'విశాఖ మీదుగా చైనాకు పట్టు మార్గం' | chandra babu proposes silk root via visakapatnam | Sakshi
Sakshi News home page

'విశాఖ మీదుగా చైనాకు పట్టు మార్గం'

Published Mon, Nov 23 2015 3:52 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

'విశాఖ మీదుగా చైనాకు పట్టు మార్గం' - Sakshi

ప్రతిపాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
చైనా ఉప మంత్రి చెన్‌తో రాజధాని నిర్మాణంపై చర్చలు



విజయవాడ: చైనా ప్రతిపాదిత సిల్క్ రూటును విశాఖపట్నం మీదుగా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా బృందాన్ని కోరారు.  కోల్‌కతా, చెన్నయ్‌లతో పోలిస్తే తూర్పుతీరానికి సరిగ్గా మధ్యభాగంలో ఉందని,  మేరీటైమ్ సిల్క్ రోడ్డుకు ఈ రాష్ట్రం అన్నివిధాలుగా ఆకర్షణీయమైనదని ముఖ్యమంత్రి చైనా బృందానికి వివరించారు.  పెట్టుబడులకు షాంగై తరువాత అమరావతిని సెకండ్ హోమ్‌గా భావించాలని ఆ బృందానికి సూచించారు.

సోమవారం విజయవాడకు విచ్చేసిన చైనా ప్రభుత్వ ఇంటర్నేషనల్ డిపార్టుమెంటు ఉపమంత్రి చెన్ పెంగ్జిన్, మరో ఆరుగురు ప్రతినిధుల బృందంతో చంద్రబాబు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. భారత్ పర్యటనలో తమ తొలి ప్రాధాన్యం ఏపీయేనని చైనా ఉపమంత్రి చెన్ పెంగ్జిన్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ చెప్పారు. ఈ సమావేశంలో పలువురు ఏపీ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement