
ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించండి
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదా సమస్యకు ద్రోహం చేయడమే కాక, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన వాగ్దా నాలను అమలు చేయలేదన్నారు. అవినీతి, లంచగొండితనం, పార్టీ ఫిరాయింపులు పెరిగిపోయాయన్నారు. అధికార టీడీపీ, బీజేపీ కూటమిని నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడించి ప్రభుత్వ పాలనపట్ల నిరసన తెలియజేయాలన్నారు.