crackers
-
మళ్లీ విజృంభించనున్న కార్చిచ్చు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ అటవీ ప్రాంతాలను బూడిదచేస్తున్న కార్చిచ్చు మళ్లీ కన్నెర్రజేయనుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోని దావాగ్నిని ఇప్పటిదాకా కేవలం 14 శాతం మాత్రమే అదుపులోకి తెచ్చిన నేపథ్యంలో వాతావరణ విభాగ నివేదికలు స్థానికుల్లో భయాందోళనలను మరింత పెంచాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీంతో అడవిలో కార్చిచ్చు మరింత విస్తరించే ప్రమాదముందని అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ సోమవారం ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వీయనున్న శాంటా అనా పెనుగాలులతో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం దాకా ‘రెడ్ ఫ్లాగ్’ వార్నింగ్ అమల్లో ఉంటుంది. మరోవైపు అటవీప్రాంతాల్లో అగ్నికీలల సంబంధ అగ్నిప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా 24కు పెరిగింది. ఇంకా డజన్ల మంది జాడ తెలియాల్సిఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఒక్క లాస్ ఏంజెలెస్ సిటీ, కౌంటీ పరిధుల్లో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకువెళ్లాలని సూచించగా, మిగతా చోట్ల కలిపి మరో 87,000 మందికి సురక్షిత స్థలాలకు వెళ్లాలని స్థానికయంత్రాంగం హెచ్చరికలుచేసింది. ఆరు చోట్ల కార్చిచ్చు వ్యాపించగా పసిఫిక్ పాలిసేడ్స్, ఏటోన్ ప్రాంతాల్లోని దావాగ్ని మాత్రమే ఇంకా అత్యంత ప్రమాదకరస్థాయిలో కొనసాగుతు న్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 60 శాతం విస్తీర్ణానికి సమానమైన అటవీభూములను పాలిసేడ్స్, ఏటోన్, హర్స్ట్ కార్చిచ్చులు బూడిదకుప్పలుగా మార్చేశాయి. మొత్తంగా అన్ని కార్చిచ్చుల కారణంగా 40,000కుపైగా ఎకరాల్లో అటవీప్రాంతం పూర్తిగా కాలిపోయింది. 12,000కు పైగా ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు తగలబడ్డాయి. అయితే దుప్పటిలా కమ్మేసిన పొగ, దుమ్ము చాలా వరకు తగ్గడంతో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు తెరిచారు.బాణాసంచా వల్లే: వాషింగ్టన్ పోస్ట్నూతన సంవత్సర వేడుకల్లో జనం కాల్చిన బాణాసంచా కారణంగానే పసిఫిక్ పాలిసేడ్స్లో అగ్గిరాజుకుందని వాషింగ్టన్ పోస్ట్ వార్తాసంస్థ ఒక కథనంలో పేర్కొంది. రేడియో సంప్రదింపులు, ఆ ప్రాంతంలో బాణాసంచా కాల్చడానికి ముందు, ఆ తర్వాత తీసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు, స్థానికుల ఇంటర్వ్యూలతో ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తన కథనంలో పేర్కొంది. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ప్రదేశంలో అగ్గిరవ్వలు అడవిలో పడి దావాగ్ని మొదలైందని, అయితే వెంటనే దానిని ఆర్పేశారు. కానీ దావాగ్ని తాలూకు నిప్పుకణికలు కొన్ని అలాగే ఉండిపోయి భీకరగాలుల సాయంతో నెమ్మదిగా మళ్లీ దావాగ్నికి ఆజ్యంపోశాయని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గత మంగళవారం తొలుత పసిఫిక్ పాలిసేడ్స్లో మంటలు అంటుకున్నప్పుడు స్థానికులు ఫిర్యాదుచేసినా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతో మంటలు అదుపుతప్పి చివరకు లాస్ ఏంజెలెస్ చరిత్రలోనే మరో అతిపెద్ద దావాగ్నిలా ఎదిగాయని ఆరోపణలున్నాయి. ‘‘ ఆరోజు మేం వెంటనే ఫోన్లుచేశాం. కానీ లాస్ఏంజెలెస్ ఫైర్ డిపార్ట్మెంట్(ఎల్ఏఎఫ్డీ) నుంచి స్పందన రాలేదు. 45 నిమిషాలతర్వాత ఒక హెలికాప్టర్ వచ్చి నీళ్లు పోసి వెళ్లిపోయింది. మంటలు మాత్రం ఆరలేదు’’ అని స్థానికులు మైఖేల్ వాలంటైన్ దంపతులు చెప్పారు.ప్రైవేట్ నీటిట్యాంక్లకు గిరాకీతమ ప్రాంతంలో చెలరేగుతున్న మంటల నుంచి తమ ఇళ్లను కాపాడుకునేందుకు స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ నీటిట్యాంక్లకు గిరాకీ అమాంతం పెరిగింది. ఇదే అదనుగా ప్రైవేట్ వాటర్ట్యాంక్ సంస్థలుచార్జీలు మోతమో గిస్తున్నాయి. లాస్ ఏంజెలెస్లోని సంపన్నులు ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బంది వచ్చేదాకా ఆగకుండా ప్రైవేట్ ఫైర్ఫైటర్లను రప్పిస్తున్నారు. అయితే ఆ సేవలందించే సంస్థలు గంటకు 2,000 డాలర్లు అంటే రూ.1,73,000 చార్జ్ చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజాలు రిక్ కరుసో, కీత్ వాసర్మ్యాన్ సహా చాలా మంది ఇదే బాటపట్టారు. ‘‘ నా ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. సంస్థ మొదలైననాటి నుంచి హాలీవుడ్లో ఇంతస్థాయి డిమాండ్ ఎప్పుడూ లేదు’’ అని కవర్డ్6 ఫైర్ఫైటింగ్ సేవల సంస్థ యజమాని క్రిస్ డన్ చెప్పారు. ‘‘ నగరపాలకులను నమ్మలేమని ఈవారం ఘటనతో తేలిపోయింది. నా దగ్గర డబ్బుంది. అయితేమాత్రం ఏం లాభం. ఇళ్లు తగలబడ్డాయి’’ అని ఒక హాలీవుడ్ ప్రముఖుడు వాపోయాడు. -
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
చెన్నై:తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో శనివారం(జనవరి4) భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని సత్తూర్ సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.బాణసంచా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీ సమీపంలోని ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల జనాలు అక్కడినుంచి పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి -
టపాసుల ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన పొగ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం(నవంబర్ 1) తెల్లవారుజామున పొగ కమ్మేసింది. గురువారం రాత్రి దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ టపాసులు కాల్చారు. దీంతో ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది. ఢిల్లీ ఎన్సీఆర్లోని నోయిడా, గురుగ్రామ్లో వాయు కాలుష్యం ఒక్కసారిగా ఒక్కసారిగా పెరిగిపోయింది. రోడ్లపై విజిబిలిటీ తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)పై వాయునాణ్యత శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 395(వెరీపూర్)గా నమోదైంది. ఈ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీతో పాటు పొరుగునే ఉన్న పంజాబ్లోని పలు ప్రాంతాల్లోనూ వాయునాణ్యత ఒక్కసారిగా క్షీణించింది.#WATCH | Delhi: A thin layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.As per the CPCB, the AQI of the area is 317, in the 'very poor' category. (Visuals from India Gate) pic.twitter.com/nKvFMOPZrd— ANI (@ANI) November 1, 2024 కాగా, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీ కాలుష్యం శీతాకాలం ప్రారంభమవగానే పెరిగిపోతోంది. పంట వ్యర్థాలకు తోడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే డీజిల్ వాహనాలు కూడా కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం దీపావళి రోజు టపాసులను కాల్చడాన్ని నిషేధించింది. అయితే ఢిల్లీ వాసులు ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా టపాసులు కాల్చి పండుగ జరుపుకోవడంతో కాలుష్యం పెరిగిపోయింది. ఇదీ చదవండి: బాణసంచా కాల్చేవారిపై పోలీసుల దృష్టి -
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. బాణసంచా పేల్చడానికి 10 గంటల వరకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. ఎవరు నిబంధనలు అతిక్రమించినా హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయన్నారు.In view of maintaining public order, peace & tranquility in the limits of Cyberabad @CPCyberabad hereby notify for the information of the general public that Bursting of Fireworks/Crackers on Public roads & public places is strictly prohibited during the celebration of Deepavali. pic.twitter.com/miNJERiaOW— Cyberabad Police (@cyberabadpolice) October 31, 2024 -
బండిపై పేలిన టపాసులు.. ముక్కలు ముక్కలుగా
-
Happy Diwali: కాలుష్యరహిత దీపావళి.. ఈ టిప్స్ పాటిద్దాం!
వెలుగుల పండుగ దీపావళి వచ్చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సన్నద్ధ మవు తున్నారు. ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రేమికులు, నిపుణులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దేశంలోని పలు నగరాలలో దీపావళి టపాసులను కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తారా స్థాయికి చేరింది. దీంతో కాలుష్యం నుంచి జనావళిని రక్షించేందుకు టపాసులను నిషేధించారు. అలాగే కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పాక్షిక నిషేధం, ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరి కాలుష్యాన్ని నివారించాలంటే ఏం చేయాలి? కాలుష్యం బారిన పడకుండా టపాసులను కాల్చడం ఎలా? తెలుసుకుందాం.టపాసులు కాల్చని, బాంబుల మోత మోగని దీపావళి ఏం దీపావళి అనుకుంటున్నారా? అవును ఇలా అనిపించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి టపాసులను కాల్చడానికి అలవాటు పడ్డాం. అందులో ఆనందాన్ని అనుభవించాం. గతంలో పర్యావరణ హితమైన టపాసులను ఇంట్లోనే తయారు చేసుకునే వారు. మరిపుడు శబ్దం కంటే వెలుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కాకరపువ్వొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, చిన్ని చిన్న తాటాకు టపాసులను కాల్చే వారు. అదీ కూడా చాలా పరిమితంగా ఉండేది. దీంతో దోమలు, క్రిములు,కీటకాలు నాశనమయ్యేవి. కానీ రాను రాను ఈ పరిస్థితులు మారాయి. రసాయన మిళితమైన, పెద్ద పెద్ద శబ్దాలతో చెవులు చిల్లలు పడేలా బాంబులు వచ్చి చేరాయి. భయంకరమైన, ప్రమాదకరమైన రసాయన పొగ వ్యాపింప చేసే టపాసులు ఆకర్షణీయంగా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అర్థరాత్రి తర్వాత కూడా అపార్ట్మెంట్లలో భారీఎత్తున దీపావళి టపాసులను కాల్చడం అలవాటుగా మారిపోయింది. దీని వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అలాగే పశుపక్ష్యాదులకు ప్రమాదంకరంగా మారింది.మరి ఏం చేయాలి?భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని, కాలుష్యం కాటేయని ప్రకృతిని అందించాలంటే కొన్ని జాగ్రత్తలు, నియంత్రణలు తప్పనిసరి. అందరం విధిగా కొన్ని విధానాలను అనుసరించక తప్పదు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం స్థాయి పెరుగుతుంది అనడానికి దీపావళి తరువాత వచ్చిన కాలుష్యం స్తాయి లెక్కలే నిదర్శనం. పర్యావరణహితమైన గ్రీన్ టపాసులనే వాడాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ పొగ, ఎక్కువ శబ్దం వచ్చేవాటికి దూరంగా ఉండాలివెలుగులు జిమ్మే మతాబులు, చిచ్చు బుడ్లను ఎంచుకోవాలి.అర్థరాత్రి దాకా కాకుండా, కొంత సమయానికే మనల్ని మనం నియంత్రించుకోవాలి. టపాసులను బడ్జెట్ను సగానికి సగం కోత పెట్టుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె దీపాలే శ్రేష్టం. అవే మంగళకరం, శుభప్రదం అని గమనించాలి.ఇతర జాగ్రత్తలుటపాసులు కాల్చేటపుడు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దగ్గరుండి కాల్పించాలి. అలాగే సిల్క్,పట్టు దుస్తులను పొద్దున్నుంచి వసుకున్నా, సాయంత్రం వేళ టపాసులనుకాల్చేటపుడు మాత్రం కాటన్ దుస్తులను మాత్రమే వాడాలి.ఇరుకు రోడ్లు, బాల్కనీల్లో కాకుండా, కాస్త విశాలమైన ప్రదేశాల్లో టపాసులు కాల్చుకోవాలి.టపాసులు కాల్చుకోవడం అయిపోయిన తరువాత, చేతులను,కాళ్లు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.ఇంట్లో శిశవులు, చిన్న పిల్లలు ఉంటే శబ్దాలు విని భయపడకుండా చూసుకోవాలి.అసలే శీతాకాలం, పైగా కాలుష్యంతో శ్వాస కోస సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే అందరూ విధిగా మాస్క్లను ధరించాలి.అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. సౌకర్యం ఉన్నవారుఇంట్లో గాలి నాణ్యతకోసం ఎయిర్ ప్యూరిఫైయర్ను ఉపయోగించండి.వాయు కాలుష్యం ఇంట్లోని గాలిపై కూడా ప్రభావం చూపుతుంది. దీపావళి సందర్భంగా అధిక స్థాయి కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. పుష్కలంగా నీరు త్రాగాలి.కాలుష్యం ప్రభావం కనపించకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యంలేని శబ్దాలతో భయపెట్టని ఆనంద దీపావళిని జరుపుకుందాం. మన బిడ్డలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. -
హరిత దీపావళి జరుపుకొందాం!
భూమిపై సమస్త జీవరాశి బ్రతకడానికి కీలక పాత్ర పోషిస్తున్న గాలి నేడు కలుషితమై జీవ జాతి మనుగడకు పెను శాపంగా మారుతోంది. మన ఆర్థిక, సామాజిక జీవితంపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పరిశ్ర మలు, మోటార్ వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అగ్నిపర్వతాలు పేలడం, గనుల తవ్వకం, పంట అవశేషాలు కాల్చడం, అడవులు నరకడం, పండగలు–శుభకార్యాల్లో బాణా సంచా కాల్చడం లాంటి కారణాల వలన వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కలుషిత గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ రేణువులు మానవ,జంతు ఊపిరితిత్తుల వడపోత కేంద్రాలను దాటుకొని నేరుగా రక్తంలో చేరి రకరకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. గాలి కాలుష్యం వల్ల ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస కోశ సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు సంభవిస్తాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువులపై ప్రభావం చూపిస్తూ ‘నిశ్శబ్ద హంతకుడి‘గా వాయు కాలుష్యం వ్యవహరిస్తోంది.భారత్లోని చిన్నారుల మరణాల విషయంలో పోషకాహార లోపం తర్వాత వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని ‘లాన్సర్’ జర్నల్ పేర్కొంది. ప్రపంచ వాయు నాణ్యత నివే దిక–2023 ప్రకారం వాయు కాలుష్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత మూడో స్థానంలో భారత్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ఢిల్లీ కాలుష్య రాజధానుల్లో మొదటి స్థానంలో ఉంది. గడిచిన దశాబ్ద కాలం నుంచి మనదేశంలో పంట అవశేషాలు, బాణసంచా లాంటి కాలుష్య కారకాలు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ‘గాలి నాణ్యత, వాతావరణ సూచన మరియు పరిశోధన వ్యవస్థ’ (ఎస్ఏ ఎఫ్ఏఆర్) అధ్య యనం ప్రకారం... శీతాకాలంలో ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం వలన దీపావళి మరుసటి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థితిలోకి వెళుతోంది. గాలి నాణ్యత సూచీ 0 నుండి 100 వరకు ఉంటేనే అది ఆరోగ్యకరమైన గాలిగా పరిగణిస్తారు. కానీ శీతాకాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచి రోజురోజుకూ దిగజారుతుంది. దీపావళి తర్వాత సాధారణ పరిస్థితి రావడా నికి ఢిల్లీలో 25 రోజులు, హైదరాబా దులో 16 రోజుల సమయం పడుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణం విపరీతమైన టపా సులు పేల్చ డమే. పండగలు, ఉత్సవాల్లో పర్యావరణ హిత బాణా సంచాను మాత్రమే వాడాలి. రసాయనాలతో తయారు చేసిన టపాసుల స్థానంలో పర్యావరణహిత బాణసంచాను వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీపావళి పండుగ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలనే నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలి. హరిత దీపావళి అందరి జీవితాల్లో వెలుగు నింపాలి.– సంపతి రమేష్ మహారాజ్ ‘ ఉపాధ్యాయుడు -
Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే!
పండుగ ఏదైనా పరమార్థం ఒకటే. చీకటినుంచి వెలుగులోకి పయనం. చెడును నాశనం చేసి మంచిని కాపాడుకోవడం. అలాంటి ముఖ్యమైన పండుగల్లో వెలుగుల పండుగ దీపావళి ఒకటి. ‘‘చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి.. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి ’’ న్నాడు ఆత్రేయ.చిన్నా పెద్దా, తేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగలో దీపాలు, మతాబులతోపాటు లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైన ఆచారం. అదృష్టానికి , ధనానికి దేవత లక్ష్మీ దేవిని పూజిస్తారు. అమావాస్యనాడు వచ్చే పండుగ అయినా జగమంతా వెలుగుపూలు విరగపూస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి.దీపావళి కథశ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై, లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికిపంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, నరసింహా వతారంలో విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించి, హరి భక్తుల కష్టాలను తొలగించిన ఆనందంలోనూ ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. దీపావళి నాడు ఏం చేయాలి?ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతారు.దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతుందట. అలా శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లల్లో మాత్రమే తాను కొలువుదీరుతుందని భక్తుల విశ్వాసం. దీపావళి నాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టిందట సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది.అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, మట్టి ప్రమిదలు, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించా దేదీప్యమానంగా అలంకరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనీ, ఇల్లంతా సంపదతో తులతూగుతుందని నమ్మకం. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీపూజ ఇలా మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి. పిండి ముగ్గులతో ముంగిళ్లను తీర్చిదిద్దాలి. ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచి భక్తితో యథాశక్తి పూజించాలి. ఈ సందర్భంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచుతారు. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. బంగారు పూలతోనే పూజించాలనేదేమీ లేదు. భక్తితో చేసినదే ముఖ్యం. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఆ తరువాత స్వీట్లు, పిండి వంటలను ఇరుగుపొరుగువారితో సంతోషగా పంచుకుంటారు.దీపావళి సందడి మరింతదీపావళి రోజు చిన్న పిల్లలతో దివిటీలు కొట్టించడం కూడా ఒక ఆచారంగా పాటిస్తారు. గోగు కర్రలపై తెల్లటి కొత్త వస్త్రంతో చేసిన వత్తులను నువ్వులనూనెతో వెలగించి... దిబ్బు దిబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’’ అంటూ పాడుతూ వాటిని నేలమీద మూడు సార్లు కొట్టించి, వెనక్కి తిరిగి చూడకుండా పిల్లలకు లోపలకు వెళ్లమని, ఆ విభూతిని వారి నొసట దిద్ది, తీపి పదార్థంతో వారి నోటిని తీపి చేస్తారు. బొమ్మల కొలువుబొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు. బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా.. ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది.మతాబులు, చిచ్చుబుడ్లుపూజ,దీపాలంకరణ అనంతరం పిల్లా పెద్దా అంతా మతాబులు, చిచ్చు బుడ్లు ఇలా అనేక రకాలు దీపావళి టపాసులను వెలగించుకొని ఆనందంగా గడుపుతారు. తక్కువ పొగ, శబ్దం వచ్చే క్రాకర్స్కు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం అనేది అందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే టపాసులను కాల్చేటపుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ అప్రమత్తండా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు జాగరూకతతో మెలగాలి.ఈ దీపావళి అందరికీ ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలగాలని కోరుకుందాం. -
ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్.. సురక్షితం.. కాలుష్య రహితం
దేశంలో గత కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై పలు ఆంక్షలు విధించారు. బాణసంచా నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి హానిచేస్తుంది. అలాగే కాలుష్యాన్ని కూడా వ్యాపింపజేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు.అయితే దీపావళి వేళ బాణసంచా లేకుండా సరదాగా ఎలా గడపడం? ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు బాణసంచాకు బదులుగా ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి వెలుగు జిలుగులను, ధ్వనిని అందించినప్పటికీ కాలుష్యాన్ని కలుగజేయవు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను కాల్పడం వలన ఎటువంటి హాని జరగదు.ఎలక్ట్రానిక్ టపాసులు నిజమైన టపాసుల మాదిరిగనే కనిపిస్తాయి. వాటిలానే వెలుగులను ఇస్తాయి. అయితే ఇవి రిమోట్తో పనిచేస్తాయి. వీటిని వినియోగించినప్పుడు నిజమైన బాణసంచాను కాల్చిన అనుభూతినే పొందవచ్చు. ఎలక్ట్రానిక్ టపాసులు వెలిగించేందుకు ఎటువంటి అగ్గిపెట్టె లేదా నిప్పు అవసరం లేదు. ఇవి ఎంతో సురక్షితమైనవి. కాలుష్యాన్ని కూడా వెదజల్లవు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్లో వివిధ రకాల శబ్ధాలు, వెలుగులను చూడవచ్చు.remote control ignition device for crackers दिवाली में पटाखे जलाने के सुरक्षित यंत्र शुभ दिवाली 🪔 pic.twitter.com/VLj2n0tNFV— Er Ranjeet Singh (@ErRanjeetSingh) October 27, 2024 ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ లోపల వైర్లతో అనుసంధానమైన పలు చిన్న పాడ్లు, ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వీటిని ఆన్ చేసినప్పుడు పాడ్ల నుంచి స్పార్క్ వస్తుంది. అలాగే బాణసంచా మాదిరి శబ్దం కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను వినియోగించి వినూత్నమైన దీపావళి ఆనందాన్ని పొందవచ్చు.ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను మార్కెట్లో లేదా ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. వీటిని పలుమార్లు ఉపయోగించవచ్చు. వీటిధర రూ.2,500 వరకూ ఉండవచ్చు.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
బాణాసంచా దుకాణాలకు తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఫీజు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండగను పురస్కరించుకొని బాణాసంచా (పటాకుల) దుకాణాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తీసు కోవాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. లైసెన్స్ లేకుండా దుకాణాల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వబోమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. రిటైల్ అమ్మకాల కోసం దుకాణాలు ఏర్పాటు చేసేవారు రూ.11 వేలు, హోల్సేల్ విక్రయాలకు రూ. 66వేలు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఇలా.. బాణాసంచా దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ పొంది నిబంధనలకనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్ణీత ట్రేడ్ లైసెన్స్ ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్/ జీహెచ్ఎంసీ వెబ్సైట్ (www.ghmc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చన్నారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతులు ఇవ్వాలని కోరారు. బాణాసంచా షాపులను ఫుట్పాత్లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదని తెలిపారు. తగిన ఫైర్ సేఫ్టీ ఉండాలి.. కాలనీలు, బస్తీలకు దూరంగా ఓపెన్ గ్రౌండ్లో/ పెద్దహాల్లో తగిన ఫైర్సేఫ్టీతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి వీలుగా అగ్నిమాపక నిరోధక పరికరాలు సిద్ధంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద, చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దుకాణాలకు దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాసంచా కాల్చకూడదని, షాపులో ఏర్పాటు చేసే లైట్లు ఇతరత్రా కరెంటు పరికరాలకు నాణ్యమైన విద్యుత్ వైర్ను వినియోగించాలని సూచించారు. బాణాసంచా స్టాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే స్టాల్ హోల్డర్దే బాధ్యతని, చట్టపరమైన చర్యలకు బాధ్యుడని తెలిపారు. ఈ విషయాన్ని తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్లో పొందుపరచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు.చదవండి: స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాలి.. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఫైర్ క్రాకర్స్ అయిన సిరీస్ క్రాకర్స్/లడీస్ తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం ఉందని, వాటి అమ్మకాలకు అనుమతించరని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955/న్యాయస్థానాలు/పీసీబీ/ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. బాణాసంచా విక్రయ స్టాళ్లను సంబంధిత డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్తో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారుల బృందం కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. -
తమిళనాడులో పేలుడు.. ముగ్గురి మృతి
చెన్నై: తమిళనాడులో భారీ పేలుడు చోటుచేసుకుంది. మంగళవారం తిరువూరు జిల్లాలోని ఓ బాణాసంచా గోడౌన్లో భారీగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. Three people, including a nine-month-old baby, were killed in a country-made bomb explosion in #Tiruppur.Express photos | @meetsenbaga pic.twitter.com/5WL1nZGCWK— TNIE Tamil Nadu (@xpresstn) October 8, 2024క్రెడిట్స్: TNIE Tamil Naduమృతిచెందినవారిలో 9 నెలల పాప ఉన్నట్లు తెలుస్తోంది. మరో నలుగురికి తీవ్ర గాయలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి 10 ఇళ్లకుపైగా ధ్వంసం అయ్యాయి. పేలుడు శబ్దానికి భయంతో ప్రజలు పరుగులు తీశారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు. -
హైదరాబాద్లో నో డీజే.. నో క్రాకర్స్: సీపీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నేటి నుంచి డీజే, క్రాకర్స్ ఉపయోగించడంపై నిషేధం విధిస్తున్నట్టు నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శబ్ధ కాలుష్యాన్ని కారణంగానే డీజేలకు అనుమతులను సవరిస్తున్నట్టు సీపీ చెప్పారు.సీవీ ఆనంద్ మంగళవారం మాట్లాడుతూ.. హైదరాబాద్లో డయల్ 100కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చలు జరిపాము. ఈ క్రమంలోనే డీజేలు, క్రాకర్స్పై నిషేధం విధించడం జరిగింది. నేటి నుండి హైదరాబాద్లో డీజేలు, క్రాకర్స్పై నిషేధం విధింపు ఉంటుంది. మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేలను ఉపయోగించకూడదు. మైకులు, సౌండ్ సిస్టంను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తాము. సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి తీసుకోవాల్సిందే. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబుల్స్ను నిర్దేశించాము.జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబుల్స్కి మించి సౌండ్ సిస్టంలో వాడరాదు. రాత్రి వేళలో 45 డెసిబుల్స్కు మించి సౌండ్ సిస్టమ్స్ను ఉపయోగించరాదు. మతపరమైన ర్యాలీలలో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధం ఉంటుంది. డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ పరికరాలపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు నిషేధం ఉంటుంది. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆసుపత్రులు, స్కూల్స్, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు 5000 రూపాయల జరిమానా విధింపు ఉంటుంది. అలాగే, బీఎన్ఎస్ చట్ట ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు జరిమానా పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్ -
HYD: డీజే, క్రాకర్స్ కాల్చడంపై వ్యతిరేకత.. సీపీ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: నగరంలో డీజేల వాడకం, బాణాసంచా వినియోగంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. పండుగల ర్యాలీలో డీజేల వాడకంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో వివిధ మతాల పెద్దలతో సీపీ సమావేశం ఏర్పాటు చేశారు.హైదరాబాద్లో డీజేలు, బాణాసంచా కాల్చడంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో వీటి వాడకంపై సీపీ సీవీ ఆనంద్.. మత పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారి నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. మరోవైపు.. క్రాకర్, డీజే వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు అంటున్నారు. ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్ -
పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తారా? యువతి హెయిర్స్టైల్పై ఫైర్
క్రియేటివిటీకి కాదేదీ అనర్హం అన్నట్లు ఈమధ్య జనాలు వెరైటీ స్టంట్లతో పబ్లిసిటీ దక్కించుకుంటున్నారు. సోషల్మీడియాలో పాపులారిటీ, లైకుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి వెరైటీ హెయిర్స్టైల్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఏదైనా పండగ వస్తుందంటే చాలు అమ్మాయిల హడావిడి మామూలుగా ఉండదు. వేసుకునే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అందరి కంటే డిఫరెంట్గా రెడీ అవ్వాలని తెగ ట్రై చేస్తుంటారు. తాజాగా ఓ యువతి దీపావళి సందర్భంగా వెరైటీ హెయిర్స్టైల్తో షాకిచ్చింది. రాకెట్లు, భూచక్రాలు సహా రకరకాల క్రాకర్స్తో జుట్టును అందంగా అలంకరించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హెయిర్ స్టైలిస్ట్ సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది పర్ఫెక్ట్ దివాళీ బ్లాస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో యూజర్ స్పందిస్తూ.. ఒక్క అగ్గిపుల్లని ఆమె జుట్టుపైకి విసిరితే ఎంత ప్రమాదమో ఊహించండి, క్రియేటివిటి ఉండొచ్చు కానీ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ హితవు పలికారు. View this post on Instagram A post shared by kamal_hairstylist_official (@kamal_hairstylist_official) -
ఆదేశాలేనా? ఆచరణ లేదా?
ఆదేశాలిచ్చినా ఆచరణలో పెట్టకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాజధాని ఢిల్లీలోనే కాక, దేశవ్యాప్తంగా నిర్ణీత నిషేధిత రసాయనాలున్న టపాసులను నిషేధిస్తున్నట్టు సుప్రీమ్ కోర్టు గతవారం ఆదేశాలిచ్చింది. కానీ, జరిగింది మాత్రం వేరు. ఇష్టా రాజ్యంగా టపాసులు కాల్చడం కొనసాగింది. ఎప్పటిలానే దట్టమైన పొగలో ఢిల్లీ కూరుకుపోయింది. దీపావళి వేళ ఒక్క ఢిల్లీలోనే కాక దేశవ్యాప్తంగా వాయు, శబ్ద కాలుష్యాలు నియంత్రణ కాకపోగా మరింత పెరిగాయి. ఢిల్లీ, చెన్నై, కోల్కతా సహా 7 నగరాల్లో కాలుష్యస్థాయి ఘనపు మీటర్కు 500 మైక్రోగ్రాముల స్థాయిని దాటేసినట్టు గంటల వారీగా చేసిన విశ్లేషణలో వెల్లడైంది. హానికారకమైన నిర్ణీత టపాసులు కాల్చడంపై నిషేధం అమలులో ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, కోల్కతా, ముంబయ్, తదితర నగరాల్లో నిషేధిత టపాసులు సైతం నిల్వచేశారు, అమ్మారు, బాహాటంగా వాటిని కాల్చారు. కోర్టు ఆదేశాలు సైతం గాలికి పోవడం విషాదమే. అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకురాకుండా, వారిని మానసికంగా సంసిద్ధం చేయకుండా, ప్రభుత్వాల ఆచరణలో చిత్తశుద్ధి లేకుండా... ఎవరెన్ని ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం ఉండదని మరోసారి రుజువైంది. దీపావళి ముగిసి మూణ్ణాళ్ళయినా ఢిల్లీలో వాయు నాణ్యత ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉందని వార్త. నిజానికి, దేశ రాజధానిలో టపాసులపై నిషేధం పెట్టడం ఇదేమీ తొలిసారి కాదు. వాటి అమ్మకాన్ని దేశ రాజధానిలో నిషేధించాల్సిందిగా 2018 అక్టోబర్లో సైతం సుప్రీమ్ కోర్ట్ అప్పటి ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ‘పర్యావరణ హిత’ (గ్రీన్) టపాసులు, తక్కువ ఉద్గారాలు వెలువరించే ‘మెరుగైన’ టపాసులకు మినహాయింపు నిచ్చింది. అప్పుడూ ఆ మాట ఆదేశాలకే పరిమితమైంది తప్ప ఆచరణకు నోచుకోలేదు. అప్పట్లో కొద్దిరోజులకే... తక్కువ కాలుష్యం కలిగించే టపాసులను అభివృద్ధి చేసినట్టు ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్’ ప్రకటించింది. సాంప్రదాయిక టపాసుల కన్నా ఇవి చౌక అనీ చెప్పింది. వాటి అతీగతీ తెలీదు. అంతకన్నా ఘోరమేంటంటే, చైనా నుంచి దిగుమతి చేసుకున్న టపాసులు ‘మేడిన్ ఇండియా’ అంటూ నకిలీ ముద్రతో మార్కెట్లో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటిని ఆపే ప్రయత్నాలు సమర్థంగా జరగడం లేదు. అలాగే, ఇటీవల రెండు గంటలే టపాసులు కాల్చడానికి అనుమతిస్తున్నట్టు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఆ ఆదేశాలూ ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. వెరసి, కాలుష్య నియంత్రణపై మాటలే తప్ప చేతలు కనిపించని వైనం సహజంగానే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెర తీస్తోంది. టపాసుల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీ నేతాగణం, బీజేపీ పాలిత రాష్ట్రాలే ఆచారాల పేరు చెప్పి టపాసులు కాల్చేలా ప్రజల్ని కావాలని రెచ్చగొడుతున్నాయని ‘ఆప్’ ఆరోపిస్తోంది. పరస్పర నిందారోపణలు పక్కనపెడితే, కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ చర్యలు ఫలితమివ్వకపోవడానికి... ఢిల్లీకీ, పొరుగు రాష్ట్రాలకూ మధ్య సమన్వయ లోపం ఓ ప్రధాన కారణం. ఇక, ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వ వైఫల్యాలు సరేసరి. పండుగ వచ్చే ముందు ప్రతిసారీ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేయడం, మార్గదర్శకాలు జారీ చేయడం షరా మామూలే. అవన్నీ వట్టి కంటి తుడుపు చర్యలే అవుతున్నాయి. ఏటా ఈ సీజన్లో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పంట వ్యర్థాల దహనంలోనూ ఇదే జరుగుతోంది. చట్టాలు చేసినా సరే పంజాబ్, హర్యానా సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఆగింది లేదు. ఒక్క పంజాబ్లోనే సెప్టెంబర్ 15 నుంచి ఇప్పటికి 28 వేలకు పైగా దహనాల ఘటనలు జరిగినట్టు లెక్క. ఫలితంగా హర్యానా లాంటి చోట్ల వాయు నాణ్యతా సూచి ‘అల్ప’, ‘అత్యల్ప’ స్థాయుల్లోనే కొనసాగుతోంది. అనారోగ్యాన్ని మరింత పెంచే ఈ కాలుష్య విషాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ నేత సోనియా లాంటి వారు నిరుడు గోవా, ఈసారి జైపూర్లకు తరలిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణ పట్ల మన చిత్తశుద్ధి లేమికి ప్రతీకలు. పంట వ్యర్థాలు, దీపావళి టపాసుల విషయంలోనే కాదు... వినాయక చవితి, విజయదశమి వేళ దేవతా విగ్రహాల నిమజ్జనంలోనూ ఇదే తంతు. హైదరాబాద్ లాంటి చోట్ల హుస్సేన్సాగర్లో మట్టి విగ్రహాలే నిమజ్జనం చేయాలని ఏటేటా కోర్టు ఆదేశాలిస్తున్నాయి. ప్రభుత్వాలు సరేనని తలూపుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరు గుతున్నది మాత్రం వేరు. కాలుష్యకారక విగ్రహాలతో ఒకటికి మూడు రోజులు సచివాలయం సాక్షిగా నిమజ్జనాలు నడుస్తుంటాయి. సంప్రదాయాల్ని పాటించాల్సిందే. కానీ, పెరిగిన కాలుష్య ప్రమాదం దృష్ట్యా వాటిని పర్యావరణ అనుకూలంగా మార్చుకోవడం ముఖ్యం. తాగే నీరు, పీల్చే గాలిని ప్రాణాంతకంగా మార్చుకొమ్మని ఏ ధర్మమూ బోధించదు. అది గ్రహించి, మారాల్సింది మనమే! సమాజంలో మార్పు రాత్రికి రాత్రి వస్తుందనుకోలేం. టపాసుల సంరంభాన్నీ, విగ్రహాల ఆర్భా టాన్నీ తగ్గించుకొమ్మని ప్రజలను కోరే ముందు ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచాలి. ఆదేశాలన్నీ అప్పటికప్పుడు తీసుకుంటున్న అత్యవసర చర్యలుగా కనిపిస్తే లాభం లేదు. పాఠాల్లో భాగంగా టీచర్ల ద్వారా పిల్లలకు అవగాహన పెంచాలి. నివాసగృహాల అసోసియేషన్లను పర్యావరణహిత చర్యల్లో భాగం చేయాలి. పర్యావరణం, ప్రజారోగ్యం అందరి బాధ్యత గనక కేంద్రం, రాష్ట్రాలు ఒక దానిపై మరొకటి నెపం మోపడం సరికాదు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షాలూ సహకరించడమే దీనికి సరైన పరిష్కార మార్గం. మునిసిపాలిటీ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు అందరూ కలసికట్టుగా నడవాలి. ఊపిరాడని దేశ రాజధానిలో ముందుగా ఆ అడుగులు పడాలి. -
పిల్లలు బాణాసంచా కాల్చేటప్పడూ జరభద్రం..ఈ జాగ్రత్తలు తప్పనసరి..
మనకు ఎన్నో పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు ఉన్నా, పిల్లలకు అమితానందం కలిగించేది దీపావళి పండుగే! మిగిలిన పండుగల్లో పిల్లలకు మిఠాయిలు, పిండివంటలు మాత్రమే ఉంటాయి. దీపావళి నాడైతే మిఠాయిలు, పిండివంటలకు అదనంగా టపాకాయలు కూడా ఉంటాయి. సరదాగా టపాకాయలు కాల్చడానికే పిల్లలు దీపావళి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టపాకాయలు కాల్చుకోవడం సరదానే అయినా, వాటితో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల జాగ్రత్తలు తీసుకుని మరీ వాటిని కాల్చాలి. ఏమాత్రం అజాగ్రత్తపడినా ఇళ్లూ ఒళ్లూ కాలే ప్రమాదాలు ఉంటాయి. ఈసారి బాలల దినోత్సవానికి రెండురోజుల ముందు దీపావళి పండుగ వస్తోంది. పిల్లలకు ఈసారి రెట్టింపు ఉత్సాహం ఉంటుంది. పిల్లల్లారా! దీపావళి గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఒకసారి భూమండలాన్ని తీసుకుపోయి సముద్రంలో దాచేశాడు. దేవతలందరూ మొరపెట్టుకోవడంతో మహావిష్ణువు వరాహావతారం దాల్చాడు. హిరణ్యాక్షుడితో యుద్ధంచేశాడు. వాణ్ణి తన పదునైన కోరలతో పొడిచి చంపేశాడు. సముద్రంలో మునిగిన భూమిని తన కోరలతో పైకెత్తి బయటకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో వారికి నరకాసురుడు పుట్టాడు. వాడికి అసురలక్షణాలు ఉన్నాయని, ఎప్పటికైనా తల్లి చేతుల్లోనే మరణిస్తాడని మహావిష్ణువు భూదేవికి చెప్పాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్లిపోయాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకాసురుడు కామరూప దేశానికి రాజయ్యాడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించసాగాడు. ద్వాపరయుగంలో నరకాసురుడికి శోణితపురం రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. దుర్మార్గుడైన బాణాసురుడి సావాసంలో నరకాసురుడికి అన్ని చెడ్డ గుణాలూ అలవాటయ్యాయి. బాణుడు రెచ్చగొట్టడంతో ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసేవాడు. దొరికిన స్త్రీలనందరినీ తీసుకొచ్చి, బంధించేవాడు. ఇలా పదహారువేల మంది స్త్రీలను చెరపట్టాడు. స్వర్గం మీద దండెత్తి, దేవేంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ కాలంలోనే శ్రీకృష్ణుడు నరకాసురుడి మిత్రుడైన మురాసరుడిని, అతడి కొడుకులను యుద్ధంలో హతమార్చాడు. తన మిత్రుడైన మురాసురుడిని చంపడంతో నరకాసురుడికి శ్రీకృష్ణుడి మీద కోపం వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరుతుంటే, తాను కూడా వస్తానని పట్టుబట్టింది సత్యభామ. సరేనంటూ, ఆమెను తనతో పాటే గరుడ వాహనం మీద యుద్ధరంగానికి తీసుకుపోయాడు శ్రీకృష్ణుడు. నరకాసురుడికి, శ్రీకృష్ణుడికి హోరాహోరీ యుద్ధం జరిగింది. యుద్ధంలో నరకాసురుడు విడిచిన బాణం తాకడంతో శ్రీకృష్ణుడు మూర్ఛపోయాడు. ఇది చూసి సత్యభామకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే విల్లూ బాణాలూ అందుకుంది. నరకాసురుడి మీద, అతడి సైనికుల మీద వరుసగా బాణాలు కురిపించింది. కాసేపటికి శ్రీకృష్ణుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. యుద్ధంలో సత్యభామ అలసిపోతుండటం చూశాడు. తాను కూడా యుద్ధంలో విజృంభించాడు. అదను చూసి, చక్రాయుధం విసిరి నరకాసురుడి తల తెగనరికాడు. ఆ రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. అందుకే ఆ రోజును మనం నరక చతుర్దశి అంటున్నాం. మర్నాడు అమావాస్య రోజున జనాలందరూ నరకాసురుడి పీడ విరగడైనందుకు సంతోషంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, పండుగ చేసుకున్నారు. ఇప్పుడు మనం జరుపుకుంటున్న దీపావళి పండుగ అలా పుట్టిందన్నమాట. బాణసంచా చరిత్ర చాలాకాలం పాటు జనాలు దీపావళి రోజున సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించుకోవడం, లక్ష్మీపూజలు జరుపుకోవడం మాత్రమే చేసేవారు. అప్పట్లో టపాకాయలు కాల్చేవారు కాదు. తర్వాతి కాలంలో సురేకారంగా పిలుచుకునే పొటాషియం నైట్రేట్ కనుగొన్న తర్వాత దానికి గంధకం, బొగ్గుపొడి కలిపి పేలుడు పదార్థాలను, ఆ తర్వాత రకరకాల రంగు రంగుల కాంతులు వెదజల్లే బాణసంచా సామగ్రి తయారు చేయడం మొదలైంది. బాణసంచాను మొదటగా తయారు చేసినది చైనావాళ్లు. వాళ్ల నుంచి ఇది దేశ దేశాలకు పాకింది. అలాగే క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దం నాటికి మన దేశానికి కూడా చేరుకుంది. అప్పటి నుంచి దీపావళి పండుగ రోజు టపాకాయలు కాల్చడం అలవాటుగా మారింది. కాకరపూవొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, తాటాకు టపాకాయలు, తారాజువ్వలు వంటి బాణసంచా కాల్చడం, వాటి నుంచి వచ్చే రంగురంగుల వెలుగులను చూడటం ఎంతో సరదాగా ఉంటుంది కదూ! అయితే బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. జాగ్రత్తగా టపాకాయలు కాల్చండి టపాకాయలు కాల్చడం ఎంత సరదా అయినా, టపాకాయలు కాల్చడమంటే ఒకరకంగా నిప్పుతో చెలగాటమే! అందువల్ల టపాకాయలు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి: టపాకాయలు కాల్చేటప్పుడు వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి. టపాకాయలను చేత్తో పట్టుకుని నేరుగా కాల్చవద్దు. రేకు డబ్బాలు, సీసాలు, కుండలు బోర్లించి, వాటిలో టపాకాయలు అసలే కాల్చవద్దు. ఇలా చేయడం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. బాణసంచా కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలేయవద్దు. తల్లిదండ్రులు దగ్గరుండి, జాగ్రత్తగా కాల్పించండి. టపాకాయలు కాల్చేచోట బాగా నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అనుకోకుండా కాలిన గాయాలైతే, గాయమైన చోట బాగా నీరుపోసి, గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవచ్చు. (చదవండి: అతిపెద్ద బాలల మ్యూజియం!) -
బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు
లండన్: లండన్ వేదికగా దీపావళి సంబరాలు ఊపందుకున్నాయి. సాక్షాత్తు ప్రధాని నివాసం అధికారిక భవనంలో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగాయి. దీపావళి వేడుకలకు హిందూ బంధువులను ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఆహ్వానించారు. చీకటిపై వెలుతురు విజయ సూచకంగా దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను ప్రధాని రిషి సునాక్ అధికారిక ఖాతాలో పంచుకున్నారు. అక్షతా మూర్తి దీపాలను వెలిగిస్తుండగా.. ఆమె చుట్టూ జనం గుమిగూడి ఉన్న ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. యూకే, ప్రపంచమంతటా దీపావళి వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. Tonight Prime Minister @RishiSunak welcomed guests from the Hindu community to Downing Street ahead of #Diwali – a celebration of the triumph of light over darkness. Shubh Diwali to everyone across the UK and around the world celebrating from this weekend! pic.twitter.com/JqSjX8f85F — UK Prime Minister (@10DowningStreet) November 8, 2023 చీకటిపై వెలుతురు, చెడుపై మంచి విజయసూచకంగా దీపావళి పండుగను హిందువులు ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటారు. ఇరు దేశాల నాయకులు రిషి సునాక్, ప్రధాని మోదీ ఇటీవల టెలిఫొన్లో సంభాషించుకున్నారు. స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందంపై పురోగతి దిశగా అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. వరల్డ్ కప్ సందర్భంగా భారత్కు రిషి సునాక్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్ -
యూట్యూబర్ పైత్యం: మండిపడుతున్న నెటిజనులు
యూట్యూబ్లో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది వింత విన్యాసాలు, ప్రమాదకర ఫీట్స్తో సోషల్మీడియా యూజర్లకు చిరాకు తెప్పించడం ఈ మధ్య కాలంలో రొటీన్గా మారి పోయింది. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పటాకులు కాల్చిన వీడియో నెటిజనులకు ఆగ్రహం తెప్పింది. రైల్వే ప్లాట్ఫారమ్పై యూట్యూబర్ నిర్భయంగా పటాకులు స్నేక్ క్రాకర్స్ కాల్చుతున్న వీడియో ట్విటర్లో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియా క్రియేటర్లకు, యూట్యూబర్ల అతి చేష్టలకు హద్దు పద్దూ లేకుండా పోతోందంటూ ఆగ్రహం పెల్లుబుకింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దీంతో ర్వైల్వే శాఖ స్పందించింది. ఫూలేరా-అజ్మీర్ సెక్షన్లోని దంత్రా స్టేషన్ సమీపంలో ఈ వీడియోను షూట్ చేసినట్టు తెలుస్తోంది.ఇందులో రైలు పట్టాలపై కుప్పగా పోసిన పాము బిళ్లల్ని ఒక్కసారిగా వెలిగించాడు. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రైన్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై అవసరమైన చర్యలు తీసుకోండి అనే క్యాప్షన్తో దీన్ని షేర్ చేసింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి...ప్రాణాలతో చెలగాటాలా అంటూ ఒకరు, అసలే దేశమంతా కాలుష్యంతో మండిపోతోంది. దీపావళి సందర్భంగా పిల్లలు ఎక్కువగా ఇష్ట పడే ఈ పాము బిళ్ళలు ఎక్కువ కార్బన్ను రిలీజ్ చేస్తాయంటూ మరొకరు మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా? పర్యావరణం కలుషితమవుతోంది. రైలు పట్టాల దగ్గర ఇలాంటి ప్రయోగాలు ప్రమాదకరం అంటూ తీవ్రంగా స్పందించడం గమనార్హం. అంతేకాదు ఇది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు..చర్యలు తీసుకోండి అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వీడియోపై నార్త్ వెస్ట్రన్ రైల్వే స్పందించింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్, జైపూర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను ఆదేశించింది. ప్రస్తుతం వీడియోపై ఆర్పీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే స్నేక్ క్రాకర్స్ అనేవి అత్యధిక మోతాదులో PM2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్)ను విడుదల చేస్తాయని 2016నాటి చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ (CRF), పూణే విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. YouTuber bursting crackers on Railway Tracks!! Such acts may lead to serious accidents in form of fire, Please take necessary action against such miscreants. Location: 227/32 Near Dantra Station on Phulera-Ajmer Section.@NWRailways @rpfnwraii @RpfNwr @DrmAjmer @GMNWRailway pic.twitter.com/mjdNmX9TzQ — Trains of India 🇮🇳 (@trainwalebhaiya) November 7, 2023 -
బాబోయ్.. బాణసంచా
సాక్షి, హైదరాబాద్: వరుస ప్రమాదాలతో సతమత మవుతున్న రైల్వే శాఖ ఇప్పుడు దీపావళి పండుగ అనగానే తీవ్ర ఆందోళనకు గురవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా బ్యాగుల్లో బాణసంచా పెట్టు కుని కొందరు ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రతీ దీపావళి సంద ర్భంలో రైల్వే ఉద్యోగులు తనిఖీలు చేస్తుంటారు. అయినా వాటిని పూర్తిగా నియంత్రించ లేకపోతు న్నారు. కొంతకాలంగా రైల్వే భద్రతపై మళ్లీ విమ ర్శలు వస్తున్నాయి. ఇటీవల తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రయా ణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరస్పరం రెండు రైళ్లు ఢీకొంటుండటంతో పాటు అగ్ని ప్రమా దాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈసారి దీపావళి సందర్భంగా రైళ్లలో బాణసంచా తరలించకుండా మరింత పకడ్బందీగా వ్యవహరించాలని రైల్వే శాఖ జోన్లను ఆదేశించింది. రంగంలోకి స్నిఫర్ డాగ్స్.. నిత్యం కిటకిటలాడే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయా ణికుల తనిఖీ రైల్వే సిబ్బందికి సవాల్గా ఉంటోంది. వందలాది మంది ఒకేసారి వస్తుండటంతో వారి ని క్రమపద్ధతిన లోనికి పంపుతూ చెక్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటం కుదరటం లేదు. స్టేషన్కు వెళ్లేందుకు నాలుగైదు దారులు ఉండటంతో, ఏదో ఓ దారి నుంచి లోనికి చేరుతున్నారు. వారి లగేజీలో బాణాసంచా ఉందో లేదో తనిఖీ చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు)తో కూడిన క్విక్ రియాక్షన్ బృందాల ను రైల్వే రంగంలోకి దింపుతోంది. ఈ సిబ్బంది సాధారణ దుస్తుల్లో ఉండి తనిఖీ చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో.. రెండు చోట్ల జాగిలాలతో తనిఖీ చేసి బాణాసంచాను సులభంగా గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. బాణ సంచా తరలిస్తే మూడేళ్ల జైలు శిక్ష ప్రస్తుతం ఉన్న సీసీటీవీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్నింటిని ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. వాటి ద్వారా పర్యవేక్షించేందుకు ప్రత్యే కంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. రైళ్లలో బాణసంచా తరలిస్తే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.వేయి జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందంటూ రైల్వే సిబ్బంది ప్రచారం ప్రారంభించారు. ఎవరైనా బాణ సంచా సహా మండే స్వభావం ఉన్న ఇతర వస్తు వులను రైళ్లలో తరలిస్తున్నట్టు దృష్టికొస్తే 139కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠిన చర్యలు రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇలాంటి పేలుడు పదార్థాల వల్ల ప్రయాణికుల భద్రత, రైళ్లు, రైల్వేస్టేషన్లు, రైల్వే ఆస్తుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందన్నారు. -
బర్త్డే వేడుకల్లో బీభత్సం: కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరి, రచ్చ..రచ్చ!
పుట్టినరోజు సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసిన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పటాకులు పేల్చి, కరెన్సీ నోట్లకు గాల్లోకి విసరడమే కాకుండా, స్థానికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించి అసభ్యకరంగా దూషించి ఘటన కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఘజియాబాద్లోని రాజ్నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్గ్రామ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రవి కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం ముగ్గురు వ్యక్తులు పుట్టిన రోజు వేడుకల్లో బీభత్సం సృష్టించారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోపల కారు పైకప్పుపై నిలబడి విచ్చల విడిగా బాణా సంచా కాల్చడంతోపాటు కరెన్సీని గాల్లోకి విసిరి గలాటా సృష్టించారు. అంతేకాదు దీన్నిప్రశ్నించిన అపార్ట్మెంట్ వాసులను దుర్భాషలాడారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అపార్ట్మెంట్ ఓనర్స్ సంఘం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. @ghaziabadpolice @DCPCityGZB #Ghaziabad pic.twitter.com/Q97dZabFch — Ajnara Integrity AOA (@integrityaoa) October 29, 2023 https://t.co/Nlf6IPi1Le — DCP CITY COMMISSIONERATE GHAZIABAD (@DCPCityGZB) October 29, 2023 -
TN: కృష్ణగిరి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
చెన్నై: తమిళనాడులోని కృష్ణగిరి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం పాతపేటలోని ఓ బాణాసంచా గోడౌన్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బాణాసంచా గోడౌన్ కావడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించి భారీగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల అదుపులోకి తెచ్చుందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి ఇదేందిది.. కారు కాని కారు.. బానే పోతోందే..! -
సింహాద్రి రీ రిలీజ్.. ఏకంగా థియేటర్ తగలబెట్టేశారుగా!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమా రిలీజైతే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి రీ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) అయితే ఈ సినిమా రిలీజ్ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా రిలీజైన థియేటర్ల ముందు పాలాభిషేకాలు, కేక్లు చేసి సందడి చేశారు. అయితే విజయవాడలోని గాంధీనగర్ అప్సర థియేటర్లో అభిమానులు ఏకంగా టపాసులు పేల్చారు. దీంతో సీట్లకు మంటలు అంటుకుని థియేటర్ మొత్తం వ్యాపించాయి. అయితే అక్కడే ఉన్న పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ ఘటనతో సాయంత్రం ప్రదర్శించాల్సిన షోలను నిర్వాహకులు రద్దు చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. (ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) -
Video: బాణసంచా వెలుగుల్లో కొత్త సచివాలయం.. అదరహో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Big Day In Telangana Today… ❤️ Opening of New Telangana’s Secretariat 👏 Not Graphics like in other states 😀 It’s A Reality… The Best in India… Thanks to Visionary KCR Garu ✊️#Telangana #Secretariat 😍@KTRBRS pic.twitter.com/YQR07zozon — Govardhan Reddy Dharmannagari (@DGRforBRS) April 30, 2023 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్కు వచ్చిన కేసీఆర్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో సీఎంను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. తనతో పనిచేసిన, కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకోనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు -
టపాసులు కాల్చొద్దు అన్నందుకు హత్య
ముంబై: ఒక వ్యక్తి టపాసుల కాల్చొద్దని చెప్పినందుకు ముగ్గురు మైనర్ల చేతిలో హతమయ్యాడు. ఈఘటన శివాజి నగర్లోని గోవాండిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ముగ్గురు మైనర్లు బహిరంగంగా సీసాలో టపాసులు పెట్టి కాలుస్తున్నారు. దీంతో 21 ఏళ్ల వ్యక్తి వారిని అలా టపాసులు కాల్చొద్దు అని వారించాడు. ఆ తర్వాత ఇరువైపులా మాటా మాటా పెరిగి వాగ్వాదం తలెత్తింది. అంతే కోపంతో ఒక మైనర్ సదరు వ్యక్తిని దారుణంగా కొట్టి చాకుతో మెడపై పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఎందుకలా చూస్తున్నారు అని ప్రశ్నించాడని...కొట్టి చంపేశారు) -
పండుగ ధమాక షురూ!.. ఇంటింటికి కిలో చికెన్, మద్యం, క్రాకర్స్ బాక్స్
సాక్షి, నల్లగొండ: పండుగ ధమాక షురూ అయ్యింది. దీపావళి పండుగ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పండుగ తాయిలాల పంపిణీని ప్రారంభించాయి. చికెన్, మద్యంతోపాటు పిల్లలకు క్రాకర్స్, మహిళలకు చీరలు ఇస్తున్నాయి. అంతేకాదు.. ఓట్లు వేయించగలిగే నాయకులకు భారీగా ఆఫర్లు అమలు చేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ ఓటర్ల ఇంటికే చికెన్, క్రాకర్ బాక్సుల పంపిణీని ఆదివారమే ప్రారంభించింది. మరో పార్టీ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం కల్లా పిల్లలకు క్రాకర్స్ అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. మరోవైపు పెద్దలకు మద్యం బాటిళ్ల పంపిణీని కూడా షురూ చేశారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు కొన్ని చికెన్ సెంటర్లలో పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. వాటిన్నంటిని తీసుకెళ్లి, ఆయా గ్రామాల్లో ఇంటింటికి పంచేందుకు కొందరు గ్రామ నాయకులకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. గ్రామాల్లో చికెన్ సెంటర్లు ఉంటే అక్కడే ఆర్డర్ ఇచ్చి పంపించేలా స్థానికంగా ఉండే పార్టీ అభిమానులను పురమాయించినట్లు సమాచారం. చదవండి: రైళ్లలో ప్రీమియం తత్కాల్ దోపిడీ..రూ.450 టికెట్ రూ.1000పైనే గ్రామ, మండల స్థాయి నేతలకు బెస్ట్ ఆఫర్లు గ్రామ మండల స్థాయి నాయకులకు ప్రధాన పార్టీలు దీపావళి పండుగను పురస్కరించుకొని పెద్ద మొత్తంలో బొనాంజా ప్రకటించాయి. భారీ మొత్తంలో నగదును నజరానాగా అందజేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ వార్డు సభ్యుని నుంచి మొదలుకొని మండల స్థాయి నాయకుని వరకు ఓట్లు వేయించగలిగే సత్తాను బట్టి రూ.25 వేల నుంచి రూ.2లక్షలు వరకు ముట్టజెప్తున్నట్లు తెలిసింది. మరో ప్రధాన పార్టీ వారు కూడా రూ.10వేల నుంచి మొదలుకొని రూ.లక్షన్నర వరకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల పుణ్యమాని నియోజకవర్గంలో పండుగ అంతా పార్టీల విందులతోనే గడిచిపోతోంది. గత కొన్ని రోజులుగా నియోకవర్గంలో పొద్దంతా ప్రచారం, సాయంత్రం మద్యం సిట్టింగ్లు వేస్తూ విందులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో బయట నిర్వహించే సిట్టింగ్లు బంద్ చేసి ఇంటికే మద్యం, మాంసం పంపిణీలో పడ్డాయి. చదవండి: ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు మహిళలకు చీరలు.. దీపావళి సందర్భంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ పార్టీ నాయకులు మునుగోడు, మర్రిగూడ మండలాల్లో చీరల పంపిణీని ప్రారంభించింది. మరో పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చీరలు పంచితే ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో చీరలు కొనుక్కొమ్మని డబ్బులు పంచుతున్నట్లు తెలిసింది. -
స్వీట్లు, టపాసుల దుకాణాల వద్ధ కొనుగోలుదారుల సందడి
-
కొనకుండానే పేలుతున్న టపాకాయలు..!
-
Diwali 2022: పండుగ పచ్చగా.. గ్రీన్ క్రాకర్స్కు పెరిగిన ఆదరణ
దీపావళి వచ్చేసింది. అమావాస్య చీకటి రోజున దివ్వెల కాంతులతో పాటు కాకరపువ్వొత్తుల చిటపటలు, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్ల మెరుపులు, లక్ష్మీబాంబుల మోతలు లేకుండా పండుగకి కళే రాదు. మరి ఈ బాణాసంచాతో పర్యావరణం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బ తింటోంది. అందుకే ఇప్పుడు అందరూ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండగ సరదా తీర్చుకోవాలంటే గ్రీన్ క్రాకర్స్ మార్గం కావడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. ఏమిటీ గ్రీన్ క్రాకర్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్గా పిలుస్తున్నారు. మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది. గ్రీన్ క్రాకర్స్ని గుర్తించడం ఎలా ? ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయి స్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి సఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాదే ఆదరణ ఎందుకు ? పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుని గుర్తించిన సుప్రీం కోర్టు బాణాసంచాను నిషేధిస్తూ అక్టోబర్ 23, 2018 దీపావళికి ముందు సంప్రదాయ బాణాసంచాపై నిషేధం విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. గ్రీన్ క్రాకర్స్కి మాత్రమే అనుమతినిచ్చింది. 2019లో దీపావళి సమయంలో గ్రీన్ క్రాకర్స్పై గందరగోళంతో బాణాసంచా పరిశ్రమ భారీగా నష్టపోయింది. వేటిని గ్రీన్ అనాలో వేటి కాదో తెలీక, తయారీదారులకే వీటిపై అవగాహన లేకపోవడంతో ఆ ఏడాది దీపావళి పండగ కళ తప్పింది. ఆ తర్వాత వరసగా రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం పండగపై పడింది. 2021లో సుప్రీం కోర్టు ఆకుపచ్చ రంగుని వెదజల్లే బేరియమ్ను వాడే టపాసులకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు వచ్చి నాలుగేళ్లు కావడంతో ఇప్పుడు వీటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. అయినప్పటికీ బాణాసంచా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గిపోయిందని శివకాశీలో తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎలా? కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో జనవరి 1 దాకా అన్ని రకాల బాణసంచాపై నిషేధముంది. కొన్ని రాష్ట్రాలు గ్రీన్ క్రాకర్స్కు అనుమతినిచ్చాయి. పశ్చిమ బెంగాల్లో దీపావళి రోజు మాత్రం క్రాకర్స్ను కాల్చుకోవచ్చు. పంజాబ్ రాత్రి 8 నుంచి 10 వరకే గ్రీన్ క్రాకర్స్కు అనుమతించింది. హరియాణా కూడా గ్రీన్ క్రాకర్స్కే అనుమతినిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Diwali 2022: టపాసులు కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాక్షి,హైదరాబాద్: దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే.. బంధువుల రాకపోకలు... అతిథి మర్యాదలు... టపాసుల మోతలు ఇలా దీపావళి పండుగ అంతా సందడిగానే ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ ఇది. అలాంటి దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుందని ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. లక్ష్మీదేవి ఆరాధన.. దీపావళి రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదును అమ్మవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చీకట్లను పారద్రోలే విధంగా దీపాలను వెలిగించి పూజ చేస్తారు. దీపారాధన అనేది ఈ పండుగలో ప్రత్యేకమైనది. ఇంట్లో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. లక్ష్మీదేవి దీప జ్యోతిగా సంపద దైవంగా భావిస్తుండటంతో అందరు దీపావళి రోజు దీపాలను వెలిగిస్తారు. మార్కెట్లో రకరకాల డిజైన్లు.. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లతో కూడిన ప్రమిదలు లభిస్తున్నాయి. స్టీల్, ప్లాస్టిక్, మట్టికి సంబంధించి దీపాలు, ప్రమిదలు వివిధ డిజైన్లలో మార్కెట్లో దండిగా లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలకు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా ఈ పండుగకు కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో తక్కువ రేటు ఉండటంతో చాలామంది ఆన్లైన్ ద్వారా తెíప్పించుకుంటున్నారు. మరికొందరు దుకాణాలకు నేరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంటే ఉంటుంది. బాణా సంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ, పోలీసులు, వైధ్యాధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు. ► టపాసులను ఆరుబయటనే కాల్చాలి. ఇంట్లో కాల్చొద్దు. ► ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతాల్లో టపాసులు పేల్చొద్దు. ► టపాసులు కాల్చే ముందు విధిగా పాదరక్షలు ధరించాలి, అందుబాటులో నీళ్లు ఉంచుకోవాలి. గాయాలు అయితే వెంటనే సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ► టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలిపెటొద్దు. పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. సరిగ్గా కాలని బాణసంచాపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ► టీషర్టులు, జీన్స్లాంటి దుస్తులు కాకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి, కళ్లకు హాని కలగకుండా అద్దాలు వాడాలి. ► అగ్నిమాపక శాఖ వద్ద లైసెన్సులు పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. ► పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ కాకర్స్ ఉపయోగిస్తే మంచిది. అప్రమత్తంగా ఉండాలి టపాసుల కాల్చేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలో బాణా సంచా కాల్చాలి. టపాసులు విక్రయించే వారు విధిగా అనుమతులు తీసుకోవాలి. దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి. – రమేష్గౌడ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్నగర్ అగ్నిమాపక కేంద్రం -
కాల్చకుండానే పేలుతున్న క్రాకర్స్.. ఈ దీపావళి చాలా కాస్ట్లీ గురూ!
ఎట్టికేలకు కరోనా వ్యాప్తి తగ్గింది. దీంతో ఆంక్షలు కూడా పక్కకు వెళ్లిపోయాయి. ఈ ఏడాది దీపావళి పండగను ఇంటిల్లపాదీ సంతోషంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు బాణసంచా ధరలు గుండె గుబేల్మనిపించేలా ఉన్నాయి. డిమాండ్ను బట్టి వ్యాపారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. సీజన్ కావడంతో హోల్సేల్ దుకాణాల వద్ద వారం రోజుల నుంచే సందడి నెలకొంది. మరోవైపు తాత్కాలిక దుకాణాలకు అధికారికంగా అనుమతులు ఉన్న వాళ్లు, లేనివాళ్లు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరుసగా రెండేళ్ల పాటు కరోనా నేపథ్యంలో దీపావళి బాణసంచా వ్యాపారం జరగని విషయం తెలిసిందే. ఈ ఏడాది కాస్త సొమ్ము చేసుకోవాలని వ్యాపారులు చూస్తున్నారు. దీంతో బాణాసంచాలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రవాణా భారం వల్లే ఎక్కువ ధరలు.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా అంతంత మాత్రమే జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో అటు వ్యాపారులు ఇటు ప్రజలు గతేడాది పోలిస్తే ఈ ఏడాది వ్యాపారం బాగా జరుగుతుందని దుకాణదారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బాణసంచా దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. గతంలో రూ.వెయ్యి పెడితే చిన్నా చితకా సామాగ్రి కలిపి 20 నుంచి 30 వరకు వచ్చేవి. ఇప్పుడు ధరలను చూస్తే వాటిలో సగం కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడులోని శివకాశీ తదితర ప్రాంతాల నుంచి హోల్సేల్గా తీసుకురావడానికి రవాణా చార్జీలు భారీగా పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. డీజిల్ ధర అనూహ్యంగా పెరిగిన ప్రభావం దీపావళి బాణసంచా విక్రయాలపై కూడా కనిపిస్తోందని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వ్యాపారులు మాత్రం ఇదే అదనుగా ధరలు పెంచేసి కొనుగోలుదారుల నడ్డి విరగ్గొడుతున్నారు. చదవండి: భారీ షాక్.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! -
దీపావళి బాణసంచా మోతపై షరతులు.. కేవలం ఆ 2 గంటలే!
సాక్షి, చెన్నై: దీపావళి రోజున కేవలం 2 గంటల మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగను ఈనెల 24న జరుపుకోనున్న విషయం తెలిసిందే. పండుగ వేళ బాణసంచా ఏఏ సమయాల్లో పేల్చాలో అనే వివరాలను అందులో వెల్లడించారు. ఈ మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు ఈ విషయంపై అవగాహన కలిగించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అలాగే, భారీ శబ్దంతో కూడిన బాణసంచా ఉపయోగించవద్దని, గ్రీన్ టపాసులనే పేల్చాలని సూచించారు. -
కలలే కల్లలై.. కళ్లేదుటే బూడిదై..
రణస్థలం (శ్రీకాకుళం): ఆ ఇల్లాలు ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం కోసం భర్తను పిలిచింది. అయితే, తన స్నేహితుడి పెళ్లికి బాణసంచా తయారు చేస్తున్నానని, కొద్ది సమయంలోనే వచ్చేస్తానని చెప్పి ఆమెను పంపించేశాడు. ఇది జరిగిన కాసేపటికే భారీ పేలుడు సంభవించడంతో భార్య నిర్ఘాంతపోయింది. వెంటనే బయటకు వచ్చి పూర్తిగా కాలిపోయిన తన భర్తను చూసి అక్కడే కూలిపోయింది. మృతుని కుమారులు సైతం స్కూల్కు వెళ్లి ఇంటికి వచ్చేసరికే మంటలు ఎగసిపడటంతో భయంతో వెనక్కు పారిపోయారు. ఈ విషాద ఘటన రణస్థలం మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ పరిధిలో ఫ్రెండ్స్కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్న కామరాజు(39) కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. స్వగ్రామం లావేరు మండలం వేణుగోపాలపురంలో తన స్నేహితుని పెళ్లి వేడుక నిమిత్తం బాణసంచా తయారుచేసేందుకు సామ్రగి తెచ్చుకున్నాడు. మధ్యా హ్నం 12.25 గంటల సమయంలో కామరాజు బాణసంచా తయారు చేస్తుండగా చేతిలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి పక్కనే ఉన్న నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రికి అంటుకోవడంతో భారీ శబ్దంతో రేకు షెడ్డు ఎగిరిపడింది. ఈ ఘటనలో కామరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. పేలుడు ధాటికి ఇంటి ప్రహరీ సైతం కూలిపోయింది. విద్యుత్ తీగకు సైతం మంటలు అంటుకోవడంతో దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు సాహసం చేయలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి పైల అశోక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. చదవండి: (ఫస్ట్నైట్ అంటే భయపడ్డాడు.. అందుకే ఇలా చేశాడు: వరుడి తల్లి) ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ.. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహేంద్ర పరిశీలించారు. జె.ఆర్.పురం సీఐ బీసీహెచ్ స్వామినాయుడుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. కామరాజు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జి.రాజేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం తరలించినట్లు చెప్పారు. కామరాజు 20 ఏళ్ల కిందటే స్వగ్రామం వేణుగోపాలపురం నుంచి జె.ఆర్.పురం వచ్చి అన్నయ్య కృష్ణతో కలిసి వడ్రంగి పనులు చేస్తున్నాడు. మందుగుండు తయారీ కేంద్రాలపై దాడులు అరసవల్లి/శ్రీకాకుళం/కాశీబుగ్గ:జె.ఆర్.పురంలో మందుగుండు పేలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో సీఐ అంబేడ్కర్, ఎస్సైలు విజయ్కుమార్, రామకృష్ణలు మంగళవారం 19 చోట్ల సోదాలు నిర్వహించగా ఐదుచోట్ల మందుగుండు సామగ్రి గుర్తించారు. పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరసవల్లి రెల్లివీధి, ఆదిత్యనగర్ కాలనీ తదితర చోట్ల ఈ సోదాలు జరిగాయి. పలాస–కాశీబుగ్గలోనూ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. -
ఎన్నిసార్లు చెప్పినా అంతే..! ఒకరింట్లో విందు.. మరొకరింట్లో నిద్ర బందు
సాక్షి, శంషాబాద్: ఒకరి ఇంట్లోని శుభకార్యం మరో ఇంటికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. ఓ వైపు టపాసుల మోత.. మరో వైపు శబ్దాల హోరుతో పలు ఫంక్షన్హాళ్ల వద్ద అర్ధరాత్రి వరకు జరుగుతున్న కార్యక్రమాలకు సమీప కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఒకే చోట ఐదు.. ►శంషాబాద్లోని సిద్ధంతి, నక్షత్ర, సాయినగర్ కాలనీ సమీపంలో ఒకే చోట ఐదు ఫంక్షన్హాళ్లు ఉన్నాయి. ఒకే చోట అధిక సంఖ్యలో ఇవి ఉండటం వల్ల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా సమీప కాలనీ వాసులకు వీటి శబ్దం కారణంగా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. పలుసార్లు ఫిర్యాదు.. ►అనుమతి లేకుండానే అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున సౌండ్ బాక్సుల శబ్దాలు, టపాసుల మోతతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ విషయంపై కాలనీ వాసులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే సారి అన్ని ఫంక్షన్హాళ్లలో వేడుకలు జరిగినప్పుడు శబ్దం తీవ్రత మరింతగా బాధిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేజర్ కాంతులపై నిషేధం.. ►విమానాశ్రయానికి సుమారు 8 కిలో మీటర్ల వరకు ఎలాంటి లేజర్ కాంతులు ఏర్పాటు చేయకూడదని గతంలో అనేకసార్లు ఎయిర్పోర్టు అధికారులతో పాటు స్థానిక సంస్థలు కూడా ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేశాయి. గతంలో పోలీసుల దృష్టి పెట్టినప్పుడు కొంత మేర తగ్గించి తిరిగి యథాతథంగా కొనసాగిస్తున్నారని వాపోతున్నారు. తెల్లవారే వరకు శబ్ధాలు.. ఒక్కోసారి రాత్రి నుంచి తెల్లారే వరకు కూడా శబ్దాల హోరు తగ్గడం లేదు. టపాసుల మోతతో పాటు సౌండ్ బాక్సుల్లో మితిమీరిన శబ్దం ఫంక్షన్ హాళ్ల నుంచి వెలువడుతోంది. వీటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. – రాజిరెడ్డి, సాయినగర్ కాలనీ -
ఈ అత్యుత్సాహం మానుకోండి : సల్మాన్ ఖాన్
న్యూఢిల్లీ: సాధారణంగా ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో సినిమా షోను మొదటి రోజు... మొదటి షోను చూడటానికి ఇష్టపడుతుంటారు. సినిమా హాల్లో పేపర్ కటింగ్స్, అల్లరి చేయడం, విజిల్స్ వేయడం చేస్తుంటారు. మరికొందరు పూలు చల్లుతూ.. ఫ్లెక్సీలపై పాలను పోసి తమ అభిమానాన్ని చాటుకుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే, కొందరు అభిమానులు మాత్రం అత్యుత్సాహాం ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన న్యూఢిల్లీలోని స్థానిక సినిమా థియేటర్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ కొత్త సినిమా.. ‘ఆంటీమ్ దిఫైనల్ ట్రూత్’ సినిమా విడుదలైంది. ఈ క్రమంలో కొందరు అభిమానులు థియేటర్లో క్రాకర్లను కాల్చారు. అంతటితో ఆగకుండా.. గట్టిగా కేకలు వేస్తూ పక్కవారికి ఇబ్బందులకు గురిచేశారు. ఈ హఠాత్పరిణామంతో.. థియేటర్కు హజరైన చాలా మంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్వీటర్ వేదికగా స్పందించారు. థియేటర్లలో ఇలాంటి పనులు చేయకూడదని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పనులతో.. మీ ప్రాణాలతోపాటు.. తోటివారి ప్రాణాలకు కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. అదే విధంగా.. ఫ్యాన్స్ క్రాకర్స్ తీసుకోని సినిమాహల్లోకి ప్రవేశించకుండా సెక్యురీటి సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కొందరు అభిమానులు ‘ఆంటీమ్ దిఫైనల్ ట్రూత్’ సినిమా ఫ్లెక్సీపై పాలాభిషేకం నిర్వహించారు. దీనిపై కూడా సల్మాన్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ‘ కొంత మందికి తాగటానికి సరైన మంచి నీరు దొరకడం లేదు.. మీరు పాలను ఈ విధంగా వృథా చేయకూడదని’ పేర్కొన్నారు. ఈ విధంగా.. పాలను వృథా చేసే బదులు అవసరమైన పిల్లలకు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు
-
ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి బాణాసంచా ఎఫెక్ట్ దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)పై స్పష్టంగా కనిపించింది. పండుగ ముందు రోజులతో పోలిస్తే పండుగ తర్వాత నమోదైన వాయు నాణ్యత ఐదేళ్లలోనే అత్యల్పం కావడం గమనార్హం. దీనికి చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాలుష్యం తోడయింది. దీంతో, ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్ల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ దీపావళి రోజున ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు కళ్లు, గొంతు మంట వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. చదవండి: (పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత) తక్కువ ఉష్ణోగ్రతలు, కాలుష్య కారకాలు పేరుకుపోవడం, ఆకాశం మేఘావృతమైన కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జన్పథ్లో వాయు నాణ్యత ప్రమాదకర పీఎం 2.5 స్థాయి 655.07కి చేరుకుంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలో పీఎం 2.5 స్థాయి 999గా నమోదైంది. ప్రమాణాల ప్రకారం, పీఎం 2.5 స్థాయి 380 కంటే ఎక్కువగా ఉంటే దానిని తీవ్రమైందిగా పరిగణిస్తారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో సగటున వాయు నాణ్యత ఢిల్లీలో 462, ఫరీదాబాద్లో 469, ఘజియాబాద్లో 470, గురుగ్రామ్లో 472, నోయిడాలో 475, గ్రేటర్ నోయిడాలో 464కి చేరుకుంది. కోవిడ్ బాధితులపై తీవ్ర ప్రభావం దీపావళి తర్వాత రోజున 2016లో 445, 2017లో 403, 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462 వాయుకాలుష్య తీవ్రత నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారిపై కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరు మార్నింగ్ వాక్ మానేయాలని, శ్వాస సంబంధ, హృద్రోగ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చదవండి: (కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ) -
టపాసులు కాలుస్తూ గాయాలపాలు.. సరోజినీ దేవి ఆస్పత్రికి జనం క్యూ
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ పూట పలు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా గాయపపడిన వారి సంఖ్య పెరుగుతోంది. గాయపడిన వారంతా హైదరాబాద్లోని సరోజనిదేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. దీపావళి రోజు బాణాసంచా కాలుస్తూ 31 మంది పిల్లలు, పెద్దలు గాయపడ్డారు. స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించగా. తీవ్రంగా గాయపడిన నలుగురికి సరోజినిదేవి ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికి ఆపరేషన్ అవసరమైంది. చదవండి: భీతావహం.. పేలిన దీపావళి బాంబులు చంద్రాయణగుట్టకు చెందిన రాజ్ తివారి అనేవ్యక్తి ఏకంగా కన్ను కోల్పోయాడు. దీంతో దీపావళి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని లేదా అవిటివారు కావాలిస వస్తుందని సరోజినీదేవి వైద్యురాలు కవిత హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఛత్రీనాక పేలుడు ఘటన: ట్విస్ట్ ఏంటంటే..
హైదరాబాద్: ఛత్రీనాక పీఎస్ పరిధి కందికల్ గేట్ వద్ద గురువారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బెంగాల్కు చెందిన విష్ణు,జగన్నాథ్లుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. మృతులు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులని పోలీసులు తెలిపారు. అయితే, ఈ పేలుడులో కొత్తకోణం బయటపడింది. యువకులు గుంతలో టపాసులతోపాటు కెమికల్స్ను పెట్టి కాల్చడం వల్ల పేలుడు సంభవించిందని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. విగ్రహ తయారీ పరిశ్రమలో బాణాసంచా కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని ఏసీపీ మజీద్ తెలిపారు. -
వరుణుడి రాకతో దుకాణాలు వెల వెల
-
Diwali: ఈ టపాసులు తినెయ్యొచ్చు
మండపేట: చిచ్చుబుడ్లు.. వెన్నముద్దలు.. లక్ష్మీ ఔట్లు.. భూచక్రాలు.. రాకెట్లు.. ప్రమిదలు.. ఇవన్నీ నిజమైన దీపావళి బాణ సంచా అనుకుంటే పొరబాటే. బాణ సంచాను తలపించే మధురమైన చాక్లెట్లు. వినూత్న రీతిలో బోకేల తయారీ ద్వారా శుభాకాంక్షలు తెలపడంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు మండపేటకు చెందిన రోటరీక్లబ్ సభ్యురాలు మల్లిడి విజయలక్ష్మి. (చదవండి: దీపావళి రోజున ఇలా చేయండి) ఇంటి వద్దనే ప్లెయిన్, ఎనర్జీటిక్ బార్స్, లాలీపప్స్ తదితర చాక్లెట్లతో అందమైన ఆకృతుల్లో బొకేలు తయారుచేస్తూ పలువురికి ఉపాధి చూపిస్తున్నారు. పూలబొకేలు రెండు మూడు రోజుల్లో వాడిపోతే ఈ చాక్లెట్ బొకేలు రెండుమూడు వారాలు నిల్వ ఉండటంతో పాటు ఆత్మీయులకు మాధుర్యాన్ని అందిస్తూ వారి ఆదరణ చూర గొంటున్నాయి. భర్త శ్రీనివాసరెడ్డి రోటరీ గవర్నర్ కాగా వీటిపై వచ్చే ఆదాయంతో ఆయనతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు విజయలక్ష్మి. (చదవండి: తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం జగన్) -
ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టపాకాయలు కాల్చాక వివిధ రూపాల్లో వెలువడే కాలుష్యాలు కనీసం మూడురోజుల పాటు ప్రభావం చూపే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వాహనాలు, పరిశ్రమల ద్వారా, పంటలు కాల్చాక, ఇతర రూపాల్లో వెలువడే కాలుష్యాలు వివిధ అనారోగ్య సమస్యలున్న వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. చలికాలంలో పొగ, ఇతర కాలుష్యాలు కలగలిసి స్మాగ్ (పొగ, మంచు కలగలిసినది )గా మారడంతో ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లోని ప్రజలకు శ్వాసకోశ, ఇతర తీవ్ర సమస్యలు ఎదురౌతున్నాయి. ఇక దీపావళి పండుగ సందర్భంగా కాల్చే టపాసులతో విపరీతంగా వెలువడే కాలుష్యం మూడురోజుల పాటు వాతావరణంలోనే అది కూడా భూ ఉపరితలానికి కొంత ఎత్తులోనే ఉంటుంది. అప్పటికే ఉన్న కాలుష్యానికి ఇది తోడవడంతో తీవ్రత మరింత పెరగడంతో పాటు మరింత ఎక్కువ మందిపై ప్రభావం చూపేందుకు అవకాశం ఏర్పడుతోంది. మంచు వాతావరణంలో గాలి నెమ్మదించడం, టపాకాయలు పేల్చాక వెలువడే పొగలతోనూ గాలి స్తంభించడం, కాలుష్యకారక ధూళి కణాలు గాల్లోనే ఉండిపోవడం ఇందుకు కారణం అవుతున్నాయి. కాలుష్యంతో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ వీవీ రమణ ప్రసాద్ (కిమ్స్ ఆస్పత్రి), డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల (యశోద ఆస్పత్రి) సాక్షితో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే... ఇళ్లకే పరిమితం కావాలి దీపావళి టపాసులతో పెరిగే వాయుకాలుష్య తీవ్రత అనేక సమస్యలకు కారణమౌతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, జబ్బులున్నవారు ఇళ్లకే పరిమితం కావాలి. ఆస్తమా, ఐఎల్డీ, బ్రాంకైటిస్ రోగులు టపాకాయలు పేల్చొద్దు. చేతులను తరచుగా శానిటైజ్ చేయడం కంటే సబ్బు నీటితో కడగాలి. శానిటైజర్లలో అల్కహాలు ఉంటుంది కాబట్టి టపాకాయలకు దగ్గరగా ఉంచకండి. షేక్హ్యాండ్ అలవాటుకు దూరంగా ఉంటే మంచిది. నైలాన్, సింథటిక్ దుస్తులు వేసుకోవద్దు. సాధారణ టపాసులు కాకుండా గ్రీన్ క్రాకర్లు కాల్చాలి. ఈ కాలుష్య ప్రభావంతో దగ్గు, ఆయాసం, ఛాతీ బరువెక్కడం ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమౌతాయి. న్యూమోనియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. – డాక్టర్ హరికిషన్ -
వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి..
కామారెడ్డి (నిజామాబాద్): తాడ్వాయి మండలం ఎర్రపహాడ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, టపాసులు కొనడానికి కారులో వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కారులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వారిలో.. జగన్ (45), ఆనంద్ (28), శ్రీనివాస్ (52), శశాంక్ ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నట్టు గుర్తించారు. కామారెడ్డిలో టపాసులు కొనుగోలు చేసి.. ఎల్లారెడ్డివైపు వెళ్తుండగా కారు ప్రమాదం సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏమరపాటు వద్దు.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది
దీపావళి పండుగ కోసం దేశమంతా అందంగా ముస్తాబవుతోంది. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వెలుగులు నింపే దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చే సమయంలో అపశ్రుతి చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ‘డ్రైనేజీ సమీపంలో టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి’ అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!! ఆ వీడియో ప్రకారం.. కొందరు చిన్నారులు ఓ డ్రైనేజీ కవర్పై సరదాగా టపాసుని వెలిగించారు. ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఆ డ్రైనేజీ కవర్ రంధ్రాల్లోంచి భారీ ఎత్తున మంటలు వచ్చాయి. చిన్నారులు అప్రమత్తమై ఆ కవర్ నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈప్రమాదంలో కొందరు చిన్నారుల తల వెంట్రుకలు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే, డ్రైనేజీ లైన్ల నుంచి విషపూరిత, పేలుడు స్వభావం గల వాయువులు వెలువడుతుంటాయి. ఆ క్రమంలోనే పిల్లలు క్రాకర్స్ వెలిగించడంతో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పండగ వేళ పిల్లలు క్రాకర్స్ కాల్చే విషయంలో తల్లిదండ్రులు మరిన్ని జాగ్తత్తలు తీసుకుంటే మంచిది. ఏమరపాటుగా ఉండొద్దు! చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి. pic.twitter.com/sgfwMuwLKJ — Sushil Rao (@sushilrTOI) November 3, 2021 -
ఆ దీపావళి రోజులు
దీపావళి పిల్లల పండుగ. కాకరపువ్వొత్తులు కలర్ పెన్సిళ్లు, చిచ్చుబుడ్లు పాము బిళ్లలు, తుపాకీ రీళ్లు... ఇప్పటి సంగతి ఏమోకాని కొన్ని తరాల బాల్యం దీపావళితో గడిచింది. ఒక్క బొమ్మ తుపాకీ కోసం అలకలు.. హర్తాళ్లు.. దొంగ– పోలీస్ ఆటలు.. ఆ రోజులే వేరు. ఒక వారం ముందు నుంచే వీధిలో ఠపా, ఠుపీ సౌండ్లు మొదలవుతాయి. ఆ వీధి చివరి ఇంట్లో పిల్లాడు శెట్టిగారి అంగట్లో దొరికే పది పైసల తుపాకీ బిళ్లలు కొని, ఆ బిళ్లల డబ్బీ జాగ్రత్తగా దాచుకుని, అందులో ఒకో బిళ్లను గచ్చు నేల మీద పెట్టి, గుండ్రాయితో ఠాప్మని పేల్చుతుంటాడు. డబ్బీ అయిపోతే మళ్లీ ఇంకో డబ్బీకి అమ్మ పదిపైసలు గ్యారంటీగా ఇస్తుంది. ఆ పది పైసలూ లేనివాడు ఎలాగో చేసి చిన్న ఇనుపగుంట, గూటం సంపాదిస్తాడు. ఎక్కడ దొరుకుతుందో దొరుకుతుంది గంధకం పొడి. ఆ పొడి సీసాను దగ్గర పెట్టుకుని, కొంచెం గంధకం పొడి ఇనుప గుంటలో పెట్టి, గూటం బిగించి, ఆ గూటానికి ఉండే పాలజాటీని పట్టుకుని గట్టిగా గోడకు కొడితే ఠాప్ అని సౌండ్ వస్తుంది. ఇక గంధకం పొడి అయిపోయేంత కాలం వాడి దీపావళికి దిగుల్లేదు. పోయిన దీపావళికి కొన్న గన్ను కనిపించదు. లేదా పాడై ఉంటుంది. కొత్త గన్ కొన్న పిలకాయలు వాటిని పట్టుకుని దొంగ పోలీస్ ఆట ఆడుతుంటారు. మనకూ కావాలనిపిస్తుంది. బజారుకు వెళ్లి టపాకాయల అంగడిలో అడిగితే రూపాయిన్నరది ఒకటి, మూడు రూపాయలది, ఐదు రూపాయలది చూపిస్తాడు. నల్లటి రంగు వేసిన రేకు తుపాకీలు, స్టీలు తుపాకీలు... కొనాలంటే డబ్బులెక్కడివి. వచ్చిన అమ్మను అడిగితే వీపు మీద ఒక టపాకాయల పేలుతుంది. నాన్నను అడిగితే ‘కొందాం లేరా.. దీపావళి చాలా రోజులు ఉందిగా’ అంటాడు. ఈలోపు అన్నయ్య వాళ్లను వీళ్లను అడిగి, బంధువుల దగ్గర చిల్లర సంపాదించి ఒకటి సొంతానికి కొనుక్కుంటాడు. వాడు వాడిది మనకు చచ్చినా ఇవ్వడు. ఇంకేంటి? అలక... నిరాహార దీక్ష... హర్తాళ్.. రాస్తారోకో... చివరకు నిరసన దీక్షకు ఇంట్లో ఉన్న నానమ్మ ముక్కు చీది ‘పిల్లాడు ఏమడిగాడని’ అని ఏడుపు. ఆఖరకు తుపాకీ శాంక్షన్ అవుతుంది. ఇంకేంటి. నానమ్మ తన ముక్కుపొడుం డబ్బులు త్యాగం చేసి రీల్స్ ప్యాకెట్ కొనిస్తుంది. ఒక ప్యాకెట్లో పది రీల్స్ డబ్బీలు ఉంటాయి. ఒక్కో డబ్బీలో ఒక్కో రీలు. తుపాకీ విప్పి రీలు చుట్టి మళ్లీ కచ్చితంగా బిగించడం ఒక ఆర్టు. ఆ పని చేశాక ట్రిగర్ నొక్కిన ప్రతిసారీ రీల్ రన్ అవుతూ ఠాప్ ఠాప్ సౌండ్ వస్తుంటే సూపర్స్టార్ కృష్ణ కూడా నిలువలేడు ఆ స్టయిల్కి. డబ్బులు పెద్దగా ఉండని రోజులు అవి. పిల్లలు తమ కోర్కెలను కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టే రోజులు. ఒక తండ్రి ఒక కొడుక్కి నేల టపాకాయల సంచి కొనిస్తాడు. పది రూపాయలకు చాలా నేల టపాకాయలు ఉంటాయి దానిలో చిన్నవి. ఆ పిల్లవాడికి బుద్ధి పుట్టినప్పుడల్లా ఒక నేల టపాకాయ తీసి నేలన గట్టిగా బాదితే ఢమ్మని సౌండు. మరో బీద తండ్రి తన కొడుక్కి తాటాకు టపాకాయలు కొనిస్తాడు. తాటాకులో మందు కూర్చి వొత్తి బయటకు వచ్చేలా ఉండే ఆ చీప్ టపాకాయలు సౌండ్లో మేటి. క్యాండిల్ వెలిగించి ఒక్కో తాటాకు టపాకాయ అంటించి విసురుతూ ఉంటే ఠపాఠపా అంటాయి. పీర్ ప్రెజర్ ఉండేది ఆ రోజుల్లో. మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అనంటే మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అని. పిల్లలు తమ దగ్గర ఉన్న అన్ని డబ్బాల కాకర పువ్వొత్తులను లెక్క వేసి పక్క కుర్రాడితో పోల్చుకునేవారు. చిచ్చుబుడ్లు ఫ్యాషన్వి కొనేవాళ్లు డబ్బున్నవాళ్లు. మట్టి చిచ్చుబుడ్లు కొనేవాళ్లు మధ్యతరగతి వారు. ఆ మట్టి చిచ్చుబుడ్లు మూడ్ బాగుంటే బుజ్మని వెలిగేవి. లేకుంటే తుస్మనేవి. విష్ణుచక్రం, భూచక్రం అందరూ కొనలేరు. లక్ష్మీ ఔట్లు క్వాలిటీ ఔట్లు. ఆరు ఔట్లు ఒక ప్యాకెట్. కొంటే చెవులు చిల్లులు పడేలా పేలడం గ్యారంటీ. పురికొస బాంబులు కూడా మానం గల్లవి. తుస్మనడం వాటి చరిత్రలో లేవు. ఇక పిల్లిపిసర సరం ప్రమాద రహితమైనది. 500 వాలా, 1000 వాలా కొనేది శ్రీమంతులు. వాళ్లు అందరూ టపాకాయలు కాల్చేక ఏ అర్ధరాత్రో 1000 వాలా వెలిగించి పది నిమిషాలు ఢమఢమలాడించి తమ దర్జా చూపించుకుంటారు. పిల్లలు దీపావళికి కొత్తబట్టలు అడగరు. కాని టపాకాయలు మాత్రం తప్పక అడుగుతారు. పాముబిళ్లలు, వెన్నముద్దలు, మెగ్నీషియం రిబ్బన్లు, కలర్ అగ్గిపెట్టెలు... ఇవి ఉంటే పెన్నిధి ఉన్నట్టే. ఇంతా చేసి దీపావళి ముందు రోజు నుంచి ముసురు పట్టుకుంటే వాళ్లు బెంగ పడతారు. చీటికి మాటికి ఆకాశం వైపు చూస్తుంటారు. అయ్యో.. వీటిని కాల్చడం ఎలా అనుకుంటారు. దీపావళి రోజు వాన రావడం ఆనవాయితీ. పిల్లలతో ఆడుకోవడానికే వచ్చి కాసేపు అల్లరి చేసి వెళ్లేది అది. దీపావళికి చుట్టుపక్కల పిల్లలను గమనించుకోవడం పెద్దలు తప్పక చేసేవారు. కొన్ని టపాకాయల్ని కొనుక్కోలేని పిల్లలకు ఇచ్చేవారు. తమ పిల్లల చేత ఇప్పించేవారు. తమ ఇంటి ముంగిట్లో టపాకాయలు కాలుస్తున్నప్పుడు పక్కింటి పిల్లలు తెల్లముఖం వేసుకు చూస్తుంటే పిలిచి వారి చేత కూడా కాల్పించేవారు. ప్రేమ, స్నేహం ఉన్నది కాస్త పంచితే పెరుగుతుంది. దీపం అంటే తాను వెలిగేది మాత్రమే కాదు.. వెలుతురు పంచేది. ఒక దీపం నుంచి వేయి దీపాలు వెలుగుతాయి. ఈ దీపావళిని ప్రేమను పెంచుతూ జరుపుకోండి. చిన్నప్పటి రోజులను పిల్లలకు చెప్పండి. పిల్లలకు సురక్షితమైన దీపావళి సరంజామా ఇచ్చి దగ్గరుండి వారి చేత కాల్పించండి. హ్యాపీ దీపావళి. -
దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!!
Safe Diwali Tips In Telugu: దేశవ్యాప్తంగా పిల్లా పాపలతో కలిసి దీపావళి సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధమవు తున్నారు. కుల మత ప్రాంత విభేదాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి. అయితే పలుదేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న తరుణంలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముంచు కొస్తున్న కాలుష్య భూతం కోరలకు చిక్కకుండా వీలైనంతవరకు క్రాకర్స్కు దూరంగా ఉండాలని కనీసం పర్యావరణ హితమైన గ్రీన్క్రాకర్స్ మాత్రమే వినియోగించాలంటున్నారు. దీంతోపాటు చిన్నపిల్లలు వృద్ధులను దృష్టిలో ఉంచుకుని భారీ శబ్దాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. పెంపుడు జంతువులకు కూడా పెద్ద పెద్ద శబ్దాలు హానికరం. మరీ ముఖ్యంగా టపాసులు అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఉత్సాహంగా దూసుకుపోతూ వుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆనందంగా దీపావళి జరుపు కోవచ్చు. ప్రమాదాలు లేని దీపావళి కోసం జాగ్రత్తలు పాటిద్దాం.. తద్వారా సర్వత్రా వెలుగు దివ్వెల పండుగ దీపావళి కాంతులు నింపుదాం. శానిటైజర్ల వినియోగంలో అప్రమత్తత దీపావళి పండుగలో కీలకమైన దీపాలు, కొవ్వొత్తులను వెలిగించే ముందు శానిటైజర్ల వాడకాన్ని మానుకోండి. ముఖ్యంగా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను వాడకండి. ఎందుకంటే శానిటైజర్లు మండించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది తీవ్రమైన అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా నీరును, పేపర్ సబ్బులు బెటర్. అలాగే దీపాలను వెలిగించే ముందు టపాసులు వెలిగించిన తరువాత చేతులు సరిగ్గా కడుక్కోవాలి. దీపావళికి తగిన దుస్తులు ఉదయం నుంచి ఎథ్నిక్ వేర్, డిజైనర్ వేర్ ఎలాంటి దుస్తులు ధరించినా పరవాలేదు కానీ, టపాసులు కాల్చే సమయంలో షిఫాన్, జార్జెట్, శాటిన్, సిల్క్ ఫ్యాబ్రిక్స్కు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా, కాటన్ సిల్క్, కాటన్ లేదా జ్యూట్ దుస్తులను ధరించడం మంచిది. ►టపాసులు కాల్చేటప్పుడు కాస్త వదులైన మందపాటి కాటన్ దుస్తులను ధరించడం, తప్పనిసరిగా కాళ్లకు చెప్పులు ధరించడం మంచిది. ►కాకరపువ్వొత్తులు, మతాబులు, పెద్ద పెద్ద బాంబులు వంటివి కాల్చేటప్పుడు చిన్న పిల్లలకు పెద్దలెవరైనా సహాయంగా ఉండటం మంచిది. ►టపాసులు, బాంబులు వంటి పేలుడు పదార్థాలను గృహసముదాయాల వద్ద కాకుండా దూరంగా ఆరుబయట ప్రదేశంలో కాల్చడం మంచిది. ►కొన్ని రకాల టపాసులను కాల్చేసిన తర్వాత ఆవి పూర్తిగా ఆరిపోయాయో లేదు తనిఖీ చేసుకోవాలి. పిల్లలు తొందరపాటుగా వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ►ఇంట్లో ఉన్న అందరూ రాకెట్లు, తారాజువ్వలు వంటివి కాల్చేటప్పుడు అవి ఇతరుల ఇళ్లలోకి చొరబడకుండా దిశ సరిగా ఉండేలా చూసుకోవాలి. ►దీపావళి టపాసులు కాల్చేటపుడు కళ్లకు రక్షణగా కళ్లజోడు ధరించడం కూడా చాలా మంచిది. ఈ జాగ్రత్తల విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా వ్యవహరిస్తే.. హ్యాపీ అండ్ సేఫ్ దివాలి సొంతమవుతుంది. కరోనా సమయంలో సంబంధిత మార్గదర్శకాలను పాటిస్తూ సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలి. ప్రతీ ఏడాది దీపావళి తరువాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పెరగడం మనం చూస్తున్నాం. దీంతో శ్వాసకోశ రుగ్మతలు, సంబంధిత బాధితులు మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందులోనూ ప్రస్తుత కోవిడ్-19 సమయంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కాలుష్యమైన గాలి చాలా ప్రమాదకరమని పల్మనాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. -
బాణాసంచాపై సంపూర్ణ నిషేధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండబోదని, గ్రీన్ క్రాకర్స్కు అనుమతి ఉంటుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాళీ పూజ, దీపావళి, క్రిస్మస్, కొత్త ఏడాది వేడుకలు ఇతరత్రా పండుగల సమయంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. గౌతమ్ రాయ్, సుదీప్త భౌమ్నిక్ తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. బాణాసంచా డీలర్ల తరఫు న్యాయవాది సిద్ధార్ధ భట్నాగర్ వాదనలు వినిపిస్తూ.. గ్రీన్ కాకర్స్కు అనుమతిస్తూ 2020లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బాణాసంచాపై పూర్తి నిషేధం లేదని, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి హానికలిగించే వాటినే నిషేధిస్తున్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ధర్మాసనానికి వివరించారు. గ్రీన్ కాకర్స్పై నిషేధం లేదని, సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలు అమలు చేస్తున్నామని భట్నాగర్ తెలిపారు. ఇటీవలే నిషేధిత బేరియంతో బాణాసంచా తయారుచేస్తున్న పలు ఉత్పత్తి సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. జులై, అక్టోబరుల్లో వేర్వేరు పిటిషన్ల విచారణ సందర్భంగా బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండదని, గ్రీన్కాకర్స్ను అనుమతిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెల్సిందే. -
హరిత టపాసులతో కాలుష్యానికి చెక్
సాక్షి, అమరావతి: దీపావళి సందర్భంగా పెద్దఎత్తున వెలువడే వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి హరిత టపాసులు చక్కని ప్రత్యామ్నాయంగా మారాయి. తక్కువ కాలుష్యం వచ్చే హరిత టపాసులనే దీపావళి రోజున వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చాయి. దీపావళి సందర్భంగా వినియోగించే సాధారణ టపాసుల వల్ల విపరీతమైన కాలుష్య కారకాలు విడుదలై అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో పీల్చే గాలి అత్యంత విషపూరితంగా మారడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రాష్ట్రంలో దీపావళి రోజున వాయు కాలుష్యం సాధారణ రోజు కంటే ఐదురెట్లు ఎక్కువ ఉన్నట్లు గతంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. సాధారణంగా గాలిలో ధూళికణాలు (పీఎం 10, పీఎం 2.5) 60కి మించకూడదు. కానీ దీపావళి రోజున 300 నుంచి 400కు పైగా ఉంటున్నాయి. టపాసుల నుంచి బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు, లోహాల ధూళి వెలువడుతోంది. అలాగే శబ్దాలు సాధారణ స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటివల్ల ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయి. అందుకే హరిత టపాసులు వాడాలని కాలుష్య నియంత్రణ మండలి ప్రచారం చేస్తోంది. అన్నిచోట్ల అందుబాటు తక్కువ కాలుష్య కారకాలు విడుదల చేసేలా హరిత టపాసుల ఫార్ములాను మూడేళ్ల కిందట శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్), జాతీయ పర్యావరణ, ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరి) సంయుక్తంగా రూపొందించాయి. బాణసంచా తయారు చేసేవారికి దీని గురించి వివరించి ఈ ఫార్ములాతోనే టపాసులు తయారు చేయాలని ఈ సంస్థలు కోరాయి. అనేకమంది తయారీదారులు ఇందుకోసం ఒప్పందాలు కూడా చేసుకున్నారు.తక్కువ బూడిద, ముడిపదార్థాలను వాడి చిన్న సైజులో హరిత టపాసులను తయారు చేస్తారు. చూడ్డానికి ఇవి మామూలు టపాసుల్లానే ఉంటాయి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, బాంబులు వంటివి కూడా ఉంటాయి. ఇవి సాధారణ టపాసుల కంటె 30 నుంచి 50 శాతం తక్కువ ధూళి కణాలను విడుదల చేస్తాయి. కాలుష్యకారక వాయువులు, పొగ, శబ్దాలు కూడా తక్కువగానే విడుదలవుతాయి. సాధారణ టపాసులు విక్రయించే షాపుల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. అలాగే పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లతోపాటు ఆన్లైన్లోను ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా గ్రీన్లోగో, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి. హరిత టపాసులతో పర్యావరణ పరిరక్షణ ప్రజలందరు హరిత టపాసులను కాల్చాలి. అప్పుడు ప్రజారోగ్యానికి ఇబ్బందులు తప్పుతాయి. పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దీపాల పండుగను అందరు సురక్షితంగా జరుపుకోవడానికి హరిత టపాసులు ఉపయోగపడతాయి. – అశ్వినీకుమార్ పరిడ, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ -
టపాసుల దుకాణాలకు అనుమతి.. ఇలా అప్లై చేయండి
సాక్షి, హైదరాబాద్: దీపావళి నేపథ్యంలో టపాసులు విక్రయించే దుకాణాదారులు అనుమతి తీసుకోవాలని పోలీసు విభాగం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ పోలీసు విభాగం ప్రకటన విడుదల చేసింది. దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు ఈ నెల 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు సమర్పించాల్సిన వెబ్సైట్లు: www.tspolice.gov.in https://eservices.tspolice.gov.in/ అప్లోడ్ చేయాల్సిన పత్రాలు ► డివిజినల్ ఫైర్ ఆఫీసర్ నుంచి ఎన్ఓసీ. ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేసే వాళ్లు జీహెచ్ఎంసీ నుంచి తీసుకున్న అనుమతి పత్రం. ► ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసే వాళ్లు స్థల యజమానుల నుంచి ఎన్ఓసీ. ► గతంలో దుకాణాలు ఏర్పాటు చేసి ఉంటే ఆ లైసెన్స్ ప్రతి. పక్కా భవనంలో దుకాణం ఏర్పాటు చేస్తున్నట్లైతే చుట్టు పక్కల వారి నుంచి ఎన్ఓసీ. ► దుకాణం బ్లూ ప్రింట్ కాపీ గన్ఫౌండ్రీ ఎస్బీఐలో చెల్లించిన రూ.600 లైసెన్స్ రుసుము ఒరిజినల్ రసీదు. ► ఈ పత్రాలు లేకుండా వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తారు. -
Rajasthan: బాణాసంచాపై సీఎం అశోక్ గెహ్లాత్ కీలక నిర్ణయం
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాణాసంచాను నిషేదిస్తూ గురువారం ఉత్తర్వులను జారీచేశారు. అక్టోబరు 1 నుంచి 2022 జనవరి31 వరకు రాజస్థాన్లో బాణాసంచా అమ్మడం, కాల్చడం,నిల్వచేయడాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు తెలిపారు. బాణా నుంచి వెలువడే కాలుష్యం వలన ఊపిరితిత్తుల పనితీరు తీవ్ర ప్రభావానికి గురౌతుందని తెలిపారు. కరోనాతో ఇప్పటికే ప్రజల రోగనిరోధక శక్తి తగ్గిందని అన్నారు. అందుకే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశోక్ గెహ్లత్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2022 జవవరి 1 వరకు ఢిల్లీలో బాణాసంచాను నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. చదవండి: బాణాసంచాలో విషపూరిత రసాయనాలు! -
బాణాసంచాలో విషపూరిత రసాయనాలు!
న్యూఢిల్లీ: బాణాసంచా తయారీలో విషపూరిత రసాయన పదార్ధాలు వాడడం చాలా ప్రమాదకరమని సీబీఐ నివేదిక వెల్లడించిందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. బాణాసంచా తయారీలో బేరియం వాడకం, బాణాసంచాపై జరిపే ముద్రణ(లేబిలింగ్)లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. హిందుస్తాన్ ఫైర్వర్క్స్, స్టాండర్డ్ ఫైర్వర్క్స్ సంస్థలు పెద్ద స్థాయిలో బేరియంను కొనుగోలు చేసినట్లు తెలిసిందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఉత్పత్తిదారులకు మరో అవకాశం ఇవ్వదలిచామని, సీబీఐ నివేదికను వారికి అందించాలని కోర్టు సూచించింది. మనదేశంలో ఎక్కడోఒకచోట ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటుందని, ఈ కారణంతో బాణాసంచాపై విచారణ నిలిపివేయలేమని, ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిశీలించాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
ఢిల్లీలో బాణాసంచాకు నో ఛాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాను నిషేధించాలని నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని బాణాసంచా వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గత మూడు సంవత్సరాల మాదిరిగానే, ఈ ఏడాది సైతం దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకం, నిల్వ చేయడం, కాల్చడంపై నిషేధం కొనసాగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం వ్యాపారులు బాణాసంచాను నిల్వ చేసిన తర్వాత కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పూర్తి నిషేధం ఆలస్యంగా విధించామని, ఇది వ్యాపారులకు నష్టాన్ని కలిగించిందని కేజ్రీవాల్ తన ట్వీట్లో వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఈసారి ముందుగానే ప్రకటించినందున వ్యాపారులందరూ ఎలాంటి బాణాసంచాను నిల్వ చేయరాదని ఆయన కోరారు. రూ.1,500 కోట్ల బాణాసంచా వ్యాపారం మరోవైపు దీపావళి రోజున దేశ రాజధానిలో సుమారు రూ.1,500 కోట్లకు పైగా బాణాసంచా వ్యాపారానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దెబ్బ తగిలినటైంది. ఢిల్లీలో 150 కి పైగా హోల్సేల్ బాణాసంచా విక్రేతలు ఉన్నారు. వీరేగాక దీపావళికి ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఢిల్లీలో బాణాసంచా విక్రేతలు తాత్కాలిక ప్రాతిపదికన వ్యాపారం చేస్తారు. -
టపాసులతో హత్యాయత్నం.. ఏడ్చేసిన మంత్రి
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు హాట్హాట్గా మారాయి. ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచార సమయంలో తమ ప్రత్యర్థులు తనను చంపేసేందుకు కుట్ర పన్నారని ఓ మంత్రి ఏడ్చేశారు. తనను ఒంటిరిని చేసి పటాకులు పేల్చి చంపేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఐటీ శాఖ మంత్రి కదంపూర్ రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవిల్పట్టిలో ఆదివారం పర్యటించారు. ప్రచారం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీ వారు కూడా ప్రచారానికి వచ్చారు. ఈ సమయంలో వివాదం ఎందుకు అని చడీచప్పుడు లేకుండా వెళ్తుంటే పటాకులు పెద్ద ఎత్తున పేల్చి వాటిని తన కాన్వాయ్పై వదిలారని మంత్రి రాజు ఆరోపించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ (ఏఎంఎంకే) పార్టీ నాయకులు తమ కార్లతో అడ్డగించి అనంతరం 5 వేల పటాకుల లడీ పేల్చారని చెప్పారు. మంటలు తనకు సమీపంలో వచ్చాయని వాపోయారు. కొద్దిలో నా ప్రాణం పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అయితే కోవైల్పట్టి నియోజకవర్గంలో శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏఎంఎంకే పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రిపై దాడి చేశారని ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకేదశలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి. -
బుమ్రా పెళ్లి వేడుకల ఫోటోలు.. కొత్త తలనొప్పులు
ముంబై: కొద్దిరోజుల కిందటే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఊహించని తలనొప్పులు వచ్చి పడ్డాయి. తన పెళ్లి వేడుకల్లో తీసుకున్న ఫోటోల్లో బాణసంచా కాల్చడం కనిపించడంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో దీపావళి రోజున టపాసులు కాల్చొద్దని ఆయన, తన అభిమానులను కోరుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీటే ఆయన తలనొప్పికి కారణంగా మారింది. తన వివాహ వేడుకకు సంబంధించిన రెండు ఫోటోలను శుక్రవారం ఆయన ట్విటర్లో షేర్ చేయడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'టపాసులు కాల్చొద్దని ఇతరులకు నీతులు చెప్పడమేనా.. మీరు స్వయంగా ఏమైనా పాటించేదుందా' అంటూ కొందరు, 'ఆచరణ సాధ్యంకాని ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని' మరికొందరు కామెంట్లు చేశారు. గతంలో ఆయన చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు రకరకాల పంచ్లు వేస్తున్నారు. కాగా, బుమ్రా ఈనెల 15న క్రీడా ఛానల్ వ్యాఖ్యాత సంజన గణేశన్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Diwali celebration at home! 🎆 Wishing everyone a very Happy and a prosperous Diwali!💥🎆💥#saynotocrackers pic.twitter.com/koCbYkLJ4I — Jasprit Bumrah (@Jaspritbumrah93) October 19, 2017 The last few days have been nothing short of absolutely magical! We are so grateful for all the love & wishes we’ve received. Thank you. pic.twitter.com/dhWH918Ytu — Jasprit Bumrah (@Jaspritbumrah93) March 19, 2021 -
కరీంనగర్లో తీగ... ఫలక్నుమాలో డొంక
చంద్రాయణగుట్ట: దీపావళి టపాసులు తయారు చేయడానికి వినియోగించి గన్పౌడర్తో తక్కువ సామర్థ్యం కలిగిన డిటొనేటర్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. కరీంనగర్లో పట్టుబడిన ఇద్దరి విచారణలో వీటి మూలాలు ఫలక్నుమాలో ఉన్నట్లు తేలాయి. సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈది బజార్కు చెందిన మహ్మద్ జైనుల్లా హబీబ్ అలియాస్ షబ్బీర్కు గతంలో గన్పౌడర్ తయారీకి సంబంధించి లైసెన్స్ ఉండేది. బొగ్గు, అమ్మోనియం నైట్రేట్, సోడియం సల్ఫేట్ తదితరాలను కలిపి దీనిని తయారు చేసే అతగాడు టపాసుల తయారీదారులకు విక్రయించేవాడు. రెయిన్బజార్ కేంద్రంగా ఈ వ్యాపారం చేయడానికి కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ జారీ చేసిన దీని కాల పరిమితి 2018లో ముగిసింది. ఆ తర్వాత దాన్ని షబ్బీర్ రెన్యువల్ చేయించుకోలేదు. అయితే అప్పటికే అతడి వద్ద కొంత ముడిసరుకు మిగిలిపోయింది. ఫాతీమానగర్లో బొగ్గు విక్రయానికి లైసెన్స్ కలిగిన హమీద్ ఖాన్తో కలిసి ఆ ప్రాంతంలోనే దీన్ని అక్రమంగా తయారు చేయడం మొదలెట్టాడు. నిర్మాణ రంగంలో అక్రమ పేలుళ్ల కోసం డిటొనేటర్లకు భారీ డిమాండ్ ఉందని తెలుసుకున్న షబ్బీర్ గన్పౌడర్ వినియోగించి తక్కువ సామర్థ్యం కలిగిన డిటోనేటర్లను తయారు చేస్తున్నాడు. వివిధ జిల్లాలకు పాలిష్ పౌడర్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతడి వద్ద వీటిని ఖరీదు చేస్తున్న వారిలో కరీంనగర్కు చెందిన సతీష్, విష్ణువర్థన్రెడ్డి సైతం ఉన్నారు. గురువారం ఉదయం వీరిద్దరినీ పట్టుకున్న అక్కడి పోలీసులు వారి నుంచి భారీ మొత్తంలో డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తమకు వీటిని హైదరాబాద్ నుంచి షబ్బీర్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్్కఫోర్స్ పోలీసులు ఫాతీమానగర్లోని స్థావరంపై దాడి చేసి షబ్బీర్తో పాటు హమీద్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు టన్ను గన్పౌడర్ స్వాధీనం చేసుకున్నారు -
హమ్మయ్య.. ఊపిరాడింది!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజన్లకు ఇది శుభవార్త. దీపావళికి కాల్చిన బాణసంచాతో వెలువడే కాలుష్యం గతేడాది దీపావళితో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈసారి మహానగరవాసుల్లో పర్యావరణ స్పృహ పెరగడం, లాక్డౌన్, కోవిడ్ కష్టాల నేపథ్యంలో చేతిలో నగదు నిల్వలు లేక బాణసంచా కొనుగోళ్లు 40 శాతం మేర తగ్గాయి. దీంతో కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రధానంగా వాయుకాలుష్యంలోని సూక్ష్మ, స్థూల ధూళికణాల కాలుష్యం గతేడాది కంటే తగ్గుముఖం పట్టగా..సల్ఫర్డయాక్సైడ్ కాలుష్యం స్వల్పంగా పెరగడం గమనార్హం. ఇక నైట్రోజన్ ఆక్సైడ్ల కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు పీసీబీ తాజానివేదికలో వెల్లడైంది. శబ్దకాలుష్యం సైతం గతేడాది కంటే స్వల్పంగా తక్కువ నమోదుకావడంతో సిటీజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతేడాది దీపావళి, ప్రస్తుత దీపావళి రోజున నగరంలో పలు ప్రాంతాల్లో నమోదైన శబ్ద, వాయు కాలుష్యం డేటాను సోమవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసింది. చదవండి: ఎట్టకేలకు తల్లి చెంతకు.. తగ్గిన వాయు కాలుష్యం.. గ్రేటర్ పరిధిలో గతేడాది దీపావళి పర్వదినంతో పోలిస్తే ఈ సారి వాయుకాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఉదాహరణకు సూక్ష్మ ధూళికణాల మోతాదు గతేడాది పండగరోజున ఘనపు మీటరుగాలిలో 72 మైక్రోగ్రాములు నమోదుకాగా..ఈ సారి పర్వదినం రోజున కేవలం 64 మైక్రోగ్రాములు మాత్రమే నమోదైంది. ఇక స్థూల ధూళికణాల మోతాదు గతేడాది దీపావళి రోజున 163.4 మైక్రోగ్రాములు నమోదుకాగా..ఈ సారి కేవలం 128 మైక్రోగ్రాములు మాత్రమే నమోదైంది. కాగా ఈ సారి సల్ఫర్డయాక్సైడ్ కాలుష్య కారకం మోతాదు స్వల్పంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది. చదవండి: ముంబైలో తగ్గిన దీపావళి సప్పుడు స్వల్పంగా తగ్గిన శబ్ద కాలుష్యం.. నగరంలో పలు పారిశ్రామిక, వాణిజ్య, నివాస, సున్నిత ప్రాంతాల్లో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేసింది. గతేడాది నివాస ప్రాంతాల్లో పగలు 69 డెసిబుల్స్..రాత్రివేళ 64 డెసిబుల్స్ కాలుష్యం నమోదుకాగా..ఈ సారి(2020 దీపావళి) పగలు 59 డెసిబుల్స్..రాత్రి 63 డెసిబుల్స్ మేర శబ్దకాలుష్యం నమోదైనట్లు పీసీబీ తాజా నివేదిక తెలిపింది. కాలుష్యం తగ్గడానికి కారణాలివే.. ♦ సిటీజన్లలో పర్యావరణ స్పృహ పెరగడం ♦ కోవిడ్ రోగులు, కోవిడ్ నుంచి ఇటీవలే కోలుకున్నవారు, శ్వాసకోశ సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు స్వేచ్ఛగా శ్వాసించేందుకు అసౌకర్యం కలుగుతుందన్న భావన. ♦ కోవిడ్, లాక్డౌన్ కష్టాల నేపథ్యంలో చేతిలో నగదు నిల్వలు లేకపోవడం. ♦ క్రాకర్స్పై నిషేధం విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు నిషేధం ఉత్తర్వులు జారీచేయడంతో వినియోగదారులు అయోమయానికి గురవడం. -
ఢిల్లీకి కాలుష్యం కాటు
న్యూఢిల్లీ: బాణసంచాపై నిషేధం ఉన్నా ప్రజలు పట్టించుకోలేదు. కాలుష్యం తీవ్రతకు కరోనా మళ్లీ విజృంభిస్తుందని చెప్పినా వినిపించుకోలేదు. దీపావళి పర్వదినాన అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా టపాసుల మోత మోగుతూనే ఉంది. ఫలితంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలిలో అత్యంత సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 కొన్ని ప్రాంతాల్లో 500 దాటి పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల్లో 32% పెరిగిన కాలుష్యం కాలుష్య నియంత్రణ మండలి అంచనాల ప్రకారం పీఎం 2.5 స్థాయి శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో 32 శాతం పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో గాలి నాణ్యతా సూచిలో పీఎం 2.5 స్థాయి 490 వరకు వెళ్లింది. 490 అంటే ఆ గాలిలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నట్టు లెక్క. ఆ సమయంలో పీల్చిన గాలితో ఆస్తమా వంటి వ్యాధులు తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ కాలుష్యంతో కరోనా వైరస్ కూడా విజృంభిస్తోంది. ఢిల్లీలో కాలుష్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం ఉదయం 9 గంటల వేళ పీఎం 2.5 ఏకంగా 545కి చేరుకుంది. ఇలా ఉండగా, ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమ్రంతి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. -
‘గ్రీన్ క్రాకర్స్’కు ఓకే
సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి వేళ రాష్ట్రంలో బాణ సంచా డీలర్లు, విక్రేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి, వాయు కాలు ష్యం దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా టపాసుల విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును సర్వో న్నత న్యాయస్థానం శుక్రవారం స్వల్పంగా సవ రించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా గాలి నాణ్యత సూచీల ప్రకారం రాష్ట్రంలో గ్రీన్ క్రాకర్స్ (తక్కువ కాలుష్యంతో ఉండేవి) విక్రయాలు, వినియోగానికి ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సమయాన్ని నిర్దేశించకపోతే దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి ప్రత్యేక తేదీల్లో గాలి నాణ్యత సాధారణంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను తెలంగాణలోనూ అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ తెలంగాణ ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ (టీఎఫ్డబ్ల్యూడీఏ) దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో మా జీవన హక్కుకు విఘాతం... ఈ పిటిషన్పై తెలంగాణ ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. బాణసంచా తయారీ, విక్రయం చేపట్టే వ్యక్తుల జీవన హక్కుకు హైకోర్టు తీర్పు విఘాతం కలిగించేలా ఉందని వాదించారు. అందువల్ల హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు. అయితే ప్రతివాదులు శుక్రవారం విచారణకు రాలేకపోయిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం... ప్రతివాదుల వాదన వినికుండా హైకోర్టు తీర్పుపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. ప్రతివాదులు విచారణలో పాల్గోనప్పటికీ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా హైకోర్టు ఉత్తర్వుల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ప్రతివాదులైన పి. ఇంద్రప్రకాశ్ (హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన న్యాయవాది), తెలంగాణ సీఎస్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా గతేడాది నవంబర్లో నమోదైన గాలి నాణ్యతతో పోలిస్తే ఈసారి అంతకంటే తక్కువకు పడిపోయిన అన్ని నగరాలు, పట్టణాల్లో టపాసుల వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ ఎన్జీటీ ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసింది. కాగా, గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉత్తర్వులు జారీ చేసింది. ‘గ్రీన్ క్రాకర్స్’ అంటే ? తక్కువ వాయు, ధ్వని కాలుష్యం విడుదల చేసే ముడిపదార్థాలతో తయారయ్యే టపాసులనే గ్రీన్ కాకర్స్ అంటారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసే టపాకాయల కంటే ఇవి 30–35 శాతం తక్కువగా కాలుష్యాన్ని వెదజల్లుతాయి. గ్రీన్ క్రాకర్స్లో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 కాలుష్య కణాలు తగ్గించే ప్రత్యామ్నాయ ముడి పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిని పేల్చినప్పుడు దుమ్మును సంగ్రహించేందుకు ‘వాటర్ మాలిక్యూల్స్’ వెదజల్లేలా కెమికెల్ ఫార్ములేషన్ ఉంటుంది. వీటిలో లిథియం, బేరియం, లెడ్, అర్సెనిక్ వంటి రసాయనాలు ఉండవు. సాధారణ టపాకాయల నుంచి దాదాపు 160 డెసిబుల్స్ దాకా శబ్దాలు వస్తే గ్రీన్ క్రాకర్స్ నుంచి 110–125 డెసిబుల్స్ లోపే శబ్దాలు వెలువడతాయి. ఇవి మామూలు టపాసుల ధరలతో పోలిస్తే 15–20 శాతం చవకగా తయారవుతాయి. వీటిలో సేఫ్ వాటర్ రిలీజర్ (శ్వాస్), సేఫ్ థర్మయిట్ క్రాకర్ (స్టార్), సేఫ్ మినిమల్ అల్యూమినియమ్ (సఫల్) అనే మూడురకాల గ్రీన్ క్రాకర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్–నీరి) ఆధ్వర్యంలో వీటిని అభివృద్ధి చేశారు. గ్రీన్ క్రాకర్స్ను తయారు చేసే ఉత్పత్తిదారులు ముందుగా గ్రీన్ క్రాకర్స్ ఫార్ములేషన్ను ఉపయోగించేందుకు సీఎస్ఐఆర్తో ఒప్పందంపై సంతకాలు చేయాలి. వీటిని గుర్తించేందుకు వీలుగా ఈ టపాకాయల ప్యాకెట్లపై ‘గ్రీన్ ఫైర్వర్క్స్’ లోగో, క్యూర్కోడ్స్ ఉంటాయి. -
క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీం గ్రీన్సిగ్నల్..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ గ్రీన్ క్రాకర్స్కు అనుమతినిచ్చింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో బాణసంచా వ్యాపారులకు ఊరట లభించింది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో క్రాకర్స్ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టులో శుక్రవారం లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతినిచ్చింది. -
టపాసులు అమ్మటం, కాల్చటం నిషేధం
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని తెలిపారు. టపాసుల అమ్మకాలతో పాటు కాల్చడం కూడా నిషేధమన్నారు. క్రాకర్స్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. కాగా, పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బాణసంచా కాల్చకుండా, విక్రయించ కుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదేశించింది. -
తెలంగాణలో టపాసులు బ్యాన్
-
టపాసులు బ్యాన్: హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో టపాసుల బ్యాన్పై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టపాసులు ఖచ్చితంగా నిషేధించి తీరాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. ఎవ్వరు క్రాకర్స్ అమ్మడం గాని, కొనడం గాని చేయవద్దని ఆదేశించింది. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ పెరుగుతున్న నేపథ్యంలో క్రాకర్స్ బ్యాన్ చేయాలంటూ న్యాయవాది ఇంద్రప్రకాష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. టపాసుల కారణంగానే శ్వాస కోశ ఇబ్బందులు పడుతారన్న ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. టపాసులపై బ్యాన్ విధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ప్రజలకు అవగాహన కల్పించండి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయడం ఉత్తమమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలని ఆదేశించింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని హెచ్చరించింది. ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు టపాసులను నిషేధించిన విషయాన్ని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేసింది. క్రాకర్స్ను బ్యాన్ చేయాలంటూ రాజస్తాన్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. ఇక కోల్కత్తాలో టపాసులు బ్యాన్చేయకపోతే తామే స్వయంగా రంగంలోకి దిగి నిషేదిస్తామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి ఇదివరకే పలు రాష్ట్రాలు టపాసులపై నిషేధం విధిస్తున్న విషయ తెలిసిందే. దేశ రాజధానితో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే క్రాకర్స్ బ్యాన్ చేశారు. -
వెలుగుల కేళి.. దీపావళి
సాక్షి, ఖమ్మం : భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా పండుగలు వెలుగొందుతున్నాయి. జాతి, కుల, మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు, అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాల వరుసతో వెలుగొందే గృహాంగణాలు, ఆనందంతో వెల్లువిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల కళకళలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా మోతలు ప్రతి ఇంటా కనిపిప్తాయి. ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి వస్తుంది. ముందు రోజు అశ్వయుజ బహుళ చదుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది తిథులు, నక్షత్రాల ఆధారంగా నరక చతుర్దశిని 13వ తేదీ శుక్రవారం రోజున, దీపావళిని 14వ తేదీన జరుపుకునేందుకు పండితులు నిర్ణయించారు. దీపాలంకరణ, లక్ష్మీపూజ మహిళలంతా బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసం అంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలు. శరదృతువులో వచ్చే ఈ దీపావళి మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం. ఈ రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటం ఓ విశిష్టత. దుర్వాస మహర్షి దూవేంద్రుని ఆతిథ్యాన్ని మెచ్చి ఒక హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన ఏనుగు మెడలో వేస్తాడు. ఆ హారాన్ని ఏనుగు తొక్కేస్తుంది. దీంతో దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రున్ని శపిస్తాడు. ఆ ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకుని శ్రీహరిని ప్రార్థిస్తాడు. మహావిష్ణువు గమనించి ఒక జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మి రూపంగా తలచి పూజించమని దేవేంద్రునికి సూచిస్తాడు. దీంతో తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపతిగా సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజును సకల సంపన్నులు కావటం కోసం మహాలక్ష్మి పూజలు చేస్తారు. పేలని టపాసు! గోదావరిఖని(రామగుండం): టపాసులమోత.. చిచ్చుబుడ్ల వెలుగులు.. రాకెట్ల తారాజువ్వలు.. ఈసారి ఇవ్వన్నీ కన్పించకపోవచ్చు.. కరోనా ఎఫెక్ట్.. పెరిగిపోతున్న వాయుకాలుష్యం.. వెరిసి ఈసారి దీపావళి పండుగపై ప్రభావం చూపనున్నాయి. ఏటా పండగకు వారం రోజుల ముందునుంచే టపాసుల మోత విన్పించగా ఈసారి మాత్రం ఆ చప్పుళ్లు కరువయ్యాయి. మరో రెండురోజుల్లో దీపావళి పండుగ ఉండగా టపాసుల మోతపై కరోనా ప్రభావం తప్పకుండా పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వాయుకాలుష్యాన్ని తగ్గించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో బాణాసంచా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. అసలే చలికాలం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులపై పెనుప్రభావం చూపుతున్న కరోనాతో ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు టపాసుల పొగ ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో చేతుల్లో డబ్బులు లేకపోగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈసారి టపాసుల వ్యాపారంపై ప్రభావం చూపనుంది. శబ్దకాలుష్యంతో ఆరోగ్య సమస్యలు శబ్దకాలుష్యం ఆరోగ్యంపై ప్రభావం చూపనుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాయుకాలుష్య నియంత్రణ మండలి సుంప్రీకోర్టును ఆశ్రయించగా, వాయుకాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో బాణాసంచా కాల్పివేతపై పోలీసులు ఆంక్షలు విధించారు. భారీ శబ్దాలు వచ్చే టపాసులు పూర్తిగా నిషేధించారు. శబ్దరహిత కాకర్స్మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. అమ్మకాలపై ప్రభావం.. దీపావళి సమయంలో ఒక్కో కుటుంబం రూ.ఐదు నుంచి రూ.పదివేల విలువచేసే టపాసులు కాల్చేది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సైతం రూ.వెయ్యి నుంచి రూ.2వేల విలువచేసే టపాసులు కాల్చడం సాదారణంగా జరిగేది. గతంలో ఉమ్మడి జిల్లాలో బాణాసంచా అమ్మకాలు సుమారు రూ.2కోట్ల వరకు జరిగేవి. కరోనా కారణంగా జనం పండుగలు, ఫంక్షన్లకు భారీ మొత్తంలో ఖర్చుచేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడిప్పుడే పనులు దొరకడంతో వచ్చిన సొమ్మును పొదుపుగా వాడుకోవాలనే ఉద్దేశంతో పండుగలకు ఖర్చులు తగ్గించారు. పెరిగిన ధరలు.. తగ్గిన విక్రయాలు విద్యానగర్(కరీంనగర్): కరోనా తన ప్రతాపాన్ని దీపావళి బాణాసంచాపై కూడా చూపింది. దీపావళి టపాసుల తయారీలో వేసవికాలం కీలకం కాగా ఈసారి వేసవి మొ త్తం లాక్డౌన్తో టపాసుల తయారీ పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఉత్పత్తి తగ్గి వాటి ధరలు పెరిగాయి. మూడింతలు పెరిగిన ధరలు కరోనా ప్రభావంతో గత ఏడాదితో పోలీస్తే ఈ సారి టపాసుల ధరలు మూడింతలు పెరిగాయి. లాక్డౌన్తో అన్ని రంగాలు ఢీలాపడగా, ప్రైవేట్ కంపెనీలు, పాఠశాలలు, సంస్ధలు, పరిశ్రమాల్లో పనిచేసేవారు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారికి రోజు గడవడమే కష్టంగా ఉన్న పరిస్ధితుల్లో పిల్లలు మారంచేసినా టపాసులు కొనే పరిస్ధితి లేకపోవడంతో వాటి అమ్మకాలు 75శాతం మేర తగ్గిపోయాయి. ప్రస్తుతం కాకరవత్తులు బాక్స్ రూ. 80– రూ.250 వరకు, చిచ్చుబుడ్లు బాక్స్ రూ.150– రూ.300, రాకెట్స్ బాక్స్ రూ.125–రూ.550, లక్షి్మబాంబ్స్ 5 పీసులు రూ.50– రూ.90, భూచక్రాలు బాక్స్ రూ.90–రూ.275 వరకు ధరలు ఉన్నాయి. -
టపాసులు కాల్చేందుకు 2 గంటలే
సాక్షి, అమరావతి: దీపావళి రోజున టపాసులు కాల్చే వారికి కేవలం రెండు గంటల సమయమే ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వ పధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల కోవిడ్ ప్రభావం ఎక్కువయ్యే అవకాశాలున్నాయని, దీన్ని నియంత్రించేందుకే కేవలం రెండు గంటల సమయం ఇచ్చినట్టు ఈనెల 5న నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ ఆదేశాల మేరకు రెండు గంటల సమయం ఇచ్చామని, టపాసులు అమ్మే షాపులు కూడా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించారు. షాపుల ముందు క్యూలు ఉండకుండా చూడాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్లు, పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. -
టపాసుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగంకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగులు దూరం పాటించాలని సూచించింది. దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది. (వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో మరో జన్మ) -
నవంబర్ 30 వరకు బాణాసంచాపై పూర్తి నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్ 9(సోమవారం) అర్థరాత్రి నుంచి నెలాఖరు వరకు బాణాసంచా అమ్మకం, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) పూర్తి నిషేధం విధించింది. దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి గాను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో బాణాసంచా వినియోగానికి అనుమతిస్తే.. పరిస్థితి మరింత దిగజారిపోతుందనే ఉద్దేశంతో ట్రిబ్యూనల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఉత్తర్వు నేషనల్ క్యాపిటర్ రీజియన్(ఎన్సీఆర్)లో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 2 డజనుకు పైగా జిల్లాలకు వర్తిస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా "గత ఏడాది నవంబర్లో సగటు పరిసర గాలి నాణ్యత" అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. అలానే గాలి నాణ్యత మోడరేట్గా ఉన్న నగరాలు, పట్టణాల్లో తక్కువ కాలుష్య కారకాలుగా పరిగణించబడే గ్రీన్ క్రాకర్స్ని మాత్రమే అనుమతించింది. అది కూడా పరిమిత సమయం వరకు మాత్రమే. "సంబంధిత రాష్ట్రం పేర్కొన్న విధంగా పర్వదినాల్లో బాణాసంచా కాల్చే సమయం రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయబడింది. దీపావళి, గురుపూర్లలో రాత్రి 8-10 గంటల మధ్యన, ఛత్లో ఉదయం 6-8 గంటల మధ్య.. క్రిస్మస్, న్యూ ఇయర్ రోజున రాత్రి 11.55 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతించబడినట్లు" ఉత్తర్వుల్లో పేర్కొన్నది.(చదవండి: బాణాసంచా బ్యాన్పై కర్ణాటక యూటర్న్) ఇక గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ఇతర ప్రాంతాల్లో ట్రిబ్యూనల్ క్రాకర్స్ నిషేధాన్ని ఐచ్చికం చేసింది. "కోవిడ్ -19 తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గాలి కాలుష్యానికి కారణం అయ్యే చర్యలని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి" అని ఎన్జీటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో.. గాలి నాణ్యత అధ్వన్నంగా ఉన్న తరుణంలో.. కాలుష్యాన్ని మరింత పెంచే బాణాసంచా వాడకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ని విచారించిన ఎన్జీటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ కాలంలో వాయు కాలుష్యం కారణంగా రోజుకు 15,000 కేసులు నమోదవుతాయని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖలు చేసిన హెచ్చరికలను గుర్తు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 7,745 కేసులు నమోదయ్యాయి. (అలర్ట్ : కరోనాకు కాలుష్యం తోడైతే.. ) ఏటా, ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. శీతాకాలంలో విషపూరితంగా మారుతుంది, అక్టోబర్ నుండి రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది. గత మూడు రోజులుగా, జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాలని ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ నుంచి ఢిల్లీలోని వాయు కాలుష్యం 17.5 శాతం కోవిడ్ కేసుల పెరుగుదలకిదారితీసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధం వెల్లడించింది. -
బాణాసంచా బ్యాన్పై కర్ణాటక యూటర్న్
సాక్షి, బెంగళూరు : బాణాసంచా నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. దీపావళి సందర్భంగా బాణాసంచాను కొనొద్దు, కాల్చొద్దు అంటూ ముఖ్యమంత్రి యడియూరప్ప పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాణాసంచా కాల్చకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధిస్తామని ఆయన నిన్న పేర్కొన్నారు. టపాసులు అధికంగా కాల్చడం వల్ల కాలుష్య ప్రమాణం పెరిగి కరోనా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో టపాసులను ఈ ఏడాది దీపావళికి నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ తీర్మానం వల్ల ప్రజలెవరూ టపాసులు కొనడం కానీ, అమ్మడం కానీ చేసి నష్టపోవద్దని సూచించారు. ఈ ఏడాది బాణాసంచా లేకుండానే దీపావళి పండుగ జరుపుకుందామని పిలుపునిచ్చారు. (కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం) అయితే తాజాగా బాణాసంచా నిషేధం నిర్ణయంపై యడియూరప్ప సర్కార్ పునరాలోచన చేసింది. వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శనివారం తెలిపారు. దీపావళి పండుగని పురస్కరించుకొని కర్ణాటకలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే తయారు చేసి, అమ్మాలని అన్నారు. ప్రజలు నిబంధనలకు లోబడి, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు. ఇక కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. (‘టపాసులు కాల్చం, లక్ష్మీ పూజ చేసుకుంటాం’) -
నిశ్శబ్ద దీపావళి
-
కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం
సాక్షి, బెంగళూరు : దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక కూడా చేరింది. కరోనా మహమ్మారితో పాటు వాయు కాలుష్యం కూడా వైరస్ వ్యాప్తికి కారణం నేపథ్యంలో పటాకుల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా టపాసులు అమ్మకాల నిషేధంతో పాటు ఒకవేళ అమ్మినా లేక కాల్చినా లక్ష వరకూ జరిమానా చెల్లించాల్సిందిగా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాజస్థాన్, ఒడిశా కూడా టపాసులపై బ్యాన్ విధించింది. -
భారీ పేలుడు ఐదుగురు సజీవ దహనం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో.. అందులో పనిచేస్తున్న కార్మికుల్లో ఐదురుగు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విరుదునగర్ జిల్లా సరిహద్దుల్లోని మురుగనేరి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. డి.కల్లూపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమ కుటుంబాలపై దేవుడు పగబట్టాడని మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
'పటాసులు కాల్చండి.. డ్రమ్స్ వాయించండి'
నాగ్పూర్ : మిడతల దాడిని ఎదుర్కొనేందుకు ప్రజలు పటాసులు కాల్చాల్సిందిగా, డ్రమ్ములను వాయించాల్సిందిగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం కతోల్లో మిడతల దాడి పరిస్థితిపై మంత్రి సమీక్ష చేపట్టారు. రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఎప్పుడైతే మిడతలు దాడి చేస్తాయో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పటాకులు కాల్చడం, టైర్లను కాల్చడం, డ్రమ్ములను వాయించడం వంటి చర్యలతో మిడతలను పారద్రోలాలన్నారు.(మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!) అంతకముందు మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి దాదా భూషే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 శాతం మిడతలను వ్యవసాయ విభాగం నిర్మూలించిందన్నారు. రసాయనాలు స్ప్రే చేసేందుకు అగ్నిమాపక యంత్రాలను వినియోగించినట్లు తెలిపారు. మిడతల ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఉచితంగా రసాయనాలు, పురుగుమందులను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.పాకిస్తాన్ నుంచి దేశంలోకి ప్రవేశించిన మిడతలు గాలి ద్వారా తమ దిశను మార్చుకుంటున్నాయి. రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలో పెద్ద ఎత్తున పంటపొలాల మీద పడి పంటను నాశనం చేస్తున్నాయి. ఒక్కో గుంపులో వేల నుంచి లక్ష సంఖ్యలో ఉండే మిడతల దండు వల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కోట్లాదిమంది వినియోగించే ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఫలాలను మిడతల దండు స్వాహా చేస్తాయి. (మధ్యప్రదేశ్ వైపు మిడతల దండు!) -
టపాసులకు భయపడి పట్టాలపైకి
దొడ్డబళ్లాపురం: అప్పటి వరకూ దీపావళి పండు గ సంబరాలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఇంటి యజమాని మృతి ఆ ఇంటి ఇల్లాలి కలలను ఛిన్నాభిన్నం చేశాయి. టపాసుల సరాన్ని అంటించిన వ్యక్తి నిప్పురవ్వల నుండి తప్పించుకునే ప్రయత్నంలో రైలు పట్టాలపైకి పరిగెత్తగా, అదే సమయంలో వస్తున్న రైలు ఢీకొని ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన దొడ్డబళ్లాపురం రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంజునాథ్ (38) మృతి చెందిన వ్యక్తి. ఎలా జరిగిందంటే బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడ పరిధిలోని విజయనగర్ కాలనీలో నివసించే మంజునాథ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రాయచూరుకు చెందిన మంజునాథ్ భార్య విజయరంజనితో కలిసి నివసిస్తున్నాడు. వివాహం జరిగిన పదేళ్లకు గర్భం దాల్చిన భార్య ఇప్పుడు ఆరునెలల గర్భవతి అని తెలిసింది. మంగళవారం రాత్రి దీపావళి సందర్భంగా మంజునాథ్ టపాసులు కాల్చే క్రమంలో టపాసుల సరం అంటించాడు. నిప్పురవ్వల ఎగరడంతో తప్పించుకోవాలని పక్కనే ఉన్న రైలుపట్టాలపైకి పరిగెత్తాడు. అదే సమయంలో బెంగళూరు నుండి వస్తున్న కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు వేగంగా ఢీకొంది. దీంతో మంజునాథ్ అక్కడికక్కడే మృతిచెందాడు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న విజయరంజని కళ్ల ముందే భర్త మరణించడంతో కన్నీరుమున్నీరైంది. సమాచారం అందుకున్న దొడ్డ రైల్వేపోలీసులు సంఘటనాస్థలాన్ని సందర్శించారు.కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ దీపావళికి మోత మోగించారు..
సనత్నగర్: నగరంలో ఈసారి దీపావళికి టపాసుల మోత మోగింది. పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినా నగరవాసులు వినిపించుకోలేదు. ఫలితంగా గతేడాది దీపావళి రోజు కంటే ఈసారి కాలుష్యం అధికంగా నమోదైంది. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పరిమితికి మించి ధ్వని కాలుష్యం నమోదు కాగా, గాలిలో కాలుష్య ఉద్గారాల పరిమితి పెరిగింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దీపావళికి సంబంధించిన ప్రాథమిక నివేదికను మంగళవారం విడుదల చేసింది. నివాస ప్రాంతాల్లో గతేడాది ధ్వని కాలుష్యం సరాసరిన (ఉదయం 6–రాత్రి 10) 64 డెసిబెల్స్ నమోదైతే... ఈసారి అది 69 డెసిబెల్స్కు పెరిగింది. నిబంధనల మేరకు రెసిడెన్షియల్ప్రాంతాల్లో 55 డెసిబెల్స్కు మించరాదు. వాణిజ్య ప్రాంతాల్లో గతేడాది 71 డెసిబెల్స్ నమోదైతే.. ఈసారి 72 డెసిబెల్స్కు పెరిగింది. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో 65 డెసిబెల్స్కు మించరాదు. ఇక పారిశ్రామిక ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత టపాసుల మోత మోగిందని నివేదిక పేర్కొంది. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు 64 డెసిబెల్స్ ఉంటే... ఆ తర్వాత రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల వరకు 71 డెసిబెల్స్కు పెరిగింది. గతేడాది ఈ ప్రాంతాల్లో రాత్రి 10గంటల తర్వాత 66 డెసిబెల్స్గా ఉంది. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు పరిగణనలోకి తీసుకుంటే గతేడాది కంటే 7 డెసిబెల్స్ తగ్గడం గమనార్హం. కమర్షియల్ ప్రాంతా ల్లో రాత్రి 10 తర్వాత 70 డెసిబెల్స్కు మించ రాదు. పీఎం10 రెట్టింపు శ్వాసకోశ సంబంధ వ్యాధులకు కారణమయ్యే పీఎం 10 ఉద్గార స్థాయి ఊహించని రీతిలో పెరిగినట్లు పీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో సగటున 85 ఉంటే దీపావళి రోజున 163 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్గా నమోదైంది. అంటే సాధారణ రోజుల్లో కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నమోదైంది. పీఎం 10 గతేడాది దీపావళికి 140 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్ నమోదు కాగా... ఈసారి అదనంగా 23 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్ మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. వాస్తవానికి గాలిలో పీఎం10 ఉద్గార స్థాయి 24 గంటల పాటు సగటున 100 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటరు మించరాదు. ఇక పీఎం 2.5 మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గింది. 2018లో 95 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్గా ఉంటే... ఈసారి 71.6 గా నమోదైంది. పీఎం 2.5 ఉద్గార స్థాయి 24 గంటల పాటు సగటున 60కి మించరాదు. పెరిగిన ఎన్ఓఎక్స్ కళ్లు, ముక్కు మండేలా చేసే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ (ఎన్ఓఎక్స్) గతేడాది కంటే పెరిగింది. 2018లో 43.5 మైక్రోగ్రాము/క్యూబీక్ మీటర్ నమోదు కాగా.. ఈసారి 65కు నమోదైంది. ఇక శ్వాసకోశ, బ్రాంకైటీస్, చికాకును కలిగించే సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్ఓ2) గతేడాది కంటే కాస్త తగ్గడం ఊరటనిచ్చింది. 2018లో 7.6 నమోదు కాగా.. ఈసారి 6.0 నమోదైంది. అందుకే పెరిగిందా? ఓవైపు కాలుష్యం పెరగ్గా... మరోవైపు టపాసుల విక్రయాలు మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఈ నేపథ్యంలో కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదు కావడానికి కారణం గాలిలో ఆర్ధ్రత (తేమ శాతం) ఎక్కువగా ఉండడమేనని తెలుస్తోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు టపాసుల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు త్వరలో గాలిలో కలసిపోయే ఆస్కారం ఉండదు. దీంతో ఆయా ప్రాంతాల్లో చుట్టుముట్టడంతో కాలుష్యం ఎక్కువగా నమోదైందని పేర్కొంటున్నారు. గతేడాది గాలి వేగం 1.6 మీటర్స్/సెకనుగా ఉండగా... ఈసారి 0.5 మీటర్స్/సెకనుకు పడిపోయింది. సనత్నగర్లో అత్యధికం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను పరిశీలిస్తే అత్యధికంగా సనత్నగర్లో 361, బొల్లారంలో 300 నమోదైంది. ఈ మేర స్థాయి ఆరోగ్యానికి హానికరమని పీసీబీ పేర్కొంది. ఇక సున్నిత (సెన్సిటివ్) ప్రాంతాల్లోనూ కాలుష్య ఉద్గారాలు వెలువడ్డాయి. హెచ్సీయూ వద్ద 170, జూపార్కు వద్ద 113 నమోదైంది. -
మంటలు చెలరేగి,ఇళ్లు దగ్ధం
-
రైళ్లలో టపాసులు తీసుకెళ్తే అంతే సంగతి!
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా రైళ్లలో ఎలాంటి పేలుడు పదార్ధాలు తీసుకెళ్లరాదని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి సందర్భంగా టపాసులు, బాణాసంచా తీసుకెళ్లడం కూడా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అలాంటి ప్రయాణికులపైన రైల్వేయాక్ట్ –1989లోని సెక్షన్లు 164, 165 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఎవరైనా వ్యక్తులు రైళ్లలో టపాసులు, బాణా సంచా తీసుకెళ్తున్నట్లు అనుమానం వస్తే ప్రయాణికులు వెంటనే 182 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందజేయాలని కోరారు. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. -
ఢిల్లీలో ఆ రెండే కాల్చాలి
దీపావళి అనగానే మనసుకి ఆహ్లాదాలనిచ్చే దీపాలూ, వాతావరణాన్ని కలుషితం చేసే టపాకాయలే గుర్తొస్తాయి. అందుకే దీపావళి పండుగని ప్రమాదకరంగా పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏటా వేలాది మందిని మృత్యువు దరికి చేరుస్తోన్న టపాకాయలు కాల్చొద్దంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ఎకోఫ్రెండ్లీ టపాకాయలను తయారు చేస్తున్నారు. ఇవి తక్కువ శబ్దంతో, తక్కువ పొగని విడుదల చేస్తాయి. ఎలక్ట్రిక్ బల్బులకు బదులుగా బయోడీగ్రేడబుల్ దీపాలను వెలిగించడం వల్ల కూడా కాలుష్యానికి చెక్ పెట్టొచ్చు. ఇందులోభాగంగానే ఈసారి ఢిల్లీ ప్రభుత్వం కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లను కాల్చుకోవడానికి మాత్రమే అనుమతినిచ్చింది. అవి కూడా ప్రభుత్వం తయారు చేసిన వాటిని మాత్రమే కొనాలి. ప్రభుత్వం తయారు చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటితోనే ఈసారి ఢిల్లీ వాసులు దీపావళి జరుపుకొని సంతృప్తి పడవలసిందే. -
అసలు ‘గ్రీన్ క్రాకర్స్’ అంటే ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు వ్యవసాయరంగంలో ‘గ్రీన్ రెవెల్యూషన్’ రాగా, ఇప్పుడు దీపావళి క్రాకర్స్ (బాణాసంచా) పరిశ్రమలో ‘గ్రీన్ రెవెల్యూషన్’ వస్తోంది. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని తీసుకరావడం కోసం తీసుకొచ్చిన గ్రీన్ రెవెల్యూషన్ను తెలుగులో హరిత విప్తవంగా పేర్కొన్నారు. బాణాసంచాను కాల్చడం వల్ల వాతావరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు క్రాకర్స్లో వస్తోన్న ఈ గ్రీన్ రెవెల్యూషన్ను తెలుగులో కాలుష్య నియంత్రణ విప్లవంగా పేర్కొనవచ్చు. పలు భాషలు మాట్లాడే ప్రజలందరికి సులభంగా అర్థమయ్యేలా ‘గ్రీన్ క్రాకర్స్’ అని వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో సాధారణ బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లను సుప్రీం కోర్టు 2018, అక్టోబర్ నెలలో నిషేధించింది. సాధారణ బాణాసంచాను ముందే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నామని, ఇంత త్వరగా ‘గ్రీన్ క్రాకర్స్’ అందుబాటులోకి రావడం కష్టమంటూ నాడు దుకాణదారులు లబోదిబోమంటూ మొత్తుకోగా, సుప్రీం కోర్టు షరతులతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. ఈ ఏడాది నుంచి మాత్రం సాధారణ బాణాసంచాను అమ్మరాదని, గ్రీన్ కాకర్స్ను మాత్రమే అమ్మాలని నిక్కచ్చిగా చెప్పింది. అలాగే గ్రీన్ క్రాకర్స్ ఫార్ములాను రూపొందించాల్సిందిగా ఢిల్లీలోని ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్’ను సుప్రీం కోర్టు ఆదేశించింది. గ్రీన్ క్రాకర్స్లో ఉపయోగించే పదార్థాలు సాధారణ క్రాకర్స్ అన్నింటిలో ‘బేరియం నైట్రేట్’ను ఉపయోగిస్తారు. ఇది అత్యంత హానికరమైన పదార్థం. ప్రజల శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా వాతావరణంలోకి ధూళి, ద్రవ కణాలను వదలని లేదా అణచివేసే పదార్థాలతో గ్రీన్ క్రాకర్స్ను తయారు చేయాలని భావించి ఈ ఇంజనీరింగ్ సంస్థ ఓ ఫార్మూలాను రూపొందించింది. ఇందులో ఉపయోగించే పదార్థాల మిశ్రమాన్ని ‘జియోలైట్’ అంటారని సంస్థలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్న సాధన రాయులు తెలిపారు. ఎక్కువ ఆక్సిజన్ కలిగిన ఈ పదార్థంతో తయారు చేసే గ్రీన్ క్రాకర్స్ను కాల్చినప్పుడు అందులోని ఇంధనం వేడి లేదా వెలుతురు రూపంలో బయటకు వెలువడుతుందని ఆమె తెలిపారు. వీటి వల్ల ఎలాంటి విష వాయువులు వెలువడం కనుక సాధారణ క్రాకర్స్తో పోలిస్తే 70 శాతం తక్కువ హానికరం అని ఆమె చెప్పారు. ఇవెన్ని రకాలు ? కొత్తగా తయారు చేస్తోన్న గ్రీన్ క్రాకర్స్లో ‘సేఫ్ వాటర్ రిలీజర్, సేఫ్ మినిమల్ అల్యూమినియం క్రాకర్, సేఫ్ థర్మైట్ క్రాకర్’ రకాలు ఉన్నాయి. సేఫ్ వాటర్ రిలీజర్ క్రాకర్స్ను కాల్చినప్పుడు అందులో నుంచి నీరు విడుదలై గాలి, దూళి కణాలు వాతావరణంలో కలువకుండా అడ్డుకుంటుంది. సేఫ్ అల్యూమినియం క్రాకర్లో అల్యూమినియం అతి తక్కువగా ఉంటుంది. సేఫ్ థర్మైట్ క్రాకర్లో వేడిని ఉత్పత్తి చేసే ఐరన్ ఆక్సైడ్ లాంటి ఖనిజ లోహాలను, తక్కువ స్థాయిలో అల్యూమినియంను ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా సాధారణ క్రాకర్స్ కన్నా 70 శాతం తక్కువ, అంటే 30 శాతం కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేస్తాయి. నూటికి నూరు శాతం కాలుష్యం ఉండొద్దనుకుంటే ఏ క్రాకర్స్ను కాల్చకపోవడమే ఉత్తమం. గ్రీన్ క్రాకర్స్కు లైసెన్స్లు ఎలా? వీటిని ఉత్పత్తి చేయాలనుకునే వారు ముందుగా ఢిల్లీలోని ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్’ను సంప్రదించి ‘అవగాహన ఒప్పందం’ కుదుర్చుకోవాలి. ఫార్ములాను తీసుకోవాలి. ఆ తర్వాత ‘పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ ఆమోదంతో పరిశ్రమ లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ సంస్థతో ఉత్పత్తిదారులు 230 అవగాహన ఒప్పందాలు, 135 ‘నాన్ డిస్క్లోజివ్’ ఒప్పందాలు తీసుకోగా పెట్రోలియం అండ్ ఎక్స్పోజివ్స్ సంస్థ నుంచి కేవలం 28 మంది మాత్రమే ఆమోదం తీసుకున్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా పరిశ్రమలు స్థాపించి ‘గ్రీన్ కాకర్స్’ తయారు చేస్తున్నారు. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఈ పరిశ్రమలు ప్రస్తుతం వెలిశాయి. ఢిల్లీలో పరిస్థితి ఏమిటీ ? ఢిల్లీలో బాణాసంచా లేదా టపాకాయల దుకాణదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది కస్టమర్స్ నిషేధించిన క్రాకర్స్ కావాలని కోరుతున్నారని, లేదంటే తిరిగి పోతున్నారని వాపోతున్నారు. వారు వెయ్యి రూపాయలు ఖర్చయినా ఫర్వాలేదనుకొని ఢిల్లీకి దూరంగా వెళ్లి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారని, వారు వాటిని తెచ్చి ఢిల్లీ వీధుల్లో కాలిస్తే ఇక ఫలితమేమిటని ప్రశ్నిస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్కు డిమాండ్ బాగా పెరిగిందని, కంపెనీల నుంచి సకాలంలో సరఫరా అందక ఇబ్బంది పడుతున్నామని మరో ప్రాంతంలోని దుకాణదారులు వాపోతున్నారు. -
ఈ స్వీట్ బాంబులు..హాట్ కేకులే!
సాక్షి,జోధ్పూర్ : దీపావళి అంటేనే స్వీట్లు, క్రాకర్స్ పండుగ. అయితే ఈ దీపావళి పండుగకు కూడా ఉత్త లడ్డూలు, జిలేబీలు, జామూన్లు ఏంటి బోర్... సమథింగ్ ఇస్మార్ట్ అనుకున్నారో ఏమో కానీ... రాజస్థాన్లోని వ్యాపారులు స్వీట్ తయారీదారులు సరికొత్తగా ఆలోచించారు. పండుగవేళ వినియోగదారులను ఆకర్షించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బాంబులతో స్వీట్లు పేల్చారు. అదేనండీ.. దీపావళి క్రాకర్స్ మాదిరిగా స్వీట్లను తయారు చేసారు. సుత్లీ బాంబులు, లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు లాంటి దీపావళి క్రాకర్స్ తరహాలో స్వీట్లను రూపొందించారు. అయితే దీపావళి క్రాకర్స్అనుకొని కొనడానికి వచ్చిన కస్టమర్లు.. క్రాకర్ల ఆకారంలో ఉన్న స్వీట్లను చూసి బహు ముచ్చటపడిపోతున్నారుట. దీంతో 'క్రాకర్ స్వీట్స్' అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా పిల్లల్ని ఆకట్టుకుంటూ హాట్కేక్ల మాదిరిగా అమ్ముడవుతున్నాయి. సాధారణంగా దీపావళికి స్వీట్లకు మంచి ఆదరణ లభిస్తుందని జోధ్పూర్లోని సర్దార్పురా దుకాణదారులు చెబుతున్నారు. సుమారు ఒక నెల సమయంనుంచే స్వీట్ల తయారీలో నిమగ్నమై పోతామని చెప్పారు. అంతేకాదు, స్వచ్ఛమైన నెయ్యి, డ్రైఫ్రూట్స్తో ఎలాంటి కల్తీ లేకుండా తయారుచేస్తారట, అందుకే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయట. ఈ సంవత్సరం దీపావళి పర్వదినాన్ని అక్టోబర్ 27న జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. -
దీపావళికి పర్యావరణహిత టపాసులు
న్యూఢిల్లీ: సాధారణ టపాసుల కంటే 30 శాతం తక్కువ ఉద్గారాలను వెలువరించే పర్యావరణహిత టపాసులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. ప్రజల మనోభావాలను పరిగణనలో ఉంచుకొని పర్యావరణానికి హాని కలిగించని టపాసులను అందిస్తున్నామని స్పష్టం చేశారు. వీటిని శాస్త్రీయ పరిశ్రమల పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) తయారు చేసింది. 2018లో దీపావళి పండుగను పర్యావరణహిత టపాసులతోనే జరపాలని సూచిస్తూ కాలుష్యాన్ని కలిగించే టపాసుల తయారీ పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణహిత టపాసులు తయారు చేయాలని సూచించింది. -
కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్ భడోహి జిల్లాలోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సంభవించిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కార్పెట్ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణసంచా తయారు చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. ఈ మధ్యాహ్నం కార్పెట్ ఫ్యాక్టరీ లోపల రహస్యంగా బాణాసంచా సామాగ్రి తయారుచేస్తుండగా పేలుడు సంభవించింది. దాంతో ఇంతకు ముందే భవనం లోపల భద్రపరిచిన టపాకాయలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగనట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి కార్పెట్ ఫ్యాక్టరీ భవనం పేకమేడలా కుప్పకూలి పోగా.. చుట్టుపక్కల ఉన్న మరో మూడు ఇళ్లు కూడా నేలమట్టమైనట్టు తెలిసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి. -
చీకటి నింపిన దీపావళి..
విజయనగరం, బొబ్బిలి: దీపావళి పండుగ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతుంది.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బతుకులను చీకటిమయం చేస్తుంది. పట్టణంలోని తారకరామా కాలనీలో బాణసంచా విక్రయించే కుటుంబంలో మాత్రం రెండు ప్రాణాలు గాలిలో కలసి పోగా మిగిలిన ముగ్గు రు పిల్లల జీవితాలను చీకటి మయం చేసింది. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఎవరు మమ్మల్ని ఆదుకుంటారని చిన్నారులు బేలచూపులు చూస్తున్నారు. పట్టణంలోని తారకరామా కాలనీకి చెందిన చుక్క త్రినాథరావు లారీ డ్రైవర్గా పని చేయడంతో పాటు తారాజువ్వలు తయారు చేస్తుంటాడు. కుటుంబ సభ్యులు కూడా బాణసంచా తయారుచేస్తూ విక్రయిస్తుంటారు. గత నెల 25న త్రినాథరావు, భార్య రమణమ్మ, కుమార్తె తనూజ బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇల్లంతా మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ ఆటోలో బొబ్బిలి ఆస్పత్రికి తరలించగా, వైద్యుడు జి. శశిభూషణరావు ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖకు రిఫర్ చేశారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గత నెల 28న త్రినాథరావు, ఈ నెల ఆరున రమణమ్మ మృతి చెందారు. దీంతో పిల్లలు సాయి, నందిని, తనూజ అనాథలయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ తనూజ ప్రస్తుతం కోలుకుంటున్నా తల్లిదండ్రుల మృతితో మనోవేదనకు గురైంది. గాయపడిన తనూజ పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలలో... నందిని నెల్లిమర్లలో చదువుతున్నారు. సాయి పదో తరగతి పాసై నిరుద్యోగిగా ఉన్నాడు. దీపావళి పండుగ వీరి కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తమను ఆదుకునే ఆపన్నహస్తం కోసం చిన్నారులు ఎదురుచూస్తున్నారు. -
నిప్పురవ్వ పడిందని కత్తితో దాడి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): బాణసంచా నిప్పు రవ్వ పడిందన్న నెపంతో ఒక యువకుడు మరో యువకుడిని కత్తితో పొడిచాడు. ఎంవీపీ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదజా లారిపేట కాలనీలో దీపావళి సందర్భంగా బుధవారం రాత్రి యువకులు రోడ్లపై బాణసంచా కాల్చారు. ఆ సమయంలో అక్కడి ఆటోడ్రైవర్ చందనాల దాసు(30) కాల్చిన బాణసంచాకి సం బంధించిన నిప్పు రవ్వలు సమీపంంలోనే ఉన్న మదుపాన శ్రీనివాస్పై పడ్డాయి. దీంతో ఆగ్రహించిన శ్రీను తన వద్ద ఉన్న కత్తితో దాసు కడుపులో పొడిచాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాసుని హుటాహుటిన 108అంబులెన్సులో కేజీ హెచ్కి తరలించారు. కొద్దిరోజుల క్రితమే ఈ ఇద్ద రు యువకుల కుటుంబాల మధ్య గొడవ జరి గింది. పది రోజుల క్రితం నిందితుడు శ్రీను సోదరుడు రాజుకి జ్వరం రావడంతో దాసు తండ్రి సత్తయ్య చేతబడి చేశాడంటూ అతని కుటుంబ సభ్యులతో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీను పాత గొడవ మనసులో ఉంచుకునే బాణసంచా నెపంతో దాడి చేశాడని పోలీసుల విచారణలో తేలింది. దాసు సోదరుడు పోలారావు ఫిర్యాదు మేరకు ఎంవీపీ సీఐ కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఐ.గోపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దీపావళి సంబరాలు.. కేసులే కేసులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో దీపావళి సంబరాలు మిన్నంటాయి. టపాసుల కాల్పుల మోతలు హోరెత్తాయి. వరుసగా 5 రోజులు సెలవులు రావడంతో చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగరీత్యా, వివిధ పనుల నిమిత్తం ఉన్న వాళ్లంతా తమ స్వగ్రామాలకు రావడంతో గ్రామాల్లో మరింత పండుగ వాతావరణం నెలకొంది. ఇళ్ల వద్ద బాణాసంచా పేల్చుతూ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బాణాసంచా పేల్చేందుకు అనుమతి ఇచ్చారు. అయితే కొన్ని చోట్ల యువత నిబంధనలను ఉల్లంఘించింది. దీంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు నమోదు చేశారు. సొంత పూచికత్తుపై 400 మందిని విడుదల చేశారు. 200 మందిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. కోయంబత్తూరులో 30 మంది, తిరుప్పూర్లో 42 మంది, విల్లుపురంలో 30 మంది, చెన్నైలో 10 మంది, తిరునల్వేలిలో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ అరెస్టుల కారణంగా ఆయా ప్రాంతాల్లో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వారిని బుజ్జగించడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. చాలా మందిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి హెచ్చరించి వదిలేశారు. బాలుడు మృతి.. తండ్రిపై కేసు నమక్కల్ జిల్లాలో టపాసుల కారణంగా 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. బాణాసంచా పేలడంతో బాలుడికి ఛాతి దగ్గర గాయమైందని, ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. బాలుడి తండ్రి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. బాలుడి ఇద్దరు మిత్రులు కూడా గాయపడ్డారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లఘించి బాణాసంచ కాల్చినందుకు బాలుడి తండ్రిపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ‘మోత’ తగ్గింది! నిర్ణీత సమయంలోనే బాణసంచా కాల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ ఏడాది పటాకుల కాల్పుల మోత తగ్గిందని పర్యావరణవేత్త శ్వేత నారాయణ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి చాలా మంది టపాసులు కాల్పుస్తున్నారని తెలిపారు. దీని గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో రెండు ఫిర్యాదులు చేసినట్టు చెప్పారు. రోజులో ఎప్పుడు బయటకు వెళ్లినా పటాసుల కాల్పుల మోత తప్పడం లేదన్నారు. పోలీసులు కూడా నియంత్రించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి కూడా పర్యావరణ మార్పులను అంచనా వేసేందుకు కసరత్తు చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యాంశాలివీ.. ♦ దీపావళికి ఏడు రోజుల ముందు, ఆ తరవాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పరిశీలించాలి. ♦ దీపావళి రోజు దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు (35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. ♦ తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతివ్వాలి. ♦ బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలి. ♦ నిషేధిత టపాసులు అమ్మడం, కాల్చడంపై పోలీసు శాఖ నిఘా పెట్టాలి. ♦ టపాసులు పేల్చడం వల్ల తలెత్తే కాలుష్యంపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. -
విన్నారా.. సౌండ్ పడుద్ది సప్పుడు గుప్పెడే!
సాక్షి,సిటీబ్యూరో: వెలుగు దివ్వెల కేళి.. దీపావళి పండగ ఈ ఏడాది గ్రేటర్లో పర్యావరణహితంగా మారనుంది. అధిక శబ్దం వెలువడే బాణసంచా పేలుళ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇటు నగర పోలీసులు అటు బల్దియా అధికారులు శబ్ద, వాయుకాలుష్యంపై సమరభేరి మోగించారు. దీంతో ఈసారి దీపావళిని ఎలాంటి బాణసంచా పేలుళ్లు లేకుండా జరుపుకునేందుకు గ్రేటర్ సిటీజన్లు సైతం మక్కువ చూపుతున్నారు. మహానగరంలో ఏటా ఈ పండగ సందర్భంగా సిటీజన్లు మూడురోజుల పాటు పెద్ద ఎత్తున క్రాకర్స్ను కాలుస్తుంటారు. గతేడాది సుమారు రూ.100 కోట్ల మేర టపాసులను బూడిద చేశారంటే దాని ద్వారా వెలువడిన శబ్ద, వాయు కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు. అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి టపాసుల అమ్మకాలు సగానికి పడిపోయినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. తాజా ఆంక్షల నేపథ్యంలో తాము తమిళనాడు, చైనాల నుంచి తక్కువ మొత్తంలో సరుకు దిగుమతి చేసుకున్నట్లు చెబుతున్నారు. ‘సుప్రీం’ షరతులతో దివ్వెల పండగ.. దీపావళి అంటే గుర్తుకొచ్చేది టపాసుల మోత.. బాణసంచా వెలుగులు. అయితే, ఆ ప్రమోదం మాటున ఉన్న శబ్ద, వాయు కాలుష్యంతో పాటు పర్యావరణ హననంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీపావళి వేళ బాణసంచాను రాత్రి 8 నుంచి 10 గంటలమధ్యనే కాల్చాలన్న షరతు విధించిన విషయం విదితమే. అయితే, సూప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైతే నగర పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఈ మేరకు ఆంక్షలు విధించినప్పటికీ.. సమయం దాటి టపాసులు పేల్చే వారిని అదుపుచేయడం, అవధులు దాటే కాలుష్యాన్ని లెక్కించడం, లైసెన్సు పొందిన వ్యాపారుల నుంచే కొనుగోళ్లు చేయాలన్న నిబంధన అమలుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యాన్ని లెక్కించే యంత్రాంగమేది? నగరంలో హెచ్సీయూ, సనత్నగర్, పాశమైలారం, జూపార్కు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం ‘కంటిన్యూయస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ’ అధునాతన యంత్రాలతో కాలుష్యాన్ని లెక్కగడుతోంది. ఈ యంత్రాలతో గాలిలోని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, బెంజిన్, టోలిన్ వంటి కాలుష్య కారకాల మోతాదును నిత్యం లెక్కిస్తుంది. మరో 21 నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో డస్ట్ శాంప్లర్ వంటి యంత్రాలతో దుమ్ము, ధూళి ఇతర కాలుష్యాలను మాత్రమే లెక్కగడుతోంది. ‘సుప్రీం’ మార్గదర్శకాల నేపథ్యంలో దీపావళికి వారం రోజుల ముందు, తర్వాత నగరవ్యాప్తంగా వివిధ రకాల వాయు కాలుష్యాన్ని లెక్కించేందుకు అవసరమైన సిబ్బంది, కాలుష్య నమోదు కేంద్రాలు లేకపోవడంతో అవధులు దాటే కాలుష్యాన్ని ఎవరు.. ఎలా లెక్కిస్తారన్నది సస్పెన్స్గా మారింది. సగానికి తగ్గిన టపాసుల విక్రయాలు గ్రేటర్ పరిధిలో ఏటా దీపావళికి సుమారు రూ.100 కోట్ల వరకు బాణసంచా అమ్మకాలు జరుగుతుంటాయి. మహానగరంతో పాటు పొరుగు జిల్లాల వారు కూడా ఇక్కడే క్రాకర్స్ కొనుగోలు చేస్తుంటారు. ఈసారి దీపావళి నేపథ్యంలో అధిక శబ్దం వెలువడేవి.. ఆకాశంలో కాంతులు వెదజల్లే క్రాకర్స్ అమ్మకాలు సగానికి పడిపోయాయని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యాపారం రూ.50 కోట్ల మార్కును దాటడం గగనమేనని బాణసంచా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలివీ.. ♦ దీపావళికి ఏడు రోజుల ముందు, తర్వాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పరిశీలించాలి. ♦ దీపావళి రోజున దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు (35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. ♦ తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతివ్వాలి. ♦ బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం.. ప్రజలకు అవగాహన కల్పించాలి. ♦ నిషేధిత టపాసులు అమ్మడం, కాల్చడంపై పోలీసు శాఖ నిఘా పెట్టాలి. ♦ టపాసులు పేల్చడం వల్ల తలెత్తే కాలుష్యంపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. శబ్దకాలుష్యంతో జాగ్రత్త దీపావళి టపాసుల మోత అవధులు మించితే చిన్నారులు, పెంపుడు జంతువులు ప్రమాదంలో పడినట్టే. వాయు కాలుష్యంలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదు భారీగా పెరిగి శ్వాసకోశ వ్యాధులు, కళ్లసంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ముఖ్యంగా టపాసులు కాల్చినపుడు వెలువడే శబ్దాలు నివాస ప్రాంతాల్లో 45 డెసిబుల్స్ మించరాదు. కానీ నగరంలో ఇవి ఏటా 90 డెసిబుల్స్కు మించి నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద శబ్దాలు చిన్నారులు, పెంపుడు జంతువుల్లో విపరిణామాలకు దారితీస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంతువులు 50 డెసిబుల్స్ దాటి వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. రాకెట్లు, భూచక్రాల వంటివి కాల్చినపుడు జంతువులకు తగిలి గాయాలపాలవుతాయి. అవి ఎపిలెప్సీ (వణుకుడు) బారిన పడతాయి. ఈ గాయాలు సమీప భవిష్యత్లో వాటికి పెనుముప్పుగా మారడం తథ్యం. వాయు కాలుష్యంతో ముప్పే.. టపాసులు కాల్చగా వచ్చే పొగలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ధూళి రేణువులులు ప్రజల ఊపిరితిత్తులకు తీవ్ర హాని కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సల్ఫర్ డై ఆక్సైడ్ క్యూబిక్ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములు మించరాదు. కానీ ఏటా దీపావళికి సల్ఫర్ డై ఆక్సైడ్ 450–500 మైక్రోగ్రాములకు చేరుతోంది. నైట్రోజన్ ఆక్సైడ్ సైతం క్యూబిక్ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములు మించరాదు. కానీ అదీ 450–500 మైక్రోగ్రాములు దాటుతోంది. దీంతో కళ్లు, ముక్కు మండుతాయి. శ్వాసకోశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక ధూళిరేణువులు(ఎస్పీఎం) క్యూబిక్ మీటరు గాలిలో 100 మైక్రోగ్రాములు మించరాదు. కానీ 300 మైక్రోగ్రాములు మించుతోంది. ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. ఆనంద దీపావళి ఇలా.. ♦ ప్రమిదల్లో వెలిగించిన దీపాలు, తీరొక్క పూలతో మీ ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలను అందంగా అలంకరించి ముస్తాబు చేసుకోండి. ♦ తక్కువ శబ్దం వెదజల్లే చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పూల్ఛడీ, పెన్సిల్స్ కాల్చాలి. ♦ శబ్దాలు కాకుండా వెలుగులు విరజిమ్మే మతాబులను ఎంపిక చేసుకోవాలి. ♦ విపరీత శబ్దాలు కర్ణభేరీకి సోకకుండా చెవుల్లో దూది పెట్టుకోవాలి. ♦ టపాసుల మోత శృతి మించకుండా చూసేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ప్రయత్నించాలి. -
పేలుళ్లు 2 గంటలే!
కోల్సిటీ(రామగుండం): చిచ్చుబుడ్డి.. లక్ష్మీబాంబులు.. రాకెట్లు.. భూచక్రాలు.. పెద్దశబ్ధంతో పేలే బాణాసంచా కాల్చాలని ఊహించుకుటున్నారా? ఆగండి ఆగండి.. మీ ఊహలు తలకిందులయ్యేలా సుప్రీంకోర్టు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో దీపావళి పండుగకు ఈసారి టపాసుల మోత తగ్గనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. దీపావళి రోజున కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చేందుకు సుప్రీం అనుమతిచ్చింది. పర్యావరణ హితమైన టపాసులు మాత్రమే కాల్చాలని సూచించింది. ఈ నిబంధనలను ఎవరూ అతిక్రమించినా చట్టపరమైన కేసులు నమోదు చేయాలని పోలీసుశాఖను కోరింది. దీంతో ఈ దీపావళి రోజున టపాసుల మోతతోపాటు విక్రయాలూ తగ్గనున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు ప్రభావంతో గత ఏడాది టపాసుల ధరలు పెరుగగా...ఈఏడాది శివకాశి ప్రాంతంలో భారీ వర్షాల ప్రభావం మరింత చూపింది. గతేడాదితో పోలిస్తే 10 నుంచి 20 శాతానికిపైగా ధరలు ధరలు పెరిగాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు... దీపావళి పండుగనాడు కేవలం రెండు గంటలపాటు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు సుప్రీం ఆంక్షలు విధించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా... కోర్టు ధిక్కారంగా పరిగణించి శిక్ష, జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. స్థానికంగా ఉండే పోలీసు అధికారులు నిబంధనలను అమలు చేయడంలో ముఖ్యభూమిక పోషించాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు రామగుండం పోలీసు శాఖకు మాత్రం సుప్రీం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ అందలేని అధికారులు వెల్లడిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకే కఠిన నిబంధనలు... కలుషితమౌతున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సుప్రీం కోర్టు బాణాసంచా కాల్చడంపై కఠిన నిబంధనలు విధించింది. దీపావళి రోజున సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున టపాసులు కాల్చడం ద్వారా పర్యావరణంకు ముప్పు వాటిళ్లుతుంది. దీనికి తోడు శబ్ధకాలుష్యం కూడా వ్యాపిస్తోంది. కాల్చే సందర్భాలలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిన్నంటినీ దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. 42 దుకాణాలకు దరఖాస్తులు... జిల్లా పరిధిలో దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులను విక్రయించేందుకు జిల్లా వ్యాప్తంగా 42 మంది వ్యాపారులు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్లోని పెద్దపల్లి డీసీపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటితోపాటు పెద్దపల్లిలో రెండు, గోదావరిఖనిలో రెండు పర్మినెంట్ హోల్సెల్ దుకాణాలు ఉన్నాయి. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల నుంచి టపాసులను విక్రయించేందుకు అనుమతులు పొందాల్సి ఉంటుంది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా టపాసులు విక్రయించరాదు. ప్రజలకు ఇబ్బదులు తల్తెకుండా, ప్రమాదాలు చోటు చేసుకోకుండా, ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా ఉండే రీతిలో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తగ్గనున్న టపాసుల మోత... సుప్రీం కోర్టు జారీ చేసిన నిబంధనలతో టపాసుల మోత తగ్గనుంది. జిల్లా వ్యాప్తంగా దీపావళికి రూ.కోట్లలో బాణాసంచ విక్రయాలు జరుగుతుంటాయి. సుప్రీం ఆంక్షలతో బాణాసంచా విక్రయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని వ్యాపారులు ఆందోళనలకు గురవుతున్నారు. టపాసుల కొనుగోలుపై సుప్రీం కోర్టు ఆంక్షల ప్రభావం పడనుంది. దీంతో ఆశించినస్థాయిలో బాణాసంచా విక్రయాలు జరుగకపోవచ్చని, చాలా మంది వ్యాపారస్తులు దుకాణాల ఏర్పాటుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. -
పేలుతున్న టపాసుల ధరలు
తారాజువ్వల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చిచ్చుబుడ్లు కాస్తా చెట్టెక్కి కూచున్నాయి. కాకరపువ్వొత్తుల్లో చుక్కలు కనిపిస్తున్నాయి. మతాబులు చూస్తేనే మండిపోతున్నాయి. అయినా ఏడాదికోసారి వచ్చే పండగకోసం... ఇంట్లో పిల్లల ఆనందం కోసం... ఎంతోకొంత వెచ్చించక తప్పదు. ఆ కారణంగానే దుకాణాలకు వెళ్లే వినియోగదారులపై ధరల మోత మోగుతోంది. అసలేఅమ్మకాలు లేక సతమతమవుతున్న వ్యాపారులు ఇదే అదనుగా వచ్చిన వారికే అధిక మొత్తానికి అంటగట్టి సొమ్ము చేసుకోవాలన్న తపన కనిపిస్తోంది. సందట్లో సడేమియాలా అనుమతుల్లేని దుకాణాలు పుట్టుకొచ్చేశాయి. విజయనగరం గంటస్తంభం: దీపావళికి ఒక్కరోజే మిగిలి ఉంది. ఇప్పటివరకూ అంతంతమాత్రంగా సాగిన వ్యాపారం కనీసం ఈ రెండు రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యంతో వ్యాపారులు ఓ అడుగు ముందుకేసి ధరలు పెంచేశారు. గతేడాది కంటే 15 నుంచి 20శాతం పెరిగాయి. వ్యాపారులు పెరగలేదని చెబుతున్నా గతేడాది కొనుగోలు చేసిన సామగ్రి కొనుగోలు చేస్తే ఈ సారి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం కాకరపువ్వొత్తులు సాధారణ రకం బాక్సు(10) రూ.50 ఉండగా పదేసి ఉండే చిచ్చుబుడ్లురూ.80 నుంచి రూ.100లు, తాళ్లు రూ.60, లక్ష్మీబాంబులు(చిన్నవి) రూ.20,1000వాలా రూ.450, 12సాట్స్ రూ.100, 60సాట్స్ రూ.600 వరకు ఉన్నాయి. ఇవి గతేడాది కంటే 15 నుంచి 20శాతం ఎక్కువే అని వినియోగదారులు చెబుతున్నారు. గతేడాది రూ.2000 లు సరుకు కొనేవారు ఇప్పుడు వాటికే రూ.2400ల వరకు వెచ్చిస్తున్నారు. అనధికార అమ్మకాలజోరు జిల్లా బాణాసంచా వ్యాపారానికి పెట్టింది పేరు. జిల్లానుంచే కాకుండా పొరుగున ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడినుంచే సరకులు కొనుగోలు చేస్తుంటారు. ఇది చాలాకాలంగా వస్తున్నదే. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్మినెంట్ లైసెన్స్ కలిగిన దుకాణాలు 12 ఉన్నాయి. వీటికి ఎక్స్ప్లోజివ్ శాఖ అనుమతులు ఇస్తుంది. ఈ దుకాణాల్లో ఏడాది పొడవునా వ్యాపారాలు సాగుతాయి. ఇక దీపావళి ముందు తాత్కాలిక లైసెన్సుతో వ్యాపారాలు చేసుకునేందుకు రెవెన్యూశాఖ అనుమతులిస్తుంది. ఇలా ప్రతి ఏడాది 80కు పైగా తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇవిగాకుండా అనధికారికంగా మరో 30 నుంచి 40 దుకాణాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సోమవారం నుంచి వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. కొందరు లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. విజయనగరం పట్టణంలో ఆర్డీఓ సోమవారం సాయంత్రం వరకు 24 తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేస్తే ప్రస్తుతం ఒక్క కె.ఎల్.పురంలోనే 46 దుకాణాల్లో అమ్మకాలు జరుగుతుండడం విశేషం. కొత్తవలస, లక్కరవరపుకోట, ఎస్.కోట, గజపతినగరం, పూసపాటిరేగ మండలాలకు సంబంధించి 45 దుకాణాలకు అనుమతిస్తే అక్కడ 60కు పైగా ఉన్నాయి. పార్వతీపురం డివిజన్లో బొబ్బిలి, పార్వతీపురంలో మూడేసి, సాలూరులో ఒకటి తాత్కాలి లైసెన్సులు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ అనధికార షాపులు లేకపోయినా మంగళ, బుధవారాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అమలు కాని నిబంధనలు అనుమతులు ఇచ్చిన తాత్కాలిక వ్యాపారులు, హోల్సేల్ వ్యాపారులతో విజయగనరం ఆర్డీఓ జె.వి.మురళి, పోలీసు, ఫైర్ అధికారులు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల గురించి కచ్చితమైన సూచనలు చేశారు. కానీ తాత్కాలిక దుకాణదారులు మాత్రం చివరికి నిబంధనలు పాటించకుండా షాపులు పెట్టారు. కె.ఎల్.పురంలో రాజులకాలనీకి ఆనుకుని పదుల సంఖ్యలో షాపులు పెట్టారు. వాస్తవానికి ఇళ్లకు, షాపులకు మధ్య 50మీటర్లు దూరం ఉండాలి. మరోవైపు ఫైర్ సేఫ్టీ నిబంధనలు అసలు లేవు. తాత్కాలిక షాపులు రేకులతో వేయాలని చెప్పినా టెంట్లుతో వేశారు. ఇసుక, నీరు బకెట్లు, డ్రైకెమికల్, అగ్ని మాపక పరికరాలు లేవు. ఇప్పటికే నిల్వలు అనుమతుల కంటే ఎక్కువ ఉన్నాయి. పరిశీలించి అనుమతులిచ్చాం స్థలాలు ముందే పరిశీలించాం. ఇళ్లకు వెళ్లేదారి కావడం, పక్కనే ఇల్లు ఉండడంతో ఒక ప్రదేశంలో పెట్టకూడదని చెప్పాం. ఇంకోచోట సూచించినా స్థల యజమాని అంగీకరించనందున జనావాసాలకు ఇబ్బంది లేకుండా పెట్టాలని సూచించాం. ఇళ్లకు 50మీటర్లు దూరంలో ఉండేలా చూసుకున్నాం. టేకు చెట్లు, ఇతర అడ్లు ఉన్నందున ఇబ్బంది ఉండదు. అనుమతి లేకుండా ఎక్కడైనా షాపులు పెట్టి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా పెడతాం.– జె.వి.మురళి,ఆర్డీవో, విజయనగరం -
దీపావళి దందా
తణుకు: జిల్లాలో దీపావళి దందా మొదలైంది. అనుమతుల పేరిట అధికారులు దుకాణదారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలారు. జిల్లాలో అధికారికంగా కంటే అనధికారికంగా ఎక్కువ దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుని ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రూ.100 కోట్ల వ్యాపారం ఏటా రూ.వంద కోట్లు వ్యాపారం జరుగుతుంది.. అయినా నిబంధనలు ఎక్కడా అమలు కావు.. దీపావళి బాణసంచా వ్యాపారం పేరుతో నాలుగురాళ్లు సంపాదించుకుందామనుకునే వ్యాపారులకు వివిధ శాఖల అధికారులు మామూళ్ల పేరుతో వారిని ముంచేస్తున్నారు. తాత్కాలిక షాపులకు అనుమతులు పేరుతో కొన్నిశాఖల అధికారులు, సిబ్బంది దీపావళి దందాకు దిగుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్రత్యేక రేటు పెట్టి మరీ దోచేస్తున్నారు. మరోవైపు నిబంధనలు పాటించాల్సిన వ్యాపారులు సైతం అధికారులకు మామూళ్లు ఇచ్చేశాం కదా అని నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. సాధారణంగా తయారీ కేంద్రాల్లో 15 కిలోలకు మించి తయారు చేయకూడదనే నిబంధనలు ఉన్నా జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు. దీంతో ఏటా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం శ్రద్ధ చూపడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 550 దుకాణాలకు అనుమతులు జిల్లాలో ఈ ఏడాది తాత్కాలిక దుకాణాల ఏర్పాటు కోసం 550 వరకు అధికారులు అనుమతులు ఇవ్వగా మరో 19 తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. ఇదిలా ఉంటే 2 వేల వరకు అనధికార షాపుల ద్వారా దీపావళి రెండ్రోజుల పాటు అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా వారం రోజుల పాటు జరిగే వ్యాపారం జిల్లాలో రూ.వంద కోట్లు పైగా ఉంటుందని అంచనా. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బాణసంచా దిగుమతి చేసుకుంటున్న ఇక్కడి వ్యాపారులు ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన హోల్సేల్ వ్యాపారులకు ఇక్కడి నుంచే ఎగుమతులు అవుతుంటాయి. అయితే తయారీ కేంద్రాల్లో కేవలం 15 కిలోలకులోపు మాత్రమే బాణసంచా తయారు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో వయ్యేరుగట్టు ఆనుకుని తయారీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున బాణసంచా తయారీ కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో ఏటా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే ప్రాంతంలో 2013లో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇదే గ్రామంలో ఇంటిలో నిల్వ ఉంచిన బాణసంచా ప్రమదవశాత్తూ పేలిపోవడంతో ఇద్దరు భార్యాభర్తలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ముడుపులిస్తేనే సర్టిఫికెట్.. బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు, రెవెన్యూ, ఫైర్, ట్రాన్స్కో ఇలా ఆయా శాఖలవారీగా డిమాండ్ చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అధికారులకు అడిగిన సొమ్ము ముట్టజెబితేనే నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది. లేకపోతే ఏదొక సాకు చెప్పి తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు బ్రోకర్లు అంతా మేం చూసుకుంటామంటూ వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. తణుకు పట్టణ పరిధిలో షాపు ఏర్పాటు చేసుకోవడానికి ఒక్కో వ్యాపారి నుంచి రూ.15 వేలు చొప్పున వసూలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా తాత్కాలికంగా షాపు ఏర్పాటు చేసుకోవాలంటే రూ.వెయ్యి చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం స్థానిక ఫైర్ అధి కారులతో పాటు రెవెన్యూ, డివిజన్ పోలీసులు, స్థానిక పోలీసులు, మున్సిపాలిటీ లేదా పంచాయతీ ఇలా ఒక్కోశాఖ అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు మీరితే చర్యలు నిబంధనలు పాటించని బాణసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటికే 550 తాత్కాలిక షాపులకు అనుమతులు ఇచ్చాం. మరో 19 తయారీ కేంద్రాలు అధికారికంగా ఉన్నాయి. ఎక్కడైనా అనధికారికంగా తయారు చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు. – ఎ.వి.శంకరరావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, ఏలూరు -
మందుగుండు సామగ్రి సీజ్
విజయనగరం, చీపురుపల్లిరూరల్: ఎలాంటి లైసెన్స్ లేకుండా అనధికారకంగా మందుగుండు సామగ్రి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను చీపురుపల్లి ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని కర్లాంలో దీపావళి పండుగ సందర్భంగా అనధికారకంగా మందుగుండు సామాగ్రిని అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా కోరాడ ఆంజనేయులు, కోరాడ ప్రసాదరావు, కోరాడ తవిటిరాజు, కిల్లంశెట్టి గోవిందరావు, కిల్లంశెట్టి లక్ష్మణరావులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద రనుంచి 21 వేల రపాయల గ్రామంలోనికి వెల్లి దాడి చేసారు. ఈసంఘటనలో అనధికారకంగా బాణాసంచాను అమ్ముతున్న గ్రామానికి చెందిన కోరాడ ఆంజనేయులు,కోరాడ ప్రసాదరావు,కోరాడ తవిటిరాజు,కిల్లంశెట్టి గోవిందరావు,కిల్లంశెట్టి లక్ష్మణరావులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 21వేలు విలువ గల బాణాసంచాను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశారు. తయారీ స్థావరంపై దాడి వేపాడ: మండలంలోని సోంపురం, అరిగిపాలెం గ్రామాల్లో అనుమతుల్లేకుండా బాణాసంచా తయారు చేస్తున్న స్థావరంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 1625 తాటాకు బాంబులు, ఐదు కిలోల మిశ్రమం, 500 ఖాళీ చిచ్చుబుడ్లు, 400 తారా జువ్వలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాగర్బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేసినట్లు చెప్పారు. ఆతవలో బాణసంచా స్వాధీనం టీవీఎస్ ఎక్సె్సల్ వాహనంపై బాణసంచా తరలిస్తున్న వ్యక్తిని ఆతవలో స్పెషల్ బ్రాంచ్పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఎల్.కోట మండలం వేచలపువానిపాలెంనకు చెందిన ఎన్వై కుమార్ సుమారు ఆరువేల రూపాయల విలువైన బాణసంచాను తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడ్ని వల్లంపూడి పోలీస్స్టేషన్కు తరలించగా, ఎస్సై సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దీపావళి వేళలను ధిక్కరిస్తాం
బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు కట్టుబాట్లను విధించడంపై అనేకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండుగంటలు కేటాయించడంపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలుఅసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. రోడ్లలో వెళ్లే వాహనాలు కాలుష్యపు పొగనువదలడం లేదా, కేవలం రెండుగంటలే వాహనాలు నడపాలని షరుతు విధించడం సాధ్యమా అని పలువురు దుయ్యబట్టారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: బాణసంచా కాల్చడం ద్వారా ఏడాదికోసారి సందడి చేసుకునే దీపావళి పండుగపై షరుతులు ఏంటి, బాణసంచా కాల్చేందుకు వేళల కట్టుబాటేంటి.. అన్నింటినీ ధిక్కరిస్తాం.. అంటున్నారు పలువురు పౌరులు. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకు అందరూ కలిసి జరుపుకోవడమే దీపావళి ప్రత్యేకతని చెన్నై టీ.నగర్కు చెందిన స్వప్న అన్నారు. దీపావళి వేళల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం చోద్యంగా ఉందని ఆమె అన్నారు. అనవసరమైన ఇలాంటి కట్టుబాట్ల వల్ల మరింత కసిగా అదనపు వేళల్లో బాణసంచా కాల్చాలనే భావన వస్తోందని చెప్పారు. హిందువులకు అనాదిగా వస్తున్న పండుగల్లో దీపావళి కూడా ఒకటి దాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానించాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీదివ్య అనే ఇంజినీరు సుప్రీం తీర్పును సమర్థించారు. దీపావళి కాలుష్యం చిన్ననాటి నుంచే తెలుసు. ఇకనైనా ప్రజల్లో మార్పురావాలి. సినిమాలకు, షికార్లకు వెళ్లడం ద్వారా దీపావళి పండుగ చేసుకోవడం అలవాటు కావాలని అన్నారు. దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చే హక్కును న్యాయస్థానాలు హరించరాదని అముద అనే యువతి అన్నారు. పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండుగంటల గడువును పాటించడం మంచదని వైష్ణవి అనే పారిశ్రామికవేత్త అభిప్రాయపడ్డారు. భయంకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ రోడ్లపై ప్రతినిత్యం వాహనాలు పరుగులు పెడుతుంటే ఏ అధికారి పట్టించుకోవడం లేదు, ఒక్క దీపావళి రోజున కాలుష్యాన్ని అరికడుతారా అని మేట్టుపాళయంకు చెందిన కన్నన్ విమర్శించారు. ఇపుడు దీపావళి బాణసంచాకు రెండుగంటలు విధించారు. భవిష్యత్తులో ఇక మిగిలిన పండుగలకు ఎలాంటి నియమ నిబంధనలు మీదవచ్చి పడతాయోనని భయంగా ఉందని జ్యోతిక అనే కళాశాల విద్యార్థిని ఆందోళన వ్యక్తంచేశారు. దీపావళి అంటేనే టపాసులు అవిలేకుండా పండుగా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పాటించడం సాధ్యం కాదు, నాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. వారిని తెల్లవారుజామున 4 గంటలకు లేపికూర్చునబెట్టి టపాసులు కాల్చేదెలా అని కూలీ కార్మికుడు సుబ్రమణియం ప్రశ్నించారు. సుప్రీంకోర్టు చెప్పింది అంటే పిల్లలకు అర్థం అవుతుందా, వారు వినిపించుకుంటారా అని నిలదీశారు. దీపావళి పండుగకు ఐదురోజులు సెలవులు వచ్చాయి, అయితే రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలనే నిబంధన బాధాకరమని ఆదికేశవన్ అనే పాఠశాల విద్యార్థి అన్నాడు. రెండుగంటల షరతు వల్ల బాణసంచా తయారీదారులు తీవ్రంగా నష్టపోతారు, ప్రజలు సరదాగా పండుగ చేసుకోలేరు, సుప్రీంకోర్టు మరోసారి ఆలోచిస్తే మంచిదని కడలూరుకు చెందిన తంగ ఆనందన్ సూచించారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు బాణసంచా వేళలను కట్టడి చేయడం స్వాగతించదగిందే, అయితే కట్టడి చేయడం అసాధ్యమని వేలూరుకు చెందిన డాక్టర్ శశిరేఖ అన్నారు. బాణసంచా కాల్చే హక్కులను కాలరాయడమేనని నాగర్కోవిల్కు చెందిన పాల్కని అన్నారు. రెండుగంటలు మాత్రమే టపాసులు కాల్చాలని చెప్పడం పిల్లల ఆనందాన్ని హరించడమేనని ఆమె అన్నారు. వేళల పునఃపరిశీలన చేయాలి కేవలం రెండే గంటల నియమాన్ని ప్రజలు అంగీకరించరని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. వీధి వీధికి పోలీసులను పెట్టి వ్యవధిని పర్యవేక్షిస్తారా అని ఆయన ఎద్దేవాచేశారు. దీపావళి అనేది సంతోషంగా జరుపుకునే పండుగ, సంతోషంగానే సాగనివ్వండని అన్నారు. వ్యవధిని పునఃపరిశీలించాలని వీసీకే అధినేత తిరుమావళవన్ కోరారు. బాణ సంచా వేళలను పెంచాలని సమత్తువ మక్కల్ కట్చి అధినేత, నటుడు శరత్కుమార్ కోరారు. పుదుచ్చేరి ఆఫర్ దీపావళి పండుగను పురస్కరించుకుని పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు పలు ఆఫర్లను అందజేసేందుకు సిద్ధమైంది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు, చక్కెర అందిస్తున్నారు. అలాగే రేషన్కార్డుదారులకు కిలో చక్కెర, కొత్త బట్టల కొనుగోలుకు రూ.1000ల నగదు పంపిణీ చేస్తున్నారు. -
టపాసు.. తుస్సు!
సాక్షి, సిటీబ్యూరో: దీపావళి నేపథ్యంలో కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతి ఉందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే అనుమతిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉండే ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయనహెచ్చరించారు. కాలుష్యం పెరగకుండా టపాసులను రెండు గంటలే కాల్చాలని ఇటీవల సుప్రీం కోర్టు నిబంధనలతో నగర ప్రజల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఎక్కువ శాతం ప్రజలు సుప్రీం తీర్పును సమర్థిస్తున్నారు. టపాసుల హోల్సేల్ వ్యాపారులు, డీలర్లు మాత్రం సుప్రీం ఆదేశాలను బాహాటంగా వ్యతిరేకించడంలేదు. రిటైల్ వ్యాపారులు బాణసంచాను కొనుగోలు చేసిన తరువాత సుప్రీం తీర్పు వెలువడటంతో తమ వ్యాపారంపై ప్రభావం పడే అవకాశముందని విక్రయదారులు పేర్కొంటున్నారు. ఏటేటా తగ్గుముఖం పడుతున్న అమ్మకాలు గత రెండు మూడేళ్లుగా బాణసంచా విక్రయాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఈ సారి రెండు గంటల ప్రభావంతో మరింత తగ్గుముఖం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు 30,40 శాతం మంది ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు.ఈ పరిస్థితుల్లో టపాసుల విక్రయాలు తగ్గడం ఖాయమనే నిర్ణయానికి వ్యాపారులు వచ్చేశారు. నగరంలో గత నాలుగేళ్లలో దాదాపు 20 శాతం టపాసుల విక్రయాలు తగ్గాయని, గత ఏడాది దాదాపు 30 శాతం వరకు తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. నగర వ్యాప్తగా దాదాపు వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. పండుగకు ఒకటి రెండు రోజుల ముందు నుంచి రిటైల్ వ్యాపారం ప్రారంభం కానున్నాయి. కనిపించని గ్రీన్ బాణసంచా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రీన్ బాణసంచా కాల్చాలి. అయితే ప్రస్తుతం మార్కెట్లో అవి అందుబాటులోలేవు. వచ్చే ఏడాదికి గ్రీన్ టపాసులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఆసక్తి చూపని వ్యాపారులు గతంలో దీపావళి వస్తోందంటే చాలు చిన్న చిన్న గల్లీల్లో కూడా బాణసంచా విక్రయ దుకాణాలు వెలిసేవి. దాదాపు 5 వేల మంది విక్రయాలు సాగించేవారు. అయితే మూడేళ్ల నుంచి తాత్కాలిక దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీ స్థాయిలోతగ్గింది. 2015 నుంచి ఏటా వెయ్యి దరఖాస్తులు తగ్గుతూ వచ్చాయి. 2017లో ఈ సంఖ్య రెండు వేలకు పడిపోయింది. ఈ ఏడాది ఇంకా విక్రయాలు జోరందుకొలేదు. -
‘2 గంటల’ నిబంధనలో మార్పులేదు
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పండగ రోజుల్లో తెల్లవారుజాము 4 నుంచి 5 వరకు, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో బాణసంచా కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. సంప్రదాయానికి తగ్గట్లు సమయాన్ని మార్చుకోవచ్చని, మొత్తంగా 2 గంటలు దాటొద్దంది. 2 గంటల నిబంధన దేశవ్యాప్తంగా వర్తిస్తుందని జస్టిస్ కోర్టు స్పష్టంచేసింది. పర్యావరణహిత బాణసంచా తప్ప ఇతర రకాల బాణసంచా ఢిల్లీలో విక్రయించడానికి వీల్లేదని తేల్చింది. ఈ నిబంధన ఈ దీపావళికే కాకుండా ఇతర పండగలకూ వర్తిస్తుందని చెప్పింది. నిషేధించిన బాణసంచా నిబంధన ఆన్లైన్ విక్రయాలకూ వర్తిస్తుందని, కోర్టు ఆదేశాలను ఇ–కామర్స్ వెబ్సైట్లు పాటించానలని, లేకుంటే చర్యలు తప్పవని పేర్కొంది. స్థానిక పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ విషయంలో నిఘా పెట్టాలని 23వ తేదీన వెలువరించిన తీర్పులో వెల్లడించింది. అయితే హానికారక బాణసంచాను పూర్తిగా నిషేధించ లేదని, బహుశా వచ్చే ఏడాదికి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని బాణసంచా విక్రయంపై కోర్టును ఆశ్రయించిన ఉత్పత్తిదారులకు తెలిపింది. తాము çతీర్పును తప్పుపట్టలేదని, గత సంవత్సరం బాణసంచాను నిషేధిస్తూ కోర్టు వెలువరించిన తీర్పుపైనే తమ ఆవేదన అని బాణసంచా ఉత్పత్తిదారులు సుప్రీంకు విన్నవించుకున్నారు. -
ఆంక్షలు సరే.. అమలు ఎలా?
సాక్షి,సిటీబ్యూరో: దీపావళి అంటే గుర్తుకొచ్చేది టపాసుల మోతలు.. బాణాసంచా వెలుగు జిలుగులే. అయితే ప్రమోదం మాటున పొంచున్న శబ్ద, వాయు కాలుష్యంతో పాటు పర్యావరణ హననంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక తీర్పును వెలువరించిన విషయం విదితమే. దీపావళి వేళ బాణాసంచాను రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యనే కాల్చాలన్న షరతు విధించింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై గ్రేటర్లో ఉత్కంఠ నెలకొంది. సమయం దాటి టపాసులు పేల్చే వారిని అదుపు చేయడం, అవధులు దాటే కాలుష్యాన్ని లెక్కించడం, లైసెన్సు పొందిన వ్యాపారుల నుంచే కొనుగోళ్లు చేయాలన్న నిబంధన అమలుపై ఎలా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యాన్ని లెక్కించే యంత్రాంగమేది? నగరంలో హెచ్సీయూ, సనత్నగర్, పాశమైలారం, జూపార్కు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి ‘కంటిన్యూయస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ’ అధునాతన యంత్రాలతో వాయు కాలుష్యాన్ని లెక్కగడుతోంది. ఈ యంత్రాలతో గాలిలోని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, బెంజిన్, టోలిన్ వంటి కాలుష్య కారకాల మోతాదును నిత్యం లెక్కిస్తోంది. మరో 21 నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో డస్ట్ శాంప్లర్ వంటి యంత్రాలతో దుమ్ము, ధూళి ఇతర కాలుష్యాలను మాత్రమే లెక్కగడుతోంది. ఇప్పుడు ‘సుప్రీం’ మార్గదర్శకాల ప్రకారం దీపావళికి వారం రోజుల ముందు, తరవాత నగరవ్యాప్తంగా వివిధ రకాల వాయు కాలుష్యాన్ని లెక్కించాలి. అందుకు అవసరమైన సిబ్బంది, కాలుష్య నమోదు కేంద్రాలు లేవు. దీంతో అవధులు దాటే కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తాన్నది సస్పెన్స్గా మారింది. సగానికి పడిపోనున్న విక్రయాలు గ్రేటర్లో ఏటా దీపావళి సీజన్లో సుమారు రూ.100 కోట్ల వరకు బాణసంచా అమ్మకాలు జరుగుతుంటాయి. మహానగరంతో పాటు పొరుగు జిల్లాల వారు కూడా ఇక్కడే క్రాకర్స్ కొనుగోలు చేస్తుంటారు. ఇందులో సుమారు రూ.20 కోట్ల వరకు ఆన్లైన్ అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. ఈసారి దీపావళి నేపథ్యంలో అధిక శబ్దం వెలువడేవి.. ఆకాశంలో కాంతులు వెదజల్లే క్రాకర్స్ను చైనా నుంచి సుమారు రూ.30 కోట్ల సరుకును నగరానికి దిగుమతి చేసుకున్నట్లు అంచనా. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రేటర్లో బాణసంచా అమ్మకాలు సగానికి సగం పడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ‘సుప్రీం’ తీర్పులో ముఖ్యాంశాలివీ.. ♦ దీపావళికి ఏడు రోజుల ముందు, ఆ తరవాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పరిశీలించాలి. ♦ దీపావళి రోజు దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు (35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. ♦ తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతివ్వాలి. ♦ బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలి. ♦ నిషేధిత టపాసులు అమ్మడం, కాల్చడంపై పోలీసు శాఖ నిఘా పెట్టాలి. ♦ టపాసులు పేల్చడం వల్ల తలెత్తే కాలుష్యంపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. గ్రేటర్కు శబ్దకాలుష్య ముప్పు దీపావళి టపాసుల మోత అవధులు మించితే చిన్నారులు, జంతువులపై తీవ్ర ప్రభావం చూపే అకాశం ఉంది. వాయు కాలుష్యంలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదు కూడా భారీగా పెరిగి శ్వాసకోశ వ్యాధులు, కళ్ల సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదముంది. ముఖ్యంగా టపాసులు కాల్చినపుడు వెలువడే శబ్దాలు నివాస ప్రాంతాల్లో 45 డెసిబుల్స్ (ధ్వనిని కొలిచే ప్రమాణం) మించరాదు. కానీ నగరంలో ఆ శబ్దాలు ఏటా 90 డెసిబుల్స్కు మించి నమోదవుతున్నాయి. వీటివల్ల పెంపుడు జంతువులు విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. వాయు కాలుష్యంతో ముప్పే సల్ఫర్ డై ఆక్సైడ్ క్యూబిక్ మీటర్ గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ 80 మైక్రోగ్రాములు మించరాదు. కానీ ఏటా దీపావళికి అవి 450–500 మైక్రోగ్రాములకు చేరుతోంది. దీంతో ఊపిరితిత్తులకు హానితో పాటు బ్రాంకైటిస్ (తీవ్రమైన దగ్గు), శ్వాసకోశ వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ధూళిరేణువులు(ఎస్పీఎం) క్యూబిక్ మీటర్ గాలిలో 100 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ వీటి మొతాదు కూడా 300 మైక్రోగ్రాములు దాటుతోంది. పరిష్కారం ఇలా.. తక్కువ శబ్దం వెలువడే చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పూల్ఛడీ, పెన్సిల్స్ కాల్చాలి. శబ్దాలు కాకుండా వెలుగులు విరజిమ్మే మతాబులను ఎంచుకోవాలి. విపరీత శబ్దాలు కర్ణభేరీకి సోకకుండా చెవుల్లో దూది పెట్టుకోవాలి. ట పాసుల మోత శృతిమించకుండా చూసేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ప్రయత్నించాలి. -
రాజమహేంద్రవరం వద్ద మందుగుండు పేలుడు
-
నిశీధిలో అగ్నిప్రమాదం
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేసే క్రమంలో ప్రమాదశాత్తూ పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన రాజమహేంద్రవరం లాలాచెరువు సుబ్బారావునగర్లోని దేవాడ ముత్యాలరెడ్డి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీపావళి సామగ్రి తయారు చేస్తుండగా పేలుడు జరగడంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో దేవాడ ముత్యాల రెడ్డి, దేవాడ ధనలక్ష్మి, దేవాడ సూర్యకాంతం, దేవాడ వినయ్ రెడ్డి, దేవాడ దుర్గారెడ్డి, కర్రి వైష్ణవి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో దేవాడ ధనలక్ష్మి (35) ఘటనా స్థలంలో మృతి చెందింది. సూర్యకాంతం, వైష్ణవి, వినయరెడ్డి, దేవాడ దుర్గారెడ్డి, పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్పేయ్ సందర్శించి వివరాలు సేకరించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 50వ డివిజన్ కార్పొరేటర్ గుత్తుల మురళీధరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
టపాసులు కాల్చొద్దని అన్నందుకు..
గువహటి : పెళ్లి వేడుకల్లో బాణాసంచా పేలుళ్లను వద్దన్నందుకు 35 సంవత్సరాల వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన అసోంలో చోటుచేసుకుంది. నల్బారి జిల్లాలోని గురతోల్లో మంగళవారం రాత్రి పెళ్లి వేడుకలో బాణాసంచా కాల్చుతుండగా పొరుగున ఉండే జతిన్ దాస్ అభ్యంతరం తెలిపారు. బాణాసంచా కాల్చుతుండగా ఓ టపాసు దాస్ కాలికి తగలడంతో ఘర్షణ ప్రారంభమైందని పోలీసులు చెప్పారు. టపాసులు పేల్చడంపై దాస్ ఆగ్రహం వ్యక్తం చేయగా అతనిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని నల్బారి ఎస్పీ శైలాదిత్య చెటియా తెలిపారు. కాగా వరుడి ఇంటికి పెళ్లికుమార్తె రాకపోవడంతో పెళ్లి జరగలేదని పోలీసులు చెప్పారు. ఘటన నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించారు. ఆరుగురు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. దినసరి కూలీ అయిన బాధితుడు దాస్పై నిందితులు మద్యం మత్తులో దాడికి పాల్పడిఉంటారని స్ధానికులు చెప్పారు. -
కాలుష్యం తగ్గిందా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా వాసికెక్కిన ఢిల్లీ నగరంలో దీపావళిని దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని నివారించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. నగర పరిధిలో బాణాసంచా అమ్మకాలను సుప్రీం కోర్టు నిషేధించింది. డీజిల్ వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే వాహనాల రాకపోకల సంఖ్యను నియంత్రించింది. బుధ, గురువారాల్లో నగరంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిలిపివేసింది. డీజిల్తో నడిచే జనరేటర్ల వాడకంపై నిషేధం విధించారు. వీటికి తోడు టపాసులను కాల్చవద్దంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేశాయి. ఈ చర్యల ఫలితం ఉందా? నగర కాలుష్యం ఏ మేరకు తగ్గిందా? ప్రభుత్వ చర్యలు పాక్షికంగానే ఫలితాలనిచ్చాయని చెప్పవచ్చు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నగరంలో కాలుష్యం సగానికి సగం తగ్గింది. గతేడాది వాతావరణంలో ‘పీఎం–2.5’ స్థాయి గతేడాది 778 పాయింట్లకు చేరుకోవడంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కాలుష్య నగరంగా ఢిల్లీని గుర్తించారు. ఈ పరిస్థితిపై పర్యావరణ పరిరక్షకవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం వాహనాల రాకపోకలను నియంత్రించడం, డీజిల్ వాహనాలను నిషేధించడం తదితర చర్యల వల్ల కొంతమేరకు కాలుష్యం తగ్గింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని భావించిన ప్రభుత్వం సకాలం తీసుకున్న చర్యల వల్ల వాతావరణంలో కాలుష్యం 200 పాయింట్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఇది క్షేమదాయకం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల ప్రకారం వాతావరణంలో కాలుష్యం స్థాయి 25 పాయింట్లకు మించకూడదు. 200 పాయింట్లకు చేరిందంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఉన్నట్లే. భారత దేశంలో ఈ పాయింట్లు 300–500 పాయింట్ల మధ్యనుంచే అత్యంత ప్రమాదకర స్థాయిగా పేర్కొంటున్నారు. 500 పాయింట్లకు మించితే అది ఎంత ప్రమాదకరమో పేర్కొనే పద్ధతే లేదు. 500 పాయింట్లకు మించి పోదన్నతి గతంలో శాస్త్రవేత్తలు వేసిన అంచనా. ఇప్పుడు అనేక సార్లు ఢిల్లీ కాలుష్యం 500 పాయింట్లను దాటింది. ఈసారి బాణాసంచా కాల్పులను నగరంలో నియంత్రించినా పెద్దగా కాలుష్యం తగ్గలేదు. అందుకు కారణం నగరానికి సమీపంలోఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట దుబ్బలను విరివిగా కాల్చివేయడం. అధికారిక లెక్కల ప్రకారం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రతిఏటా 3.50 కోట్ల టన్నుల పంట దుబ్బలను తగులబెడతారు. ఇలా తగులబెట్టడంపై 2015 సంవత్సరం నుంచే దేశవ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ రెండు రాష్ట్రాల రైతులు వినిపించుకోవడం లేదు. ‘పంట దుబ్బలను మంటపెట్టకుండా వాటి రీసైక్లింగ్ కోసమో, మరో అవసరానికి ఉపయోగించేందుకు వాటిని మేము ఎక్కడికి తీసుకపోగలం? ఏం చేయగలం ? దుబ్బను తరలించేందుకు కూడా డబ్బులు ఖర్చుగావా?’ అని చివరి పేరును మాత్రమే చెప్పడానికి ఇష్టపడిని దేవి తెలిపారు. ఆమెది నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోనిపట్ గ్రామం. అంత దూరం నుంచే కాదు, ఉత్తరాది నుంచి వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా దుబ్బ తగులబెట్టిన కాలుష్యం నగరానకి వస్తోందని నాసా ఉపగ్రహం ఇటీవల తీసిన ఫొటోలు బయటపెట్టాయి. కాలుష్యం కారణంగా భారత్లో ఏటా పది లక్షల మంది మరణిస్తున్నారని అమెరికా గత ఫ్రిబవరిలో జరిపిన ఓ అధ్యయనం తెలిపింది. -
టపాసులు కాల్చకండి... దాచుకోండి!
గురువారం దీపావళి పండగ నాడు ఏ రేంజ్లో మోత మోగించేయాలా? అని చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. ‘పొల్యూషన్’ ఇష్టం లేనివాళ్లు టపాసులకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. శ్రద్ధా కపూర్ కూడా అలానే అనుకుంటున్నారు. ‘‘ఈ దీపావళికి క్రాకర్స్ కాల్చి, ఎన్విరాన్మెంట్ను పొల్యూట్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయండి. టపాసులు పేల్చడం వల్ల మూగజీవాలకు హాని కలుగుతుంది’’ అని ‘సాహో’ ద్వారా తెలుగు తెరపైనా మెరవనున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్కు ఫాలోయర్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు ‘బాగా చెప్పారు’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. కొందరు మాత్రం ‘ముందు మీరు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసేలా ప్రవర్తించండి’ అన్నారు. ‘అవును... అందరూ టపాసులు కొని, దాచుకోండి. తర్వాత శ్రద్ధా మూవీ ప్రమోషన్కు కాల్చండి’ అని కామెంట్ చేశారు. అంతేకాదు.. రెండేళ్ల క్రితం శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘హాఫ్ గర్ల్ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్లో క్రాకర్స్ పేలుతున్న ఫొటోను పోస్ట్ చేశాడో ఫాలోయర్. ‘శ్రద్ధా.. మీరు కారు, ఏసీలు వాడొద్దు. ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది’ అని ఓ వ్యక్తి వ్యంగ్యంగా అన్నాడు. ఇంకో వ్యక్తి అయితే.. ‘పాపం.. మూగజీవాలు ఏం పాపం చేశాయి. మీరు నాన్వెజ్ తినడం మానేయండి’ అని రిప్లై ఇచ్చాడు. మంచి చెబుతూ, పోస్ట్ చేసిన వీడియోకు ఇంత నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందని శ్రద్ధా ఊహించి ఉండరు. అందుకే, ఈ కామెంట్స్కి స్పందించకుండా సైలెంట్ అయిపోయారు. -
మతసమస్యా, న్యాయసమస్యా?
నమ్మిన మూగజీవులను ప్రేమించడం, వాటికోసం స్వర్గాన్ని కూడా వదులుకోవడం మన సంప్రదాయం. కానీ దీపావళి రోజున పటాసులను పేల్చి వాటికి భంగం కలిగించడం న్యాయమేనా? నేషనల్ కేపిటల్ రీజియన్లో నవంబర్ ఒకటి వరకు బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ, అక్టోబర్ 9న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. చేతన్ భగత్ లాంటి వాళ్ళు ఈ విషయానికి మత రంగు పులమాలని ప్రయత్నిస్తున్నప్పుడు జస్టిస్ ఏ కె సిఖ్రి ‘‘నా గురించి తెలిసినవారికి నేను ఆధ్యాత్మికవాదిగా కనబడవచ్చు, కానీ ఇది న్యాయానికి సంబంధించిన సమస్య’’ అన్నాడు. కోర్టు ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించింది, మతాలకు కాదు అని నిర్ద్వందంగా ప్రకటించింది. మనం మనుషులం కదా, మనకు అభ్యుదయాన్ని కోరుకునే నాగరికులు ఉంటారు, కోర్టులుంటాయి, విప్లవ పోరాటాలూ ఉంటాయి. అందుకనే కోర్టుకెళ్లి బాణాసంచా వల్ల చాలా కాలుష్యం పెరిగిపోతుందని బాణాసంచా అమ్మకంపై నిషేధం తీసుకొచ్చాం. కానీ, పాపం భూమిపై సమాన హక్కే ఉన్నా పశు పక్ష్యాదులకు ఇవన్నీ ఏమీ లేవు. అందుకే మీరు పేల్చే బాణాసంచాకు మా చెవులు పగిలిపోతున్నాయి, మా గుండెలు ఆగిపోతున్నాయి, బాణాసంచా పేల్చడం ఆపండి అని కోర్టులకు ఎక్కలేకపోతున్నాయి. బాణాసంచాపై సుప్రీం కోర్టు తీర్పు వినగానే నాకు మొదట మా రాజమల్లిక జ్ఞాపకమొచ్చింది. రాజ మల్లిక నాకు ఇప్పుడే కాదు, డాం అని టపాసు పేలిన ప్రతిసారీ జ్ఞాపకమొస్తుంది. రాజమల్లిక సెయింట్ బెర్నార్డ్ జాతి కుక్క. దాదాపు 60 కిలోల బరువు ఉండి, అతి గంభీరమైన ముఖమూ, స్వభావము కలిగిన శున కం ఇది. చుట్టూ హోంగార్డులు ఉండే మా ఇంటిలో మా ఆవును దొంగిలించడానికి దొంగలు పడినప్పుడు, ఎక్కడో మిద్దె పైన ఉన్న రాజమల్లిక, పశువుల దొడ్డిలోని అలజడిని విని మా ఆవును కాపాడింది. మేముండే చోట అతి పెద్ద భూకంపం వచ్చినపుడు గట్టిగా అరిచి మమ్మల్ని హెచ్చరించింది. అలా కాపాడటానికి అవసరమైన శక్తి దానికి సునిశితమైన దాని చెవులు ఇచ్చాయి. అయితే రాజమల్లికకు ఉన్న ఈ శక్తి దానికి ఈ భూమిపైన టపాసులు పేలే ప్రతి పండుగనాడు నరకాన్ని చూపించింది. ఎంత సముదాయిం చినా దాని ఆందోళనను మేము ఆపలేకపోయినప్పుడు పశువైద్యుడు ఆందోళనను తగ్గించే మాత్రలు కానీ, స్వల్ప స్థాయిలో మత్తు ఇంజెక్షన్ కానీ ఇచ్చేవాడు. చివరికి ఒక వినాయక చవితి నిమజ్జనం రోజు టపాసుల శబ్దానికి భయపడి గుండె ఆగి రాజమ్మ మరణించింది. రాజమల్లికను ‘‘అక్క’’ అని భావించే నా కూతురు ఎన్నోసార్లు ఈ టపాసుల విషయాన్ని ప్రపంచానికి తెలి సేట్లు రాయమని నన్ను బతిమాలుకుంటూ ఉంటుంది. సత్యభామ నరకాసురుని వధించినప్పుడు ప్రజలు చాలా సంతోషించి, ఆ అమావాస్య రోజున దీపాలు వెలిగించి, కాంతితో నింపి ఆనందాన్ని ప్రకటించుకున్నారట. మనిషికి ఆనంద ప్రకటన పట్ల మక్కువ చాలా ఎక్కువ. దీపావళి వచ్చే కాలంలోనే వానలు వంకలూ వచ్చి పురుగూ పుట్రా పెరిగిపోయి ఉంటాయి. ఆ సమయంలో బాణాసంచా పేలిస్తే ఆ పొగకు విష పురుగులన్నీ చస్తాయని ఎవరో ఎక్కడో రాస్తే చదివాను. కానీ ఇవాళ మనం కేవలం దీపావళి సమయంలోనే టపాసులు పేల్చి ఆగిపోతున్నామా? నిజానికి మనుష్యులకు పురుగూ పుట్రా కన్నా కూడా తమ ఆనందాన్ని పక్క వీధివారికో, ఊరి చివరి వారికో చెవులలో మోత మోగించి మరీ వినిపించడం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. మన ఈ ఆసక్తి నోరులేని మూగజీవులను ఎంత బాధపెడుతుందో ఆలోచించకపోతే మనం ఆలోచించగల జీవులం ఎలా అవుతాం? పశు పక్ష్యాదులను భయపెట్టి జీవావరణ సమతుల్యతను దెబ్బతీయడం ఇప్పటికిప్పుడు పెద్ద ప్రమాదకారకంగా అని పించకపోవచ్చు కానీ భవిష్యత్తులో అదే పెద్ద చింతనీయమైన విషయంగా మారవచ్చునేమో కదా! మా తాతకి టామీ అనే దేశీ జాతి కుక్క ఉండేదిట. అది ఎప్పుడూ మా తాతను విడువకుండా తిరి గేది. అది చనిపోయాక మా తాత తినే ప్రతిసారీ మొదటి ముద్దను పక్కన పెట్టడం మొదలు పెట్టాడట. మేం పుట్టాక మాకు మాత్రమే కాదు మా ఊరందరికీ తెలుసు గండవరపు సుబ్బరామిరెడ్డి కుక్క పేరు టామీ అని, ఆయన తినే తిండిలోని మొదటి ముద్దకి అది హక్కుదారని. ధర్మరాజు భార్య, తమ్ముళ్లు మరణిం చాక తానొక్కడే ఒక కుక్క తోడుగా స్వర్గారోహణ చేశాడు. మధ్యదారిలో రథం వేసుకొచ్చి ఇంద్రుడు కలిశాడు, ఇక నడవనక్కరలేదు వచ్చి ర«థమెక్కు అన్నాడు. అందుకు ధర్మరాజు అన్నాడట ఈ కుక్క కూడా ర«థం ఎక్కవచ్చా అని. ఇంద్రుడు కుదరదూ అన్నాడట. కుక్కని వదిలివచ్చేయ్ అని బలవంతపెట్టాడట. అప్పుడు ధర్మరాజు ఇంద్రుడితో అన్నాడట ‘స్వామీ! ఈ కుక్కను వదిలి పెట్టడం నాకు కుదరని పని. దీనిని వదిలేసి వచ్చి పొందే స్వర్గం నాకు అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళు’ (మహాప్రస్థానిక పర్వం–59) అని స్వర్గాన్నే తిరస్కరించాడట. చాలామంది అంటున్నారు బాణాసంచా కాల్చడం మన సంప్రదాయం అని. నిజానికి బాణాసంచాకి వాడే గన్ పౌడర్ చైనా వారి ఆవిష్కరణ. అలా చైనా నుంచి టపాసులు పుట్టాయి. నమ్మిన మూగజీవులను హృదయపూర్వకంగా ప్రేమించడం, వాటికోసం స్వర్గాన్ని కూడా వదులుకోవడం మన సంప్రదాయం. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి 91635 69966 -
పటాసులు అవసరమా?
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఢిల్లీలో సుప్రీంకోర్టు బాణాసంచాను నిషేధించడాన్ని ప్రముఖ డిజైనర్ మసాబా గుప్త సమర్థించారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు బిన్నరకాలుగా స్పందించారు. రెండు రోజుల కిందట సుప్రీం నిర్ణయంపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. చేతన్ భగత్ వ్యాఖ్యలపై మసాబా గుప్త విభిన్నంగా స్పందించింది. ‘‘నేను దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. దేశాన్ని ప్రేమించే వాళ్లంతా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటే మసాబా ట్విటర్లో ట్వీట్ చేశారు. డిజైనర్ మసాబా గుప్త.. ప్రముఖ వెస్టిండీస్ క్రీడాకారుడు వివ్ రిచర్ట్స్, నీనా గుప్తల కుమార్తె. మసాబా ట్వీట్పై చేతన్ భగత్ వ్యంగ్య కామెంట్లు చేశారు. నేను అత్యంత స్ఫూర్తివంతమైన వ్యక్తిని నేడు కలిశాను అంటూ ట్వీట్ చేశారు. చేతన్ ట్వీట్కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. pic.twitter.com/VRwKk8sQPm — Masaba Mantena (@MasabaG) October 12, 2017 -
శివకాశి నెత్తిన ఢిల్లీ బాంబు
-
చినకాకానిలో భారీ పేలుడు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిలోని చినకాకాని వద్ద ఉన్న టపాసుల గోదాములో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. గోదాములో బాణాసంచాకు మంటలు అంటుకోవడంతో ఈ పేలుడు జరిగింది. టపాసుల పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో రహదారిపై వాహక రాకపోకలు నిలిచిపోయాయి. -
బాణసంచా అమ్మకాలపై బ్యాన్
-
టపాసుల వ్యాపారుల్లో కనపడని దీపావళి వెలుగు
-
పేలుతున్న మామూళ్ల మతాబు!
– వాణిజ్య పన్నుల శాఖ అధికారుల 'దీపావళి' దందా – పండుగ మామూళ్లు ఇవ్వాలని వసూళ్లు.. షాపును బట్టి రేట్లు – ప్రశ్నిస్తే తనిఖీల పేరుతో బెదిరింపులు కర్నూలు(రాజ్విహార్): దీపావళి పండగకు మామూళ్ల మతాబులు పేలుతున్నాయి. పండగ సందర్భంగా బాణా సంచా సామగ్రి అమ్మే దుకాణాల నుంచి కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మామూళ్లు వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వ్యాపారులను.. తనిఖీల పేరుతో బెదిరిస్తున్నారు. ఆర్డీఓ లైసెన్స్లు ఇచ్చినా.. సాధారణంగా ప్రతి ఏటా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు నిర్ణయించిన స్థలంలో అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టి షాపులు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తారు. ఇందుకు సంబంధిన రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీఓ) అనుమతులు ఇస్తారు. వీటితోపాటు అగ్నిమాపక శాఖ, పోలీసుల, అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల ఆవరణంలో బాణాసంచా అంగళ్లు పెట్టుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే వ్యాపార లావాదేవీలను బట్టి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు అధికారులు సందట్లో సడేమియాలా మామూళ్ల దందాకు తెరలేపారు. దీపావళి టపాసులు అమ్మే వ్యాపారుల నుంచి రూ.2వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. సామూహికంగా ఏర్పాటు చేసే షాపులతోపాటు చిన్నాచితకా కిరాణం షాపుల వద్ద బాణాసంచా సామాగ్రి తెచ్చుకునే వారి నుంచి కూడా వసూళ్లు మొదలు పెట్టారు. రూ.7.50లక్షల వరకు మినహాయింపు ఉన్నా.. చిరు వ్యాపారులు.. వాణిజ పన్నుల శాఖ లైసెన్స్లు కలిగి ఉండరు. వీరికి పన్నుల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. రూ.7.50లక్షలకు పైబడి లావాదేవీలకు ఉన్న అంగళ్ల నుంచి 14.5శాతం పన్నులు వసూలు చేస్తారు. కాని ఆ కింది స్థాయి అధికారులు ఈ నిబంధన పక్కన పెట్టి ఒక అడుగు ముందుకేశారు. కొందరు ఏసీటీఓలకు తోడు ఉద్యోగులు జతకట్టి బాణసంచా దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. కింది నుంచి పైవరకు ఇవ్వాలని రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ఒక్కోక్క దుకాణం నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాదూకూడదంటే దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కర్నూలులోని పాతబస్టాండ్, నెహ్రూ రోడ్డులోని పలు ప్రాంతాల్లో మామూళ్లు ఇవ్వనందుకు తనిఖీలు చేసినట్లు సమాచారం. ఈ దందా లక్షల రూపాయాలకు చేరినట్లు తెలుస్తోంది. అధికారులు, వ్యాపారులకు మధ్య కొందరు అకౌంటెంట్లు, ఆడిటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మామూళ్లు అడిగితే ఫిర్యాదు చేయండి : పి. నాగేంద్ర ప్రసాద్, సీటీఓ, కర్నూలు–1సర్కిల్. పెద్ద వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు కలిగి ఉండాలి. రూ.7.50లక్షల లోపు వ్యాపారం ఉంటే ట్యాక్స్ పరిధిలోకి రారు. మామూళ్లు అడుగుతున్నట్లు నా దృష్టికి రాలేదు. ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయండి. వాటిపై విచారించి చర్యలు తీసుకుంటాం. -
మాయావతి బాంబులు వచ్చాయి..!
లక్నో: వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో వేడెక్కిన రాజకీయ వాతావరణాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. దీపావళి పండగ సందర్భంగా బాణసంచా అమ్ముకునేందుకు రాజకీయ నేతల పేర్లను వాడుకుంటున్నారు. టపాకాయలకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి పేర్లు పెట్టారు. మాయావతి బాంబులు, సమాజ్వాదీ పార్టీ రాకెట్స్ పేరుతో టపాకాయలను అమ్ముతున్నారు. రాకెట్స్ ఉన్న ప్యాకెట్లపై సమాజ్వాదీ రాకెట్స్ అని రాసి, వాటిపై ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఫొటోను ముద్రించారు. ములాయం తన స్నేహితుడు అమర్ సింగ్కు స్వీట్లు తినిపిస్తున్నట్టుగా ప్యాకెట్లపై ఉంది. మరికొన్ని ప్యాకెట్లపై మాయవతి ఫొటోను ముద్రించి, పక్కన యాంగ్రీ బాంబ్స్ అని రాసి వుంది. థౌజండ్ వాలా టపాకాయలకు అఖిలేష్ కీ లారీ అన్లిమిటెడ్ అని పేరు పెట్టి ఆయన ఫొటో వేశారు. ఇటీవల ములాయం కుటుంబంలో కలహాలు రావడం, సమాజ్వాదీ పార్టీలో తీవ్ర విబేధాలు ఏర్పడం, కొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు హోరాహోరీగా పోరాడుతుండటంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు టపాకాయలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. -
కాల్చాల్సింది క్రాకర్స్ కాదు మీలో ఉన్న అహాన్ని..!
-
వాతావరణాన్ని కలుషితం చేయోద్దు
-
దీపావళి సందడి
-
దండుకునేందుకే..దందా
టీడీపీ నేతల గుప్పిట్లో క్రాకర్స్ అసోసియేషన్ టపాసుల వ్యాపారులతో సమావేశం నిర్వహించిన ఆ పార్టీ నేతలు ఒక్కో దుకాణం నుంచి రూ.50 వేలు డిమాండ్ అధికారులదీ అదే బాట జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 380 దుకాణాల్లో బాణాసంచా విక్రయాలు సాగనున్నాయి. ఇందులో అనంతపురం నగర ‡పరిధిలో 150 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం దుకాణాల్లో వ్యాట్ రిజిస్ట్రేషన్ కల్గినవి 15లోపే. తక్కిన వాటికి దీపావళి నేపథ్యంలో తాత్కాలిక లైసెన్స్ జారీ చేస్తారు. దీపావళి బాణాసంచాలో 145 రకాలు ఉంటాయి. తక్కువ అంటే కనీసం వంద రకాలు విక్రయిస్తారు. సరుకు కొనుగోలుకు కనీసం రూ.5 లక్షలు వ్యాపారులు ఖర్చు చేయాలి. 380 మంది వ్యాపారులు కనీస ధరకు బాణాసంచా కొనుగోలు చేసినా రూ.19 కోట్లు అవుతుంది. అయితే.. కొన్ని దుకాణాలు భారీగానే కొనుగోలు చేస్తాయి. మొత్తమ్మీద జిల్లాకు రూ.19–25 కోట్ల విలువైన సరుకు చేరుతుంది. ఒక్క ‘అనంత’లోనే రూ. 8–10 కోట్ల సరుకు కొనుగోలు చేస్తారు. కొనుగోలు ధర కంటే 60–70 శాతం లాభానికి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన వీటి విక్రయాల ద్వారా కనీసం రూ.50 కోట్లు వ్యాపారులకు లాభం చేకూరుతుంది. రంగంలోకి టీడీపీ నేతలు నగర పరిధిలోని దుకాణాల నిర్వహణను గతంలో బీజేపీ నేత సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టేవారు. గత ఏడాది టీడీపీ నేత రాయల్ మురళీ అధ్యక్షునిగా, కార్పొరేటర్ రాజారాంతో కలిసి దుకాణాలు నిర్వహించారు. నిర్వహణ పేరిట గత ఏడాది ఒక్కో వ్యాపారి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. అధికారులకు భారీగా మామూళ్లు ఇవ్వాలని చెప్పి వసూళ్లు చేసినా..వారికి ఇవ్వకపోవడంతో పండుగ రోజు, ఆ ముందురోజు తనిఖీల పేరుతో వ్యాపారులను వేధించి జరిమానాలు వసూలు చేశారు. దీంతో మురళీ, రాజారాం తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది కూడా వీరే వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. స్థానిక 36వ డివిజన్లోని పార్కులో ఆదివారం వ్యాపారులతో సమావేశమయ్యారు. ‘చంద్రదండు’ నేత ప్రకాశ్ నాయుడుæ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్మురళీ, రాజారాం సమావేశానికి హాజరయ్యారు. గత ఏడాది పరిణామాలను వివరిస్తూ వ్యాపారులు వీరిపై తీవ్రస్థాయిలో మాటల దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే.. అధికారులకు డబ్బు ఇచ్చామని, వారు తీసుకుని కూడా తీసుకోనట్లు మాట్లాడుతున్నారని సర్దిచెప్పారు. ఈ ఏడాది అలాంటిదేమీ జరగదని హామీ ఇస్తూ.. ఒక్కొక్కరు రూ.50 వేలు చెల్లించాలని సూచించారు. వ్యాపారుల్లో అధికశాతం ఆర్యవైశ్యులు ఉన్నారు. వీరు దీన్ని వ్యతిరేకించారు. కొన్నేళ్లుగా వ్యాపారాలు చేస్తున్నామని, రూ.10వేల ఖర్చుతో అంతా జరిగేదని గుర్తు చేశారు. ఇప్పుడు మీకు రూ.50వేలు, బాణాసంచా విక్రయాలు జరిపే కూలీలు, కరపత్రాలు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.50 వేలు కలిపి మొత్తం రూ.లక్ష ఖర్చొస్తుందని, చేసే వ్యాపారం ఖర్చులకే సరిపోతుందని వాదించినట్లు సమాచారం. కానీ కచ్చితంగా రూ.50 వేలు ఇవ్వాల్సిందేనంటూ ఓ ప్రజాప్రతినిధి మాటగా చెబుతున్నామని వారు హుకుం జారీ చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఖర్చు మూరెడు...లాభం బారెడు 36 డివిజన్ పార్కు సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. గ్రౌండ్ ఉచితం. మూడురోజులకు ఒక్కో దుకాణానికి రోజుకు రూ.2వేల అద్దె చొప్పున రూ. 9లక్షలు, లైటింగ్ కోసం మరో రూ.లక్ష, ఇతర ఖర్చులు ఇంకో రూ.లక్ష కలిపినా మొత్తం రూ.11 లక్షల ఖర్చవుతుంది. ఇది కాకుండా రెవెన్యూ, పోలీసుశాఖకు రూ.5లక్షలు, విజిలెన్స్, కమర్షియల్ ట్యాక్స్, ఫైర్కు రూ.4 లక్షలు, తూనికలు, కొలతల శాఖకు, ట్రాన్స్కోకు రూ.లక్ష ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది. అంతా కలిపినా రూ.23 లక్షలకు మించి ఖర్చు రాదు. అయితే.. దుకాణానికి రూ.50వేల చొప్పున 150 దుకాణాలకు రూ.75 లక్షలు వసూలవుతుంది. అంటే రూ.52 లక్షలు నిర్వాహకులకు మిగులుతుందన్నమాట! అంతా ‘కమర్షియల్’ బాణాసంచా విక్రయాలపై 14.5 శాతం పన్ను వసూలు చేయాలి. నిబంధనల ప్రకారం రూ.7.5 లక్షల సరుకు ఉంటేనే లైసెన్స్డ్ డీలర్గా గుర్తించి చలానాలు ఇస్తారు. చాలామంది సరుకును రూ.5లక్షలలోపు అధికారులకు చూపిస్తారు. దీంతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కింద ఒక్కో స్టాల్ నుంచి రూ.15–20 వేలు వసూలు చేస్తారు. 2013లో ఇలానే వసూలు చేశారు. కానీ జిల్లాలోని దుకాణాలన్నింటికీ కలిపి కేవలం రూ.1.62లక్షలు ట్రెజరీకి జమ చేశారు. 2014లో నగరంలోనే 90 దుకాణాలకు లైసెన్స్లు ఇచ్చారు. ఒక్కో దుకాణం నుంచి రూ.15వేలు వసూలు చేసి, ఇందులో ట్రెజరీకి ఒక్కరూపాయి కూడా జమ చేయకుండా మొత్తం స్వాహా చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. గతేడాది కూడా కాస్త ట్రెజరీలో చెల్లించి, స్వాహా చేశారని తెలుస్తోంది. ఈ ఏడాది దాదాపు రూ.50కోట్ల వ్యాపారాలు జరగనున్న నేపథ్యంలో కమర్షియల్ అధికారులు జేబులు నింపుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. -
బాణసంచా దుకాణాలకు 37 దరఖాస్తులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: దీపావళి సందర్భంగా శ్రీకాకుళం నరగరం, డివిజన్లోని ఇతర మండలల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటి వరకు 37 దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ వర్గాలు తెలిపారు. గతంలో దుకాణాల అనుమతులను కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చేవి. గత ఏడాది నుంచి రెవెన్యూ డివిజినల్ అధికారులకు దుకాణాల కేటాయింపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం పట్టణంలో 30, నరసన్నపేటలో 4, ఆమదాలవలసలో 2, సరుబుజ్జిలి నుంచి ఒక దరఖాస్తు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించి విపత్తుల శాఖ, పోలీసు, రెవెన్యూ, నగర పాలక సంస్థ, మండల పరిషత్, స్థానిక సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా గడువు ఉంది. -
నిర్లక్ష్యం వహిస్తే.. బూమ్మ్!!
* రేపల్లె మండలంలోని పేటేరు, ఇసుకపల్లిలో అక్రమ బాణసంచా స్థావరాలు? * గతేడాదిలో పేటేరులో భారీ పేలుడు * వ్యక్తి మృతి, 1992లో మరో ఘటన * మరోఘటన సంభవించే అవకాశం? రేపల్లె: దీపావళి పండుగ వస్తుందంటే తీర ప్రాంతలో ఏ ప్రాంతంలో ఎలాంటి ఘటన జరుగుతుందోనని ప్రజానీకం భయాందోళనకు గురవుతుంది.. సరిగ్గా ఏడాది క్రితం పేటేరులో చోటు చేసుకున్న పేలుడు ఘటనకు ఈ శనివారానికి ఏడాది పూర్తయ్యింది. గత సంవత్సరం పేటేరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో అనధికారికంగా మందుగుండు సామగ్రిని గచ్చుకింద గొయ్యితీసి దాచిపెట్టాడు. దీపావళి సందర్భంగా వేరోచోటికి తరలించేందుకు యత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విస్ఫోటనం జరిగి ఓ వ్యక్తి ఇంటి పైకప్పుకు బలంగా కొట్టుకొని కిందపడ్డాడు. ప్రమాదంలో ఆ వ్యక్తి తునాతునకలై దుర్మరణం చెందాడు. ఆ దెబ్బకు ఇంటి వాసాలు, పెంకులూ ధ్వంసమయ్యాయి. ప్రమాదం సంభవించిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఏడాది దసరా, దీపావళి సీజన్ ప్రారంభమైంది. అక్రమంగా మందుగుండు సామగ్రి తయారీపై స్థానికంగా భయాందోళనలు వ్యాపిస్తున్నాయి. 1992లో ఓల్డ్టౌన్లో భారీ పేలుడు.. 1992లో పట్టణంలోని ఓల్డ్టౌన్లో బాణాసంచా తయారు చేస్తున్న ఓ స్థానవరంలో భారీ పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొన్నాళ్ల తర్వాత ఓ మహిళ ఇంట్లో కొన్నిరకాల మందుగుండు సామగ్రిని నూరుతుండగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. పేటేరు తాటాకు టపాసులకు ప్రసిద్ధి.. దీపావళి పండుగ వినగానే తీరప్రాంతంలోని ప్రజలకు గుర్తుకు వచ్చేది తాటాకు టపాసులు, తారాజువ్వలు. జిల్లాలోనే తాటాకు టపాకాయలు, తారాజువ్వల తయారీకి మండలంలోని పేటేరు, ఇసుకపల్లి ప్రసిద్ధి చెందినవని ప్రజలకు తెలిసిన విషయమే. పండుగ సందర్భాలలో ఈ ప్రాంతాల్లో లైసెన్స్లు లేకుండానే ఏటా టపాసుల తయారీ జరుగుతుంది. గతంలో ప్రమదాలు సంభవించిన ఘటనలూ ఎన్నో ఉన్నా ప్రమాదం జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడమే తప్ప పెద్దగా ప్రభావం చూపేంతా చర్యలు ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం. మండలంలో దీపావళి మందుగుండు సామగ్రి అక్రమ తయారీని, విక్రయాలను నివారించితేనే మరో ప్రమాదం సంభవించుకుండా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. -
అగ్నిప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
రామచంద్రాపురం (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ముచ్చుమిల్లి వీధిలోని సాయిబాబా ఆలయ సమీపంలో నివాసముండే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఇంట్లో బాణాసంచా నిల్వ ఉంచడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వాణి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. మంటలు వేగంగా చెలరేగడంతో ఇరుగుపొరుగువారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఫైరింజన్ మంటలను ఆర్పుతోంది. -
ధరలు మోగినా.. దివాళి తగ్గలే
హైదరాబాద్: మహా నగరాన్ని ఆనంద డోలికల్లో ముంచే వెలుగుల పండుగ దీపావళి. ఈ రోజు చీకటి పడక ముందే తారాజువ్వ పెకైగరాలి.. ఇంటి ముందు టపాసులు పేలాలి.. చిచ్చుబుడ్లు వెలుగులు విరజిమ్మాలి.. సీమ టపాకాల కాల్పులతో వీధి మోతెక్కిపోవాలి. వాటిని కాలుస్తూ మనసు నిండా ఆనందం నిండిపోవాలి. కానీ ఈ ఏడాది బాణసంచా ధరలు బాగా పేలాయి. అయినా సరే గిరాకీతో విక్రయాలు రాకె ట్లలా పైపైకి దూసుకెళ్లాయి. పండుగ సందర్భంగా నగరంలో మంగళవారం పలుచోట్ల బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసినా.. ఓ ప్రాంతంలో కొనుగోళ్లతో కిటకిటలాడాయి. మరోచోట వ్యాపారం లేక వెలవెలబోయాయి. సనత్నగర్, సికింద్రాబాద్, మలక్పేట, ఉస్మాన్గంజ్, తదితర ప్రాంతాల్లోని హోల్సేల్ దుకాణాల న్నీ మంగళవారం కోనుగోళ్లతో కిటకిటలాడాయి. అయితే, గ్రేటర్లోని ఇతర ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన దుకాణాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వినియోగదారులు మాత్రం బాణ సంచాలో కొత్త వెరైటీస్ కోసం ఆరా తీయడం కన్పించింది. సోమవారం నెమ్మదిగా ప్రారంభమైన కొనుగోళ్లు మంగళవారం ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం మేర విక్రయాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లో మంగళవారం కూడా బాణ సంచా కొనుగోళ్లు నెమ్మదిగా సాగడం రిటైల్ వ్యాపారులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి గతంలో 10 రోజుల ముందునుంచే నగరంలో దీపావళి బాణాసంచా కొనుగోళ్ల సందడి కన్పించేది. దిగుమతులు, ఎగుమతులు, క్రయ విక్రయాలతో మార్కెట్లన్నీ నిండుగా ఉండేవి. ఈసారి భద్రత దృష్ట్యా బాణ సంచా విక్రయాలపై పోలీసు శాఖ పక్కాగా నిబంధనలు విధించడంతో నిర్దేశిత ప్రాంతాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసి, నిర్ణీత వ్యవధిలోనే విక్రయాలు జరపాల్సి వచ్చింది. ధరలు పెరిగినా కొనుగోళ్ల జోష్.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బాణ సంచా రేట్లు పెరిగాయి. శివకాశిలో అనానుకూల పరిస్థితుల వల్ల ఈసారి డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో ధరల మోతకు ఓ కారణమైంది. బాణసంచా ఉత్పత్తి క్షేత్రమైన శివకాశిలోనే 10 శాతం మేర ధరలు పెరగ్గా, ఇక్కడికి వచ్చాక మరో 20 శాతం లాభం వేసుకొని 30 శాతం మేర ధరల పెరుగుదలను వ్యాపారులు చూపిస్తున్నారు. నగరంలోని 60 మంది హోల్సేల్ ట్రేడర్స్ శివకాశి నుంచి సరుకు దిగుమతి చేసుకొని రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. కనీసం 15 రోజుల ముందు నుంచే చిల్లర వ్యాపారులు కొనుగోళ్లు జరిగేవి. కానీ ఈ ఏడాది హోల్సేల్ వ్యాపారులు నెల రోజుల ముందే సరుకు తెచ్చినా పోలీసు నిబంధనలతో రిటైల్ కొనుగోళ్లు మాత్రం ప్రారంభించ లేకపోయారు. గత ఏడాది రూ.100 కోట్ల వ్యాపారం జరిగిందని, ఈ ఏడాది రూ.150-200 కోట్లకుపైగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా. కొత్త కాంతులివీ.. ఈ ఏడాది దీపావళి వేడుకల్లో కొత్త కాంతులు ఆవిష్కరించేందుకు హోల్సేల్ వ్యాపారులు విభిన్నమై వెరైటీస్ను మార్కెట్కు పరిచయం చేశారు. కొత్త ఉత్పత్తులుగా 25 రకాల రాకెట్లు, చిచ్చుబుడ్లు ఇతర పేలుడు పదార్థాలు మార్కెట్లోకి వచ్చాయని సనత్నగర్ క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రధానంగా గోల్డెన్ విజిల్, కార్గిల్ బుల్లెట్, గోల్డెన్ డ్రాప్స్, స్టూటింగ్ స్టార్, గోల్డ్ రష్, రెయిన్బో, జాక్పాట్, చెన్నై బ్యూటీ, కేరళ బ్యూటీ, బుల్లెట్ రెయిన్, గ్రీన్పార్క్, పనోరమ, స్నాజీ జిమ్నా, యమ్నీ.. యమ్నీ, జాగ్ బజర్, రా పవర్, నయగరా ఫాల్స్, కిక్ షాట్స్, హాట్ గర్ల్, హాట్ మిర్చి, సిటీ నైట్, 2000 బగ్స్.. ఇలా వివిధ పేర్లతో టపాసులు మార్కెట్ను ఏలుతున్నాయి. చైనా టపాసులపై నిషేధం.. గతంలో దేశీయ టపాసుల కంటే తక్కువ ధరకు లభించే చైనా టపాసులు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపేవారు. కానీ ఈసారి వాటిని విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేయడంతో చైనా సరుకు దిగుమతి చేసుకొన్న పలువురు వ్యాపారులు వాటిని గోదాములకే పరిమితం చేశారు. బాగా తెలిసిన వినియోగదారులు వస్తే తప్ప ఆ సరుకును బయటకు తీయలేదని తెలుస్తోంది. కొందరు హోల్సేల్ వ్యాపారులు తమవద్ద ఉన్న చైనా సరుకును రహస్యంగా జిల్లాలకు తరలించి విక్రయించినట్లు వినికిడి. -
కామెడీ క్రాకర్స్
-
టెన్త్ క్లాస్లోనే గుడ్బై చెప్పా: రకుల్ ప్రీత్ సింగ్
నా చిన్నతనంలో క్రాకర్స్ చాలా ఇష్టంగా కాల్చేదాన్ని. టెన్త్క్లాస్లో మాత్రం వీటికి గుడ్బై చెప్పేశా. ఎందుకంటే వీటిని పేల్చడం వల్ల ఎంత ఆనందం కలుగుతుందో, అంతకు మించిన అనర్ధాలు కూడా ఉంటాయి. ఆ వాస్తవం అప్పుడే తెలుసుకున్నా. అప్పటి నుంచీ వాటి జోలికి వెళ్లలేదు. ఏడాదికోసారి ఈ పండగ పేరుతో క్రాకర్స్ కాలిస్తే పర్యావరణానికి చాలా నష్టం. పైగా మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే జంతువులకు కూడా హాని జరుగుతుంది. జంతువులతో పాటు మనకు కూడా దుష్ఫలితాలు సంభవిస్తాయి. అయినా ఎవరూ వీటి గురించి దృష్టి పెట్టడం లేదు. నేనైతే దీపావళిని ఆస్వాదిస్తాను కానీ, క్రాకర్స్ కాల్చను. మరి మీరు కూడా కాలుస్తారో లేదో మీ ఇష్టం. -
ఈ దీపావళి నాకు చాలా స్పెషల్! - సయేషా
లాస్ట్ ఇయర్ వరకూ దీపావళిని ఇంట్లోనే జరుపుకున్నా. ఈ దీపావళి మాత్రం నాకు చాలా స్పెషల్. నా ఫస్ట్ మూవీ ‘అఖిల్’ ఈ దీపావళికి విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. చిన్నతనం నుంచి నేను చాలా సెలైంట్ అండ్ కామ్గోయింగ్. క్రాకర్స్ అంటే చాలా భయం. అందుకే చిన్నతనం నుంచి టపాసులు కాల్చేదాన్ని కాదు. ప్రతి ఏడాది దీపావళికి మాత్రం కచ్చితంగా పూజ చేస్తాం. రంగు రంగుల ముగ్గులతో మా ఇల్లు కళకళలాడిపోతుంది. మీరంతా ‘అఖిల్’ను చూసి ఆనందించండి. దీపావళిని ఆస్వాదించండి. -
బాణసంచా గోదాములో భారీ అగ్నిప్రమాదం
దీపావళి పండుగ సంబరాల సమయంలో నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్రాకర్స్ గోదాములో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగి మంటలు ఎగసిపడ్డాయి. టపాసుల పేలుళ్లకు ఆ ప్రాంతం దద్దరిల్లింది. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ప్రమాద తీవ్రత, పేలుళ్లతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
కోట్ల రూపాయల బాణాసంచా సీజ్
మంగళగిరి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలంలోని ఆత్మకూరులో ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 2.20 కోట్ల విలువైన బాణాసంచాను ఆదివారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన పి. వెంకటేశ్వరరావు దీపావళి పండుగ సందర్భంగా విక్రయించేందుకు అదే గ్రామంలోని ఓ క్లబ్ వెనుక గోడౌన్లో ఈ సరుకును నిల్వ చేశారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న గుంటూరు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి సరుకుతో పాటు గోదామును కూడా సీజ్ చేశారు. -
‘ఆన్లైన్’ టపాసు పేలింది!
సొమ్ము చేసుకున్న చోటా ఇ-కామర్స్ వెబ్సైట్లు సాక్షి సెంట్రల్డెస్క్: ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, దుస్తులు, ఇతర వస్తువులను ఆన్లైన్లో కొనుక్కోవడం అలవాటుగా మారిన ప్రభావం ఇప్పుడు దీపావళి టపాసులపైనా పడింది. ఎన్నడూ లేని స్థాయిలో ఈ ఏడాది క్రాకర్స్ బిజినెస్ ఆన్లైన్ మయం అయ్యింది. మొత్తంగా టపాసుల వ్యాపారంలో గణనీయమైన తరుగుదల నమోదైందని వ్యాపారవర్గాలు ఒకవైపు చెబుతున్నా ఆన్లైన్లో మాత్రం రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. పెద్ద పెద్ద వెబ్సైట్లు కాకుండా, ఆన్లైన్లో టపాసుల అమ్మకాల్లో యువ ఎంటర్ప్రెన్యుయర్ల హవా నడిచింది. ఒకవైపు ఆఫ్లైన్లో కూడా టపాసులు దొరుకుతున్నా.. నగర, పట్టణ ప్రాంతాల వాళ్లు ఆన్లైన్ అమ్మకాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముం దస్తుగా వెబ్సైట్లను ప్రారంభించి వాటి ద్వారా బాణసంచాను అమ్మకానికి పెట్టిన వారి పంట పండింది. కుప్పలు తెప్పలుగా వెబ్సైట్లు..! ఇప్పటికే బాణసంచా వ్యాపారంలో ఉన్నవారు, ఆన్లైన్ మార్కెటింగ్పై ఆసక్తి ఉన్న టెక్కీలు... వెబ్లో టపాసుల వ్యాపారానికి దిగారు. రంగురంగుల హోంపేజీలతో, ఆకట్టుకునే ఆఫర్లతో టపాసుల ధరల వివరాలను అందుబాటులో ఉంచారు. టపాసులను కొనుక్కోవడానికి ఆన్లైన్ను ఆశ్రయించిన వారిని ఈ సైట్లు ఆకట్టుకున్నాయి. ఒక్కసారి గూగుల్లో ‘ఆన్లై న్ క్రాకర్స్ సేల్’ అనే కీ వర్డ్ను కొడితే కొన్ని వందల సైట్లు ప్రత్యక్షం అవుతాయి. బయట మార్కెట్తో పోలిస్తే ఈ వెబ్సైట్లు తక్కువ ధరలోనే టపాసులను అందుబాటులో ఉంచడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. మొత్తం టపాసుల అమ్మకాల్లో 15% వీటి వాటా ఉంటుందని విశ్లేషకుల అంచనా. రూ.వేల కోట్ల వ్యవహారం అయిన దీపావళి టపాసుల వ్యాపారంలో ఇదీ పెద్ద మొత్తమే. పోటీలోలేని పెద్ద సైట్లు.. ఆన్లైన్ మార్కెటింగ్లో ప్రధానంగా కొన్ని వెబ్సైట్ల గుత్తాధిపత్యం ఉందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే దీపావళి సందర్భంగా కూడా ఆ సైట్లు.. స్మార్ట్ఫోన్ల పై ఆఫర్లు, సోఫాలు ఇతర గృహావసరాల అమ్మకాల మీదే దృష్టిపెట్టాయి. అవి ఆ సందడిలో ఉండగానే చిన్నచిన్న వ్యాపారస్తులు బాణసంచా మార్కెట్లో ఆన్లైన్ను మార్కెట్ను ఆక్రమించేశారు. అమెజాన్డాట్కామ్ వంటి సైట్లు ఈ ఆన్లైన్ టపాసుల వ్యాపారాన్ని చేస్తున్నా వెనుకబడ్డాయి. ముందుస్తుగానే క్లోజ్ అవుతుంది! నవంబర్ 11న దీపావళి. ఆ రోజు సాయంత్రానికల్లా డెలివరీ ఇవ్వగలిగిన ఆర్డర్లనే వెబ్సైట్లు తీసుకుంటున్నాయి. టపాసుల రవాణాకు పరిమితులున్న నేపథ్యంలో కొన్ని వెబ్సైట్లు అప్పుడే ఆర్డర్లను తీసుకోవడాన్ని ఆపేస్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమే.. ఈసారి రికార్డుస్థాయి ఆర్డర్లను తీసుకున్నట్లు ఛఠడౌజ్ఛీఛిట్చఛిజ్ఛుటట.జీ అనే వెబ్సైట్ నిర్వాహకుడు తెలి పారు. ఆన్లైన్లో కొనుక్కోవడంలో చాలా సౌలభ్యాలున్నాయని ఛిట్చఛిజ్ఛుటటఝ్ఛ్చ.ఛిౌఝ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. షాప్కు వెళితే ఒక్కోసారి బడ్జెట్ రెట్టింపు కావొచ్చని, అదే ఆన్లైన్లో అయితే బడ్జెట్ పరిమితులతో కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. -
అరకోటి విలువైన బాణాసంచా స్వాధీనం
కోటగుమ్మం (రాజమండ్రి) : రాజమండ్రి నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.50 లక్షల విలువైన బాణాసంచాను అధికారులు సీజ్ చేశారు. నగరంలోని మోచీ వీధిలో ఉన్న అరవ సుబ్బరాజు అనే వ్యాపారికి చెందిన ఏడు గోదాములపై మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులు సోదాలు చేశారు. ఆ గోదాముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ.50 లక్షల విలువైన మందుగుండు సామగ్రిని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సోదాల్లో రాజమండ్రి అర్బన్ ఎస్పీ బి.శరత్ బాబుతోపాటు అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
'బిహార్లో బీజేపీ ఓడితే.. పాక్లో క్రాకర్స్'
బిహార్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం బిహార్లోని రక్సల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. 'ఈ దేశంలో గెలుపు ఓటములు జరుగుతూనే ఉంటాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ఓటమి పాలైతే.. పాకిస్థాన్లో క్రాకర్స్ కాల్చుతారు. అలా జరగాలని మీరు కోరుకుంటున్నారా?' అని అన్నారు. దీనికి జవాబుగా ర్యాలీకి హాజరైన ప్రజలు 'లేదూ.. లేదూ' అని బదులిచ్చారు. బీజేపీ బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా మోదీ నాయకత్వంలో అభివృద్ధిని ప్రచారాస్త్రంగా వాడుతుంది. బుధవారం జరిగిన మూడోదశ పోలింగ్తో సగానికి పైగా స్థానాలలో పోలింగ్ పూర్తయింది. బీజేపీకి మహా కూటమితో గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన రెండు దశల పోలింగ్ పూర్తయ్యాక నవంబర్ 8న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. -
పిట్టల్ని కొట్టబోతే మంటలంటుకున్నాయి
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు భయాందోళన కలిగించాయి. రన్ వేకు సమీపంలోని బే 55 వద్ద మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక దళం వెంటనే మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. పక్షులను చెదరగొట్టేందుకు పేల్చిన బాణాసంచా ఎండు గడ్డి మీద పడి మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. గత వారం బే 48 వద్ద ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. విమానాలు పైకి ఎగరడానికి, దిగడానికి ముందు పక్షులను చెదరగొట్టేందుకు బాణాసంచా కాల్చడం చేస్తుంటారు. -
బాణసంచా పేలుడు: నలుగురి మృతి
-పది మందికి తీవ్రగాయాలు -వేలూరు జిల్లాలో ఘటన వేలూరు(తమిళనాడు): తమిళనాడు వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని బాణసంచా గోడౌన్లో టపాకాయలు పేలి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గుడియాత్తం సమీపంలోని కల్లపాడి గ్రామంలో ప్రభుత్వ అనుమతితో బాణసంచా గోడౌన్ను అదే ప్రాంతానికి చెందిన సంపత్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గోడౌన్లో పెద్ద పేలుడు సంభవించింది. అక్కడ నిల్వ ఉంచిన టపాకాయలు పేలి భవనం పూర్తిగా నేలమట్టమైంది. శబ్దం విని స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నేల మట్టమైన భవన శిథిలాల మధ్య చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే రామాల గ్రామానికి చెందిన సర్వశరన్(35), జయశంకర్(35), జీవిత(25) మృతి చెందారు. తీవ్రగాయాలైన పది మంది కార్మికులను పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మేఘల(40) మార్గమధ్యంలో మృతి చెందింది. గాయపడ్డ వారిని గుడి యాత్తం, వేలూరు ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. వేలూరు కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ సెంథిల్కుమారి ఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ జరుపుతున్నారు. -
సంబరాలు నింపిన విషాదం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారత అభిమానుల సంబరాలలో విషాదం జరిగింది. బాణాసంచా పేలడంతో ఏడుగురికి గాయాలయిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... దాయాది పాకిస్థాన్ తో తలపడిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించడంతో అభిమానులు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేలుస్తుండగా ఓ గిఫ్ట్ షాపులో పడి మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు గాయపడటంతో పాటు రూ.7 లక్షల నష్టం వాటిల్లిందని షాపు యజమాని తెలిపారు. గాయపడిన వారిలో ఓ నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. -
సరదాగా నవ్వుకోండిలా : బాంబు పేలింది!!
-
తీపివేడుక
దీపావళి పండుగ అంటే ఠక్కున టపాకాయలు గుర్తుకొస్తాయి ఎవరికైనా.. దీపావళి అంటే సందడి చేసే టపాకాయలే కాదు, నోరూరించే మిఠాయిలు కూడా. టపాకాయల శబ్దాలకు భయపడే చిన్నారులకు, వాటి జోలికి వెళ్లలేని వయోధికులకు పండుగ సందడి అంతా మిఠాయిల్లోనే ఉంటుంది. బిజీ బిజీ నగర జీవితంలో ఇళ్లలో మిఠాయిలు వండుకునే వారెందరు..? ఇళ్లలో మిఠాయిల తయారీ చేపట్టినా, ఒకటి రెండు.. మహా అయితే అరడజను వెరైటీలతో సరిపెట్టేస్తారు. ఇంట్లో ఎలాంటి పని పెట్టుకోకుండానే, స్వీట్స్ టేస్ట్ను ఆస్వాదించాలనుకునే వారికి నగరం నలుమూలలా లెక్కలేనన్ని స్వీట్షాపులు ఉన్నాయి. దాదాపు అన్ని షాపుల్లోనూ దొరికే వెరైటీలు ఒకే తీరులో ఉంటే ఎలా! ఎంతో కొంత కొత్తగా... మరింత ఆకర్షణీయంగా ఉండాలి కదా. అందుకే నగరవాసుల టేస్ట్కు తగ్గట్టు విభిన్నమైన మిఠాయిలను అందిస్తున్నారు నగరంలోని స్వీట్ షాప్ల వారు. లోపల స్వీట్ ఎంత మధురంగా ఉంటుందో... దానికి తగ్గట్టుగానే పైన ప్యాకింగ్ కూడా అంతే ఆకర్షణీయంగా చేస్తున్నారు. చూడ్డానికే కాదు... రుచి, శుచి, నాణ్యత కూడా ఉంటేనే గిరాకీ. వాటిపైనా దృష్టి పెడుతున్నారు దుకాణదారులు. అదనంగా 350 వెరైటీలు.. ఈసారి దీపావళి సందర్భంగా అదనంగా దాదాపు మరో 350 వెరైటీల స్వీట్లను అందుబాటులోకి తెచ్చాం. నగరంలో మా వ్యాపారం అనూహ్యంగా పెరిగింది. అంచనాలకు మించి దాదాపు మూడు రెట్లు అమ్మకాలు పెరిగాయి. ఎక్కువగా స్వీట్ గిఫ్ట్ ప్యాక్లు అమ్ముడవుతున్నాయి. ప్యాకింగ్ కోసం మా సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తోంది. - రుషిల్, డెరైక్టర్, దాదూస్ మిఠాయి వాటిక దివాలీ థీమ్స్ బంధువులు, మిత్రులకు కానుకగా ఇచ్చేందుకు వందలాది రకాల మిఠాయిలు ఇప్పుడు నగరంలో దొరుకుతున్నాయి. దీపావళి థీమ్కు తగ్గట్టుగా ప్యాకింగ్లు, స్వీట్లు చేస్తున్నారు. ప్రమిదలు, చిచ్చుబుడ్లు, మతాబుల ఆకారాల్లో రూపొందించిన స్వీట్స్ను వెండిని తలపించే పళ్లాల్లో పెట్టి విభిన్నంగా ప్రజెంట్ చేస్తున్నారు. స్వచ్ఛమైన నేతి మిఠాయిలు, డ్రైఫ్రూట్ స్వీట్స్, సుగర్ ఫ్రీ స్వీట్స్ నోరూరించే రుచుల్లో సిద్ధం చేసి షాపుల్లో ఉంచారు. సౌతిండియన్, బెంగాలీ, రాజస్థానీ, గుజరాతీ, ఆగ్రా, ఢిల్లీ తదితర ప్రాంతాల స్పెషల్ వెరైటీలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. - శిరీష చల్లపల్లి -
భువనగిరి ఆర్బీనగర్లో బాణసంచా పేలుడు
-
బాణసంచా పేలి ఇద్దరి సజీవ దహనం
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఆర్బీనగర్లో ఓ వ్యాపారి అమ్మకానికి తీసుకువచ్చి దుకాణంలోని టపాసులు పేలి ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరొకరు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. భువనగిరి ఆర్బీ నగర్లో వ్యాపారి పెద్ది శ్రీనివాస్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా విక్రయించేందుకు టపాసులు తీసుకువచ్చి దుకాణంలో ఉంచాడు. తన దుకాణంలో కరెంట్ సమస్య ఉందని శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావు(50)కి ఫోన్ చే యడంతో అతడు వచ్చాడు. అదే సమయంలో టపాసులు కొనేందుకు కల్యాణ్(22), పోశెట్టి వచ్చారు. అంతలోనే సెల్ఫోన్ ఓవర్హీట్ కారణంగా టపాకాయలకు అంటుకుని పెద్దఎత్తున మంటలు లేశాయి. గదిలో ఉన్న ముగ్గురికీ మంటలు అంటుకున్నాయి. వారిలో నాగేశ్వర్రావు , కల్యాణ్ అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. పోశెట్టి తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దఎత్తు టపాసులు పేలిన శబ్దాలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. -
అక్రమార్కులకు పండుగే..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : దీపావళి పండుగ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం దేవుడెరుగు.. ఈ దీపావళి పటాకులు మాత్రం అధికారుల జేబులు నింపుతున్నాయి. యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ వ్యాపారంతో సర్కారు ఆ దాయానికి వ్యాట్ రూపంలో రూ.కోట్లలో గండి పడుతుండటం ఒకెత్తయితే.. అక్రమ నిల్వలతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. దీపావళి పండుగ అంటేనే పటాకలకు ఎంతో ప్రాధాన్యం. పేద, ధనిక తారతమ్యం లేకుండా ఈ పండుగను ఆనందంగా జరుపుకోవడం సంప్రదాయం. అయితే జిల్లాలో బాంబుల వ్యాపారం జోరోగా కొనసాగుతోంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లు ఇచ్చి కొందరు బడా వ్యాపారులు రూ.లక్షల్లో వ్యాట్ను ఎగవేస్తున్నారు. పండుగ సీజన్లో జిల్లాలో సుమారు రూ.ఐదు కోట్ల వరకు ఈ వ్యాపారం జరుగుతుందని అంచనా. అధికారికంగానే సుమారు 500 వరకు క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు మంజూరవుతుండగా, అనధికారికంగా మరో 500 వరకు రిటైల్ షాపులు వివిధ పట్టణాల్లో వెలుస్తాయి. ఒక్కో షాపులో సగటున కనీసం రూ.80 వేల వ్యాపారం జరుగుతుంది. ఈ లెక్కన రూ.ఎనిమిది నుంచి రూ.పది కోట్ల వరకు బాంబుల టర్నోవర్ అవుతోంది. పటాకలపై 14.5 శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.1.40 కోట్లు వ్యాట్ రూపంలో జమ కావాల్సి ఉంటుంది. కానీ.. వ్యాట్ పన్ను రాబడి రూ.25 లక్షలకు మించడం లేదు. గతేడాది అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ పటాకలపై కేవలం రూ.22 లక్షలు మాత్రమే వ్యాట్ ఆదాయం వచ్చిందంటే ఏ మేరకు జీరో దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంటే.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం తమ అక్రమ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాఖలో రిజిస్ట్రేషన్ అయిన డీలర్లు జిల్లాలో సుమారు 20 మంది వరకు ఉంటారు. శివకాశి, తమళనాడు, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ డీలర్లు తీరా దీపావళి అయిపోయాక, సరుకంతా విక్రయించుకున్నాక రిటర్న్ (అమ్మకం వివరాలు) దాఖలు చేస్తారు. డీలర్లు కట్టిందే పన్ను.. వచ్చిందే ఆదాయం అనుకుని అధికారులు రిటర్న్ ఎంత అమ్మినట్లు పేర్కొంటే అంతే మొత్తంలో పన్ను వసూలు చేసుకుంటారు. పండగకు ముందు ఈ శాఖ అధికారులు ఒక్క డీలరు గోదాములపై ఆకస్మిక దాడులు చేసి, స్టాకు వివరాలు తీసుకున్న దాఖలాల్లేవంటే వ్యాపారులతో వాణిజ్య పన్నుల అధికారులకు ఉన్న ‘సన్నిహిత’ సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు శాఖల్లో కూడా.. బాంబుల విక్రయాల కోసం రెవెన్యూ శాఖ జారీ చేస్తున్న క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు ఆ మూడు శాఖల అధికారులకు కూడా కాసుల వర్షం కురుస్తోంది. క్యాజువల్ ట్రేడ్ లెసైన్సు మంజూరు కావాలంటే అగ్నిమాపక, మున్సిపల్, పోలీసు శాఖల నుంచి ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్లు) తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు శాఖల నుంచి ఎన్వోసీ వస్తేనే రెవెన్యూ అధికారులు ఈ లెసైన్సులు జారీ చేస్తున్నారు. ఈ ఎన్వోసీలు ఆయా శాఖల అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎన్వోసీ కోసం రూ.500 చొప్పున చాలాన్ రూపంలో ఆయా శాఖలకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ లెసైన్స్ మంజూరుకు నిబంధనల ప్రకారం రూ.రెండు వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ.. మరో రూ.12 నుంచి రూ.15 వేల వరకు అధికారులకు సమర్పించుకోనిదే ఎన్వోసీ మంజూరు కాదనేది బహిరంగ రహస్యం. ఒక్కో శాఖకు ఒక్కో రేటు.. ఒక్క ఎన్వోసీ కోసం మున్సిపల్ అధికారులకు అదనంగా రూ.రెండు నుంచి రూ.మూడు వేల చొప్పున ముట్టజెప్పాల్సిందే. పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి ఇంకా ఎక్కువే. ఒక్కో ఎన్వోసీ ఈ శాఖల అధికారులు రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగ రహస్యంగా తయారైంది. ఇక లెసైన్స్ మంజూరు చేసే రెవెన్యూ శాఖలో కూడా చేయి తడపనిదే పని జరగడం లేదు. మొత్తం మీదా ఒక్క క్యాజువల్ ట్రేడ్ లెసైన్స్ మంజూరు కావాలంటే కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికారుల చేతులు తడపాల్సి వస్తోంది. ఇదంతా ఏటా జరుగుతున్న తంతే. ఈ లెసైన్సుల జారీకి కొందరు వ్యాపారులు దళారులుగా అవతారమెత్తారు. ఈ లెసైన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వద్ద ఈ దళారులు వసూలు చేసి ఏక మొత్తంగా సంబంధిత అధికారులకు ముట్టజెప్పడం పరిపాటిగా తయారైంది. ఈ మామూళ్ల దందా ఒకెత్తయితే.. పటాకలకు సంబంధించిన గిఫ్ట్ ప్యాక్లు అదనం. ఏరియా కౌన్సిలర్లు, చోటామొటా నాయకుల నుంచి మొదలు.. ఫైర్ మెన్లు, కానిస్టేబుళ్లు, ఆయా కార్యాలయాల సిబ్బందికి ఈ గిఫ్ట్ ప్యాక్లు ముట్టజెప్పాల్సిందే. -
బాణాసంచా దుకాణాల లైసెన్స్ల రద్దు
విశాఖ : విశాఖ జిల్లా వ్యాప్తంగా దీపావళి మందుగుండు సామాగ్రి, బాణాసంచా దుకాణాల లైసెన్స్లను రద్దు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ యువరాజ్ హెచ్చరించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీపావళికి విశాఖ ప్రజలు బాణాసంచా కాల్చవద్దని సూచించిన విషయం తెలిసిందే. హుదూద్ బీభత్సంతో ఎక్కడికక్కడ చెట్లు కూలటంతో పాటు, నగరంలో చెత్త కూడా పెద్ద ఎత్తున పేరుకుపోవటంతో బాణాసంచా కాల్చితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు దీపాలు పెట్టి పండుగ జరుపుకోవాలని ఆయన తెలిపారు. -
దీపావళికి బాణాసంచా కాల్చొద్దు: చంద్రబాబు
-
దీపావళికి బాణాసంచా కాల్చొద్దు: చంద్రబాబు
విశాఖ : దీపావళికి ఎవరూ బాణాసంచా కాల్చవద్దని, దీపాలు పెట్టి పండుగ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ చెత్త ఉన్నందున, బాణాసంచా కాల్చితే అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారముందన్నారు. ప్రజల కళ్లల్లో ఆనందం చూడాలని, అవసరమైతే అందరికీ దీపాలు సరఫరా చేస్తామన్నారు. ప్రకృతి విపత్తును ఎదుర్కొంటూ పండుగ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీపావళి కంటే ముందే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల సహకారం మరువలేనిదని చంద్రబాబు అన్నారు. నిన్న విశాఖలో 40 నిమిషాల పాటు తాగునీరు ఇచ్చామని, శనివారం గంటసేపు ఇవ్వాలని చెప్పామని ఆయన తెలిపారు. విద్యుత్ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందన్నారు. డీజిల్, పెట్రోల్పై ఎక్కడా ఫిర్యాదులు లేవన్నారు. ఇంకా చాలాచోట్ల చెట్లను తొలగించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో తనకు ఇంకా సంతృప్తి లేదని ఆయన వ్యాఖ్యానించారు. అందిరతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు. టెలి కాన్ఫరెన్స్లతో నిరంతరం సమీక్షలు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఒక వెబ్సైట్ ద్వారా చెట్ల తొలగింపు, ఇతర కార్యక్రమాలకు కావల్సిన కార్మికులను అందిస్తామని, ఎవరైనా వెబ్సైట్లోకి లాగిన్ అయితే వారికి వృత్తి కార్మికులను అందిస్తామని చంద్రబాబు తెలిపారు. విశాఖను పునర్ నిర్మించడానికి అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యువత అంతా ముందుకు రావాలని కోరారు. విరాళాలు ఇస్తారా? లేక శ్రమదానం చేస్తారా అనేది వారి ఇష్టమన్నారు. హుదూద్ కూడా అసూయ పడేలా విశాఖ నగరాన్ని గతంలో కంటే సుందరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. విద్యుత్, గ్యాస్, తాగునీరు ... వీటన్నింటిని అండర్ గ్రౌండ్ చేస్తామని చంద్రబాబు తెలిపారు. దీనికోసం కన్సల్టెన్సీలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. ఇన్ఫోసిస్ రూ.5 కోట్లు విరాళం ఇచ్చిందని, ఒక గ్రామాన్ని కట్టడానికి ముందుకు వచ్చినట్లు బాబు తెలిపారు. తుఫానులను తట్టుకునే విధంగా కాలనీల నిర్మాణం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
కొన్ని ప్రాంతాల్లో క్రాకర్స్ వ్యాపారం నిషేధం
-
బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
-
బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టపాసులు ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం కలిగించింది. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. సోమవారం రాత్రి తమ్ముడితో కలిసి బయటకు వెళ్లి తిరిగివస్తున్న బాలికపై చిల్లర దొంగ షేక్ జావీద్ అలీ(22) కన్ను పడింది. బాలిక తమ్ముణ్ని ఏమార్చిన జావీద్ టపాసులు కొనిస్తానంటూ ఆ బాలికను ఎన్టీఆర్ నగర్ బస్తీ వెనక ఉన్న హుడా స్థలంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్క కనిపించకపోవడంతో ఆ బాలుడు తల్లికి విషయం చెప్పాడు. గాలింపు చేపట్టగా హుడా స్థలంలో బాలిక కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలికను ఆస్పత్రికి తరలించారు. పరారైన జావీద్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో కూడా స్థానిక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, మహిళలను వేధిస్తుంటాడని కాలనీవాసులు తెలిపారు. -
బాణాసంచా తీసుకెళ్లడం వల్లే రైలు ప్రమాదం?
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని ఇంకా మరువక ముందే విజయనగరం జిల్లాలో అమావాస్య పూట దారుణం జరిగిపోయింది. మృతుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడానికి అవకాశం లేకుండా పోయింది. రాత్రి 9.30 గంటల వరకు సుమారు 18 మంది మరణించి ఉంటారని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటే విభ్రాంతికర వాస్తవాలు బయటపడుతున్నాయి. బొకారో ఎక్స్ ప్రెస్ లో కొంతమంది అనధికారికంగా బాణాసంచా తీసుకెళ్తున్నారని, దానివల్ల ఎస్1 బోగీలోంచి పొగలు రావడం లేదా మంటలు రేగడం చూసి కలకలం రేగిందని కొందరు ప్రయాణికులు అంటున్నారు. అయితే, దీన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రధానంగా ఎస్1 బోగీలోనే మంటలు లేదా పొగ వచ్చాయని, దాని పక్కనే ఉన్న ఎస్2లో నుంచి కూడా కొంతమంది కలకలం వల్ల దూకి ఉంటారని భావిస్తున్నారు. పొగను చూడగానే అప్రమత్తమైన ప్రయాణికులు ఎవరైనా చైన్ లాగి ఉండొచ్చని అంటున్నారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వెంటనే స్లో అవుతున్న రైల్లోంచి చాలామంది కిందకి దూకేశారు. అయితే అప్పటికే రాత్రి 7.15 గంటలు కావడం, శివారు ప్రాంతాలు కావడంతో అసలు లైటింగ్ ఏమాత్రం లేకపోవడం వల్ల ఎదురుగా వస్తున్న రాయగడ్ ప్యాసింజర్ వారికి కనిపించలేదు. అది శరవేగంగా వచ్చి దాదాపు 18 మంది ప్రాణాలు బలిగొంది. -
‘అవినీతి టపాకాయ్’
సాక్షి, అనంతపురం: ఈ దీపావళికి నగరంలో టపాకాయలు పేలడం సంగతి ఎలాగున్నా... ఓ కాంగ్రెస్ నాయకుడి దెబ్బకు మాత్రం టపాసుల వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో టపాసులు విక్రయించాలంటే ఒక్కొక్కరు రూ.50 వేలు ఇవ్వాల్సిందేనంటూ ఆ నాయకుడు హుకుం జారీ చేయడంపై మండిపడుతున్నారు. పైగా ఆ సొమ్ము తనకు కాదని, వివిధ శాఖల అధికారులను ‘మేనేజ్’ చేయడానికేనంటూ ఆ నాయకుడు సాకులు చెబుతున్నాడు. నగరంలో టపాసులు విక్రయించడానికి 47 మంది లెసైన్స్ కలిగి ఉన్నారు. దీపావళి సందర్భంగా కొన్ని రూ.కోట్ల విలువైన టపాసులు విక్రయిస్తుంటారు. గతంలో ఎవరి దుకాణాల్లో వారు అమ్మేవారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఐదేళ్ల నుంచి టపాసుల విక్రయాలను న్యూటౌన్ జూనియర్ కళాశాల మైదానానికి మార్చారు. రెవెన్యూ అధికారులే స్టాళ్లు ఏర్పాటు చేసి సీనియారిటీ ప్రకారం వ్యాపారులకు కేటాయిస్తుంటారు. ఇందుకు కొంత రుసుం వసూలు చేస్తారు. ఇక టపాసుల వ్యాపారులు పోలీసు, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక, వాణిజ్య పన్నులు తదితర శాఖల అధికారులకు ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోందన్న విమర్శలున్నాయి. గత ఏడాది ప్రతి వ్యాపారి ముడుపుల రూపంలో రూ.14 వేల దాకా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఆయా శాఖల సిబ్బందికి టపాసులు కూడా ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీ. ఇలా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. వ్యాపారులు మాత్రం ప్రతి యేటా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అయితే... ఈసారి వ్యాపారుల్లోనే ఒకరైన కాంగ్రెస్ నాయకుడి దెబ్బకు మిగతా వారు హడలెత్తుతున్నారు. వ్యాపారులు ఒక్కొక్కరు రూ.50 వేలు ఇవ్వకపోతే వ్యాపారం చేయడానికి వీలు లేదని ఆ నాయకుడు తెగేసి చెప్పడంతో వారు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది మామూళ్లు అన్ని శాఖలకు కలుపుకుని ఒక్కో షాపునకు రూ.14 వేలకు మించలేదని, ఇప్పుడు అంత మొత్తం ఎందుకని వారు సదరు నాయకుడిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెబుతున్న వ్యావారులకు సదరు వ్యాపారి.. ధరలు పెంచుదామంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారట. -
టపాసులు .. మిఠాయిలు ... డాన్సులు
-
కేంద్రమంత్రి కావూరి స్వాగత యాత్రలో అపశ్రుతి