చికిత్సపొందుతూ స్కూల్‌ కరస్పాండెంట్‌ మృతి | correspondent died | Sakshi
Sakshi News home page

చికిత్సపొందుతూ స్కూల్‌ కరస్పాండెంట్‌ మృతి

Published Mon, Jul 25 2016 11:47 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

correspondent died

ములుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన గజ్వేల్‌ జీడీఆర్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ వల్లపురెడ్డి మధుకుమార్‌రెడ్డి(35) సికింద్రాబాద్‌ స¯ŒSషై¯ŒS ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. శనివారం రాత్రి 11 గంటలకు అతను ఇన్నోవా వాహనంలో హైదరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వస్తున్నాడు. ములుగు అటవీ పరిశోధన కేంద్రం సమీపంలో అది అదుపుతప్పి డివైడర్‌ను, ఆ తరువాత లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుకుమార్‌రెడ్డితోపాటు, మనోజ్‌కుమార్‌రెడ్డి, నవీ¯ŒSరెడ్డిలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మధుకుమార్‌రెడ్డి స¯ŒSషై¯ŒS ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ సమాచారం తెలియడంతో గజ్వేల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓవైపు కుటుంబ సభ్యులు, బంధువులు, మరోవైపు విద్యార్థుల రోదనలతో జీడీఆర్‌ స్కూల్‌ ప్రాంగణం శోకసాగరంలో మునిగిపోయింది. సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement