inflow
-
డెట్ ఫండ్స్లోకి రూ.1.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్కు అక్టోబర్లో డిమాండ్ ఏర్పడింది. ఏకంగా రూ.1.57 లక్షల కోట్లను డెట్ ఫండ్స్ ఆకర్షించాయి. సెప్టెంబర్ నెలలో ఇదే విభాగం నుంచి రూ.1.14 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోగా, మరుసటి నెలలోనే పరిస్థితుల్లో పూర్తి మార్పు కనిపించింది.ముఖ్యంగా డెట్లో మొత్తం 16 కేటగిరీలకు గాను 14 విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో డెట్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) 11 శాతం వృద్ధితో అక్టోబర్ చివరికి రూ.16.64 లక్షల కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ చివరికి ఇవి రూ.14.97 లక్షల కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.స్వల్పకాల ఫండ్స్కు ఆదరణ » లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా 83,863 కోట్లను రాబట్టాయి. అక్టోబర్ నెలలో మొత్తం డెట్ పెట్టుబడుల్లో సగం లిక్విడ్ ఫండ్స్లోకే వచ్చాయి. » ఓవర్నైట్ ఫండ్స్ రూ.25,784 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.25,303 కోట్ల చొప్పున ఆకర్షించాయి. » అల్ట్రా షార్ట్ డ్యురేషన్ (12 నెలల్లోపు) ఫండ్స్లోకి రూ.7,054 కోట్లు వచ్చాయి. » లో డ్యురేషన్ ఫండ్స్ రూ.5,600 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.4,644 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.1,362 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ప్రధానంగా తక్కువ కాలానికి ఉద్దేశించని డెట్ ఫండ్స్కు ఆదరణ లభించింది. » నాలుగు నెలల విరామం తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్యూ ఫండ్స్లోకి అత్యధికంగా రూ.936 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. » గిల్ట్ ఫండ్స్ రూ.1,375 కోట్లు, లాంగ్ డ్యురేషన్ బాండ్ ఫండ్స్ రూ.1,177 కోట్ల చొప్పున ఆకర్షించాయి. -
జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో...
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 7గంటల వరకు కేవలం 317 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 161 క్యూసెక్కులు క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 388 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.048 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. -
జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 1,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 78 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 731 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 300 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,044 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.340 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రామన్పాడుకు 1,140 క్యూసెక్కులు మదనాపురం: జూరాల ఎడమ కాల్వ నుంచి రామన్పాడు జలాశయానికి 1,140 ఇన్ఫ్లో కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు వచ్చి చేరింది. రామన్పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు 1,150, కుడి కాల్వకు 10, ఎడమ కాల్వకు 10 క్యూసెక్కులు విడుదల చేయడంతో పాటు తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ రనిల్రెడ్డి తెలిపారు. -
స్తబ్దుగా గోదావరి
సాక్షి, అమలాపురం: గలగలా గోదావరి... స్తబ్దుగా ఉంది. ‘నైరుతి’ ముఖం చాటేయడంతో ఈ ఏడాది గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు పడలేదు. ఆ ప్రభావం ఇన్ఫ్లోపై పడింది. నైరుతి ముగియడం, వరదల సీజన్ కూడా అయిపోవడంతో జలాల రాక క్రమేణా తగ్గిపోయి ఇన్ఫ్లో తక్కువ స్థాయిలో నమోదవుతోంది. గడచిన రెండురోజులుగా బ్యారేజ్ నుంచి దిగువునకు నీటి విడుదల ఆగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభావం వచ్చే రబీపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆశాజనకం గతేడాది జూలైలో చరిత్రలో రెండో అతి పెద్ద వరద రాగా, ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా అది కొనసాగింది. అక్టోబరు ఇదే సమయానికి బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 6,231 టీఎంసీలు నమోదవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు విస్తృతంగా పడే ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా వరద జాడ లేదు. గతంలో అంటే... 2016లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ఏడాది బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 2,750.944 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. రబీ మొత్తం ఆయకట్టుకు అనుమతి ఇచ్చినా తరువాత కొంత అనధికారికంగా కోత విధించాల్సి వచ్చింది. తగ్గిన ఇన్ఫ్లో ధవళేళ్వరం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో గణనీయంగా పడిపోవడంతో రెండు రోజులుగా గేట్లు మూసివేసి సముద్రంలోకి నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుత ఇన్ఫ్లో 14,700 క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిలో సీలేరు పవర్ జనరేషన్ నుంచి వచ్చింది 3,765 క్యూసెక్కులు. అంటే సహజ జలాలు కేవలం 10,935 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. ఈ నీటిని తూర్పు డెల్టాకు 4,900, మధ్యడెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7,200 చొప్పున మొత్తం 14,700 క్యూసెక్కులు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. -
‘మూసీ’కి పెరిగిన ఇన్ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 892 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. మూసీ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.10 అడుగులు ఉంది. దీంతో అధికారులు ఒక క్రస్టు గేటును ఒక అడుగు మేర ఎత్తి 609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగింది. నీటి ప్రవాహం తగ్గడంతో రెండ్రోజుల క్రితం గేట్లు మూసివేయగా..బుధవారం ఉదయం నుంచి ఇన్ఫ్లో పెరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రాజెక్టుకు 95వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా..పది క్రస్టు గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి 39,580 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. అదేవిధంగా 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 38,864 క్యూసెక్కులు వదులుతుండగా..మొత్తంగా జూరాల నుంచి 83,077 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి జూరాల క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 78,444 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 886 క్యూసెక్కులు మొత్తం 79,330 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 854.40 అడుగులమేర 90.348 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఈక్విటీ పథకాల్లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మరోసారి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాయి. జూన్ నెలలో నికరంగా రూ.8,637 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. వివిధ ఏఎంసీలు కొత్త పథకాల ద్వారా (ఎన్ఎఫ్వోలు) పెట్టుబడులు సమీకరించడం, సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం, స్మాల్క్యాప్ పథకాలకు చక్కని ఆదరణ లభించడం ఇందుకు దారితీసింది. జూన్ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈక్విటీ పథకాల్లోకి జూన్ నెలలో వచ్చిన పెట్టుబడులు మూడు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. మే నెలలో రూ.3,240 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించగా, ఏప్రిల్లో వచ్చిన పెట్టుబడులు రూ.6,480 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఈక్విటీ పథకాలు భారీగా రూ.20,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ‘‘ఈక్విటీ పథకాల్లోకి మెరుగైన పెట్టుబడులు రావడం అన్నది ప్రధానంగా ఆరు కొత్త పథకాలు రూ.3,038 కోట్లు సమీకరించడం వల్లేనని చెప్పుకోవాలి’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా పేర్కొన్నారు. జూన్ నెలలో 11 ఎన్ఎఫ్వోలు (ఓపెన్ ఎండెడ్) ప్రారంభం కాగా, ఇవి సమీకరించిన పెట్టుబడులు రూ.3,228 కోట్లుగా ఉన్నాయి. మే నెలతో పోలిస్తే జూన్ పెట్టుబడులు మెరుగ్గా ఉన్నట్టు కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సేల్స్ హెడ్ మనీష్ మెహతా చెప్పారు. గరిష్ట స్థాయిలో అస్సెట్ అలోకేషన్ కారణంగా కొంత లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదన్నారు. అయితే ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా పెట్టుబడులు కొనసాగించుకోవాలని సూచించారు. నికరంగా చూస్తే ఉపసంహరణే జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం మీద నికరంగా రూ.2,022 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ప్రధానంగా డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.14,135 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీనివల్లే మొత్తం మీద పెట్టుబడుల క్షీణత చోటు చేసుకుంది. అంతకుముందు మే నెలలో డెట్ విభాగంలోకి రూ.45,959 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. విభాగాల వారీగా.. ►స్మాల్క్యాప్ పథకాల్లోకి రికార్డు స్థాయిలో రూ.5,472 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►సిప్ రూపంలో ఇన్వెస్టర్లు జూన్లో రూ.14,734 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మే నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,749 కోట్లుగా ఉన్నాయి. ►లార్జ్క్యాప్ పథకాల నుంచి రూ.2,049 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ నుంచి రూ.1,018 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ►వ్యాల్యూ ఫండ్స్ రూ.2,239 కోట్లు, మిడ్క్యాప్ పథకాలు రూ.1,748 కోట్లు, లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.1,147 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ►ఈటీఎఫ్ ల్లోకి రూ.3,402 కోట్లు వచ్చాయి. ►అన్ని ఏఎంసీల నిర్వహణలోని మొత్తం నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ మే చివరికి ఉన్న రూ.42.9 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.44.8 లక్షల కోట్లకు పెరిగింది. ►డెట్ విభాగంలో హైబ్రిడ్ ఫండ్స్లోకి రూ.4,611 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►లిక్విడ్ ఫండ్స్ రూ.28,545 కోట్లు కోల్పోయాయి. -
గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.165 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు) వరుసగా మూడు నెలల పాటు అమ్మకాలు చూసిన తర్వాత తేరుకున్నాయి. ఫిబ్రవరిలో రూ.165 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది జనవరిలో రూ.199 కోట్లు, 2022 డిసెంబర్లో రూ.273 కోట్లు, అదే ఏడాది నవంబర్లో రూ.195 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఉపసంహరించుకోవడం గమనార్హం. 2022 అక్టోబర్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.147 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశీయంగా బంగారం ధరలు కొంత తగ్గడం పెట్టుబడుల రాకకు అనుకూలించిందని.. బంగారం ధరలు తగ్గినప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు సహజంగానే వస్తుంటాయని మార్నింగ్స్టార్ రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. భౌతిక బంగారానికి సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి ఇచ్చే గుర్తింపు) ఫిబ్రవరిలో 20వేలు పెరిగి మొత్తం 46.94 లక్షలకు చేరాయి. బంగారంలో రాబడులు ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటాయని, అందుకే అది నేడు ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా మారినట్టు కవితా కృష్ణన్ తెలిపారు. ఫిబ్రవరి చివరికి గోల్డ్ ఈటీఎఫ్లు అన్నింటి పరిధిలోని నిర్వహణ ఆస్తుల విలువ రూ.21,400 కోట్లుగా ఉంది. -
ఈక్విటీల్లోకి మళ్లీ పెట్టుబడుల వరద
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు జనవరిలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. రూ.12,546 కోట్లు నికరంగా ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. గత నాలుగు నెలల్లో ఈక్విటీ ఫండ్స్లోకి ఒకనెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. 2022 డిసెంబర్లో ఈక్విటీల్లోకి రూ.7,303 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే ఏడాది నవంబర్లో రూ.2,258 కోట్లు, అక్టోబర్లో రూ.9,390 కోట్ల చొప్పున వచ్చాయి. ఇక 2022 సెప్టెంబర్లో వచ్చిన రూ.14,100 కోట్లు నెలవారీ గరిష్ట స్థాయిగా ఉంది. ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 23వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు రావడాన్ని గమనించొచ్చు. 2023 జనవరి గణాంకాలను ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. విభాగాల వారీగా.. అత్యధికంగా స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.2,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత లార్జ్ అండ్ మిడ్క్యాప్ పథకాల్లోకి రూ.1,902 కోట్లు, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.1,773 కోట్లు, మిడ్క్యాప్ పథకాల్లోకి రూ.1,628 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.14,14 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.1,006 కోట్లు, సెక్టోరల్, థీమ్యాటిక్ పథకాల్లోకి రూ.903 కోట్లు, కాంట్రా ఫండ్స్లోకి రూ.763 కోట్లు, లార్జ్క్యాప్ పథకాల్లోకి రూ.716 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్లోకి రూ.183 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ స్థిరాదాయ పథకాల (డెట్) నుంచి జనవరిలో నికరంగా రూ.10,316 కోట్లు బయటకు వెళ్లాయి. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్లో రూ.5,042 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో రూ.3,859 కోట్లు, ఓవర్నైట్ ఫండ్స్లో రూ.3,688 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు విక్రయించారు. మనీ మార్కెట్ పథకాలు రూ.6,460 కోట్లు ఆకర్షించాయి. ఇక హైబ్రిడ్ పథకాలు సైతం రూ.4,492 కోట్లు ఆకర్షించగా, మల్టీ అస్సెట్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, ఆర్బిట్రేజ్ ఫండ్స్లోకి రూ.2,055 వచ్చాయి. ఇండెక్స్ ఫండ్స్లోకి రూ.5,813 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లలో నమ్మకం ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాలపై నమ్మకాన్ని ఉంచారు. దీనికి నిదర్శనమే రూ.12,546 కోట్లు రావడం. నెలవారీగా చూస్తే ఇది 72 శాతం అధికం’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నా ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. సిప్ బలం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.13,856 కోట్లు వచ్చాయి. డిసెంబర్లో వచ్చిన రూ.13,573 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ పెట్టుబడులు రూ.13వేల కోట్లకు పైగా రావడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. సిప్ ఖాతాల సంఖ్య 6.21 కోట్లుగా ఉంది. నికరంగా 9.20 లక్షల కొత్త సిప్ ఖాతాలు రిజిస్టర్ అయ్యాయి. ఒకవైపు ఎఫ్పీఐలు విక్రయాలు చేస్తున్నప్పటికీ మార్కెట్లు స్థిరంగా ఉండడానికి సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద
-
కృష్ణా నదికి పోటెత్తిన వరద (ఫొటోలు)
-
వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు
నిర్మల్/కడెం: సముద్రం నుంచి సునామీ దూసుకువస్తోందా అన్నట్టు కడెం ప్రాజెక్టుపై వరద పోటెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తుంటేనే కడెం గుండె దడదడలాడింది. అధికారులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోయారు. అలాంటిది బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. ఎత్తిన 17 గేట్లతో పాటు (ఒక గేటు పనిచేయడం లేదు) ఎడమకాలువకు పడ్డ గండి నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో వచ్చిన వరద ప్రాజెక్టుపై నుంచి పొంగింది. అలా దాదాపు మూడునాలుగు గంటల పాటు కొనసాగింది. ఇక ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమని భావించిన సిబ్బంది వదిలేసి వచ్చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతటి తాకిడినీ తట్టుకుని ఆనకట్ట చెక్కుచెదరకుండా నిలబడింది. రెండు గేట్ల కౌంటర్ వెయిట్ దిమ్మెలు మాత్రం కొట్టుకుపోయాయి. గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం మొత్తం వరద తాకిడితో వచ్చిన చెట్లు, చెట్లకొమ్మలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఈ కారణంగా గేట్లను దించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ఎన్నడూ చూడని వరద ఉధృతి కడెం ప్రాజెక్టుకు తొలిసారి ఈస్థాయి ఇన్ఫ్లో వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని అధికారులు, స్థానికులు పేర్కొన్నారు. 1958లో ఒకసారి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. (అప్పట్లో 9 గేట్లే ఉండేవి) దిగువన మొత్తం నీటమునిగింది. భారీ వరదకు డ్యామ్ ఒకవైపు కోతకు గురయ్యింది. ఆ ప్రమాదం తర్వాత మరో తొమ్మిది గేట్లను నిర్మించి, ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచారు. అయితే 1995లో 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా డ్యామ్ ఎడమ కాలువ వద్దనే గండిపడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టుపై నుంచి పారింది. ఈసారి కూడా ఎడమవైపు గండిపడటం వల్లే కట్ట ఆగిందని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద గండి పడటంతో కోతకు గురైన ప్రాంతం ప్రాజెక్టు నిలిచింది..నష్టం మిగిల్చింది కడెం ప్రాజెక్టు పైభాగమంతా అటవీ ప్రాంతమే ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు అధికారులు అంచనా వేసే లోపే ఎగువన ఉన్న వాగులన్నీ పొంగి ప్రాజెక్టులోకి వరద వేగంగా వచ్చేస్తుంది. ఈవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువ జాము వరకు పోటెత్తిన వరదతో కడెం ప్రాజెక్టు చాలావరకు దెబ్బతింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాజెక్టు ఒకటి, రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. వరద గేట్లను ఎత్తి దించేందుకు ఈ దిమ్మెలు ఉపయోగపడతాయి. 2018లో కూడా రెండో నంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఇక వరద గేట్లలో మొత్తం చెత్త పేరుకుపోవడం, ఎలక్ట్రికల్ కనెక్షన్లు దెబ్బతినడంతో వాటిని సరిచేయడం ఇప్పట్లో కుదరని పని అని అంటున్నారు. ఎడమ కాలువకు గండిపడ్డ ప్రాంతంలో వందమీటర్ల మేర కాలువ కోతకు గురైంది. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువన సైడ్వాల్స్ మొత్తం దెబ్బతిన్నాయి. కొనసాగుతున్న అవుట్ ఫ్లో ప్రస్తుతం 17 గేట్ల ద్వారా దిగువకు అవుట్ఫ్లో కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి 9 గంటలకు మొత్తం 700 అడుగులకు గానూ 684.725 అడుగుల నీటిమట్టం, మొత్తం 7.603 టీఎంసీలకు గానూ 4.259 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,25,582 క్యూసెక్కులు ఉండగా అదేస్థాయిలో వరద దిగువకు వెళుతోంది. పెను ప్రమాదం తప్పింది: మంత్రి కడెం ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. కడెం వాగుకు పూజలు చేశారు. -
ఎర్రకాలువకు పెరుగుతున్న నీటిమట్టం
-
వాయుగుండంగా మారిన గులాబ్ తూఫాన్
-
శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్కు పోటెత్తిన వరద
-
చంద్రబాబు నివాసం చుట్టూ వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/అచ్చంపేట(పెదకూరపాడు): కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. బుధవారంతో పోలిస్తే గురువారం వరద ఉద్ధృతి మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత కాస్త తగ్గింది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీలోకి 7,28,934 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 70 గేట్లను పూర్తిగా ఎత్తేసి అంతేస్థాయిలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటికి.. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల కట్టలేరు, మున్నేరు, కొండవాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తింది. అదేస్థాయిలో దిగువకు వదులుతున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో నదీ తీరప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శుక్రవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో 2009 అక్టోబర్ 5న తొలిసారిగా గరిష్ఠంగా 11,10,404 క్యూసెక్కుల వరద వచ్చింది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా పదిగేట్లను 20 అడుగుల మేర ఎత్తేసి, కుడి విద్యుత్కేంద్రం ద్వారా 5.07 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి నాలుగు లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలోనూ భారీవర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్, సుంకేశుల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర నీరు కృష్ణానదిలోకి చేరుతోంది. (చదవండి: మహోగ్ర కృష్ణమ్మ) వంశధారలో స్థిరంగా వరద ఉద్ధృతి ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధారలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 41,253 క్యూసెక్కులు చేరుతుండగా.. 43,197 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నాగావళి ప్రధాన ఉపనది అయిన సువర్ణముఖి నదిలో వరద మరింత పెరిగింది. మడ్డువలస ప్రాజెక్టులోకి 25,428 క్యూసెక్కులు చేరుతుండగా.. 27,706 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో నదీ తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం నుంచి 2.31 లక్షల క్యూసెక్కులు కడలిలోకి గోదావరిలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. చంద్రబాబు నివాసం చుట్టూ వరద ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో గురువారం ఎగువ ప్రాంతంలోని కరకట్ట వెంబడి రిజర్వ్ కన్జర్వేటరీలో అక్రమంగా నిర్మించిన గెస్ట్హౌస్ల చుట్టూ వరదనీరు చేరింది. కొన్ని గెస్ట్హౌస్లు వరదనీటిలో మునిగిపోయాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి. హెలీప్యాడ్ సగం వరకు మునిగిపోయింది. గోకరాజు గంగరాజు గెస్ట్హౌస్, చందన బ్రదర్స్ గెస్ట్హౌస్ ఐదడుగుల వరకు నీళ్లలో మునిగిపోగా, ఆక్వా డెవిల్స్లో కరకట్ట వరకు నీళ్లు చేరాయి. ఇసుక ర్యాంప్ వద్ద ఉన్న మత్స్యకారుల ఇళ్లు మునిగిపోవడంతో అధికారులు వారిని అక్కడినుంచి ఖాళీ చేయించారు. గురువారం రాత్రి మరింత వరద వస్తుందని సమాచారం అందటంతో ముందు జాగ్రత్తగా కరకట్ట లోపల ఉన్న గెస్ట్హౌస్ల వారిని ఖాళీచేయాలని అధికారులు ఆదేశించారు. మేం ఉంటే గంటగంటకూ టెలీకాన్ఫరెన్స్లు: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలో ఉంటే వరదల సమయంలో గంట గంటకు అధికారులతో టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించేవాళ్లమని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేవాళ్లమన్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి గురువారం టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ‘తీరం దాటే సమయాన్ని, తాకే ప్రదేశాన్ని ముందే అంచనా వేసేవాళ్లం. ఏ ప్రాంతంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ఆర్టీజీఎస్ ద్వారా అంచనా వేసి ప్రజల్ని ముందే అప్రమత్తం చేసేవాళ్లం. ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించేవాళ్లం. అధికార యంత్రాంగమంతా అక్కడే మకాం వేసేలా చూసేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాకే తిరిగి వచ్చేవాళ్లం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ చొరవ, స్ఫూర్తి లేవు. ప్రజల ప్రాణాలన్నా, ఆస్తినష్టం అన్నా వైఎస్సార్సీపీకి లెక్కేలేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు. -
ప్రకాశం బ్యారేజికి భారీగా వస్తున్న వరదనీరు
-
నిండుకుండలా శ్రీశైలం,జూరాల ప్రాజెక్ట్
-
భారీ వర్షాలతో ఉప్పొంగిన వాగులు
-
ఎస్సారెస్సీలో పెరుగుతున్న వరద
సాక్షి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇన్ఫ్లో 9,342 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1055.00 అడుగులు (9.287 టీఎంసీలు) లుగా ఉంది. ఈ నెలలో 14 రోజుల్లో ప్రాజెక్టులోకి 2 టీఎంసీల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద
సాక్షి, నిజామాబాద్: మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేశారు. దీంతో నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1052 అడుగులుగా ఉంది. -
ఎఫ్ఐపీబీ రద్దుతో ఎఫ్డీఐల జోరు
-
తగ్గిన ఇన్ ఫ్లో
పెరిగిన ఔట్ ఫ్లో డ్యాంలో 3.57 టీఎంసీల నీరు నిల్వ కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో తగ్గిపోయింది. హంద్రీ నీవా కాలువ ద్వారా 715 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 10 రోజుల క్రితం వరకు సుమారు 1050 క్యూసెక్కుల నీరు సరఫరా అయ్యేది. హెచ్చెల్సీ ద్వారా టీబీ డ్యాం నుంచి వచ్చే నీటిని నిలిపివేశారు. ఇన్ఫ్లో కన్నా ఔట్ ఫ్లో పెరిగింది. ఏపీ జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీకి సుమారు 700 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత , సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజు సుమారు 60–70 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 3.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నెల 22న ధర్మవరం కుడికాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నీటిని విడుదల చేస్తే ఔట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. -
‘ఎల్లంపల్లి’కి తగ్గిన ఇన్ఫ్లో
రామగుండం : ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో గురువారం భారీగా తగ్గింది. పక్షం రోజులు లక్షల క్యూసెక్కుల్లో వచ్చిన ఇన్ఫ్లో ప్రస్తుతం 36,539 క్యూసెక్కులకు చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు రెండు గేట్ల ద్వారా 21,095 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 148.00 మీటర్లకు ప్రస్తుతం 147.55 మీటర్లు ఉంది. 20.175 టీఎంసీల నీటికి 18.92 టీఎంసీలు నిల్వ ఉంది. -
తగ్గిన సాగర్ ఇన్ఫ్లో
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నీటి మట్టం 532.80(173.664టీఎంసీలు) అడుగులకు చేరింది. ‡జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు). ఇన్ఫ్లో తగ్గడంతో నీటిమట్టం నిలకడగా ఉంది. శ్రీశైలం జలాశయం ఎడమ విద్యుదుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా గడిచిన 24 గంటల్లో 5,094 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885.00 అడుగులు(214 టీఎంసీలు). కాగా ప్రస్తుతం 882.80 (203.4270టీఎంసీలు) అడుగులున్నది. ఎగువనుంచి 48,000 క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరుతుంది. కొంతనీటిని పోతిరెడ్డి పాడు ద్వారా విడుదల చేస్తున్నారు. రైతులకు అందుబాటులో... సాగర్ ఆయకట్టు రైతులకు 245 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. రబీలో ఆరుతడి పంటలు సాగు చేసేందుకు సరిపోతుందని అధికారులు అంచనావేస్తున్నారు. శ్రీశైలంలో 203 టీఎంసీలు ఉండగా నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగులు కనీస నీటిమట్టం పైన 42టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. దిగువన గల నీటిని రెండు రాష్ట్రాల్లో గల పలు జిల్లాలకు తాగు నీటి అవసరాలకు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. వాస్తవంగా సాగర్ ఆయకట్టుకు రెండు రాష్ట్రాల్లోని కుడి, ఎడమ కాల్వలకు వరి పంటకు గాను ఒక పంటకు 132 టీఎంసీల చొప్పున 264 టీఎంసీల నీరు కావాలి. అదే విధంగా ఆవిరి నష్టం మరో 17 టీఎంసీలు అవసరమవుతాయి. ఈనీటితో కుడికాల్వ కింద 11,74,874 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 10,37,796 ఎకరాలు మొత్తం 22,12,670 ఎకరాలకు నీరందుతుంది. ఈ పంటల ద్వారా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. గత రెండేళ్లుగా సాగర్ జలాశయం నిండకపోవడంతో ఆయకట్టు రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఈ సీజన్లోనైనా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తే పంటలను సాగు చేయనున్నారు. నిండుకుండల్లా ఎగువన జలాశయాలు కృష్ణానది పైన గల జలాశయాలు సాగర్ మినహా మిగతావన్నీ నిండుకుండలా ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వరకు పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. ఇకపై ఎగువ నుంచి అదనంగా వచ్చే ప్రతి నీటి బొట్టు సాగర్ జలాశయానికే వచ్చే అవకాశాలున్నాయి. -
ప్రాజెక్టులకు తగ్గిన వరద
ఎస్సారెస్పీకి 2 లక్షలు, ఎల్లంపల్లి 1.19లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం తగ్గింది. కృష్ణా నదిలో పూర్తిగా ప్రవాహాలు పడిపోగా, గోదావరిలో మునుపటి కన్నా కాస్త తక్కువగా ప్రవాహాలు వస్తున్నాయి. గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో వచ్చిన కొద్దిపాటి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఆదివారం ఎస్సారెస్పీకి 2 లక్షలు, ఎల్లంపల్లికి 1.19 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చింది. నిజాంసాగర్లోకి 85 వేలు, సింగూరులోకి 30 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. కృష్ణా బేసిన్లోని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రానికి 30 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, 33 వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ఇందులో శ్రీశైలం రిజర్వాయర్కు 30 వేల క్యూసెక్కులు చేరుతోండటంతో నిల్వ 202.04 టీఎంసీలకు చేరింది. ఇక్కడ విద్యుదుత్పత్తి చేస్తూ 14,382 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండగా అందులో 6,357 క్యూసెక్కులు సాగర్కు చేరుతోంది. దీంతో సాగర్లో నీటినిల్వ 171.09 టీఎంసీలకు చేరింది. -
మూసీకి తగ్గిన ఇన్ఫ్లో
కేతేపల్లి: మూసీ రిజర్వాయర్కు ఇన్ఫ్లో తగ్గిపోవడంతో 2 క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ ఎగువ, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో గురువారం 3700 కూసెక్కుల నీరు వస్తుంది. దీంతో 2 గేట్ల ద్వారా 2900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వకు 250, కుడి కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ ఎన్.రమేష్ తెలిపారు. -
16 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ
సోమశిల జలాశయానికి 15 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో సోమశిల : సోమశిల జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వచ్చి చేరడం వల్ల గురువారం సాయంత్రానికి 15.321 టీఎంసీలతో 16 టీఎంసీలకు చేరువలో ఉంది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల జ లాశయానికి మూడు రోజులుగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. నంద్యాల సమీపంలో గల రాజోలు ఆనకట్ట వద్ద కుందూ నది నుంచి ఉదయం 5 వేల క్యూసెక్కులు ఉన్న వరద సాయంత్రానికి 7 వేల క్యూసెక్కుల వంతున ప్రవహిస్తోంది. దీంతో పాటు వైఎస్సార్ జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల కడప సమీపంలో గల చెన్నూరు వద్ద ఉదయం 18 వేల క్యూసెక్కులు ఉన్న వరద మధ్యాహ్నానికి 27 వేలకు చేరింది. సాయంత్రానికి 30 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం మరో రెండు రోజుల వరకూ కొనసాగవచ్చునని అధికారుల భావిస్తున్నారు. దీంతో ఈ వరదల వల్ల జలాÔ¶ యంలో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరవచ్చని అధికారుల అంచనా. -
నిండుకుండలా ఎల్లంపల్లి
రామగుండం : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో నీటి నిల్వ బుధవారం సాయంత్రానికి 19.369 టీఎంసీలకు చేరింది. ఇన్ఫ్లో 521 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 521 క్యూసెక్కులుగా ఉంది. అందులో ఎన్టీపీసీకి 363, హైదరాబాద్ మెట్రోకు 158 క్యూసెక్కులు సరఫరా అవుతున్నాయని ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు. మరో 48 గంటల్లో ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరే అవకాశముంది. -
శ్రీశైలానికి 8వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహకప్రాంతమైన జూరాల నుంచి 8వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. రెండు పవర్హౌస్లలో శనివారం విద్యుదుత్పత్తి జరగలేదు. జలాశయం నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 4,500 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 871.90 అడుగుల వద్ద 149.7760 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
జూరాలలో తగ్గిన ఇన్ఫ్లో
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి జూరాల : కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వరద కేవలం 18వేల క్యూసెక్కులు వస్తుండటంతో జలవిద్యుత్ కేంద్రంలో రెండు పంపుల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువ నదిలోకి 16వేల క్యూసెక్కుల వరదను పుష్కరఘాట్ల అవసరాల కొరకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీంఎసీలు కాగా ప్రస్తుతం 9.09 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇక్కడి నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలకు పంపింగ్ కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 123 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు పై నుంచి ఇన్ఫ్లో 20,420 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ద్వారా 15వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా 32.23 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి ఇన్ఫ్లో 16,321 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో క్రస్టుగేట్లన్నీ మూసివేసి నీటినిల్వను పెంచుతున్నారు. కేవలం విద్యుదుత్పత్తి ద్వారా దిగువ జూరాల రిజర్వాయర్కు 6వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. -
సోమశిలకు 2206 క్యూసెక్కుల ఇన్ఫ్లో
సోమశిల: రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల జలాశయానికి మంగళవారం ఉదయానికి 2206 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 9.383 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 3000 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 83.390 మీటర్లు, 273.59 అడుగుల మట్టం నమోదైంది. సగటున 74 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. కండలేరులో రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 23.553 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 200, పిన్నెరువాగుకి 5, మొదటి బ్రాంచ్ కెనాల్కు30, లోలెవల్ స్లూయీస్కు 30 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
‘సుంకేసుల’కు నిలిచిన ఇన్ఫ్లో
సుంకేసుల(గూడూరు): తుంగభద్ర నది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సుంకేసుల రిజర్వాయర్కు నీటి చేరిక నిలిచిపోయినట్లు డ్యాం వర్క్ ఇన్స్పెక్టరు మునిస్వామి సోమవారం తెలిపారు. దీంతో కేసీ కాల్వకు నీటి విడుదల నిలిపేసామని, డ్యాంలో 1.15 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
కరీంనగర్: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. 20 టీఎంసీల సామర్ధ్యంగల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 18.5 టీఎంసీల నీరు ఉంది. అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి 93 వేల342 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 62 వేల 881 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. -
తాలిపేరు జలాశయానికి భారీ వరద
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండింది. ప్రాజెక్టు 15 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు 50,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 72.70 అడుగులు కాగా ఇన్ఫ్లో 1200 క్యూసెక్కులు. -
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 25 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1077.60(46.20 టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రారంభమైన విద్యుదుత్పత్తి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వార నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్ దిగువ భాగన ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్క టర్బయిన్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. 9 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్కో అధికారులు తెలిపారు. -
ఎస్సారెస్పీకి 70 వేల క్యూసెక్కుల వరద
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్ట్లోకి 70 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1077.10(45 టీంసీలు) అడుగులనీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. -
సోమశిలకు 3,472 క్యూసెక్కుల ఇన్ఫ్లో
సోమశిల : రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల జలాశయానికి సోమవారం ఉదయం కల్లా 3,472 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమశిలకు పైతట్టు ప్రాంతాలైన పెన్నా నది ప్రధాన హెడ్ రెగ్యులేటర్ ఉన్నæ వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద 700 క్యూసెక్కుల వంతున వరద ప్రహిస్తోంది. చెన్నూరు వద్ద 1,100 క్యూసెక్కుల వరద నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 11.069 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నారు డెల్టాకు 2వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 84.32 మీటర్లు, 276.64 అడుగుల మట్టం నమోదైంది. సగటున 55 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. -
ఎస్సారెస్పీలోకి భారీగా వరద నీరు..
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 42 వేల క్యూసెక్కులతో ప్రారంభమైన వరద నీరు మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షా 42 వేల క్యూసెక్కులకు చేరుకుంది. తర్వాత క్రమంగా తగ్గుతూ 70 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఒక్క రోజు వ్యవధిలో 5.5 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల క్యాచ్మెంట్ ఏరియాలో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధతి పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1076.60 (43.51 టీంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. ఎస్సారెస్పీకి ఎగువనగల మహారాష్ట్రలోని విష్ణు పురి ప్రాజెక్ట్ నుంచి ఆదివారం రాత్రి 11.30 గంటలకు 0.5 టీఎంసీల వరద నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఎస్సారెస్పీకి చేరుకుంటుందన్నారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందన్నారు. -
సోమశిలకు వరద ప్రవాహం
సోమశిల: రాయలసీమలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమశిలకు శనివారం వరద ప్రవాహం రావచ్చని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి పెన్నానది ఎగువ ప్రాంతాలైన వైఎస్సార్ జిల్లా చెన్నూరు గేజీ వద్ద 1000 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం కొనసాగుతోంది. కడపతో పాటు సిద్ధవటం, తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెన్నానది ఉపనది అయిన సగిలేరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో జలాశయానికి శనివారం ఉదయం వరద ప్రవాహం చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. రెండో పంటకు ఇంకా సెప్టెంబరు వరకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నా సోమశిల జలాశయంలో నీటి నిల్వ 10.968 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం అడుగంటుతున్న తరుణంలో వరద ప్రవాహం కొనసాగనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సుంకేసుల కళకళ
గూడూరు: సుంకేసుల రిజర్వాయర్ నీటితో కళకళలాడుతోంది. మూడు రోజులుగా రిజర్వాయర్ ఎగువన కుండపోతగా వర్షాలు పడుతుండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉదయం రిజర్వాయర్కు ఇన్ఫ్లో పెరగడంతో డ్యాం అధికారులు ఆరు గంటల సమయంలో రెండు గేట్లను మీటర్ మేర ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు ఇన్ఫ్లో 10 వేల క్యూసెక్కులకు చేరడంతో మరో 2 గేట్లను మీటర్ మేర ఎత్తి మొత్తం నాలుగు గేట్ల ద్వారా 18 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు మళ్లించారు. కేసీ కాల్వకు 2300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డ్యాం వర్క ఇన్స్పెక్టర్ మునిస్వామి పేర్కొన్నారు. -
మెరుగు పడుతున్న కౌలాస్ నాలా నీటి మట్టం
జుక్కల్ : జుక్కల్ మండలంలో కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నీటి మట్టం పెరిగింది. ఎగువ భాగం నుంచి ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం 454 మీటర్ల నుంచి 454.9 మీటర్లకు చేరినట్లు ప్రాజెక్ట్ జెఈ గజానన్ తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ప్రాంతంతో 5 సెం.మీ వర్షపాతం నమోదు కాగా జుక్కల్ మండలంలోని ఇతర ప్రాంతాలలో 8 సెం.మీ వర్షపాతం నమోదయినట్లు పేర్కొన్నారు. ఎగువ భాగం నుంచి 80 క్యూసెక్కుల వరద వస్తోందని తెలిపారు. మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలలో కురిసిన వర్షానికి ప్రాజెక్ట్లో నీరు వచ్చి చేరుతోందన్నారు. -
పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం
బాల్కొండ : శ్రీరాంసాగర్ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్లోకి గడ్డెన్నవాగు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు(90టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1064.10 అడుగుల(18.85 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. -
సోమశిలకు పెరిగిన ఇన్ఫ్లో
సోమశిల: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతుండటంతో లక్షా 24 వేల 722 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తుంది. ఉదయం 6 గంటల సమయానికి 83 వేల క్యూసెక్కుల ఇన్ప్లో ఉండగా..4 గంటల వ్యవధిలోనే 40 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో 32.8 టీఎంసీల నీరు ఉంది. సోమశిల డ్యాం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు గా ఉంది. -
వంశధారకు తగ్గిన వరద
హీరాం(శ్రీకాకుళం): ఒడిశాలో వర్షాలు తగ్గుముఖం పట్టటంతో వంశధారకు వరద తగ్గిందని గొట్టా బ్యారేజీ డీఈ ప్రభాకర్రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ నుంచి 18,514 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బ్యారేజీలో పూర్తి సామర్ధ్యం 38.10 మీటర్లకు మించి ఉన్న నీటిని మాత్రమే విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
శ్రీశైలానికి పెరుగుతున్న ఇన్ఫ్లో
శ్రీశైలంప్రాజెక్టు: శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చే ఇన్ఫ్లో పెరుగుతోంది. సోమవారం 16వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో మంగళవారం సాయంత్రం సమయానికి 35,645 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 13వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 22,395 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 53.2754 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 833.50 అడుగులుగా నమోదైంది. -
తుంగభద్రకు పెరిగిన ఇన్ఫ్లో
బళ్లారి : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాంలోకి ఇన్ఫ్లో మరింత పెరిగింది. మంగళవారం డ్యాంలోకి దాదాపు 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో ఒకే రోజు దాదాపు రెండు టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగింది. ప్రస్తుతం డ్యాంలో 37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పెద్దఎత్తున వస్తోంది. దీంతో డ్యాంలో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. డ్యాంలోకి 40 టీఎంసీల నీరు నిల్వ చేరితే కాలువలకు వదలుతారు. గత ఏడాది ఇదే సమాయనికి డ్యాంలో నీటిమట్టం 1,595.97 అడుగులు, 14.498 టీఎంసీలుగా ఉండేది. ఇన్ఫ్లో 939 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 150 క్యూసెక్కులుగా ఉండేది. ప్రస్తుతం నీటిమట్టం 1,610.88 అడుగులు, నీటి నిల్వ 37 టీఎంసీలు. ఇన్ఫ్లో 19,912 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 1.360 క్యూసెక్కులు. -
జూరాలకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
- 47071 క్యూసెక్కులు దిగువకు విడుదల - ఆరు యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుం చి వస్తున్న ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు కొనసాగుతున్నట్లు పీజేపీ అ ధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 36488 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా జెన్కో జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లకు విద్యుదుత్పత్తి నిమిత్తం 46071 క్యూసెక్కులు, ఆయకట్టు రైతులకు సాగునీటి నిమిత్తం కుడి, ఎడమ కాలువల ద్వారా వేయి క్యూసెక్కులను మొత్తం ప్రాజెక్టు నుంచి 47071 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఆదివారం రాత్రి 7.30గంటల వరకు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 1043 అడుగులుగా ఉంది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 1613 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 52029 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 11 క్రస్టుగేట్లను మీటరు ఎత్తుకు ఎత్తి 69670 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 1704 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 47400 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 5 క్రస్టుగేట్లను మీటరు ఎత్తుకు ఎత్తి 66500 క్యూసెక్కుల నీటిని దిగువకు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
జూరాలకు పెరిగిన ఇన్ఫ్లో
ధరూరు: ఎగువ రాష్ట్రాల్లో కు రుస్తున్న భారీ వర్షాలతో ప్రి యదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపా రు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లోలు క్రమక్రమంగా పెరుగుతున్నాయన్నారు. రాత్రి 7.30గంటల వరకు ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 13 క్రస్టుగేట్లను ఒక మీటరు ఎత్తుకు, నాలుగు క్రస్టుగేట్లను అరమీటరు ఎత్తుకు మొత్తం 17 క్రస్టుగేట్ల ద్వారా 97014 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు నీటిమట్టం 1044 అడుగులుగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 1612 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 39వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 51000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 1704 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 15000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులువివరించారు. ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి... జెన్కో జలవిద్యుత్ కేంద్రంలోని మొత్తం ఆరు యూనిట్లకుగాను ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభమైనట్లు జెన్కో అధికారులు పేర్కొన్నారు. 1,2,3,5,6 యూనిట్ల ద్వారా మొత్తం 175 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని వారు వెల్లడించారు. సుంకేసులకు కొనసాగుతున్న వరద సుంకేసుల బ్యారేజీ వద్ద సోమవారం కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన వున్న తుంగభద్ర డ్యాం నుండి విడుదలవుతున్న నీటితోపాటు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఉదయం 1.20 లక్షల క్యూసెక్కులకు చేరిన వరదనీటితో డ్యాం వద్ద ఏర్పాటుచేసిన 28 గేట్లు మీటరు ఎత్తి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం వరద ప్రవాహం 90 వేల క్యూసెక్కులకు చేరడంతో 24 గేట్లు మీటరు మేర ఎత్తి 88 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నట్లు వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామి తెలిపాడు. తుంగభద్ర డ్యాంనుండి 31 వేల క్యూసెక్కుల నీరు డ్యాంకు చేరుతుందని, బ్యారేజీలో 1 టిఎంసి నీటిని నిల్వ ఉంచుతూ మిగతా నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. కేసీ కెనాల్కు 2500 క్యూసెక్కులు యధావిధిగా విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. -
తుంగభద్రకు పెరిగిన ఇన్ ఫ్లో
హొస్పేట: తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న ఇన్ఫ్లో పెరిగింది. ఆదివారం డ్యాంకు 42 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 20 క్రస్ట్గేట్లు అడుగు మేర పెకైత్తి దిగువకు 46 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగొంబె, శివమొగ్గ, మొరాళు, తీర్థహళ్లి, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న ఇన్ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం మలెనాడులో కురుస్తున్న వర్షాల వల్ల డ్యాంలోకి ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశముందని తుంగభద్ర మండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1633 అడుగులు, కెపాసిటీ 100.855 టీఎంసీలు, ఔట్ఫ్లో 40,999 క్యూసెక్కులు ఉంది. -
నీరు ఇవ్వలేం
‘శ్రీరాంసాగర్’ ఆయకట్టులో వరికి సెలవే రైతులకు అవగాహన కల్పిస్తున్నాం చిన్న కాల్వలను ఆధునికీకరిస్తాం ఎస్సారెస్పీ ఎస్ఈ సుధాకర్రెడ్డి ‘ఈ ఖరీఫ్లో శ్రీరాంసాగర్ ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటి విడుదల సాధ్యం కాదు. ప్రాజెక్టులోకి ఇప్పుడు చుక్క ఇన్ఫ్లో లేదు. ఆగస్టు నెలపై చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ.. వరుణుడు కరుణించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాకు సాగునీరు ఇవ్వలేం. ఆయకట్టు రైతులు ఈ ఖరీఫ్లో క్రాప్హాలిడే ఇవ్వాల్సిందే.’ అని ఎస్సారెస్పీ ఎస్ఈ సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా ఖరీఫ్ ప్రణాళిక అడగలేదని, ఖరీఫ్లో కాల్వ నీటిపై రైతులు ఆశలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పారు. హన్మకొండ : ‘శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 23.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టులో కనీసం 70 టీఎంసీలు ఉంటేనే సాగునీరు విడుదల చేస్తాం. మహారాష్ట్ర ఎగువన వర్షాలు లేకపోవడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి నీరు రావడం లేదు. ఈ పరిస్థితిలో జిల్లాకు సాగునీరు ఇవ్వలేం’ అని ఎస్సారెస్పీ ఎస్ఈ సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సారెస్పీ ఆయకట్టు సాగుపై ‘సాక్షి’ మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వల కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వలు కొంత అధ్వానంగా ఉండడంతో ప్రతి సీజన్లో 3 లక్షల ఎకరాల వరకు నీటిని సరఫరా చేయగలుగుతున్నాం. గత రబీ సీజన్లో తొమ్మిది విడతలుగా వారబందీ ప్రకారం నీటిని ఇచ్చాం. కానీ, ఇప్పుడు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం లేదు. ఎల్ఎండీలో 9.1 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జిల్లాలోని కాల్వల కింద ఆయకట్టుకు నీటిని అందించాలంటే సరాసరి 35 టీఎంసీల నీరు అవసరం పడుతోంది. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో నీటిని అందించడం సాధ్యం కాదు. తాగునీటి అవసరాల దృష్ట్యా ఎల్ఎండీ నుంచి మరో 2 టీఎంసీలు ఇస్తామని ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే సూచించారు. గోదావరి ప్రవహిస్తుండటంతో ఇప్పటికిప్పుడు ఎస్సారెస్పీ నీటిని నిల్వ చేసి, దేవాదుల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్, వడ్డేపల్లి చెరువులలో నీటిని నింపుతున్నాం. వీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తాం. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లేకపోవడంతో ఖరీఫ్లో ఆయకట్టుకు సాగునీటిని అందించలేం. అయితే ఇప్పటికే చాలా మంది ఆయకట్టుదారులు నాట్లు వేశారు. కానీ, ముందు నుంచీ రైతులకు చెబుతూనే ఉన్నాం. ప్రత్యేక నోటీసులిచ్చాం. వరి పంటలు వేస్తే నష్టపోతారని. ఆగస్టులో వర్షాలు కురుస్తాయని చూశాం. మహారాష్ట్రలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద వచ్చే దిగువ ప్రాంతాల్లో వర్షపాతం లేదు. దీంతో ప్రస్తుతం ఒక్క చుక్క ఇన్ఫ్లో కూడా లేదు. దీంతో ఈసారి ఖరీఫ్కు కాల్వల ఆయకట్టుకు నీరివ్వలేం. 4.24 లక్షల ఎకరాల్లో క్రాప్హాలిడే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరందించే 4.24 లక్షల ఎకరాలు ఈసారి క్రాప్హాలిడే పాటించాల్సిందే. లేకుంటే ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేం. ఆగస్టు దాటి ఎంతో కొంత వర్షాలు కురిస్తే.. ఆరుతడి పంటలకు రెండు, మూడో తడుల నీరిచ్చే అవకాశం ఉంది. వాటిపై కూడా ఆశలు పెట్టుకోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూ స్తూ ఆయకట్టులో పంటలు వేయొద్దు. నీరిచ్చే అవకాశం లేనందువల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కాల్వ నీరు విడుదల చేసే అవకాశం లేకపోవడంతో కాల్వల ఆధునీకరణ పనులు చేస్తున్నాం. ప్రధాన కాల్వ, ఉప కాల్వల మరమ్మతు పనులు చేయాలని ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం డీబీఎం-48లో పనులు జరుగుతున్నాయి. స్టేజ్-1లోని ఆయా ప్రధాన కాల్వలతోపాటు చిన్న కాల్వలు, ఉప కాల్వలను ఆధునీకరిస్తాం. కొన్నిచోట్ల చాలా మట్టి పేరుకుపోయింది. వాటిని మరమ్మతులు చేస్తాం. -
జూరాల 27 క్రస్ట్గేట్ల ఎత్తివేత
ధరూరు: మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో సోమవారం స్వల్పంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు లక్షా 52 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, సోమవారం సాయంత్రం వరకు లక్షా 65 వేల క్యూసెక్కులకు చేరుకున్నట్లు చెప్పారు. రాత్రి 8గంటల వరకు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 318.100 మీటర్లుగా ఉంది. లక్షా 65 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా 27 క్రస్టుగేట్ల ద్వారా లక్షా 41 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకకు సరఫరా అవుతున్న ‘జూరాల’ విద్యుత్ గద్వాల: జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను తొలిసారిగా సోమవారం సాయంత్రం 4.20 గంటల నుంచి కర్ణాటకకు సరఫరా ప్రారంభమైంది. ఈ మేరకు గతంలో ఒప్పందం కుదిరింది. శ్రీశైలానికి వరద ఉధృతి: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరి గింది. జూరాల నుంచి 1,39,125 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1.70 లక్షల క్యూసెక్కుల నీరు సోమవారం శ్రీశైలం డ్యామ్కు చేరింది. -
తుంగభద్రకు కొనసాగుతున్న వరదనీరు
మహబూబ్నగర్ : తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 97 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 1632 అడుగులుకు ఉంది. జలాశయం ఇన్ఫ్లో 1,66,706 క్యూసెక్కులు ఉండగా, ఔట్ఫ్లో 1,89254 క్యూసెక్కులు ఉంది. సుంకేశుల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 0.33 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 289 అడుగులకు ఉంది. మరోవైపు తుంగభద్రలోకి ఒకేసారి 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో రాజోలి సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వరకు బ్యాక్ వాటర్ చేరుకున్నాయి. దీంతో పాత గ్రామంలోని మాలగేరి, ఎస్సీ కాలనీ, మార్లబీడు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
జల కళ
పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు - జోగ్లో జల ఉధృతి - తొణికిసలాడుతున్న ‘తుంగా’ - తుంగభద్ర జలాశయానికి భారీ వరద - తీరనున్న ‘కరెంట్’ కష్టాలు సాక్షి ప్రతినిధి/బెంగళూరు/శివమొగ్గ : పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 68 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లోతో శివమొగ్గ జిల్లాలోని తుంగా జలాశయం గరిష్ట మట్టం 588.24 అడుగులకు చేరుకుంది. దీంతో జలాశయంలోకి చేరుతున్న 68 వేల క్యూసెక్కుల నీటిని అలాగే హొస్పేటలోని తుంగభద్ర జలాశయానికి వదిలేస్తున్నారు. దరిమిలా శివమొగ్గలో తుంగా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. మరో వైపు కోస్తా జిల్లాలతో పాటు మలెనాడులో సోమవారం కూడా వర్షాలు పడ్డాయి. కావేరి పరీవాహక ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో ఆ నదిపై నిర్మించిన జలాశయాల్లోకి ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. కేఆర్ఎస్, కబిని జలాశయాల్లో జోరుగా వరద నీరు చేరుతోంది. కేరళ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతుండడంతో కర్ణాటకలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రముఖ పర్యాటక ప్రాంతం భాగ మండలలోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించడంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. హాసన జిల్లాలో కూడా బాగా వర్షాలు పడుతుండడంతో గోరూరు, హేమావతి జలాశయాల్లో ఇన్ఫ్లో పెరిగింది. తీరనున్న కరెంటు కష్టాలు భారీ వర్షాల కారణంగా జలాశయాలు నిండుతుండడంతో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం కలిగింది. మరో 15 రోజులు వర్షాలు రాకపోతే విద్యుత్ సంక్షోభం ఖాయమని ఆ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రముఖ జల విద్యుత్కేంద్రమైన లింగమక్కి జలాశయంలోకి రోజు రోజుకు ఇన్ఫ్లో పెరుగుతోంది. సోమవారం ఇన్ఫ్లో 38,183 క్యూసెక్కులుగా నమోదైంది. ఔట్ఫ్లోను 175 క్యూసెక్కులకు పరిమితం చేశారు. గత ఏడాది ఇదే సమయానికి జలాశయంలో నీటి మట్టం 1,789.5 అడుగులు కాగా ప్రస్తుతం 1,754.5 అడుగుల నీటి నిల్వ ఉంది. -
ఇలాగైతే ఎలా?
‘తుంగభద్ర’కు పెరగని ఇన్ఫ్లో.. ఆందోళనలో మూడు రాష్ట్రాల ప్రజలు గత ఏడాదితో పోలిస్తే 46 టీఎంసీల నీరు తక్కువ గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 60 టీఎంసీల నీరు సాక్షి, బళ్లారి : మూడు రాష్ట్రాల వరప్రసాదినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో రోజురోజుకూ నీరు అడుగంటుతోంది. తాగు, సాగునీటి అవరసరాలను తీరుస్తున్న ఈ జలాశయానికి ఇన్ఫ్లో పెరకపోవడంతో కర్ణాటకలోని బళ్లారి, కొప్పళ, రాయచూరు, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఆయకట్టు రైతులు నారుమళ్లు కూడా పోయలేని దుస్థితి నెలకొంది. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కేవలం 14 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 46 టీఎంసీల మేర నీరు తక్కువగా ఉండడంతో వ్యవసాయ అవసరాలకు నీటిని ఎలా విడుదల చేయాలో అర్థం కాక బోర్డు అధికారులు తలలు పట్టుకున్నారు. తాగునీటికి కటకటే.. గత ఏడాది జులై 20 నాటికి తుంగభద్ర డ్యాం నిండు కుండలా తొణికిసలాడింది. ప్రస్తుతం ఆ ఛాయలు కనిపించడం లేదు. దీంతో తాగునీటి కష్టాలు తీరడం కూడా ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే తుంగభద్ర జలాశయంపై ఆధారపడిన నగరాలు, పట్టణాలు, గ్రామాల ప్రజలు తాగునీటి కోసం హాహాకారాలు చేస్తున్నారు. బళ్లారిలో 15 రోజులకు ఒకసారి కూడా నీరు విడుదల చేయడం లేదంటూ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలువలకు నీరు వదిలే వరకు బళ్లారి వాసులకు ఈ దుస్థితి తప్పదని అధికారులు తేల్చి చెబుతున్నారు. నీటి విడుదలపై అనుమానాలు గత ఏడాది జులై 7వ తేదీస హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంకు ఇన్ఫ్లో లేకపోవడంతో నీటి విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కాలువలకు నీరు వదలకపోవడంతో ఖరీఫ్ పంట సాగు అనుమానమేనని రైతులు పేర్కొంటున్నారు. మరో పది రోజుల్లో జలాశయంలోకి నీరు చేరకపోతే సాగునీటికే కాదు తాగునీటికి కూడా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. -
జూరాలకు... ఇన్ఫ్లో నిల్
కర్ణాటక నుంచి జూరాల రిజర్వాయర్కు వచ్చే ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. శనివారం నుంచి ఇన్ఫ్లో నిల్గా నమోదవుతోంది. రిజర్వాయర్లో ఉన్న 4 టీఎంసీల నీటిని ఏప్రిల్ 15వరకు ఆయకట్టుకు అందించాలని, ఆతర్వాత రిజర్వాయర్లో ఉన్న నీటిని బట్టి తగు నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మరోసారి జూరాల ఆయకట్టు రైతులకు నీటి సమస్య పెద్ద నష్టాన్నే మిగిల్చేలా మారింది. ఈ ఆయకట్టు పరిధిలో కుడి, ఎడమ కాల్వల ద్వారా దాదాపు 70వేల ఎకరాల్లో రైతులు వరి పంటలను సాగు చేసుకున్నారు. ఇప్పటికే పంట కాలం సగం పూర్తి కాగా, మే మొదటి వారం వరకు కాల్వల ద్వారా నీళ్లందిస్తేనే పంట పూర్తవుతుంది. లేని పక్షంలో రూ.కోట్ల విలువైన పంట నీళ్లందక ఎండిపోయి రైతులను నిలువునా నష్ట పర్చే పరిస్థితి పొంచి ఉంది. గత మూడేళ్లుగా జూరాల ఆయకట్టు పరిధిలో రైతులు రబీ సీజన్లో నీళ్లందక పంటలు ఎండి నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి రాకుండా వరి పంటలు సాగు చేసుకోవద్దని డిసెంబర్ మొదటి వారంలో జరిగిన ఐఏబీలో ప్రకటనలు చేశారు. జనవరి మొదటి వారం వరకు ప్రకటనలకే అధికారులు పరిమితమై ఆయకట్టు పరిధిలోని గ్రామాల్లో వరి సాగు చేయకుండా రైతులను చైతన్యం చేయడంలో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. జనవరి ఆఖరి వారంలో కలెక్టర్ అధికారులను ఆదేశించడంతో అప్రమత్తమై వరి సాగు చేయొ ద్దని గ్రామాల్లో దండోరా వేయించడం, రైతులకు స్థానిక సిబ్బంది ద్వారా ప్రచారం చేయించినా ఉపయోగం లేకుండా పోయిం ది. అప్పటికే వరిమళ్లు సిద్ధమై 70వేల ఎకరాల్లో వరి సాగుకు రైతులు ఉపక్రమించా రు. పంటలను పూర్తి చేసేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రిజర్వాయర్లో నీ ళ్లుంటేనే ఉపయోగం. ఇప్పటికైనా అధికారులు రిజర్వాయర్లో ఉన్న నీటిని పంట లకు వార బందీ పద్దతిలో మరికొన్నాళ్లు అందించేందుకు ప్రయత్నిస్తే న ష్టాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 15న నీటి నిల్వను బట్టి నిర్ణయం - ఎస్ఈ ఖగేందర్ ఏప్రిల్ 15 వరకు కాల్వల ద్వారా ఆయకట్టుకు నీళ్లిస్తాం. అప్పటి వరకు మిగిలి ఉన్న నీటి నిల్వ ఎంతుంది, ఏం చేయాలి, తాగునీటి పథకాలకు నీటి అవసరాలను ృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల అనుమతితో నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు ఏప్రిల్ 15 తర్వాత నీటి విడుదల కొనసాగింపుపై ఏమి చెప్పలేమని జూరాల ఎస్ఈ ఖగేందర్ చెప్పారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
కేతేపల్లి, న్యూస్లైన్: మూసీ రిజర్వాయర్కు ఎగువ నుంచి ఆదివారం కూడా ఇన్ఫ్లో కొనసాగుతున్నది. అధికారులు నాలుగు క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ ఎగువ, పరిసర ప్రాంతా ల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శనివారం 1,30,000 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో ఆదివారం నాటికి 26 వేల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో శుక్రవారం తెరిచి ఉంచిన 11 క్రస్టు గేట్లలో ఏడింటిని మూసి వేశారు. 4 క్రస్టు గేట్లను ఐదు అడుగు మేర ఎత్తి ఉంచి 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు మూసీకి వదులుతున్నారు. శనివారం 11 క్రస్టు గేట్లు తెరిచి ఉంచటంతో 645 అడుగుల గరిష్ట నీటిమట్టం 642 అడుగులకు త గ్గింది. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 300 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. నీటిమట్టం 644.5 చేరుకున్న తర్వాత ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే మరి కొన్ని గేట్లు ఎత్తుతామని ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.