నా మాటలను వక్రీకరించారు: చంద్రబాబు | chandrababu naidu gives clarification over controversial comments | Sakshi
Sakshi News home page

నా మాటలను వక్రీకరించారు: చంద్రబాబు

Published Thu, May 26 2016 12:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

నా మాటలను వక్రీకరించారు: చంద్రబాబు

నా మాటలను వక్రీకరించారు: చంద్రబాబు

దేవుడు, దేవాలయాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకున్నారు.

విజయవాడ: దేవుడు, దేవాలయాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలను వక్రీకరించారని, దేవుడు అంశాలపై తాను పాజిటివ్గానే మాట్లాడనని ఆయన అన్నారు.  కాగా తప్పులు చేసేవారే ఎక్కువగా గుళ్లకు వెళుతున్నారని, ఎక్కువ తప్పులు చేసి హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారని చంద్రబాబు నిన్న విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు రెండోరోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. పరిపాలనలో నూతనత్వం చాలా అవసరమని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ప్రజలకు వేధింపులు లేని, అవినీతి లేని పాలన అందించాలని ఆయన అన్నారు. కలెక్టర్లకు విశేషమైన అధికారాలు ఉన్నాయని, ప్రజారంజక పాలన అందించడంలో కలెక్టర్లదే బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి అధికారుల్లో పోటీ తత్వం పెరిగేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement