ఎస్సారెస్పీకి 70 వేల క్యూసెక్కుల వరద
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్ట్లోకి 70 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1077.10(45 టీంసీలు) అడుగులనీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.