కారు చోరీ కేసులో ముగ్గురికి జైలు | car theft case.. three persons imprisoned | Sakshi
Sakshi News home page

కారు చోరీ కేసులో ముగ్గురికి జైలు

Published Thu, Dec 15 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

car theft case.. three persons imprisoned

గణపవరం (నిడమర్రు) : కారు చోరీ కేసులో ముగ్గురికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు సీఐ ఎ¯ŒS.దుర్గాప్రసాద్‌ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం 2016 ఏప్రిల్‌లో గణపవరానికి చెందిన షేక్‌ సపుల్లా, గంధవరపు బాలాజీ, ఎస్‌కే గౌస్‌ బాషా కలిసి భీమవరానికి చెందిన పొదిలి శ్రీరామచంద్రమూర్తి కారును అద్దెకు తీసుకు వెళ్లారు. కేశవరం సమీపంలో కారు డ్రైవర్‌ను కొట్టి ఆ కారును తీసుకు వెళ్లిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్‌చేసి తాడేపల్లిగుడెం కోర్టులో హాజరుపరచగా.. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఫస్ట్‌ ఏజేఎఫ్‌సీఎం  ఎం.వి.ఎ¯ŒS.పద్మజ నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా  విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజులు శిక్ష కొనసాగించాలని 
తీర్పులో పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement