ఆముదం, పత్తిలో సస్యరక్షణ | agriculture story | Sakshi
Sakshi News home page

ఆముదం, పత్తిలో సస్యరక్షణ

Sep 15 2017 9:51 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఆముదం, పత్తిలో సస్యరక్షణ - Sakshi

ఆముదం, పత్తిలో సస్యరక్షణ

ఇటీవల కురిసిన వర్షాలకు ఆముదం, పత్తి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న పంటలు ఆశాజనకంగా ఉన్నందున పురుగులు, తెగుళ్ల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏరువాక కేంద్రం (డాట్‌ సెంటర్‌) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: ఇటీవల కురిసిన వర్షాలకు ఆముదం, పత్తి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న పంటలు ఆశాజనకంగా ఉన్నందున పురుగులు, తెగుళ్ల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏరువాక కేంద్రం (డాట్‌ సెంటర్‌) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు.

+ ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 6,700 హెక్టార్ల విస్తీర్ణంలో ఆముదం పంట వేశారు. జూన్, జూలైతో పాటు ఆగస్టులో పంట సాగుచేశారు. ప్రస్తుతం శాఖీయ దశ నుంచి గెల వేసే దశలో ఉంది. ఈ సమయంలో ఎరువులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పంట వేసిన 30, 60, 90 రోజుల సమయంలో తేమను ఉపయోగించుకుని ఎకరాకు 20 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాలి. రసంపీల్చు పురుగుల నివారణకు 2 మి.మీ డైమిథోయేట్‌ లేదా 1.5 గ్రాములు అసిఫేట్‌ లీటర్‌ నీటికి కలిపి ఆకులు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. నామాల పురుగు ఆశిస్తే పంట దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్‌ లేదా 2 మి.లీ ప్రొపినోఫాస్‌ లేదా 1 మి.లీ నొవాల్యురాన్‌ లేదా 1.5 గ్రాములు థయోడికార్బ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగులు పెద్దవిగా ఉన్నపుడు ఏరివేసి నాశనం చేసినా ఫలితం ఉంటుంది. పక్షులు వాలేందుకు వీలుగా పొలంలో అక్కడక్కడా పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే పచ్చపురుగులను సమూలంగా అరికట్టవచ్చు.

+ ప్రత్యామ్నాయ పంటల కింద ఇటీవల సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటల్లో కాండంతొలచు పురుగు ఆశించినందున నివారణకు ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్‌ 36 ఎస్‌ఎల్‌ లేదా 60 మి.లీ రేనాక్షిపైర్‌ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
+ వేరుశనగలో శనగపచ్చ పురుగు నివారణకు 1.5 గ్రాములు లార్విన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.  
+ పత్తిలో గులాబీరంగు పురుగు నివారణకు ఎకరాకు 4 నుంచి 6 ఫిరమోన్‌ ఎరలు ఉంచాలి. తొలుత 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ వేపనూనె లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తి పూలు, కాయలలో పురుగు ఉన్నట్లు గమనిస్తే 2 మి.లీ క్వినాల్‌ఫాస్‌ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్‌ లేదా 1 గ్రాము థయోడికార్బ్‌ లేదా 2 మి.లీ ప్రొపినోపాస్‌ లీటర్‌ నీటికి కలిపి బాగా తడిచేలా 10 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే చివరగా 2 మి.లీ ప్రొపినోపాస్‌ లేదా 1.5 గ్రాములు లార్విన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
+ సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయ పంటల కింద ఎర్ర నేలల్లో జొన్న, సజ్జ, పెసర, అలసంద, ఉలవ అలాగే నల్లరేగడి భూముల్లో జొన్న, కొర్ర, పెసర, అనుములు, ఉలవ, పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement