బిక్షాటన చేసిన సొమ్ముతో గిరిజన దంపతులు వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.
రోజూ బిక్షాటన చేసిన సొమ్మును దాచుకున్న చెంచు జాతికి చెందిన గిరిజన దంపతులు వినాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను వేలంలో దక్కించుకున్న సంఘటన బుధవారం వరంగల్ జిల్లా కురవిలో చోటుచేసుకుంది. చెంచు కాలనీకి చెందిన గడ్డం వెంకన్న, మంగమ్మ దంపతులు వినాయకుడి చేతిలోని లడ్డూను వేలం ద్వారా రూ.26, 116కు తీసుకున్నారు. అప్పుడప్పుడూ కూలీ పనులకు వెళ్తున్నప్పటికీ ఈ దంపతుల ప్రధాన జీవనాధారం భిక్షాటనే. అత్యంత భక్తి ప్రపత్తులతో లడ్డూను దక్కించుకోవడం పట్ల పలువురు అభినందించారు. అనంతరం మేళతాళాల మధ్య గణపయ్యను భద్రచాలం గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు తరలివెళ్లారు.