విశాఖపట్నం ఆర్కేబీచ్ వద్ద సముద్రంలో నిన్న(ఆదివారం) గల్లంతైన ఐదుగురిలో నాలుగు మృతదేహాలు లభ్యమైయ్యాయి.
ఆర్కేబీచ్(విశాఖపట్నం): విశాఖపట్నం ఆర్కేబీచ్ వద్ద సముద్రంలో నిన్న(ఆదివారం) గల్లంతైన ఐదుగురిలో ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలు సోమవారం తీరానికి కొట్టుకొచ్చాయి. తొలుత మూడు మృతదేహాలు లభ్యం కాగా, మరో మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది.
మృతదేహాల్లో ఇద్దరు బిహార్కు చెందిన బాబర్, ఒడిశాకు చెందిన చేతన్లుగా గుర్తించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలేనికి చెందిన ఒకరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైన ఒకరి కోసం నాలుగు మెరైన్ బోట్లు, నేవీ హెలికాఫ్టర్లతో గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.