డీసీఎమ్మెస్ సర్వసభ్య సమావేశం రేపు
నెల్లూరు రూరల్: జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నెల్లూరులోని సొసైటీ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వంచనున్నట్లు ఎన్డీసీఎమ్మెస్ చైర్మన్ ఏడుగుండ్ల సుమంత్రెడ్డి తెలిపారు. శాంతినగర్లోని కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. మార్కెటింగ్ సొసైటీ లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు. 2013 – 14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.18.96 కోట్ల వ్యాపార లావాదేవీలను నిర్వహించగా, రూ.26 లక్షల ఆదాయం, 2014 – 15లో రూ.36.6 కోట్ల వ్యాపారం చేయగా, రూ.28 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఆత్మకూరు, నెల్లూరులోని గోదాములు శిథిలావస్థకు చే రుకోగా, కొత్త వాటిని నిర్మించామని చెప్పారు. టీటీడీకి కందిపప్పును సరఫరా చేస్తున్నామని, ఈ ఏడాది మిరియాలు, బెల్లాన్ని సరఫరా చేసేందుకు అవకాశం వచ్చిందని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు పాలకవర్గ సభ్యులతో సమావేశం, మధ్యాహ్నం 11 గంటలకు సర్వసభ్య సమావేశానికి సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు.