
లిఫ్ట్లో ప్రమాదం.. 8 మందికి గాయాలు
విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చి 8 మంది భక్తులు ప్రమాదానికి గురయ్యారు. భవానీపురంలోని భవానీ టవర్స్లో లిఫ్ట్లో ఎక్కి కిందికి దిగేందుకు బయలుదేరారు.
లిఫ్ట్ కేబుల్స్ తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడి పోయింది. దీంతో గాయపడిన ఎనిమిది మందిని దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాణ్యతలేని లిఫ్ట్ను అమర్చిన బిల్డర్ అమర్నాథ్పై అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.