
కోట్ల రూపాయల బాణాసంచా సీజ్
మంగళగిరి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలంలోని ఆత్మకూరులో ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 2.20 కోట్ల విలువైన బాణాసంచాను ఆదివారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన పి. వెంకటేశ్వరరావు దీపావళి పండుగ సందర్భంగా విక్రయించేందుకు అదే గ్రామంలోని ఓ క్లబ్ వెనుక గోడౌన్లో ఈ సరుకును నిల్వ చేశారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న గుంటూరు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి సరుకుతో పాటు గోదామును కూడా సీజ్ చేశారు.