే సమయంలో తుఫాన్ వస్తే నిండా మునిగిపోతా మని రైతులు ఆందోళన చెందుతున్నారు. నవంబర్లోనే గండం....? జిల్లాలో 2012లో నీలం, 2013లో హెలెన్ తుపాన్లు అక్టోబర్ నెలాఖరు, నవంబర్ మొదటి వారంలోనే వచ్చాయి. మళ్లీ ఇప్పుడు రెండేళ్ల తర్వత బంగాళాఖాతంలో వాయుగుండం రూపంలో మరో విపత్తు పొంచి ఉంది. అప్పట్లో నీలం తుఫాన్ ప్రభావంతో 1,29,368 హెక్టార్లుల్లో రూ.128.27 కోట్లు మేరకు పంటకి నష్టం వాటిల్లింది.ఇంకా 255.21 హెక్టార్లుకు నష్ట పరిహారం నేటికీ అందలేదు. 2013 నవంబర్లో హెలెన్ తుఫాన్ జిల్లాలో రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.జిల్లా వ్యాప్తంగా హెలెన్ ప్రభావంతో 78,662.86 హెక్టార్లు లలో రూ.78.66కోట్లు మేరకు పంటనష్టం వాటిల్లింది. మూడేళ్లు గడుస్తున్నా జిల్లాలో ౖరైతులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. ఆ గాయాల నుంచి రైతులు ఇంకా కోలేదు. ఇప్పుడు మరో విపత్తు ముంచుకోస్తుందన్న వార్త రైతుల్ని కలవరానికి గురిచేస్తుంది. జిల్లాలో 4.3 మి.మీటర్లు సరాసరి వర్షపాతం: గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో 4.3 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో పెదపాడు మండలంలో గరిష్టంగా 70.4 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది.నల్లజర్లలో 38.4, భీమడోలులో 32.2, కొయ్యలగూడెంలో 26.4, పోలవరం మండలంలో 16.6, ఏలూరులో 15.0 మి.మీటర్లు చోప్పున వర్షపాతం రికార్డయ్యింది. తాళ్లపూడి, గోపాలపురం, పెదవేగి, జీలుగుమిల్లి మండలాల్లో చెదురు మెదరుగా చినుకులు పడ్డాయి.అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి.ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం, ఇదే తరుణంలో బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారునుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
పడకేసిన చింతలపూడి
–నత్తనడకన భూసేకరణ ప్రక్రియ –ఎక్కడిక్కక్కడే ఆటంకాలతో నిలిచిపోయిన పనులు –దృష్టి సారించని ప్రభుత్వం –నెరవేరని మెట్టరైతుల కల కొవ్వూరు: జిల్లాలో మెట్ట రైతుల మేలు చేకూర్చే చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులు పడకేశాయి.రాష్ట్ర ప్రభుత్వం ఈపధకం పూర్తి చేయడం పట్ల శ్రద్ద చూపడం లేదు.పనులు ప్రారంభమై ఎనిమిదేళ్లు కావస్తున్నా నేటీకీ ఇరవైఐదు శాతంలోపు మాత్రమే పనులు పూర్తయ్యాయి.టీడీపీ అధికారంలోకి వచ్చి సుమారు మూఫైనెలలు కావస్తుంది.పనుల్లో పురోగతి ఏమాత్రం కనిపించడం లేదు.రూ.1,701 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈ పధకం పనులు ఇప్పటి వరకు కేవలం రూ.456 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తి చేశారు.భూసేకరణ ప్రక్రియ నత్తనడక కొనసాగుతుంది.ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 1,828 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం మూఫైశాతం భూమిని మాత్రమే సేకరించారు. కష్ణ జిల్లా రైతులకు ప్రయోజనాల కోసం పట్టిసీమ పధకాన్ని ఆగమేఘాలపై పూర్తి చేసిన ప్రభుత్వం చింతలపూడి పధకం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని మెట్ట రైతులు ్రçపశ్నిస్తున్నారు.ఈ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది.ఈ జిల్లాకి ఎన్ని మేళ్లు చేయాలో అన్నీ చేస్తాం...జిల్లా ప్రజలు చూపిన ఆధరణకి ఎప్పుడు రుణపడి ఉంటానని పదేపదే వల్లెవేస్తున్న సీఎం చంద్రబాబు చింతలపూడి పధకం పనులు పూర్తి విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. మహానేత ఆశయానికి తూట్లు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మెట్టరైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని రూ.1,701 కోట్లు వ్యయంతో గోదావరి నీటిని తరలించే ందుకు ఈ çపధకం మంజూరు చేశారు.2008 అక్టోబర్ 30న శంకుస్ధాపన చేశారు.మెట్టప్రాంతంలో 16 మండలాల్లో 196గ్రామాల పరిధిలో 2లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించేందుకు ఈ ప«దకాన్ని రుపోంది ంచారు.నాలుగేళ్ల కాలంలో అంటే 2013 ఫిబ్రవరికి పధకం పూర్తికావాల్సి ఉన్నప్పటికీ వైఎస్ఆర్ మరణాంతరం పనులు పడకేశాయి.మరోమూడేళ్ల సమయం అదనంగా పోడిగించి వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు.అయినా ఆగడువులోపు పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. నత్తనడనక భూసేకరణ ప్రక్రియ: ఈపధకం నిర్మాణానికి 18,208 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా దీనిలో 6,683 ఎకరాల అటవీశాఖ భూమి ఉంది.మిగతా భూమి రైతులను సేకరించాల్సి ఉంది. ఈపధకం పనులు రెండు ప్యాకేజీల కింద చేపట్టారు. దీనిలో మొదటి ప్యాకేజిలో 11,749 ఎకరాలకు గాను 6,050 ఎకరాల అటవీ భూమి ఉంది.రైతుల నుంచి సేకరించాల్సిన 5,699 ఎకరాల్లో 4,430 ఎకరాలు సేకరించారు.రెండో ప్యాకేజిలో 6,801 ఎకరాలు సేకరించాల్సి ఉండగా దీనిలో 633 ఎకరాలు అటవీభూమి ఉంది.మిగిలిన 6,168 ఎకరాల్లో కేవలం 1,600 ఎకరాలు మాత్రమే సేకరించారు.ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ నుంచి సేకరిస్తున్న భూమికి ప్రత్యామ్నాయంగా భూములు చూపించాల్సి ఉంటుంది.విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో భూములను చూపించారు.ఇటీవలే అటవీశాఖ అధికారులు ఆభూములను పరిశీలించారు.అటవీశాఖకు ఈ భూములు బదలాయిస్తే ఇక్కడ ఆశాఖకి చెందిన 6,683 ఎకరాలు భూముల్లో పనులు చేపట్టే అవకాశం ఉంది.ప్రభుత్వం ఈ భూములు బదలాయింపు ప్రక్రియ తర్వతగతిన పూర్తి చేస్తే పనులు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. పురోగతి లేని పనులు: చింతలపూడి పధకం మొదటి ప్యాకేజీ పనులు రూ.1,202 కోట్లు వ్యయంతో చేపట్టారు.వీటిలో ఇప్పటి వరకు రూ.359 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు.ఈ ప్యాకేజీలో 110 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం పదహారు మాత్రమే పూర్తయ్యాయి. ఈప్యాకేజీలో 29.81శాతం పనులు పూర్తి చేశారు.రెండో ప్యాకేజీలో ఇప్పటి వరకు 19.55 శాతం పనులు పూర్తి చేశారు.మొత్తం రూ.497 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈప్యాకేజీలో ఇప్పటి వరకు కేవలం రూ.97 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు. భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో వివక్షత: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలో భూసేకరణ చేపట్టి 117 ఎకరాలు సేకరించారు.ఈ భూముల్లో భాగంగా 77.85 ఎకరాలకు గాను గత ఏడాది అక్టోబరులో రూ.25, 67,22,251 అవార్డు పరిహారాన్ని ప్రకటించారు. 50 మంది రైతుల నుంచి ఈ భూములను అధికారులు సేకరించారు.ఈపరిహారం నేటికి రైతుల బ్యాంకు ఖాతాలో జమకాలేదు.గత ఏడాది డిసెంబర్లో ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కావస్తున్నా రైతులకు మాత్రం పరిహారం చెల్లించలేదు. తొలుత ఎకరాకు రూ.29.70 లక్షల చోప్పున అందిస్తామని నమ్మించి ఇప్పుడు అధికారులు రూ.21 లక్షల చొప్పున ఇస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బుట్టాయి గూడెం మండలంలో భూసేకరణ చేసినప్పటికీ పరిహారం పూర్తిస్ధాయిలో అందకపోవడంతో నాలుగునెలలు నుంచి పనులు నిలిచిపోయాయి. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో ఎకరాకు రూ.12.50 లక్షలు మాత్రమే చెల్లించారు.దెందులూరు మండలంలో పట్టిసీమ పధకానికి ఇచ్చిన మాదిరిగా తరహాలో ఎకరానికి రూ.38 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.కొందరు రైతులు కోర్టుకు వెళ్ళి స్టేతెచ్చుకున్నారు. దీంతో యర్రగుంటపల్లితోపాటు వెంకటాపురం, కాంతంపాలెం, చింతలపూడి, ప్రగడవరం గ్రామాల్లో పనులు మే నెల నుంచి ఆగిపోయాయి.గోపాలపురం మండలం భీమోలు రైతులు పరిహారం తక్కువ మొత్తంలో చెల్లించారని కోర్టు ఆశ్రయించడంతో నాలుగు నెలలుగా పనులు నిలిచిపోయాయి.ఇక్కడ ఎకరాకి రూ.20లక్షల చోప్పున చెల్లించారు. పక్కనే ఉన్న అన్నదేవరపేట భూములకు రూ.24 లక్షల నుంచి రూ.28లక్షల వరకు చెల్లించారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జీలుగుమిల్లి మండలంలో రైతుల భూముల్లో పనులు పూర్తయినప్పటికీ అటవీశాఖ భూములు ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం అటవీ శాఖ భూములను పనులు కొనసాగడం లేదు. టి.నరసాపురం, బుట్టాయిగూడెంలోను అటవీ శాఖ భూములు స్వాధీనం చేసుకోకపోవడం పనులు చేపట్టలేదు. నాలుగు నెలలుగా పరిహారం ఇవ్వలేదు: మా గ్రామంలో సుమారు 30 మంది రైతుల నుంచి చింతలపూడి ఎత్తిపోతల పధకం కాలువ తవ్వకాలకు భూమిని తీసుకున్నారు. 4నెలలు కావొస్తున్నా మాకు నష్ట పరిహారం ఇంత వరకూ ఇవ్వలేదు.పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. –తెల్లం సూరిబాబు,కంగాలవారిగూడెం–బుట్టాయగూడెం మండలం. భూములకు పరిహారం తగ్గించారు: చింతలపూడి ఎత్తిపోతల పధకంలో భాగంగా తమ భూములు కూడా ఉన్నాయి. ప్రకటించిన అవార్డు సొమ్ము కాకుండా ఎకరాకు రూ.29.70లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 21 లక్షల ఇస్తామని చెబుతున్నారు.ఎంతో విలువైన, సాగుకు ఉపయోగపడే భూములను పధకానికి తాము ఇచ్చాం. కానీ తమకు ఇస్తామన్న పరిహారం ఇవ్వడానికి అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. – పల్లా గంగాధరరావు, రైతు,తాడువాయి జంగారెడ్డిగూడెం మండలం -
పుట్టిన రోజు నాడే విషాదం
-
పుట్టిన రోజు నాడే విషాదం
దేవరపల్లి(పశ్చిమగోదావరి జిల్లా): పుట్టిన రోజే నాడే ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం పోలీసుస్టేషన్ సమీపంలో తండ్రీ కూతుళ్లను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాక నీరజ(14) అక్కడికక్కడే మృతిచెందగా..నీరజ తండ్రి శేఖర్కు తీవ్రగాయాలయ్యాయి. శేఖర్ను చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజమండ్రి తరలించారు. నీరజ భాష్యం పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. స్కూలు దగ్గర విడిచిపెట్టడానికి వెళ్లినపుడు రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శేఖర్ విద్యుత్ శాఖలో లైన్మన్గా పనిచేస్తూ బందపురంలో నివాసముంటున్నాడు. శేఖర్ స్వస్థలం కొవ్వూరు మండలం ఔరంగాబాద్. నీరజ తన పుట్టిన రోజు నాడే ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మధ్యాహ్న వంటకు మంట
కొవ్వూరు : పాఠశాలల్లో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఏజెన్సీలకు గుదిబండగా మారింది. వంట ఖర్చులను ఇటీవల పైసల్లో పెంచిన ప్రభుత్వం.. అదనంగా గుడ్డు వేయాలంటూ నిబంధన పెట్టి రూపాయల్లో భారం మోపింది. దీంతో వంట ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఏజెన్సీలకు భారంగా తయారైంది. ప్రభుత్వం ఇటీవల వంట ఖర్చులను పైసల్లో పెంచింది. అదే సమయంలో అదనంగా కోడిగుడ్డు వేయాలంటూ రూపాయల్లో భారం మోపడంతో నిర్వాహక ఏజెన్సీ మహిళలు ఖంగుతిన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ. 0.27 పైసలు, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.0.40 పైసలు పెంచింది. వారానికి గతంలో రెండు గుడ్డు వేయాల్సి ఉంటే ఈనెల నుంచి మూడు గుడ్లు వేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారికి వంట ఖర్చు పెంచిందన్న ఆనందం లేకుండాపోయింది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ఐటీడీఎ పరిధిలో 3,257 పాఠశాలలున్నాయి. వీటిలో 3,02,271 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నామమాత్రంగా పెంపు ఇప్పటివరకు మధ్యాహ్న భోజన పథకంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు రూ.4.86 పైసలు, 9, 10 తరగతుల విద్యార్థులకు 6.78 పైసలు చొప్పున వంట ఖర్చులు నిర్వాహకులకు చెల్లించేవారు. ఈ మొత్తాలను ప్రస్తుతం దిగువస్థాయి విద్యార్థులకు రూ. 5.13 పైసలు, పై తరగతులకు రూ.7.18 పైసలకు పెంచారు. ఈ ఏడాది జూలై నుంచి పెంచిన ధరలు వర్తించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదు. నాలుగు నెలలు తర్వాత పెంచిన ధరలు వర్తింపునకు ఆదేశాలు అందినప్పటికీ వారానికి మూడు గుడ్లు వేయాలన్న నిబంధనతో నిర్వాహకులు నష్టపోతున్నారు. కేటాయింపుల్లో వివక్ష జిల్లాలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నప్పటికీ కేంద్ర, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 1 నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులకు 100 గ్రాముల బియ్యం అందిస్తున్నారు. అదే ఎస్సీ, బీసీ వసతి గహాల్లో ఉండే విద్యార్థులకు (మూడు నుంచి ఏడో తరగతి వరకు) రెండు పూటలకు కలిపి 500 గ్రాములు కేటాయిస్తున్నారు. అంటే ఒక్కో పూటకి 250 గ్రాముల చొప్పున కేటాయిస్తుంటే ఇక్కడ మాత్రం వంద గ్రాములే ఇస్తున్నారు. అక్కడ మోనో చార్జీలు నెలకి ఒక్కో విద్యార్థికి ఉదయం అల్పాహారంతో పాటు రెండుపూటల భోజనానికి రూ.750 చొప్పునఅందిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి నెలకి రూ.133.38 పైసలు కేటాయిస్తున్నారు. 8, 9, 10 తరగతులకు హాస్టళ్లలో రూ.850 చొప్పున కేటాయిస్తున్నారు. ఈ సొమ్ములు కూడా రెట్టింపు కంటే పైగానే చెల్లిస్తున్నారు. బియ్యం కూడా హాస్టళ్లలో రెండు పూటలకు 500 గ్రాములు ఇస్తే పాఠశాలల్లో పై తరగతులకు 150 గ్రాములే అందిస్తున్నారు. అందుకే మ«ధ్యాహ్నం భోజనం నాణ్యత కొరవడి భోజనం చేసే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాదికి రూ.2.50 కోట్ల భారం జిల్లావ్యాప్తంగా ఉన్న 3,02,114 మంది విద్యార్థులకు వారానికి మూడు గుడ్ల చొప్పున వడ్డిస్తే నిర్వాహకులపై ఏడాదికి సుమారు రూ. 2.50 కోట్ల మేరకు భారం పడుతోంది. బహిరంగ మార్కెట్ కోడి గుడ్డు ధర రూ.4.50 పైసలు పలుకుతోంది. ఈ విధంగా నెలలో నాలుగు వారాలకు కలిపి ఒక్కో విద్యార్థిపై మూడో గుడ్డు వేయడానికి అదనంగా రూ.18 ఖర్చు చేయాల్సి వస్తుంది. పెంచిన వంట ఖర్చులు ప్రాథమికస్థాయి విద్యార్థులకు రోజుకి 27 పైసలు చొప్పున నెలకి రూ.7.02 పైసలు అదనంగా వస్తున్నాయి. ఒక్కో విద్యార్థిపై అయ్యే రూ.18 అదనపు ఖర్చు నుంచి ఈ సొమ్ము మినహాయిస్తే నిర్వాహకులకు రూ.10.98 పైసలు అదనంగా ఖర్చవుతుంది. జిల్లాలో ప్రాథమికస్థాయిలో విద్యనభ్యసించే విద్యార్థులు 2 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.10.98 చొప్పున ఏడాదిలో పది నెలలకు లెక్కిస్తే రూ. 2.20 కోట్లు ఖర్చవుతుంది. ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతి విద్యార్థులకు వంట ఖర్చులు 40 పైసలు పెంచారు. ఈ లెక్కన నెలకి రూ.10.40 పైసలు అదనంగా వస్తున్నాయి. దీనిలో మూడో గుడ్డు నెలరోజులకు అయ్యే అదనంగా ఖర్చయ్యే రూ.18లో ఈ మొత్తం మినహాయిస్తే ఒక్కో విద్యార్థికి రూ.7.60 పైసలు చొప్పున నెలకి రూ.38 లక్షల వ్యయం అవుతుందని అంచనా. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా విద్యార్థులు హాజరు తగ్గినా, తినేవారి శాతం తగ్గడం తదితర కారణాలతో కొంత తగ్గినా ఏడాదికి రూ. 2.50 కోట్ల వరకు భారం తప్పదని నిర్వాహక ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడా మూడో గుడ్డు వేయాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు. ప్రభుత్వం ద్వారా గుడ్ల సరఫరాకు యత్నం మధ్యాహ్న భోజన పథకానికి కోడిగుడ్లను నెక్ ద్వారా ప్రభుత్వమే సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది అమలులోకి వస్తే భారం తగ్గుతుంది. పాఠశాల ప్రాంగణాల్లో కిచెన్ గార్డెన్లు అభివద్ధికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే అన్నీ పాఠశాలలకు ఉద్యాన శాఖ ద్వారా కూరగాయలు, ఆకు కురల విత్తనాలు అందించాం. – డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి -
క్రమ బద్ధకం..
బీపీఎస్కు స్పందన నామమాత్రం పరిష్కారంలోనూ జాప్యం నెలాఖరుతో గడువు పూర్తి కొవ్వూరు : పురపాలక సంఘాల్లో అనధికార భవనాల క్రమబద్ధీకరణ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం–బీపీఎస్)కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఫలితంగా ఈ పథకం గడువును సర్కారు మరోనెల పొడిగించింది. జిల్లాలో ఏడు పురపాలక సంఘాలు, ఒక నగరపంచాయతీ, ఒక నగరపాలక సంస్థ ఉన్నాయి. వీటిల్లో సుమారు 8వేల అక్రమ కట్టడాలు ఉంటాయని అధికారుల అంచనా. దీంతో ప్రభుత్వం భవన క్రమబద్ధీకరణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 1985 జనవరి 1 నుంచి 2014 డిసెంబర్ 31లోపు నిర్మించిన అనధికార నిర్మాణాలకు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. దీనికి సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే అక్రమ నిర్మాణదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో మరోనెల రోజుల గడువు పెంచుతూ జీవో నంబర్ 234 జారీ చేసింది. అక్టోబర్ 30తో ఈ గడువు పూర్తికానుంది. అయినా దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ కేవలం 4,634 దరఖాస్తులందాయి. వీటిలో 1,313 నిర్మాణాలను మాత్రమే అధికారులు క్రమబద్ధీకరించారు. మరో 3,313 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వివిధ కారణాలతో 541 అర్జీలను పెండింగ్లో పెట్టారు. ఏలూరులో ఒకటి, తాడేపల్లిగూడెంలో ఒక దరఖాస్తును తిరస్కరించారు. ఈ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.19.17 కోట్లు ఆదాయం సమకూరింది. కేవలం 28.46 శాతం అక్రమ కట్టడాలను మాత్రమే క్రమబద్ధీకరించారు. జనవరి నుంచి పెరుగుతున్న గడువు వాస్తవానికి జిల్లాలో క్రమబద్ధీకరణ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు జనవరితోనే ముగిసింది. స్పందన సరిగా లేకపోవడంతో ప్రభుత్వం అప్పటి నుంచి గడువు పెంచుతూ వస్తోంది. తొలుత జూలై నెలాఖరుకు గడువు పెంచిన సర్కారు ఆ తర్వాత సెప్టెంబర్ 30కి, తాజాగా అక్టోబర్ నెలాఖరుకు పెంచింది. ఇప్పుడు మరో 15 రోజులే గడువున్నా, అక్రమ నిర్మాణదారుల నుంచి స్పందన లేదు. జిల్లాలో భీమవరం, తణుకు పురపాలక సంఘాల్లో అనధికారిక నిర్మాణాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. మొత్తం అక్రమ కట్టడాల్లో సగం ఈ రెండు పట్టణాల్లోనే ఉన్నాయని సమాచారం. ఇప్పటికే భీమవరం పురపాలక సంఘానికి బీపీఎస్ ద్వారా రూ.6.67 కోట్లు, తణుకు మునిసిపాలిటీకి రూ.2.80 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. నరసాపురం ఫస్ట్ అక్రమ క్రబద్ధీకరణ పథకం అమలులో నరసాపురం మునిసిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచింది. 76.76 శాతం క్రమబద్ధీకరణతో జిల్లాలో మొదటిస్థానం సాధించింది. జంగారెడ్డిగూడెం ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక్కడ అతితక్కువగా 13.75 శాతమే భవనాలను క్రమబద్ధీకరించారు. కొవ్వూరు, పాలకొల్లు పురపాలక సంఘాల్లోనూ బీపీఎస్కు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ప్లాన్ కాపీ, అటెస్టెడ్ దస్తావేజులు, యాజమాని ఆధార్ నంబర్ వంటివి ఆన్లైన్కి అప్లోడ్ చేయడంలో జాప్యం, దరఖాస్తుదారుల నుంచి అపరాధ రుసుం సకాలంలో వసూలు కాకపోవడం తదితర కారణాల వల్ల అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న దరఖాస్తులన్నీ క్రమబద్ధీకరణ అయితే పురపాలక సంఘాలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ....................................................................................... మునిసిపాలిటీ/ మొత్తం పరిశీలనలో పరిష్కారం కార్పొరేషన్ దరఖాస్తులు ఉన్నవి అయినవి .......................................................................................... ఏలూరు 695 432 262 భీమవరం 1,155 822 333 3.జంగారెడ్డిగూడెం 80 69 11 4.కొవ్వూరు 242 208 34 5.నరసాపురం 142 33 109 6.నిడదవోలు 122 76 46 7.పాలకొల్లు 566 464 102 8.తాడేపల్లిగూడెం 547 414 132 9.తణుకు 1,085 795 290 .......................................................................................... మొత్తం 4,634 3,313 1,319 .......................................................................................... -
గోదావరి మాతకు మహా నీరాజనం
కొవ్వూరు : స్థానిక గోష్పాదక్షేత్రంలో శనివారం రాత్రి గోదావరి మాతకు మహా నీరాజనం సమర్పించారు. దసరా శరన్నవరాత్ర మహోత్సవాలు ముగిసిన తర్వాత వచ్చే ఆశ్వీజ పౌర్ణమి ఎంతో విశిష్టమైనదని గోదావరి నీరాజన సమితి అధ్యక్షుడు కలిగొట్ల కృష్ణారావు పేర్కొన్నారు. చంద్ర బింబాన్ని గో క్షీరంలో దర్శించుకోవడం ద్వారా మంచి ప్రతిఫలం ఉంటుందన్నారు. ఈ పౌర్ణమిని శరత్ పౌర్ణమిగా కూడా పిలుస్తారన్నారు. ఇనగంటి ఉమా రామారావు, కనకదుర్గా, కలిగొట్ల కృష్ణారావు దంపతుల చేతుల మీదుగా ముందుగా గోదావరి మాతకు పూజలు చేశారు. గోదావరిమాతకు సహస్ర నామార్చన చేశారు. సెన్సార్బోర్డు సభ్యుడు టీఎన్వీ రమణమూర్తి, బొందలపాటి హనుమంతరావు, పమ్మి రవిబాబు, మంత్రిప్రగడ సత్యనారాయణ, వైవీఎస్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి మాతకు నీరాజనం అనంతరం నదిలో దీపాలు విడిచిపెట్టారు. -
మెట్టలో అతివృష్టి.. డెల్టాలో అనావృష్టి
–జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం తీరిది –పది డెల్టా మండలాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదు –మెట్ట, ఏజెన్సీ మండలాల్లో అత్యధికంగా వర్షాలు –భారీవర్షాలకు 4,675 ఎకరాల్లో పంటలకు తీరని నష్టం కొవ్వూరు : వర్షాకాల సీజన్ ఆరంభ నెలలో అదరగొట్టిన వర్షాలు ఆ తర్వాత రెండు నెలల పాటు దోబూచులాడాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్లో జిల్లావ్యాప్తంగా గడిచిన వారం, పదిరోజుల నుంచి భారీవర్షాలు కురిశాయి. జిల్లాలో ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, పెదపాడు, ఆచంట, పెనుమంట్ర, నిడమర్రు, నిడదవోలు, ఇరగవరం మండలాల్లో జూన్ ¯ð ల ఆరంభం నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు 19 శాతం నుంచి 59 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈ మండలాలన్నీ డెల్టా ప్రాంత మండలాలే కావడం గమనార్హం. పది మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ పది మండలాలు పూర్తి మెట్ట, ఏజెన్సీ ప్రాంతంలోనివే. కుక్కునూరు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం ఏజెన్సీ మండలాలతో పాటు కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, భీమడోలు, ద్వారకాతిరుమల, టి.నరసాపురం మండలాల్లో జిల్లాలో అత్యధికంగా వర్షపాతం రికార్డంది. ఈ మండలాల్లో 20 శాతం నుంచి 59 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 4,675 ఎకరాల్లో పంటలు వర్షార్పణం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 4,500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జూన్లో సాధార ణం కంటే అ«ధికంగా కురిసిన వర్షపాతం జూలై నెలలో 43.1 శాతం, ఆగస్ట్లో 51.5 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. సెప్టెంబర్లో మూడోవారం వరకు వర్షాలు నామమాత్రంగానే కురిశాయి. గడిచిన వారం, పదిరోజుల్లో కురిసిన వర్షాలతో ఈ నెల సాధారణ వర్షపాతం కంటే 44.2 శాతం అదనంగా వర్షం కురిసింది. ఇదే రైతులు పాలిట శాపంగా మారింది. ప్రధానంగా పది మెట్ట, ఏజెన్సీ ప్రాంత మండలాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలకు తీరనినష్టం వాటిల్లింది. జూలై, ఆగస్ట్ నెలల్లో నీటితడులు సరిగా అందక ఇబ్బందులు పడిన రైతులు సెప్టెంబర్లో కురిసిన అకాలవర్షాలతో అతలాకుతలమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం వరి 1,800 ఎకరాలు, మినుము పంట 2,800 ఎకరాలు, వేరుశెనగ 75 ఎకరాల్లో దెబ్బతింది. ఎర్రకాలువ వరద ప్రభావంతో జగన్నాథపురం, సింగవరం, నందమూరు తదితర ప్రాంతాల్లో, కొవ్వాడ కాలువ ప్రభావంతో కొంతమేరకు వరి పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక నివేదికలు అందినట్టు వ్యవసాయ జేడీ సాయిలక్ష్మీశ్వరీ తెలిపారు. ఆందోళనలో అన్నదాతలు పశ్చిమ బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా కోస్తా ప్రాంతంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హె చ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ నెల పదో తేదీ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో రైతుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే పలుచోట్ల వరి పంట కోతకు వచ్చింది. ముందస్తుగా నాట్లు వేసిన చోట్ల కోతలు సైతం ప్రారంభించారు. ఈ తరుణంలో వర్షం కురిస్తే పంటలు నేలవాలిపోవడంతో పంటరాలిపోయి తీరని నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గోదావరిలో వరద పరవళ్లు
కొవ్వూరు: గోదావరి వరద పరవళ్లు తొక్కుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీరు క్రమేణా పెరుగుతుండడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్ప్లో పెరుగుతుంది.మంగళవారం ఉదయం ఆరుగంటలకు 2,44,026 క్యూసెక్కుల ఉన్న ఇన్ఫ్లో సాయంత్రం ఆరుగంటలకు 3,26,306 క్యూసెక్కులకు పెరిగింది.ఎగువన భద్రచలం వద్ద మధ్యాహ్నాం మూడు గంటలను వరద 37.80 అడుగుల వద్ద నిలకడ ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.దీనికితో భద్రచలం ఎగువ ప్రాంతాలైన కాలేశ్వరం, పేరూర్లో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుందన్నారు.ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.రానున్న రెండు రోజుల్లో ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే వరద తీవ్రత మరింత పెరగవచ్చునని అధికారులు భావిస్తున్నారు.పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని లోతట్టు ప్రాంతంలో ఉన్న కాజ్వేలపై వరదనీరు చే రే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.భద్రచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్ధాయి(43అడుగులు) దాటితే ఈ మూడు మండలా ల్లో ఏజన్సీ ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.ప్రస్తుతం భద్రచలంలో నీటిమట్టం నిలకడ ఉన్నప్పటికీ ఎగువ నుంచి వచ్చే వరద కారణంగా నీటిమట్టం పెరిగే సూచనలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలో ఇప్పటికే తూర్పు డెల్టా కాలువకి పూర్తిగా నీటివిడుదల నిలిపివేసిన విషయం తెలిసిందే. సెంట్రల్ డెల్టాకి 500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకి 1,000 క్యూసెక్కుల చోప్పున నీటిని విడిచిపెడుతున్నారు.కొవ్వూరు గోష్పాదక్షేత్రం లో స్నానఘట్టాల వద్ద వరద పరవళ్లు తొక్కుతుంది.కింది వరుసలో ఉన్న మెట్లు పూర్తిగా వరదముంపు గురయ్యాయి. డెల్టాకాలువలకు నీటి విడుదల కుదింపు: పశ్చిమ డెల్టా కాలువ ఆయకట్టు పరిధిలోని ఉండి కాలు, గోస్తనీ అండ్ వయ్యేరు కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు.ఏలూరు కాలువకి 379 క్యూసెక్కులు, నరసాపురం కాలువకి 304, అత్తిలి కాలువకి 208 క్యూసెక్కుల చోప్పున సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన స్వల్పంగా పెరుగుతున్న నీటిమట్టాలు: గోదావరికి ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ మధ్యహ్నాం మూడు గంటల నుంచి భద్రచలంలో నిలకడగా కొనసాగుతుంది. సోమవారం కంటే మంగళవారం నీటిమట్టాల పెరుగుదల కనిపించింది. కాలేశ్వరంలో 9.80 మీటర్లు, పేరూరులో 10.69, దుమ్ముగూడెంలో 10.46, కూనవరంలో 12.52, కుంటలో 4.47, కొయిదాలో 16.26, పోలవరంలో 10.37, రోడ్డు కం రైలువంతెన వద్ద 14.02 మీటర్లు చోప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి -
గోదావరిలో తగ్గని వరద ఉధృతి
కొవ్వూరు: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 10.40 అడుగులకు చేరింది. ఆనకట్ట నుంచి 4,01,182 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో డెల్టా కాలువలకు నీటి విడుదల కొద్దిమేర పెంచారు. శుక్రవారం 8,400 క్యూసెక్కులు విడిచిపెట్టిన అధికారులు శనివారం సాయంత్రం నుంచి 10,300 క్యూసెక్కులు వదులుతున్నారు. పశ్చిమ డెల్టా కాలువకు 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శుక్రవారం కంటే వెయ్యి క్యూసెక్కుల నీటిని పెంచి విడుదల చేస్తున్నారు -
గోదావరికి వరదపోటు
కొవ్వూరు : గోదావరిలో మళ్లీ వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలోకి వచ్చి చేరే ప్రవాహం ఎక్కువైంది. రెండు రోజుల నుంచి క్రమేణా నీటిమట్టం పెరుగుతోంది. గోష్పాదక్షేత్రం ఘాట్లోని కింది మెట్లు పూర్తిగా నీట మునిగాయి. బుధవారం సాయంత్రం ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 4.15 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. -
ఆధార్ అనుసంధానం అంటూ మోసం
కొవ్వూరు : ఆధార్ నంబరును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని చెప్పి ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకుని సొమ్ములు కాజేసిన ఘటన కొవ్వూరులో గురువారం జరిగింది. కొవ్వూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ యాళ్ల మార్కండేయులు తనయుడు వై.సి.హెచ్.తాతాజీకి ఓ అజ్జాత వ్యక్తి గురువారం సాయంత్రం ఫోన్ చేశారు. హిందీలో మాట్లాడి ఏటీఎం కార్డుపై ఉన్న కొన్ని నంబర్లు చెప్పి చివరి నంబర్ చెప్పాలని, మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయాలని చెప్పాడు. దీంతో ఏటీఎం కార్డుపై ఉన్న చివరి నంబర్లు చెప్పిన కొద్ది సేపటికే తన ఆంధ్రాబ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము డ్రా అవుతున్నట్టు మేసేజ్లు రావడంతో ఆయన కంగుతిన్నాడు. ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున నాలుగు సార్లు డ్రా అయినట్టు మెసేజ్లు వచ్చాయి. ఐదోసారి రూ.1,100 డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
-
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఓ కుటుంబం గురువారం ఉదయం జిల్లాలోని దేవరపల్లి మండలంలో మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చింది. కొవ్వూరు నుంచి ఆటోలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్త మృతి చెందగా మరో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రి మృతిచెందారని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
360 కిలోల గంజాయి స్వాధీనం
కొవ్వూరు: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11 లక్షల విలువైన 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా బలపంకోరుకొండ నుంచి విజయవాడకు బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తుండగా.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. బొలేరో డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఐదు మూటల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
ఆదాయ వివరాలు వెల్లడించండి
కొవ్వూరు : ఆదాయ వెల్లడి పథకం–2016 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని, ఈలోగా వ్యాపార, వాణిజ్య రంగాల్లోని వారు తమ ఆదాయ వివరాలను వెల్లడించాలని సూచించారు. బుధవారం స్థానిక యువరాజ్ ఫంక్షన్ హాలులో ఆదాయపన్ను శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు, వివిధ ఉన్నత వర్గాల వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన సందేహాలను ఆయన నివత్తి చేశారు. ఆదాయ వెల్లడి ప«థకం విధి విధానాలను వివరించారు. ఆదాయ వివరాలను వెల్లడించి నలభై ఐదుశాతం పన్ను చెల్లిస్తే క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేస్తామని, నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు తప్ప ప్రతిఒక్కరూ ఆదాయ వివరాలు వెల్లడించవచ్చని సూచిచారు. జిల్లాలో ఇప్పటికి వరకు ఎనిమిది సమావేశాలు నిర్వహించామన్నారు. ఏలూరు రేంజ్ పరిధిలోని తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు డివిజన్లలో సుమారు 40వేల మంది ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉన్నారని తెలిపారు. గత ఏడాదిగా జిల్లాలోని ఎనిమిది వ్యాపార సంస్థలపై దాడులు చేసి రూ.15కోట్లు లెక్కల్లో లేని ఆదాయం గుర్తించి రూ.4కోట్లు మేర పన్ను వసూలు చేసినట్లు వివరించారు. తణుకు ఆదాయపన్ను అధికారి బి.ఎ.ప్రసాద్ మాట్లాడుతూ నల్లధనం కలిగి ఉండడం మంచిది కాదన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పరిమి రాధాకష్ణ, ఆడిటర్ డి.ఆర్.ఎన్.శాస్త్రి, రైస్ మిల్లర్లు అసోసియేషన్ అధ్యక్షుడు మట్టే ప్రసాద్, మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని), వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజారమేష్, యువరాజ్ కేబుల్ అధినేత దుద్దుపూడి రామచంద్రరావు(రాము), మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులతోపాటు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. -
దొంగల అరెస్టు: 34 బైక్లు స్వాధీనం
కొవ్వూరు: ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 34 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలివీ... తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంనకు చెందిన మోహన్రావు, మోషేదయాకర్, కడియం మండలం బుర్రిలంకకు చెందిన చిన్నబ్బాయి ముఠాగా ఏర్పడి రెండేళ్లుగా ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం వారిని కొవ్వూరులో అదుపులోకి తీసుకున్నారు. దొంగల ముఠా ఎత్తుకుపోయిన ద్విచక్రవాహనాల విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపనున్నట్లు డీఎస్పీ వివరించారు. -
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కొవ్వూరు : ఉరివేసుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వేములూరు శివారు దొరయ్య చెరువు కాలనీకి చెందిన దౌలూరి విజయ్(25) వృత్తిరీత్యా పెయింటర్. అతనికి 2013లో దుర్గతో పెళ్లైంది. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి అతను పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. భార్య పనికి వెళ్లమని చెప్పినా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం దుర్గ పొరుగూరు వెళ్లింది. మంగళవారం తిరిగి వచ్చి చూసేసరికి విజయ్ ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకుని మృతిచెంది ఉన్నాడు. దుర్గ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్.ఎస్.ఎస్.పవన్కుమార్ తెలిపారు. కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. -
ఆధిపత్యం కోసమే హత్య
►కలకలం రేపుతున్న బీసీ నేత, కౌన్సిలర్ గోపాలకృష్ణ హత్యోదంతం ► ఔరంగాబాద్ ఇసుక ర్యాంపుపై కన్నేసిన టీడీపీలోని ఓ వర్గం నేతలు ► అతని ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు గతంనుంచీ యత్నాలు ► ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ► సీసీ కెమెరా పుటేజీ సాయంతో కేసు ఛేదన ► తెరవెనుక ఎవరున్నారనే అంశంపై దృష్టి సారించిన పోలీసులు కొవ్వూరు : ఇసుకు ర్యాంపుపై ఆధిపత్యం చెలాయించే విషయంలో టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు బీసీ నాయకుడు, కొవ్వూరు మునిసిపల్ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ (52)ను హత్యచేసే స్థాయికి వెళ్లిందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు మరో వర్గం నేతలు. పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కౌన్సిలర్ గోపాలకృష్ణ రోడ్ కం రైలు వంతెన సమీపంలోని ఔరంగాబాద్ మలుపులో శుక్రవారం పట్టపగలే నడిరోడ్డుపై హత్యకు గురైన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆధిపత్య పోరే ప్రాణం తీసింది ఔరంగాబాద్లోని ఇసుక ర్యాంపులో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరాటం నేపథ్యంలోనే గోపాలకృష్ణ హత్యకు గురయ్యాడని పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గోపాలకృష్ణ ఔరంగబాద్ ఇసుక ర్యాంపు నిర్వహణలో మూడు దశాబ్ధాల నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారు. పడవలు, వాహనాలు, కూలీలు అతని చేతిలో ఉండటంతో అక్కడి ర్యాంపులో ఆయన హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలోని ఓ వర్గం నేతలు అతడి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు కొంతకాలంగా పావులు కదుపుతున్నారు. ఇసుక ర్యాంపులు అక్రమంగా సొమ్ము సంపాదించిపెట్టే బంగారు బాతులుగా మారడంతో ఔరంగాాబాద్లోని ఇసుక ర్యాంపుపై ఆ వర్గం నేతలను కన్నేశారని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇటీవల గోపాలకృష్ణ, అతడి కుటుంబ సభ్యులపై టీడీపీలోని ఓ వర్గానికి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. టీడీపీలోని ఒక వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని గోపాలకృష్ణ పార్టీ ముఖ్యనేతలకు చెప్పారని సమాచారం. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసినా పార్టీ నాయకులు పెడచెవిన పెట్టారనే విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ నేత గోపాలకృష్ణ ఓ సాధారణ పడవ యజమాని చేతిలో హత్యకు గురికావడం చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం ఇలా గోపాలకృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు శనివారం వెల్లడించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. ఔరంగాబాద్కు చెందిన గోపాలకృష్ణను అదే గ్రామానికి చెందిన తోట శ్రీరాములు, అతని బంధువు చదలవాడ మధుబాబు కలసి చెరకు నరికే కత్తితో హత్య చేశారని డీఎస్పీ చెప్పారు. శ్రీరాములు తనకున్న 20 సెంట్ల భూమిని అమ్ముకుని ఇటీవలే ఇసుక తరలించే పడవను కొనుగోలు చేశాడన్నారు. ఔరంగాబాద్ వద్ద గోదావరి నది ఒడ్డున ఇసుక దిగుమతి చేసుకునేందుకు అవసరమైన స్థలం లీజు వ్యవహారంలో గోపాలకృష్ణకు, శ్రీరాములుకు మధ్య వివాదం ఏర్పడిందని తెలిపారు. శ్రీరాములు ఔరంగాబాద్ ర్యాంపులోఇసుక దిగుమతి చేసుకునేందుకు కబాబ్ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకునేందుకు యత్నించగా, అతడి పడవను ర్యాంపులోకి రాకుండా అడ్డుకునేందుకు గోపాలకృష్ణ ఆ స్థలాన్ని తాను లీజుకు తీసుకున్నట్టుగా ఒప్పంద పత్రాలు రాయించుకున్నాడన్నారు. దీంతో శ్రీరాములు పక్కనే ఉన్న మరో స్థలాన్ని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించగా, గోపాలకృష్ణ అడ్డుపడినట్టు నిందితులు చెప్పారని పేర్కొన్నారు. తన పడవను ఔరంగాబాద్ ర్యాంపులోకి రాకుండా గోపాలకృష్ణ అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన శ్రీరాములు అతడిని హతమార్చేందుకు పథకం రూపొందించాడని డీఎస్పీ వివరించారు. నెల రోజులుగా గోపాలకృష్ణను హతమార్చేందుకు శ్రీరాములు యత్నిస్తున్నాడని, శుక్రవారం మధ్యాహ్నం గోపాలకృష్ణ ఒంటరిగా మోటార్ సైకిల్ కొవ్వూరు వెళ్లాడాన్ని గుర్తించిన శ్రీరాములు అదే గ్రామానికి చెందిన తన బంధువైన చదలవాడ మధుబాబు అనే యువకుడి సహాయం తీసుకున్నాడన్నారు. మధుబాబు తన స్నేహితుడి నుంచి పల్సర్ మోటార్ సైకిల్ తీసుకుని, శ్రీరాముల్ని ఎక్కించుకుని కొవ్వూరు వైపు వెళ్లాడని తెలిపారు. గోపాలకృష్ణ కోసం పాత రైలు వంతెన వద్ద కొద్దిసేపు మాటు వేశారని, వివాహ విందుకు హాజరై తిరుగు ప్రయాణమైన గోపాలకృష్ణను మోటార్ సైకిల్పై వెంబడించి రోడ్ కం రైలు వంతెన దాటిన తరువాత మలుపులో అటకాయించారని డీఎస్పీ వివరించారు. మధుబాబు మోటార్ సైకిల్ అడ్డుపెట్టడంతో గోపాలకృష్ణ అదుపు తప్పి కిందపడిపోయాడని, శ్రీరాములు వెంట తెచ్చుకున్న చెరకు నరికే కత్తితో గోపాలకృష్ణపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడని చెప్పారు. అనంతరం నిందితులిద్దరూ వేములూరు పుంత రోడ్డు మీదుగా పరారయ్యారన్నారు. టోల్గేట్ జంక్షన్ వద్ద గల సీసీ కెమెరాలోని పుటేజీల ఆధారంగా గోపాలకృష్ణను పల్సర్ మోటార్ సైకిల్పై ఇరువురు వ్యక్తులు వెంబడించినట్టు గుర్తించామన్నారు. మధుబాబును అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, హత్యోదంతం బయటపడిందని డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దర్నీ అరెస్ట్ చేశామని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. హత్యకు పాల్పడిన సమయంలో నిందితులు ఇరువురూ వేసుకున్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించడంలో సీఐ పి.ప్రసాదరావు, పట్టణ ఎస్సైలు ఎస్ఎస్ఎస్ పవన్కుమార్, డి.గంగాభవాని, క్రైమ్ పార్టీ ఎస్సై కె.వెంకటరమణ, హెచ్సీలు ఎస్.నాగేశ్వరరావు, ప్రసాద్బాబు, ఆర్ఎస్ వాసు, పీవీ రమణ, ఏడు కొండలు సహకరించారని డీఎస్పీ వెల్లడించారు. వీరికి రివార్డు నిమిత్తం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఔరంగబాద్ ర్యాంపులో పాగా వేసిన పాక గోపాలకృష్ణ ఔరంగాబాద్ ఇసుక ర్యాంపులో గత మూడు దశాబ్ధాల నుంచి గోపాలకృష్ణ ఇసుక వ్యాపారంలో చక్రం తిప్పుతున్నారు. అలాగే ర్యాంపులో తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ర్యాంపు నిర్వహణ ఎవరు చేపట్టినా ఇక్కడ ఇసుక తవ్వకానికి, తరలించడానికి పనిచేసే పడవల నుంచి లారీలు, కూలీలు వరకు అన్నింటిలో గోపాలకృష్ణ హవానే నడుస్తోంది. ఇతని ఆదిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఇటీవల తీవ్ర ప్రయత్నాలు సాగాయి. సుమారు 6 నెలల క్రితం ర్యాంపులో ఇసుక లోడింగ్ వ్యవహారంలో వాహనాలను వరుస క్రమంలో పెట్టే ప్రయత్నంలో కొవ్వూరుకు చెందిన కొందరు యువకులు గోపాలకృష్ణ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. అంతేకాక ఇక్కడ ర్యాంపులో గోపాలకృష్ణ ఆదిపత్యాన్ని దెబ్బతీసేందుకు కొవ్వూరుకు చెందిన నాయకులు కొన్ని పడవలును సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం నుంచి ఇసుక వ్యాపారంలో కొనసాగుతున్న గోపాలకృష్ణ ఆర్ధికంగా స్ధిరపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇసుక వ్యాపారం కాసులు కురిపించడంతో, అందరికళ్లు ర్యాంపులపై పడ్డాయి. ఈ నేపద్యంలో ర్యాంపులో పడవలు నిలిపేందుకు , ఇసుకను అన్లోడింగ్ చేసుకునేందుకు స్థలం లీజు వ్యవహారంలో గోపాలకృష్ణకు హత్యకు దారితీసింది. -
నడిరోడ్డుపై నరికేశారు
►కత్తులతో విచక్షణా రహితంగా నరికిన దుండగులు ► పట్టపగలు గోపాలకృష్ణ హత్యతో ఉలిక్కిపడ్డ కొవ్వూరు పట్టణం ► పోలీసుల అదుపులో నిందితులు కొవ్వూరు : టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, 16వ వార్డు కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ(52)ను శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. కత్తులతో విచక్షణా రహితంగా మెడ, భుజం, చేతులపై నరకడంతో గోపాలకృష్ణ ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. కొవ్వూరు- నిడదవోలు రహదారిలో రోడ్డు కం రైలు వంతెన దాటిన తర్వాత ఉన్న మలుపులో ఈ దారుణం చోటు చేసుకుంది. మంకీ క్యాప్లు ధరించి మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కొవ్వూరు పట్టణం ఈ ఘటనతో ఉలిక్కిపడింది. సమాచారం ఇచ్చిన ఆటో డ్రైవర్లు! పట్టణంలో వివాహ విందు భోజనం చేసి తిరిగి మోటారు సైకిల్పై మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఔరంగబాద్లోని స్వగృహానికి వెళుతుండగా గోపాలకృష్ణ హత్యకు గురయ్యారు. దుండగులు హత్యకు పాల్పడుతున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఆటో డ్రైవర్ గుర్తించినట్టు సమాచారం. ఒక వ్యక్తి హత్యకు గురై రోడ్డుపై పడి ఉన్నట్టు ఆ డ్రైవరే ఔరంగబాద్లో స్థానికులకు చెప్పి వెళ్లి పోయినట్టు చెబుతున్నారు. హత్య జరిగిన సమయంలో కొవ్వూరు వైపు వస్తున్న మరో ఆటో డ్రైవర్ గుర్తించి టోల్గేట్ జంక్షన్లో ఆటోస్టాండ్కు సమాచారం అందించినట్టు తెలిసింది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చేసరికే గోపాలకృష్ణ ప్రాణాలు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కాగా ఘటనా స్థలంలో నిందితులు ఉపయోగించినట్టుగా భావిస్తున్న మంకీ క్యాప్ ఒకటి లభ్యం కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శనివారం బంద్కు పిలుపు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కొవ్వూరులో గోపాలకృష్ణ హత్య ఉదాంతం కలకలం రేపింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని బీసీ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు ఆరోపించారు. దోషులను సత్వరం అరెస్ట్ చేయాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ, వర్తక సంఘాలు గోలపాకృష్ణ మృతికి సంతాపంగా కొవ్వూరు పట్టణం బంద్కి పిలుపునిచ్చారు. శనివారం వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసి వేయాలని నిర్ణయించారు. డీఎస్పీతో ఎమ్మెల్యే వాగ్వాదం పోలీసులు వైఫల్యం మూలంగానే గోపాలకృష్ణ హత్యకు గురైనట్టు ఎమ్మెల్యే కేఎస్ జవహార్ ఆరోపించారు. తనకు ప్రాణహానీ ఉందని గోపాలకృష్ణ పలుమార్లు చెప్పినా పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేదని ప్రశ్నించారు. తనతో ఎప్పుడూ గోపాలకృష్ణ చెప్పలేదని, ప్రాణహాని ఉందని ఎవరి నుంచి తమకు ఏ విధమైన ఫిర్యాదులు అందలేదని డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి డీఎస్పీ కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదివైపు వెళ్లి అక్కడే ఉన్న తనకారులో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే జవహార్, టీడీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ నాయకులు డీఎస్పీ కారుకి అడ్డుగా నిలబడ్డారు. తామంతా ఆసుపత్రి వద్ద ఉంటే మీరు కారులో ఫోన్ మాట్లాడుకుంటారా అంటూ ఎమ్మెల్యే డీఎస్పీపై మండిపడ్డారు. నా మాట మీకు లెక్కలేకుండా ఉంద ంటూ ఆగ్రహంతో కేకలు వేశారు. గోపాలకృష్ణకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితులు మీ కార్యాలయానికి వచ్చి వేడుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎప్పుడు తన కార్యాలయానికి ఎవరూ రాలేదని డీఎస్పీ పేర్కొన్నారు. చివరకు డీఎస్పీ తన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమిచండి అనడంతో సమస్య సద్దు మణిగింది. ఇద్దరు నిందితులను గుర్తించాం : ఎస్పీ కొవ్వూరు : కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులను గుర్తించామని ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి కొవ్వూరు విచ్చేసిన ఆయన ఘటనా స్థలాన్ని, ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం నేర పరిశోధన పోలీస్ స్టేషన్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్థానిక టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యక్తులు కాదని, స్థానికులే ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. కేసు పూర్తి వివరాలు శనివారం వెల్లడిస్తామన్నారు. హత్య కేసును గంట వ్యవధిలోనే ఛేదించిన డీ ఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. మూడు సార్లు కౌన్సిలర్గా పాగా వేసిన ‘పాకా’ పురపాలక సంఘంలో పాకా గోపాలకృష్ణ కౌన్సిలర్గా మూడోసారి కొనసాగుతున్నారు. గతంలో టీడీపీ కొవ్వూరు పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బీసీల్లో బలమైన నాయకుడిగా గోపాలకృష్ణకు పేరు ఉంది. కిరాణా అండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ట్రాన్స్పోర్టు, బియ్యం, సిమెంట్ అండ్ ఐరన్, ఎర్త్ మూవర్స్ వ్యాపారాలున్నాయి. ఎమ్మెల్యే కేఎస్ జవహార్, మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని), టీడీపీ రాష్ట్ర నాయకుడు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పోట్రు శ్రీనివాస్, పలు పార్టీలకు చెందిన నాయకులు, స్థానికులు గోపాలకృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు ఆర్పించారు. వివాద రహితుడుగా పేరున్న గోపాలకృష్ణ మృతిపై వారు తీవ్ర సంతాపం తెలిపారు. -
కష్టాలు ఉచితం
ఇసుక ఉచితమే అయినా.. ఖర్చులు తడిసిమోపెడు ఇబ్బందుల పాల్జేస్తున్న నూతన విధానం చెంతనే గోదావరి ఉన్నా ఇసుక దొరకని పరిస్థితి అయిన వారికి అడ్డదారిలో లోడింగ్ కిలోమీటర్లకొద్దీ బారులు తీరుతున్న వాహనాలు ర్యాంపుల్లో బాట ఖర్చుల పేరుతో దోపీడీ కొవ్వూరు/నిడదవోలు : ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. జిల్లాలో 11 ర్యాంపులకు అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం 6 ర్యాంపులే నడుస్తున్నాయి. సర్కారు ప్రకటించిన నూతన విధానం అమలుపై పర్యవేక్షణ కొరవడటం, లోపభూయిష్టమైన మార్గదర్శకాలు జనం పాలిట శాపంగా మారాయి. పోలవరం నుంచి నిడదవోలు మండలం పందలపర్రు వరకు గోదావరి తీరంలో సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ర్యాంపులు లేకపోవడంతో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. గోదావరి చెంతనే ఉన్న గ్రామాల వారు సైతం దూర ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చుకోవాల్సి రావడంతో రవాణా చార్జీలు భారంగా పరిణమించాయి. కనీసం అనుమతిచ్చిన ర్యాంపుల్లోకి వెళ్లి ఇసుక తెచ్చుకుందామన్నా.. అనువైన బాటలు లేక అవస్థలు పడుతున్నారు. టీడీపీ నాయకులు దీనిని ఆసరాగా చేసుకుని బాట ఖర్చుల పేరిట సొమ్ములు గుంజుకుంటున్నారు. ఉచితమే అయినా.. ఖర్చయ్యేది పాత ధరలే ర్యాంపుల్లో లోడింగ్ చార్జీల పేరిట అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని.. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ధరలపై ఎక్కడా నియంత్రణ లేకుండాపోయింది. ఇసుకను ఉచితంగా ఇస్తున్నప్పటికీ.. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో విక్రయించిన ధరలనే ఇప్పుడు కూడా వెచ్చించాల్సి వస్తోంది. డ్వాక్రా సంఘాల హయాంలో సిద్ధాంతం ర్యాంపు నుంచి పెనుగొండకు ఒక ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు అన్ని ఖర్చులతో కలిపి రూ.2,600 వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నా ట్రాక్టర్ ఇసుకకు లోడింగ్, రవాణా ఖర్చులు కలిపి రూ.2,200 నుంచి రూ.2,400 అవుతోంది. అదే ర్యాంపు నుంచి తణుకు పట్టణానికి ట్రాక్టర్ ఇసుకకు డ్వాక్రా సంఘాల హయాంలో రూ.3,300 ఖర్చయ్యేది. ఇప్పుడు రూ.3 వేలు అవుతోంది. లోడింగ్ చార్జీల ముసుగులో దోపిడీ యూనిట్ ఇసుకను లోడింగ్ చేయడానికి రూ.175 చార్జీగా నిర్ధేశించారు. ఆచంట మండలం కరుగోరుమిల్లి ర్యాంపులో యూనిట్కు ఏకంగా రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే కూలీలను అధికార పార్టీ నాయకులు తమ చెప్పు చేతల్లో పెట్టుకుని.. వారికి రోజువారీ కూలీ కింద రూ.500 చొప్పున ముట్టజెప్పుతూ అదన పు ధరలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ ర్యాంపునుంచి నిత్యం సుమారు 50 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటివరకూ సుమారు 400 యూనిట్లకు పైగా ఇసుకను విక్రయించారు. ఈ ర్యాంపులో టీడీపీ నేతలు దందాసాగిస్తున్నా రెవెన్యూ, పోలీసులు యంత్రాగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మిగిలిన చోట్లా ఇంతే పెనుగొండ మండలం సిద్ధాంతంలో వారం రోజుల నుంచి ఉచిత ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ కార్మికుల సంఖ్య వెయ్యికి పైగా ఉండటంతో వారి అదుపాజ్ఞల్లోనే ర్యాంపు నడుస్తోంది. ర్యాంపు నుంచి ఇసుకను బయటకు తెచ్చుకోవడానికి అనువుగా బాటలు నిర్మించడానికి ఎమ్మెల్యే ఓత్తిడి చేసినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కార్మికులు తాత్కాలిక బాటలు వేసుకుని ఎగుమతులు చేస్తున్నారు. బాట ఖర్చును కార్మికులు భరింంచాల్సి రావడంతో యూనిట్ అసుకకు అదనంగా రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. రోజుకు 250 ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి ఎగుమతి అవుతోంది. బాటలు సరిగా లేకపోవడంతో లారీలకు ఎగుమతులు చేయడానికి కార్మికులు నిరాకరిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ ర్యాంపు నుంచి సుమారు 10 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఎగుమతులు జరిగినట్టు అంచనా. ఇదిలావుంటే.. నిడదవోలు మండలం పందలపర్రు, పెండ్యాల-కానూరు ర్యాంపుల్లో ఉచిత ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కార్మికులు తాత్కాలిక బాటలు వేసి ఎగుమతులు చేస్తున్నారు. కొబ్బరి ఆకుల ఖర్చులు, లేబర్ ఖర్చుల, బాట ఖర్చుల పేరుతో యూనిట్కు రూ.500 నుంచి రూ.550 వరకు వసూలు చేస్తున్నారు. ఈ రెండు ర్యాంపుల ద్వారా రోజుకు సుమారు 400 ట్రాక్టర్ల ఇసుక ఎగుమతి అవుతోంది. సుమారు 25వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తరలించినట్టు అంచనా. నాలుగు రోజుల క్రితం కొవ్వూరు మండలం వాడపల్లిలో ర్యాంపు తెరిచినప్పటికీ ఇక్కడి నుంచి కేవలం పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు మాత్రమే ఇసుక తరలిస్తున్నారు. బాటల్లేక నిరుపయోగంగా ఐదు ర్యాంపులు జిల్లాలో విలీమైన వేలేరుపాడు మండలం రుద్రమకోట, తిరుమలాపురం, రేపాకగొమ్ము ర్యాంపులతోపాటు కుక్కునూరు మండలం వింజరం, ఇబ్రహీంపట్న(గణవరం), దాచారం ర్యాంపులల్లో ఇసుక తవ్వకాలను అనుమతులున్నాయి. ఈ ర్యాంపుల్లోకి వాహనాలు వె ళ్లేందుకు బాటలు లేవు. ఆ రెండు మండలాల్లో 6 ర్యాంపులు ఉన్నా.. దారులు లేకపోవడంతో ఒక్క రుద్రమకోట ర్యాంపులో మాత్రమే తవ్వకాలు సాగుతున్నాయి. మిగిలిన ఐదు ర్యాంపులు నిరుపయోగం ఉన్నాయి. పైగా కొన్ని ర్యాంపుల నుంచి తెలంగాణ ప్రాంతానికి ఇసుక తరలిస్తున్న సమాచారం. పందలపర్రు ర్యాంపు వద్ద కిలోమీటర్లకొద్దీ బారులు పందలపర్రు ర్యాంపు నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు నిత్యం పెద్దఎత్తున వాహనాలు వస్తున్నాయి. ఏ సమయంలో చూసినా ర్యాంపు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరి ఉంటున్నాయి. బయటినుంచి వచ్చిన వాహనాలను క్రమపద్ధతిలో (వరుస సంఖ్యలో) ర్యాంపుల్లోకి అనుమతించడం లేదని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆ గ్రామం నుంచి వచ్చే వాహనాలతోపాటు ఏటుగట్టు మీదుగా వచ్చే కొందరు నాయకుల వాహనాలను అక్రమంగా ర్యాంపుల్లోకి తీసుకెళ్లి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
గోదావరిలో యువకుడి మృతదేహం
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గోదావరిలో ఓ యువకుడి మృతదేహం వెలుగు చూసింది. తల లేని మొండెం భాగాన్ని పోలీసులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. హత్యగా భావించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగలముఠా అరెస్ట్ : భారీ సొత్తు స్వాధీనం
కొవ్వూరు: పలు చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొవ్వూరు నేరపరిశోధక విభాగం పోలీస్స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వరరావు శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పది మంది దొంగలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారి నుంచి 15 కాసుల బంగారం, రూ.1.42 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు కొవ్వూరు, తణుకు, అత్తిలి, నిడదవోలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 15 చోరీలకు పాల్పడినట్టు డీఎస్పీ తెలిపారు. -
గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం
కొవ్వూరు: ఆదివారం సాయంత్రం గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన నందిగాం జయదేవ్(15), సూర్యసుమంత్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో.. కొవ్వూరు గోశ్పాద క్షేత్రం వద్ద స్నాన ఘట్టంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అంగన్వాడీలను చీల్చే కుట్ర..?
సొంత యూనియన్ ఏర్పాటుకి టీడీపీ పన్నాగం పార్టీ సానుభూతి పరులతో పావులు కదుపుతున్న ప్రభుత్వం బెదిరింపులతో దారికి తెచ్చుకునే ప్రయత్నం కొవ్వూరు :టీడీపీ అనుబంధ ట్రేడ్ యూనియన్ను బలోపేతం చేసుకునేందుకు అంగన్వాడీల యూనియన్ను చీల్చేందుకు సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. దీనిలో భాగంగా జిల్లాలో బలంగా ఉన్న సీఐటీయూ యూనియన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. ఇందుకోసం విజయవాడ ఆందోళనలో పాల్గొన్న అంగన్వాడీలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే జిల్లాలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఆందోళనలో పాల్గొన్న వారి వివరాలను సీడీపీవోలు జిల్లా ప్రాజెక్టు అధికారికి నివేదికలు పంపించారు. జిల్లా వ్యాప్తంగా 3,889 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో వేలమంది కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 2 వేల మందికి పైగా ఆందోళన కార్యక్రమానికి తరలివెళ్లినట్టు చెబుతున్నారు. వీరందరికి నోటీసులు ఇవ్వడం ద్వారా భయపెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే యూనియన్ ఏర్పాటుకి ఎక్కడా స్పందన కనిపించడం లేదు. జిల్లాలో 18 ప్రాజెక్టులున్నప్పటికీ ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పది నుంచి 20 మందికి మించి మద్దతుదారులు ముందుకు రాలేదని చెబుతున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో అంగన్వాడీలు, సీడీపీవోలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొవ్వూరు, దెందులూరు నియోజవర్గాల్లో ఈ ప్రక్రియకి శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఇటీవల జిల్లాలో ఆరవై ఏళ్లు పైబడిన 60 మంది కార్యకర్తలు, 377 మంది ఆయాలను తొలగించారు. వీరి స్థానంలో వచ్చే కొత్తవారిని కూడా తమకి అనుకూలంగా మలుచుకునేందుకు సర్కారు యోచిస్తోందని చెబుతున్నారు మహిళా సంఘం నేతకు ఉభయ గోదావరి బాధ్యత జిల్లాలో కొయ్యలగూడేనికి చెందిన టీడీపీ మహిళా విభాగం నేతకి ఉభయ గోదావరి జిల్లాల అంగన్వాడీ కార్యకర్తల సమన్వయ కర్త బాధ్యత అప్పగించారు. యూనియన్ ఏర్పాటులో భాగంగా ఇప్పటివరకు రెండుసార్లు ఆమె కొయ్యలగూడెంలో అంగన్వాడీలతో సమావేశం నిర్వహించినా ఆశించిన స్థాయి స్పందన లభించలేదు. దీంతో జీతాల పెంపు జీవో ఇప్పిస్తామని ఆశపెడుతున్నట్టు చెబుతున్నారు. అదీ కుదరని పక్షంలో అంగన్వాడీ కేంద్రాలపై అధికారులతో దాడులు చేయించి దారిలోకి తెచ్చుకునే యత్నం చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. -
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ : ఒకరి మృతి
కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని రోడ్డు కం రైల్వే వంతెనపై శనివారం ఆటోను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడుకు చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి స్వగ్రామం నుంచి దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీమాత ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
కొవ్వూరు రూరల్ :దొమ్మేరు-కొవ్వూరు ఈజీకే రోడ్డులో గురువారం కారును క్వారీ లారీ ఎదురుగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన సమయంతుల పుల్లారావు బుధవారం దేవరపల్లి మండలం గోపాలపురం బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం షాపింగ్ నిమిత్తం కారులో కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి బయలుదేరారు. దొమ్మేరు-కొవ్వూరు ఈజీకే రోడ్డులో పెట్రోల్ బంకు సమీపంలో కొవ్వూరు వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న పుల్లారావు ఆయన కుటుంబ సభ్యులైన భ్రమరాంబకు తీవ్ర గాయాలయ్యాయి. అదే కారులో ఉన్న కుమారి, పద్మావతి అనే మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులు రేఖ, పుష్ప స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికులు 108లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పట్టణ ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి కేసు నమోదు చేశారు. -
విద్యుత్ కోతలతో వెతలు
కొవ్వూరు:ఒకవైపు వేసవిని తలపిస్తున్న ఉక్కపోత.. మరోవైపు పట్టణాల్లో దోమల మోత, విద్యుత్ కోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడురోజుల నుంచి రాత్రిపగలు తేడాలేకుండా విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఎప్పుడు కరెంటు తీస్తారన్న సమాచారం లేకపోవడంతో అన్ని వర్గాల జనం ఇబ్బందులను చవిచూస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట వ్యాపారాలు సాగే సమయంలో కోతలు విధించడంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళుతున్నారు. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా రోజుకు ఐదారు గంటల పాటు సరఫరాలో కోత విధిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక అవాంతరాల నేపథ్యంలో సరఫరాకు ఆటంకం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. వర్షకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే రానున్న వేసవిలో విద్యుత్ సరఫరా ఎలా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఇచ్చే ఏడు గంటల విద్యుత్ సరఫరాలోను భారీగా కోత విధిస్తున్నారు. మూడు, నాలుగు గంటలే సరఫరా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకి 12 నుంచి 13 మినియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా కేవలం 9 నుంచి 9.5 మినియన్ యూనిట్ ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుంది. ఇరవై నాలుగు గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రధానంగా రాష్ర్ట వ్యాప్తంగా ఏపీఈపీడీఎస్, ఎపీఈపీడీఎల్ పరిధిలో 2,300 మెగా వాట్ల ఉత్పత్తి తగ్గినట్టు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీఎల్ )పరిధిలో 2,100 మెగా విద్యుత్ డిమాండ్ ఉంటే ప్రస్తుతం 1,700 మెగా వాట్స్ మాత్రమే సరఫరా అవుతుంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. డిమాండ్ కంటే నాలుగు వంద మెగా వాట్స్ ఉత్పత్తి తగ్గడంతో ఎమర్జన్సీ లోడు రిలీఫ్ పేరుతో రెండేసి గంటల చొప్పున ప్రాంతాల వారీగా కోతలు విధిస్తున్నారు. ఇలా రోజుకి రెండు, మూడు విడతల్లో ఐదు నుంచి ఆరు గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సింహాద్రి పవర్ ప్లాంట్లో 510 మెగా వాట్లు, వీటీపీఎస్లో 210 మెగావాట్లు, రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 600 మెగావాట్స్ ఉత్పత్తి త గ్గింది. దీనికితోడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా 686 మెగా వాట్స్ అందకపోవడంతో ఇబ్బందికరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అప్రకటిత కోతలతో అవస్థలు అప్రకటిత విద్యుత్ కోతలు విధించడం మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి అన్నీ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్కు కోత విధించడంతో నీటితడులు ముందుకు సాగడంలేదు. కనీసం కోతలు విధించే సమయం ప్రకటిస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. నాయకులు ఈ విషయంలో దృష్టి సారించి కోతలను ఆపు చేయించాలి. -మారిన రామకృష్ణ, రైతు, నందమూరు, కొవ్వూరు మండలం సాంకేతిక లోపాలే కారణం ప్రస్తుతం డిమాండ్ అనుగుణంగా విద్యుత్ సరఫరా లేదు. ఉన్న విద్యుత్ను ఇబ్బందుల్లేకుండా సరఫరా చేస్తున్నాం. విద్యుత్ ఉత్పత్తి సంస్థలో సాంకేతిక లోపాలు కారణంగా సరఫరా త గ్గింది. ఎప్పటిలోగా విద్యుత్ కోతలు తగ్గుతాయనేది చెప్పలేం. -సీహెచ్.సత్యనారాయణ రెడ్డి, ఎస్ఈ, ఏపీఈపీడీఎస్ -
నీ వెంటే.. నేను..
కొవ్వూరు : గోదావరిలో దూకిన తన తమ్ముడి ఆచూకీ ఎంతకీ లభ్యం కాలేదని మనస్తాపంతో అన్నయ్య కూడా అదే ప్రాంతంలో నదిలో దూకడంతో ఇరువురూ గల్లంతయ్యారు. ఈ ఘటన కొవ్వూరులో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలో ఇందిరమ్మకాలనీలో ఉంటున్న కొన శ్రీధర్(28) శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో మోటారు సైకిల్పై బయలుదేరి రోడ్డు కం రైలు వంతెనకు చేరుకున్నాడు. కారణమేమిటో తెలియదుకాని మోటారు సైకిల్ను వంతెనపైనే వదిలేసి గోదావరి నదిలో దూకాడు. అతని బంధువులు, కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని జాలర్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి కూడా తన సోదరుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మనస్తాపానికి లోనైన అతని సోదరుడు కొన మహేంద్ర (48)వంతెనపై నుంచి నదిలోకి దూకాడు. ఇద్దరి ఆచూకీ కోసం నదిలో రెండు పడవల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. రోడ్డు కం రైలు వంతెన నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకు వెతుకుతున్నారు. సాయంత్రానికి కూడా ఇరువురి ఆచూకీ దొరకలేదు. అన్నదమ్ములిద్దరూ పెయింటర్స్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీధర్కు భార్య, పన్నెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఉదయం శ్రీధర్ ఇంట్లో కొత్త దుస్తులు కట్టుకుని గుడికి వెళ్లి వచ్చాడని తర్వాత మోటారు సైకిల్ వేసుకుని బయటకు వెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మహేంద్ర.. వేములూరు పంచాయతీ శివారు దొరయ్య చెరువు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇతని భార్య నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. అన్నదమ్ములు ఇరువురూ నదిలో దూకి గల్లంతవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. -
లారీ ఢీకొని సైక్లిస్టు మృతి
కొవ్వూరు (పశ్చిమగోదావరి) : మద్యం మత్తులో ఉన్న ఓ లారీ డ్రైవర్ అతి వేగంగా వాహనాన్ని నడిపి ఓ సైక్లిస్టు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆడికిరేవుల ఏటిగట్టు వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఆడికిరేవుల గ్రామానికి చెందిన వడ్డెర మేస్త్రి వానపల్లి నాగభూషణం(60) సైకిల్పై పక్కనే ఉన్న కుమారదేవం గ్రామానికి వెళుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
తండ్రి హత్య కేసులో కుమారుడి అరెస్ట్
కొవ్వూరు (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మరతాడరం గ్రామంలో తండ్రిని హత్య చేసిన కేసులో కుమారుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు... దొమ్మెరతాడరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గత నెల 28న తాగి ఇంటికి వచ్చాడు. దాంతో తని భార్య, కొడుకు గొడవపడ్డారు. ఆవేశంలో కొడుకు లావరాజు సైకిల్ ట్యూబుకు గాలికొట్టే పైపుతో తండ్రిని కొట్టడంతో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా ఈ ఘటనపై మృతుని భార్య టెంకాయల పీచు తీస్తుండగా గునపం గుచ్చుకుని మృతిచెందాడని కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోస్టుమార్టం నివేదికలో గునపం దిగిన ఆనవాళ్లు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేశారు. కొడుకు ఆవేశంలో కొట్టడం వల్లే ఇనుప పైపు గుండెలో గుచ్చుకుని నాగేశ్వరరావు మృతిచెందాడని నిర్ణయానికి వచ్చిన పోలీసులు లావరాజును అరెస్ట్ చేశారు. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు గాను మృతుని భార్యపై కూడా కేసు పెట్టారు. -
కొవ్వూరు కుర్రాడికి అవార్డుల పంట
కొవ్వూరు (పశ్చిమగోదావరి) : కొవ్వూరుకి చెందిన ఆంధ్ర ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి గెడ్డం శేఖర్బాబుకు రెండేళ్ల శిక్షణాకాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఉత్తమ ట్రైనీ అవార్డుతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించిన మరో ఆరు అవార్డులను సొంతం అయ్యాయి. 2013 ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందిన శేఖర్బాబు రెండేళ్ల పాటు శిక్షణను పూర్తి చేసుకున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో సోమవారం స్నాతకోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆల్ రౌండర్ ఔట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు(అత్యుత్తమ ట్రైనీ అధికారిగా)ను, గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జయదేవకర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా టాపర్ ఇన్ కోర్ ఫారెస్టెరీలోను బంగారు పతకం అందుకున్నారు. పి.శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు, డాక్టర్ బీఎన్ గంగూలీ అవార్డు తోపాటు రూ.25వేలు నగదు పారితోషికం అందుకున్నారు. ఆర్ఎన్ మాతుర్ మెమోరియల్ అవార్డు, సీనియర్ ఫారెస్టరీ అవార్డు, కేపీ సాంగీయా వినికి అవార్డు ఫర్ బెస్ట్ ట్రైనీ అధికారి అవార్డును శేఖర్బాబు దక్కించుకున్నారు. కేంద్ర మంత్రి జయదేవకర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. అకడమిక్ ఎక్స్లెన్స్(ప్రతిభ), ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ ఫారెస్ట్ లా, కోర్ ఫారెస్టరీ సబ్జెక్ట్స్, అటవీ ఉత్పత్తుల విభాగం, ఫీల్డ్ ఫారెస్టరీ తదితర అంశాలలో శేఖర్ బాబు ఈఅవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవంలో కేంద్ర పర్యావరణ కార్యదర్శి అశోక్ లవాస, అకాడమీ డెరైక్టర్ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్ధలో కందిసాగులో అధిక దిగుబడులను ఇచ్చే జన్యువులను గుర్తించినందుకు పీహెచ్డీతో పాటు గోల్డ్మెడల్ను శేఖర్బాబు దక్కించుకున్నారు. శేఖర్బాబు తండ్రి శంకర్రావు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి సువర్ణ గృహిణి. తమ కుమారుడు ఐఎఫ్ఎస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులు సొంతం చేసుకోవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా సహకార అధికారిపై విచారణ
కొవ్వూరు (పశ్చిమగోదావరి) : జిల్లా సహకార అధికారి డి.వెంకటస్వామిపై వచ్చిన ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా సహకార అధికారిణి టి.ప్రవీణ సోమవారం విచారణ చేపట్టారు. స్ధానిక డివిజనల్ సహకార అధికారి కార్యాలయంలో డీసీవోపై ఫిర్యాదు చేసిన పీఎసీఎస్ కార్యదర్శుల నుంచి వ్యక్తిగతంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల జిల్లాలోని 164 మంది కార్యదర్శులు రాష్ట్ర సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డికి డీసీవో వైఖరిపై ఫిర్యాదు చేశారన్నారు.దీంతో సహకార శాఖ కమీషనర్ విచారణకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ప్రధానంగా సొసైటీలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా సంఘాల మనుగడను దెబ్బతీస్తున్నారని.. డీసీవోను బదిలీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా 164 మంది కార్యదర్శులను సోమవారం విచారణకు హాజరు కావాల్సినదిగా నోటీసులు పంపామని ప్రవీణ తెలిపారు. ఆరోపణలకు సంబంధించిన రుజువులతో హాజరు కావాలని కార్యదర్శులకు సూచించామన్నారు. విచారణ అనంతరం నివేదికను సహకార ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. డివిజన్ సహకార అధికారి జీవీ రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో జీవిత ఖైదు
కొవ్వూరు : హత్యకేసులో ఆటోడ్రైవర్ కలిదిండి పాటియ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ కొవ్వూరు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వైవీఎస్జీబీ పార్ధసారధి తీర్పు నిచ్చినట్టు పోలవరం సీఐ కే.బాలరాజు తెలిపారు. గోపాలపురం మండలం చిట్యాల సమీపంలో 2013 అక్టోబర్ 19 జరిగిన ఈ హత్యోదంతం వివరాలను మంగళవారం విలేకరులకు తెలిపారు. కొయ్యలగూడెం మండలం గంగవరానికి చెందిన ఆటోడ్రైవర్ పాటియ్యకు చిట్యాలకు చెందిన జ్యోతితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరో ఆటోడ్రైవర్ ఈడుపుగంటి శ్రీనుతో జ్యోతికి వివాహేతర సంబంధం ఉందన్న కారణంగా భార్యాభర్తలు గొడవలు పడ్డారు. పాటియ్య తన భార్యను చిట్యాల పుట్టింటికి పంపేశాడు. తర్వాత అక్కడకు వెళ్లి శ్రీనును హతమార్చేందుకు సహకరించాలని కోరాడు. భార్య జ్యోతి పాటియ్య ప్రతిపాదనకు అంగీకరించింది. 2013 అక్టోబర్ 19న జ్యోతితో శ్రీనుకి ఫోన్ చేయించి రాత్రి 9 గంటలకు చిట్యాల హైస్కూలుకు రమ్మని కబురు చేశాడు. ఆ ప్రకారం వచ్చిన శ్రీను జ్యోతిని ఆటోలో ఎక్కించుకుని చెరుకుమిల్లి రోడ్డులో ఉన్న తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ వద్దకు తీసుకువెళ్లాడు. ఆ సమయంలో పాటియ్య పలుగుతో శ్రీను తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీనును ఆటోలో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. డాక్టర్ శ్రీనును పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. డాక్టర్ నవీన్కుమార్ పోలీస్లకు ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి గోపాలపురం ఎస్సై ఎస్.గంగరాజు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ జీఆర్ఆర్ మోహన్ చార్జీషీట్ దాఖలు చేశారు. తొమ్మిది మంది సాక్షులను విచారించిన అనంతరం పాటియ్య హత్య చేసినట్టు రుజువు కావడంతో న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు రూ.2వేలు జరిమానా విధించినట్టు సీఐ బాలరాజు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారన్నారు. జిల్లా అదనపు సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కవల నాగేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున కేసు వాదించినట్టు సీఐ తెలిపారు. ఎస్సై కె.లక్ష్మినారాయణ దర్యాప్తులో సహకరించినట్టు తెలిపారు. -
వెతల నడుమ కుతకుతలు
మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల అవస్థలు సగం కూడా పూర్తికాని వంట షెడ్ల నిర్మాణం మంజూరైనవి 1043...నిర్మాణం పూర్తయినవి 405 అసలు పనులు ప్రారంభించనవి 232 షెడ్లు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నిమిత్తం సర్వశిక్ష అభియాన్ కింద 1043 వంటషెడ్లు మంజూరైనా అందులో సగం కూడా నిర్మాణం పూర్తి చేసుకోలేదు. దీంతో పథకం నిర్వాహక ఏజెన్సీ మహిళలు అవస్థలు పడుతున్నారు. ఎండైనా...వానైనా.. ఆరు బయటే వంటలు చేసి సమయానికి అందజేయాల్సిన బాధ్యతను మోయలేకపోతున్నారు. కొవ్వూరు : సర్వశిక్షా అభియాన్ కింద జిల్లాకు 1043 వంటషెడ్లు మంజూరు కాగా వీటి నిర్మాణ బాధ్యతలను తొమ్మిది ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించారు. ఒక్కో వంట షెడ్డుకి రూ.1.50 లక్షలు చొప్పున 2012-13 ఆర్థిక సంవత్సరంలో సర్వశిక్షాభియాన్ నుంచి జిల్లాకు రూ.15.64 కోట్లు మంజూరు చేశారు. వీటిలో మొదటి విడతగా జిల్లాకు రూ.9.62 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.6.02 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. జిల్లాకు కేటాయించిన వంట షెడ్ల నిర్మాణ బాధ్యతలను గృహానిర్మాణ శాఖ, రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం), ఐటీడీఏ, భీమవరం, ఏలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మునిసిపాలిటీలకు అప్పగించారు. మంజూరైన వంట షెడ్లల్లో ఇప్పటి వరకు 405 షెడ్లు పూర్తిచేయగా 232 షెడ్లు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 276 షెడ్లు రూఫ్లెవల్లోనూ, 38 లెంటల్ లెవెల్, 65 బేస్మెంట్ లెవెల్ ఉండగా, 27 షెడ్ల పనులు ఇటీవలే ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 8 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. చాలా పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం పథకం నిర్వహణకు కనీసం నిలువ నీడ లేదు. దీంతో కొన్నిచోట్ల తాటాకు పాకల్లోను, మరికొన్నిచోట్ల సైకిల్ షెడ్లలో, ఆరుబయట, పాఠశాల అరుగులపైన వంటలు చేస్తూ మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. పురోగతి లేని వంటషెడ్ల నిర్మాణం గృహనిర్మాణ శాఖకు 449 షెడ్ల నిర్మాణం కేటాయించారు. నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో పూర్తికాకపోవడంతో వీటిలో 125 షెడ్లను రాజీవ్ విద్యామిషన్కు అప్పగించారు. వీటిలో కేవలం 44 షెడ్లే పూర్తయ్యాయి. 67 షెడ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఐటీడీఏకు 33 కేటాయించగా 28 పూర్తిచేశారు. మరో 5 ప్రారంభం కాలేదు. ఆర్వీఎంకు 634 కేటాయించగా 324 షెడ్లు పూర్తిచేశారు. మరో 125 షెడ్లు ప్రారంభం కాలేదు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. భీమవరం, పాలకొల్లు మునిసిపాలిటీలకు 12 వంట షెడ్లు చొప్పున కేటాయించగా రెండుచోట్ల ఏ ఒక్కటీ ప్రారంభించలేదు. ఏలూరు కార్పొరేషన్కు ఏడు కేటాయించగా ఆరు పూర్తి చేశారు. మరొకటి నిర్మించాల్సి ఉంది. నిడదవోలు పురపాలక సంఘానికి ఐదు కేటాయించగా నాలుగు షెడ్లు నేటికీ ప్రారంభించలేదు. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీకి 11 కేటాయించగా అతి కష్టం మీద 3 పూర్తిచేశారు. ఒక షెడ్డు ఇప్పటికీ ప్రారంభించకపోగా మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నరసాపురం మునిసిపాలిటీకి ఐదు కేటాయించగా ఒక షెడ్డు పనులు ప్రారంభించలేదు. ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తాం అసంపూర్తిగా ఉన్న వంటషెడ్లను ఈనె ల 15వ తేదీ నాటికి పూర్తి చేస్తాం. ఇప్పటికే దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పనులు అప్పగించిన ఏజెన్సీలు నెలరోజులు గడువు అడుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలో అన్ని షెడ్ల నిర్మాణం పూర్తి చేయిస్తాం. డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి -
ఆర్చ్ వంతెనపై రెండో రైల్వే లైన్
కొవ్వూరు :గోదావరిపై ఉన్న ఆర్స రైల్వే వంతెనపై రెండో రైల్వే లైన్ వేయనున్నారు. ఆర్చ్ రైలు వంతెనపై ఎడమవైపు మరో ట్రాక్ వేసేందకు అవకాశం ఉంది. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ అశోక్కుమార్ ప్రకటించారు. రానున్న ఆరు నెలల్లో పనులు ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు వచ్చాయని వెల్లడించారు. గోదావరిపై కొవ్వూరు-రాజమండ్రి మధ్య ప్రస్తుతం రెండు రైల్వే లైన్లు ఉన్నాయి. 1974లో ప్రారంభించిన రోడ్డు కం రైలు వంతెనపై ఒకటి, 1997లో ప్రారంభమైన ఆర్చ్ రైలు వంతెనపై మరోటి ఉన్నాయి. ఆర్చ వంతెనను రెండు రైల్వే వేసేందుకుగాను నిర్మించారు. ఎట్టకేలకు ఈ వంతెనపై రెండో లైన్ వేసేందుకు రైల్వేస్ సిద్ధమైంది. మార్చనున్న ఆర్చ్ రైలు వంతెన ఆరు హేంగర్లు ఆర్చ్ రైలు వంతెన 19వ స్పాన్లోని ఒక దీనాహేంగర్ వంగింది. పదో స్పాన్లోని ఏడో హేంగర్కూ మరమ్మతులు చేయాలని బుధవారం పరిశీలించిన నిపుణుల బృందం గుర్తించింది. మొత్తం ఆరు హేంగర్లను మార్చాల్సి ఉందని అశోక్కుమార్ తెలిపారు. ఇందుకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా దశలవారీగా హేంగర్లను మారుస్తామని, రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని డీఆర్ఎం చెబుతున్నారు. ఈ వంతెనపై ఇది మూడో అలజడి ఆర్చ్ రైలు వంతెన 27వ పిల్లర్కు, డెక్ బేరింగ్కు మధ్య అంచనాలకు మించి 2003లో ఎక్కువగా కదలికలు వచ్చాయి. దీంతో వంతెన స్వరూపంలో తేడా కనిపించడంతో అప్పట్లో బేరింగ్లను సర్దుబాటు చేశారు. 2011లో వంతెనకు ప్రకంపనలు ఎక్కువగా వస్తున్నాయని రైల్వే వర్గాలు గుర్తించాయి. పరిశీలించిన రైల్వే ఇంజినీరింగ్ నిపుణుల ట్రాక్లో లోపాలే దానికి కారణమని తేల్చింది. తాజా ఇప్పుడు 19వ స్పాన్ వద్ద దీనా హేంగర్ వంగింది. ఆరు హేంగర్లను మార్చాలని గుర్తించారు. దీని కారణంగా వంతెనపై రైళ్ల వేగాన్ని 20 కిలోమీటర్లకే పరిమితం చేశారు. -
ర్యాంపు మూసివేతకు నిరసనగా ధర్నా
పశ్చిమ గోదావరి (కొవ్వూరు) : ఔరంగబాద్ ఇసుక ర్యాంపు మూసివేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ర్యాంపు గేటు ఎదుట పడవల నిర్వాహకులు ధర్నాకు దిగారు. ర్యాంపును సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం సాయంత్రం వరకు తెరవకుండా ర్యాంపు నిర్వాహక సంఘ మహిళా సంఘం అధ్యక్షురాలు కల్పన ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. లారీలు లోడింగ్ విషయంలో తాను నిర్దేశించిన సీరియల్ ప్రకారమే లోడింగ్ చేయాలని ఆంక్షలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు లోడింగ్కి ఆలస్యం కాకుండా ఉండేందుకు ఎక్కడ ఇసుక నిల్వలు సిద్ధంగా ఉంటే ఆ గుట్టలు లోడ్ చేయాలని కోరుతున్నామని పడవల నిర్వహకులు తెలిపారు. -
పుష్కర స్నానం చేసిన శివచేన ఎంపీ భావన
-
మా తాత చెప్పాడు.. తీసుకోండి..
కంచికామకోటిపీఠం (కొవ్వూరు) : ఈ పుస్తకాల్లో అనేక మంచి విషయాలు ఉన్నాయని మాతాత చెప్పాడు.. తీసుకుని చదువుకోండని విజయ విహార్ సెంటర్లో ఓబాలుడు వారం రోజులుగా ఉచితంగా ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేస్తున్నాడు. పుల్లల అడితి వ్యాపారి గుట్టా అశోక్ యాత్రికులకు ఆధ్యాత్మిక రచనలను మనవడు నాగతరుణ్తో పంపిణీ చేయిస్తున్నాడు. పిల్లలు..దేవుడు చల్లని వారే పుష్కర కల్చరల్ (కొవ్వూరు) : కల్మషం లేని మందహాసమే ఆభరణమైన బాలలు అచ్చం దేవతామూర్తులే. వారిని పూజిస్తే తల్లి గోదారికి పూజ చేసినట్టే. అందుకే ఆర్యవైశ్య మహిళా సంఘం కుమారి పూజలు చేశాయి. చిన్నారుల నుదుట బొట్టు పెట్టి, మెడలో పూలమాల వేసి, కాళ్లను పళ్లెంలో కడిగి బహుమతులను అందజేశాయి. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
కొవ్వూరు రూరల్: కొవ్వూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు కాగా ఒకరు ప్రైవేట్ ఉద్యోగి. ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నారుు.. విశాఖపట్నంలోని కంచరపాలెం శివలింగపురానికి చెందిన వైరాల అప్పారావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నారు. పుష్కర విధుల్లో భాగంగా ఆయన కొవ్వూరు వచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రిని చూసి వెళదామని అతని కుమారుడు వైరాల తరుణ్కుమార్ (20) సోమవారం రాజమండ్రిలో మేనత్త ఇంటికి వచ్చాడు. మేనత్త కుమారుడు దిగమర్తి ప్రేమకుమార్ (17)తో కలిసి అర్ధరాత్రి వేళ మోటార్ సైకిల్పై రాజమండ్రి రోడ్డు కం రైలు బ్రిడ్జిపై నుంచి కొవ్వూరు వస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. దీంతో తరుణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రేమ్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమండ్రిలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మృతిచెందాడు. తరుణ్కుమార్ విశాఖలోని గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా, ప్రేమ్కుమార్ శ్రీకాకుళం జిల్లా నరవలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. బంధువులు కొవ్వూరు చేరుకుని పోస్ట్మార్టం అనంతరం తరుణ్ మృతదేహాన్ని కంచరపాలెం తరలించారు. ఒకే కుటుంబానికి ఇద్దరు యువకులు పుష్కర వేళ కన్నుమూయడం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. కొవ్వూరుకు చెందిన కంతే సత్యనారాయణ(42) సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరికిరేవుల రోడ్డులో వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన స్థానిక ఆంధ్రా సుగర్స్ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వరలక్ష్మితో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. -
గోదారిలో.. కొంగుల ముడి
కొవ్వూరు రూరల్ : వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన జంటలు తమ బంధానికి గోదారమ్మ ఆశీస్సులనూ పొందే అవకాశమే సరిగంగ స్నానం. 'పన్నెండేళ్లకు నీకో పుష్కర సంరంభం..నిండునూరేళ్లు గుబాళించాలి మా దాంపత్య సౌరభం' అని ఆకాంక్షిస్తూ పుష్కరాల్లో సరి గంగ స్నానాలు చేస్తున్న జంటలెన్నో. సోమవారం వీఐపీ ఘాట్లో సరిగంగ స్నానానికి సిద్ధమౌతున్న నవదంపతుల్ని చిత్రంలో చూడొచ్చు. -
హాయ్.. ఐయామ్ చిన్మున్
కొవ్వూరు : 'నేనూ పుష్కర స్నానానికే వచ్చానంటే వినరేం.. నన్ను స్నానం చేయనివ్వరే' అనుకుంటూ ఇతర భక్తుల వైపు జాలిగా చూస్తోంది ఈ చిన్మున్. ఇంతకీ చిన్మున్ ఎవరా? అనుకుంటున్నారు కదూ. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ ప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్ల. సుబ్రహ్మణ్య ఘాట్లో సోమవారం తన యజమానితో కలిసి సందడి చేసింది. చక్కని మిడ్డీ వేసుకుని తిరుగుతుంటే అందరూ దాన్నే చూస్తూ ముచ్చటపడిపోయారు. కాకపోతే కుక్కలతో స్నానం చేయించకూడదని చెప్పి పోలీసులు ఘాట్ బయటికి పంపేశారు. -
పుష్కరాల్లో పంచ ‘భూతాలు’!
కొవ్వూరు : ప్రభుత్వానికి.. పాలనా యంత్రాంగానికిది పరీక్ష సమయం. భక్తులకు ఎదురయ్యే అయిదు ప్రధాన సమస్యలేమిటో పుష్కరాలు ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే తేటతెల్లం కావటంతో గోదావరీ తీర ప్రాంతాలవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడీ సవాలును ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తం కావలసిన సమయమిది. అరకొర వైద్యం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు పుష్కరాలకు వస్తున్న నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. హోటళ్లలో శుభ్రత, తాగునీటి సరఫరాపై ఒక కన్నేసి ఉంచాలి. కొన్ని వైద్య శిబిరాల వద్ద అవసరమైన ముఖ్యమైన మందులు లేని లోటు కనిపిస్తోంది. కొవ్వూరులో యాత్రికులకు వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం మూడు షిప్టులలో బేస్ క్యాంపుతో కలుపుకుని ఆరు క్యాంప్లలో 200 మంది సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారు. మూడు 108 అంబులెన్స్లు, ఐదు ఐసీయూ సౌకర్యం కలిగిన బోటు అంబులెన్స్లు ఉన్నాయి. కానీ ట్రాఫిక్ వల్ల క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకువెళ్లే అవకాశం లేదు. ప్రయాణ‘నరకం’ ఎంతో శ్రమకోర్చి దూరప్రాంతాల నుంచి తరలివ వచ్చే యాత్రికులకు తగ్గట్టు బస్సులు లేకపోవటంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పుష్కరాలకు ముందు కొవ్వూరు మీదుగా రాజమండ్రికి గంటకు సుమారు 2500 వాహనాలు వెళ్తుంటాయి. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ భారీ వాహనాలను కొవ్వూరు - రాజమండ్రి మార్గంలో అనుమతించకుండా జాతీయ రహదారిపై కి మళ్లించాలని సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. దీనిపై శనివారం వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. కానరాని ఎక్సయిజ్ ఎక్సర్సైజ్ పుష్కరాలు జరిగే 12 రోజులు మద్యం అమ్మకాలను నిలిపివేయాలనే పలువురి సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లో ఇప్పటికే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమండ్రిలో మద్యం విక్రయాలు పెరిగిపోవటంతో మందుబాబులు స్పృహ కోల్పోయి రోడ్లపై దొర్లుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొవ్వూరులో మినహా పట్టణానికి నాలుగువైపులా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాల్లో యధావిధిగా అమ్మకాలు జరుగుతున్నాయి. మంచినీటికి కటకటే పుష్కరాల ప్రారంభం నుంచి శనివారం వరకు 12 లక్షల మంచినీటి ప్యాకెట్లను యాత్రికులకు అందజేశారు. ఇకపై రానున్న యాత్రికుల అవసరాలు తీర్చేందుకు రోజుకు ఆరు లక్షల ప్యాకెట్లు అవసరం కానుండగా నాలుగు లక్షలు ప్యాకెట్లు మాత్రమే సమకూర్చే పరిస్థితి ఉంది. ‘చెత్త’శుద్ధి ఏదీ సిబ్బంది కొరత వల్ల ఘాట్లలో మినహా రాజమండ్రి నగరంతో సహా పలు పట్టణాలు, పల్లెల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. ఇది మరింత క్షీణించే ముప్పు ఉంది. కొవ్వూరు స్నాన ఘట్టాల నుంచి రోజుకు 90 టన్నుల చెత్త పట్టణంలో 60 టన్నుల చెత్త కలిపి 150 టన్నుల వరకు వస్తోంది. యాత్రికుల తాకిడి పెరిగితే దీంతో పాటు చెత్త కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
బోగీలోకాలు పెట్టేందుకు కూడావీలులేదు
-
12 గంటలుంటే ఒక రోజున్నట్టే..!
రాజమండ్రి/కొవ్వూరు : లాడ్జీల్లో వసతి 12 గంటలకు కుదించారు. రుసుము మాత్రం 24 గంటలకు వసూలు చేస్తున్నారు. కొంతమంది 12 గంటలకు సైతం రుసుము పెంచేస్తున్నారు. ఆటోల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వారు చెప్పిందే ధర.. లేకుంటే నడిచి వెళ్లాల్సిందే. మంచినీటి వాటర్ ప్యాకెట్ సైతం అవసరాన్ని బట్టి రూ.2 నుంచి రూ.4 పలుకుతోంది. రోడ్డు పక్కన తోపుడు బళ్లపై ప్లేటు ఇడ్లీ రూ.20 పలుకుతోంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల చార్జీలు సైతం రెట్టింపయ్యాయి. రాజమండ్రిలో పుష్కర స్నానం చేసి కోటిపల్లి, అంతర్వేది, కుండలేశ్వరం వంటి ఘాట్లు, అన్నవరం, ద్రాక్షారామం వంటి ఆలయాలకు వెళ్లాలన్నా కార్ల అద్దె రెట్టింపైంది. రాజమండ్రి నుంచి అన్నవరం సాధారణ రోజుల్లో కారు అద్దె దాని స్థాయిని బట్టి డ్రాపిం గ్కు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు ఉండగా, ఇప్పుడు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఉంది. బంధువుల ఇళ్లకు పయనం దీంతో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర నగరాల నుంచి వచ్చేవారు జిల్లాలోని పల్లెల్లో సమీప బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. బంధుత్వాలు లేని వారు కాకినాడ, మండపేట, అమలాపురం వంటి ప్రాంతాల్లో లాడ్జిలు, హోటళ్లలో ఉంటున్నారు. వీరి రాకతో కాకినాడ, రావులపాలెం, కొత్తపేట, అనపర్తి, జగ్గంపేట వంటి మేజర్ గ్రామాలు, రిసార్టులున్న అల్లవరం మండలం ఓడలరేవు, మలికిపురం మండలం దిండి, మురమళ్ల లాంటి చిన్న గ్రామాల్లో సైతం లాడ్జిలు కిటకిటలాడుతున్నాయి. -
పోటెత్తిన భక్తజన గోదారి
-
ప్రతి ఇల్లూ అన్నపూర్ణ లోగిలే
గోదావరి పుష్కరాలను అట్టహాసంగా.. ఆర్భాటంగా నిర్వహిస్తామంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రచారం కోసం పాకులాడిన పాలకుల పరువు పోయింది. తొలిరోజే పరాభవం ఎదురైంది. కానీ.. గోదావరి జిల్లాల ప్రజలకు మాత్రమే సొంతమైన.. స్వచ్ఛమైన మర్యాద, మన్ననల్ని అందుకుంటూ లక్షలాదిగా తరలివస్తున్న పుష్కర యాత్రికులు మైమరచిపోతున్నారు. రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి వస్తున్న లక్షలాది యాత్రికులకు స్వాగతం పలకడంతోపాటు వారికి మర్యాద చేసి పంపుతున్న గోదారి బిడ్డలు ఈ గడ్డ ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేస్తున్నారు. పవిత్ర పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి గల ప్రతి ఇల్లూ అన్నపూర్ణ లోగిలిగా మారిపోయింది. ఇంటికొచ్చిన వారికి మంచినీళ్లు ఇచ్చి పలకరించడం.. అతిథిదేవో భవ అంటూ పట్టెడన్నం పెట్టడం.. ఎక్కడైనా ఉన్న సంప్రదాయమే. కానీ.. గోదారమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు, పుష్కర స్నానమాచరించేందుకు వస్తున్న యాత్రికులంతా తమ బంధువులే.. అంతా గోదారమ్మ తల్లి బిడ్డలమేనన్న భావనతో తీరం వెంబడి ఉన్న ప్రతి కుటుంబం అతిథి మర్యాదలు చేసి పులకించిపోతోంది. వచ్చిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ఆదరిస్తోంది. ఎన్నో వ్యయప్రయాలకోర్చి గోదావరి తీరం చేరుకుంటున్న భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా స్వచ్ఛంద సేవలందిస్తూ ఇక్కడి ప్రజలు తరిస్తున్నారు. గోత్రికుల పేరిట కొందరు.. ఇంటిపేరిట కొన్ని కుటుంబాలు.. వర్ణాల పేరిట పలు సంఘాలు... కుల, వర్గ రహితంగా మరికొందరు.. స్వచ్ఛంద సేవా సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా సంస్థలు, సంఘాలే కాదు.. తీరం వెంబడి ఉన్న పట్టణాలు, ఊళ్లు, పల్లెల్లోని ప్రతి ఇల్లూ పుష్కర భక్తులకు ఘనంగా స్వాగతం పలుకుతోంది. పేదధనిక.. కులమతాల పట్టింపులు లేకుండా ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం.. సేవ చేస్తున్నారు. కొవ్వూరు, నరసాపురం, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెరవలి, నిడదవోలు, తాళ్లపూడి, పోలవరం.. ఇలా ప్రతి ప్రాంతంలో యాత్రికుల కోసం భారీగా అన్న సమారాధనలు నిర్వహిస్తున్నారు. ఒక్కపూట భోజనంతో సరిపెట్టడం కాదు.. ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం.. మధ్యాహ్న, రాత్రి వేళల్లో కడుపునిండా భోజనంతోపాటు నిండైన ఆత్మీయతను పంచిపెడుతున్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో ఎప్పుడు ఎంతమంది వచ్చినా విస్తరి వేసి సంప్రదాయంగా వడ్డిస్తున్నారు. కంచికామ కోటిపీఠం ప్రతినిధులు కొవ్వూరులో రాత్రి తెల్లవార్లూ ‘రండి.. స్వామీ ప్రసాదం స్వీకరించండి..’ అని వినమ్రంగా ఆహ్వానిస్తున్నారు. కొవ్వూరులో ప్రతి కుటుంబం దారిన వెళ్లే యాత్రికులకు మంచినీళ్లు అందిస్తోంది. కొంతమంది మజ్జిగ, మరికొందరు పాలు.. పండ్లు,. ఫ్రూట్ సలాడ్లు.. పులిహోర వంటి వాటిని ఉద్యమ రూపంలో పంపిణీ చేస్తున్నారు. పుష్కర పర్వం మొదలైన అనంతరం ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా గోదారి తీరప్రాంతాల్లో ఇంతవరకు ఎవరూ ఎక్కడా భోజనానికి ఇబ్బంది పడ్డాం.. అని చెప్పిన దాఖలాలు లేవంటే ఇక్కడి ప్రజల ఔదార్యం, అనురాగం అర్థం చేసుకోవచ్చు. దూరాభార ప్రయాణం.. ట్రాఫిక్ అవస్థలు, ఇతర రవాణా సౌకర్యాల లేమి వంటి సమస్యలన్నీ పుష్కర స్నానం ఆచరించిన తర్వాత.. గోదావరి బిడ్డల అనురాగం చూసిన తర్వాత.. ఎవరైనా మరచిపోవలసిందే. అందుకే అనురాగాల సిరి.. వడ్డించిన విస్తరి గోదావరి. తెలుగువారి తిరుగులేని జీవనాడి ఇదేనంటే ఎవరైనా అంగీకరించాల్సిందే. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
కోవ్వూరులో గోదావరి మహాపుష్కరయాగం!
-
పుష్కరాల్లో వృద్ధురాలికి గుండెపోటు..మృతి
కొవ్వూరు : గోదావరి పుష్కరాల్లో స్నానానికి వచ్చిన ఓ వృద్ధురాలు గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు లోని గోష్పాదక్షేత్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలిని దెందలూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన కొండమ్మ(65) గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్లో పుష్కర శోభ