Published
Sat, Oct 22 2016 12:01 AM
| Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
చదరంగం పోటీలు ప్రారంభం
భీమవరం : రాష్ట్రస్థాయి అమెచ్యూర్ చదరంగం పోటీలు స్థానిక ఏఎస్ఆర్ నగర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అనసూయ చెస్ అకాడమీ నేతృత్వంలో ఈ పోటీలను మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య, కార్యదర్శి మాదాసు కిశోర్ మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన వారిని నవంబర్ 5న ముంబైలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపిక చేస్తామన్నారు. చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రమేష్ పాల్గొన్నారు.