చివ్వెంల(నల్లగొండ): సూర్యాపేట- ఖమ్మం రహదారిపై ఎదురెదురుగా వచ్చిన కారు, ఆటో ఢీకొన్న ఘటనలో మహిళలు, చిన్నారులు సహా 14 మంది గాయపడ్డారు. నల్లగొండ జిల్లా చివ్వెంల మండల శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆటో సూర్యాపేట నుంచి ప్రయాణికులతో చివ్వెంల వస్తుండగా, కారు.. ఖమ్మం నుంచి సూర్యాపేట వైపునకు ప్రయాణిస్తోంది.
ప్రమాదంలో గాయపడ్డ 14 మందీ ఆటోలో ప్రయాణిస్తున్నవారే కావటం గమనార్హం. రోడ్డుపై పడిపోయిన క్షతగాత్రులను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు.
సూర్యాపేట- ఖమ్మం రహదారిపై ప్రమాదం
Published Tue, Jan 19 2016 10:21 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement