విభజన హామీలను నెరవేర్చాలని విభజన హామీల అమలు సాధన సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.
పశ్చిమ గోదావరి: విభజన హామీలను నెరవేర్చాలని విభజన హామీల అమలు సాధన సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఏలూరు సత్రంపాడు నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ పాదయాత్ర కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చలసాని సత్యనారాయణ, ప్రభాకర్, సీపీఎం నేత బలరాం తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 22న ప్రధాని నరేంద్రమోదీ వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని డిమాండ్ చేశారు. ప్రధానికి తాము విభజన నాటి హామీలను గుర్తు చేస్తామని చెప్పారు.