బైక్‌ దొంగలకు బ్రేక్‌ | bike offenders arrest | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగలకు బ్రేక్‌

Sep 30 2016 9:28 PM | Updated on Aug 20 2018 4:27 PM

బైక్‌ దొంగలకు బ్రేక్‌ - Sakshi

బైక్‌ దొంగలకు బ్రేక్‌

నగరంలో మోటారు బైక్‌లు దొంగిలిస్తున్న ముగ్గురిని సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు బాలలు ఉండడం గమనార్హం. వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 22 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముగ్గురు నిందితులు సీసీఎస్‌ పోలీసులకు చిక్కారు, వారిని విచారించగా దొంగతనాలు బైట పడ్డాయి.

ముగ్గురి నుంచి 22 వాహనాల స్వాధీనం 
వీటి విలువ రూ. 6 లక్షలు 
చోరుల్లో ఇద్దరు బాలలు 
విజయవాడ: 
నగరంలో మోటారు బైక్‌లు దొంగిలిస్తున్న ముగ్గురిని సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు బాలలు ఉండడం గమనార్హం. వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 22 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముగ్గురు నిందితులు సీసీఎస్‌ పోలీసులకు చిక్కారు, వారిని విచారించగా దొంగతనాలు బైట పడ్డాయి. 
మారుతాళాలతో బైక్‌ మాయం
 నిందితులలో ఒకరు విజయవాడ వాంబేకాలనీకి చెందిన మల్లెల ఎనోష్‌ గవాస్కర్‌ అలియాస్‌ గవ్వా చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. గత 9 నెలల కాలంలో మారుతాళాలను ఉపయోగించి  పటమట పోలీసు స్టేషన్‌ పరిధిలో 11, పెనమలూరులో 1, కృష్ణలంక పోలీసు స్టేషన్‌ పరిధిలో 4 కలిపి మొత్తం మొత్తం 16 బైక్‌లను దొంగిలించారు. జల్సాల కోసం వాటిలో ఒక దానిని అమ్ముకుందామని పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌ సెంటర్‌ సమీపంలోకి రాగా అక్కడ వాహనాలు తనిఖీని గమనించి పారిపోవడానికి యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 
జువెనైల్స్‌ నుంచి 6 బైక్‌లు 
 సీసీఎస్‌  పోలీసులు లెనిన్‌ సెంటర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు జువెనైల్స్‌ దొరికారు, వారి నుంచి 6బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement