Sea
-
‘ఘోస్ట్ ఫిషింగ్’పై యుద్ధం!
సాక్షి, విశాఖపట్నం: ఘోస్ట్ ఫిషింగ్... ఇది మత్స్య సంపదను హరిస్తోంది. సముద్ర వాతావరణానికి విఘాతం కలిగిస్తోంది. పర్యావరణ సమతుల్యతని దెబ్బతీస్తోంది. ఇంతలా హాని చేస్తున్న ఈ ఘోస్ట్ ఫిషింగ్ అంటే ఏమిటి..? దీనికి కారణమెవరు అని ఆలోచిస్తే.. గంగమ్మ ఒడిలో జీవనం సాగిస్తున్న మత్స్యకారులవైపే వేళ్లన్నీ చూపిస్తున్నాయి. అందుకే.. వారిలో చైతన్యం తీసుకొచ్చి మత్స్య సంపదకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకునేందుకు ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ) నడుం బిగించింది. ఘోస్ట్ ఫిషింగ్ అంటే..?వేటకు వెళ్లిన మత్స్యకారులు పాడైపోయిన వలలను ఒడ్డుకు తీసుకురాకుండా సముద్రంలోనే పడేస్తుంటారు. వలలను ప్లాస్టిక్, నైలాన్తో తయారు చేయడం వల్ల వందల సంవత్సరాల వరకు మట్టిలో కలిసిపోవు. ఆ వలల్లో చేపలు, తాబేళ్లు, సముద్ర జీవులు చిక్కుకుంటాయి. అవి బయటికి రాలేక చివరికి మృత్యువాత పడుతున్నాయి. దీన్నే ఘోస్ట్ ఫిషింగ్ అని అంటారు.ఎఫ్ఎస్ఐ ఏం చేసింది.?విశాఖ కేంద్రంగా ఎఫ్ఎస్ఐ సముద్రంలో మత్స్య సంపదపై నిరంతరం పరిశోధనలు చేస్తుంది. తమ సర్వే వెసల్స్ మత్స్యషికారిపై పరిశోధనలకు వెళ్లినప్పుడు వలల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు... ముఖ్యంగా ఫిషింగ్ నెట్స్ పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. ఈ విషమ పరిస్థితిపై పరిశోధనలు ప్రారంభించింది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో వ్యర్థాల గుర్తింపు, వెలికితీత, మత్స్యరాశులపై వాటి ప్రభావం తదితర అంశాలపై 2021 ఏప్రిల్ నుంచి సర్వే ప్రారంభించింది. 2024 చివరి వరకు కొనసాగిన ఈ సర్వేలో ఏకంగా 5,562 కేజీల వ్యర్థాలు దొరికాయి. ఇది చాలా ప్రమాదకరమని గ్రహించి.. అవి దొరికిన ప్రాంతాల్ని హాట్స్పాట్లుగా గుర్తించింది. అప్పటి నుంచి గ్లో లిట్టర్ పార్టనర్షిప్(జీఎల్పీ) కార్యక్రమానికి ఎఫ్ఎస్ఐ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సర్వే నౌకలు మెరైన్ ప్లాస్టిక్ లిట్టర్/అబాండన్డ్ లాస్ట్ లేదా డిస్కార్టెడ్ ఫిషింగ్ గేర్లు (ఏఎల్డీఎఫ్జీ) పేరుతో అధ్యయనం నిర్వహించాయి. మరో మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.మత్స్యకారులకు అవగాహన సర్వేలో వెల్లడైన అంశాలను మత్స్యకారులు, బోటు ఆపరేటర్లకు తెలియజేసి వ్యర్థాలను సముద్ర జలాల్లో పడేయవద్దంటూ ఎఫ్ఎస్ఐ విశాఖ జోన్ డైరెక్టర్ భామిరెడ్డి, శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్ కలిసి హాట్స్పాట్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సర్వే చేసినప్పుడు దొరికిన వలల వ్యర్థాలు చేస్తున్న కీడుకు సంబంధించిన వీడియోలను మత్స్యకారులకు చూపిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు. రీసైక్లింగ్ యూనిట్లకు ప్రణాళికలు ఎఫ్ఎస్ఐ చేపట్టిన జీఎల్పీ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. సముద్ర అధ్యయనం, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి ప్రశంసలు లభించడమేకాకుండా.. ఈ ప్రాజెక్టుని సీరియస్గా అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వలలో పడిన ప్లాస్టిక్ వ్యర్థాల్ని మత్స్యకారులు బయటకు తీసుకొచ్చేందుకు అవగాహన కల్పించడమే కాకుండా.. ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సేకరించిన వ్యర్థాలను పునర్వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీల వద్ద రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఇందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.ఘోస్ట్ ఫిషింగ్ తగ్గితేనే మత్స్య సంపదకు మనుగడచేపల వేట సమయంలో తెగిన వలలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర సామగ్రిని సముద్రంలో మత్స్యకారులు పడేస్తున్నారు. వాటిల్లో చిక్కుకుని చిరు చేపలు, పీతలు, రొయ్యలు, తాబేళ్లు వంటివి చనిపోతున్నాయి. మా అంచనా ప్రకారం సముద్ర జలాల్లో వ్యర్థాల కారణంగా 3 నుంచి 5 శాతం మేర మత్స్య దిగుబడులు తగ్గే ప్రమాదముంది. ఉపరితలంపై తేలియాడే పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు, తెగిపోయిన వలల ముక్కలు తదితర అధిక సాంద్రత కలిగిన వ్యర్థాలు సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. అందుకే జీఎల్పీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం. మేం చేపట్టిన అవగాహన సదస్సులతో మత్స్యకారుల్లో క్రమంగా చైతన్యం వస్తోంది. వారు తీసుకొస్తున్న వ్యర్థాలతో రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి మత్స్యకార మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – భామిరెడ్డి, ఎఫ్ఎస్ఐ విశాఖ జోన్ డైరెక్టర్ -
సముద్రంలో ఈతకు వెళ్లి ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతు
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా)/కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకెళ్లి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతయ్యాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పట్టపుపాళెం ఏపీజెన్కో బ్రేక్ వాటర్స్ వద్ద ఈ ఘటన జరిగింది. కృష్ణపట్నం సీఐ రవినాయక్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. నెల్లూరులో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 9 మంది విద్యార్థులు ఆదివారం నేలటూరు పట్టపుపాళెం సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. ఆటపాటలతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరిలో విశాఖపటా్ననికి చెందిన షణ్ముగనాయుడు(19) ఈతకొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతు ఉన్న చోట సముద్రపు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. స్థానికులతో కలిసి రక్షించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విశాఖలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 30 మందికి పైగా మత్స్యకారులు పడవల ద్వారా షణ్ముగనాయుడి కోసం గాలించారు. మరో ఐదుగురు గజ ఈతగాళ్లను కూడా రప్పించారు. సాయంత్రం చీకటిపడే వరకూ అన్వేషించినా ఫలితం లేకపోయింది. మత్స్యకారుడు గల్లంతు కృష్ణా జిల్లా మచిలీపట్నం బండలం మంగినపూడి బీచ్లో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. బందరు మండలం సత్రవపాలేనికి చెందిన చింతా ఏడుకొండలు శనివారం సాయంత్రం తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. సముద్రంలో చేపలు పడుతుండగా రాత్రి 12 గంటల సమయంలో వలలాగే క్రమంలో సముద్రంలో పడిపోయాడు.బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారులు ఏడుకొండలును కాపాడేందుకు సముద్రంలోకి దూకి గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వేట ఆపి ఆదివారం ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
సముద్రంలో 150 కి.మీ ఈత
కాకినాడ రూరల్ : సముద్రంలో 150 కిలోమీటర్లు ఈది ఆసియాలోనే అరుదైన ఘనతను సాధించారు స్విమ్మర్ శ్యామల గోలి. గత నెల 28న విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద సముద్రంలో ఈత ప్రారంభించిన ఆమె ఏడో రోజైన శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కాకినాడ బీచ్కు చేరుకున్న శ్యామలకు కాకినాడ నగర కమిషనర్ భావన, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు స్వాగతం పలికారు. ఐదు పదుల వయసులో అలవోకగా సముద్రాలు ఈదుతూ సాహస యాత్రతో అబ్బుర పరుస్తున్న శ్యామలను చూసేందుకు, ఆమెకు స్వాగతం పలికేందుకు విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పట్నుంచీ స్విమ్మర్ను కాదని చెప్పారు. జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల మేర స్విమ్ చేసేలా తనను కోచ్ జాన్ సిద్ధిక్ తీర్చిదిద్దారన్నారు. 2021లో శ్రీలంక – ఇండియా మధ్య రామ్సేతును ఈదానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్లో స్విమ్ చేశానని గుర్తు చేశారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు సముద్రంలో దిగి.. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒడ్డుకు వచ్చానని.. ఈ లెక్కన ఆరు రోజుల్లోనే లక్ష్యం చేరానన్నారు. స్విమ్మింగ్తో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, మహిళల్లో గైనిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. -
తీరం వెంబడి కృత్రిమ దిబ్బలు
సాక్షి, అమరావతి: మత్స్య సంపద వృద్ధి, జీవవైవిధ్యం పెంపు లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కృత్రిమ దిబ్బలు (ఆర్టిఫిషియల్ రీఫ్స్) ఏర్పాటు చేయబోతున్నారు. సముద్రపు లోతుల్లో సంచరించే చేపలను ఆకర్షించి, తీరం సమీపానికి రప్పించేలా త్రిభుజాకారం, పూల ఆకారం, భారీ పైపుల ఆకృతుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవి మత్స్య సంపదను ఆకర్షిస్తాయి. తద్వారా మత్స్యకారులకు తీరానికి సమీపంలోనే భారీగా మత్స్య సంపద లభిస్తుంది. ఒకప్పుడు సముద్రంలో తీరానికి అతి సమీపంలోనే లభించే మత్స్యసంపద పర్యావరణ కాలుష్యం, తీరంలో పెరుగుతున్న చమురు కార్యకలాపాలతో దూరమైపోయింది. కనుచూపు మేరలో మత్స్యసంపద దొరకని పరిస్థితి ఏర్పడింది. జీవవైవిధ్యం కూడా దెబ్బతింటోంది. ఈ సమస్యకు కృత్రిమ దిబ్బల ఏర్పాటు చక్కటి పరిష్కారమని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) గుర్తించింది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసి, సత్ఫలితాలను సాధించింది. ఇప్పుడు సువిశాల ఏపీ తీరంలో వీటిని ఏర్పాటు చేస్తోంది. 184 ప్రాంతాల్లో 500 యూనిట్లు ఏపీ తీరంలో 533 మత్స్యకార గ్రామాలున్నాయి. చేపల వేటపై ఆధారపడి 8 లక్షల మందికి పైగా జీవిస్తున్నారు. తీరానికి సమీపంలో ఆశించిన స్థాయిలో మత్స్య సంపద లేకపోవడంతో రాష్ట్ర మత్స్యకారులు గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల వైపు వెళ్తున్నారు. వీరి జీవనోపాధిని మెరుగుపరచడంతోపాటు జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి కృత్రిమ దిబ్బలు ఏర్పాటు చేయాలని సీఎంఎఫ్ఆర్ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2022–23లోనే రీఫ్లకు అనువైన ప్రాంతాలను గుర్తించింది. 300 మత్స్యకార గ్రామాల పరిధిలో 184 ప్రాంతాల్లో 500 రీఫ్ యూనిట్ల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2023 జూలైలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద వీటికి అనుమతి ఇచ్చిoది. తొలుత 210 యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్లో 500 దిబ్బలు ఉంటాయి. ఒక్కో యూనిట్ రూ.35 లక్షల అంచనాతో తొలి దశలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 22 చోట్ల ఏర్పాటు చేస్తారు. దశల వారీగా మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు కేరళలో ్చఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కేఎస్సీఏడీసీ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం చేసుకోనుంది.కృత్రిమ దిబ్బలతో ప్రయోజనాలుఎన్నో.. సాధారణంగా సముద్రంలో మునిగిపోయిన బోట్లు, వస్తువులు చేపలను ఆకర్షిస్తాయి. పూర్వం చేపలను ఆకర్షించడానికి భారీ కలప దుంగలు వాడేవారు. ప్రస్తుతం రంధ్రాలు, పగుళ్లతో రూపొందించిన కాంక్రీట్ నిర్మాణాలను ఉపయోగిస్తున్నారు. ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉంటూ లార్వా, పాచి, ఇతర జీవులు, చేపలను ఆకర్షించడంతో పాటు వాటి సంతానోత్పత్తికి ఇవి దోహదపడతాయి. వీటి ద్వారా లోతు జలాల్లో లభించే కింగ్ ఫిష్, ట్యూనా, రెడ్స్నాపర్స్, పీతలు, రొయ్యలు, స్క్వడ్స్, కొన్ని సార్లు ఆక్టోపస్ వంటివి కూడా 2.5 కిలోమీటర్ల దూరంలోనే వలకు చిక్కుతాయి. ఖర్చు కూడా 70 నుంచి 80 శాతం తగ్గుతుంది.2023లోనే ప్రతిపాదించాం మత్స్య సంపద సుస్థిరత, తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి పెంపు లక్ష్యంతో 2022–23లోనే కృత్రిమ దిబ్బల ఏర్పాటుకు బ్లూ ప్రింట్ తయారుచేశాం. పీఎంఎంఎస్వై ద్వారా ఏపీలో 184 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు 2023లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి ఏర్పాటు కోసం ఇప్పటికే ఆ ప్రాంతాల్లో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటి ఏర్పాటు ప్రారంభిస్తాం. – డాక్టర్ జియో కె.కుజాకుదన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీఎంఎఫ్ఆర్ఐ, విశాఖపట్నం -
నదీజలం.. వృథా అధికం
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు గోదావరి, కృష్ణా, వంశధార నదుల నుంచి 5,021.58 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. రాష్ట్రంలో ఆయా నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)లలో వినియోగించుకున్న, రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటి కంటే నాలుగు రెట్లు అధికంగా కడలిలో కలిశాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్ల పరిధిలోని రాష్ట్రాల్లోను విస్తారంగా వర్షాలు కురిశాయి. దాంతో ఈ నదులు వరద నీటితో పోటెత్తాయి. నీటి సంవత్సరం జూన్ 1న ప్రారంభమై... మే 31వ తేదీన ముగుస్తుంది. కేవలం ఆరు నెలల్లోనే 5,021.58 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలవడం విశేషం.నదుల వారీగా నీటి వినియోగం.. సముద్రంలోకి వదిలిన జలాల వివరాలు...ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,266.53 టీఎంసీల ప్రవాహం రాగా... గోదావరి డెల్టాలో పంటల సాగుకు 136.28 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 4,130.25 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గరిష్టంగా గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములకు మళ్లించి సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంటుంది.కృష్ణా నది నుంచి ప్రకాశం బ్యారేజీకి 1,006.36 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు 136.64 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 869.72 టీఎంసీలను బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–) కేటాయించింది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు అంతకంటే ఎక్కువ నీరు సముద్రంలో కలవడం గమనార్హం.వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 41.49 టీఎంసీలు వచ్చాయి. ఆయకట్టు పంటల సాగుకు 19.88 టీఎంసీలను వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 21.61 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. గొట్టా బ్యారేజీ వద్ద 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన వంశధార ట్రిబ్యునల్... ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం కేటాయించింది. వంశధార ట్రిబ్యునల్ అంచనా వేసిన దాని కంటే 73.51 టీఎంసీలు తక్కువగా వచ్చాయి. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టు కింద వంశధార జలాలను పూర్తి స్థాయిలో ఒడిసి పట్టాలంటే నేరడి బ్యారేజ్ లేదా వంశధార ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది. -
తీరం తరుక్కుపోతోంది..
సాక్షి, అమలాపురం/ అల్లవరం: కోస్తా తీరం భారీగా కోతకు గురవుతోంది. వాయుగుండాలు, అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడిన సమయంలో కోత అధికంగా ఉంటోంది. తాజాగా ఫెంగల్ తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తీరం పొడవునా కోత అధికమైంది. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 140 కిలోమీటర్ల మేర ఉంది.కోనసీమ జిల్లాలో అంతర్వేది సముద్ర సంగమ ప్రాంతం నుంచి ఐ.పోలవరం మండలం బైరుపాలెం వరకూ 90 కిలోమీటర్లు కాగా, తాళ్లరేవు మండలం గాడిమొగ నుంచి తుని మండలం వరకూ సుమారు 50 కిలోమీటర్ల మేర తీరం ఉంది. పచ్చని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ పాయల కోత వల్ల ఇప్పటికే వందలాది ఎకరాల కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో తీరం పొడవునా సముద్ర కోత కూడా అధికంగా ఉంటోంది. కోనసీమ జిల్లాలో ఓడలరేవు, కేశనపల్లి, అంతర్వేది, కొమరగిరిపట్నంలో ప్రభావం ఎక్కువగా ఉంది. భూములు, సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. గడచిన పదేళ్లలో కోత తీవ్రత రెట్టింపు అయ్యింది. ఓడలరేవులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తీరాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన ఓఎన్జీసీ చమురు బావులు ఇప్పుడు సముద్రంలో ఉన్నాయి.ఎనిమిదేళ్ల కిందట ఓడలరేవు బీచ్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం వరకూ సముద్రం చొచ్చుకువచ్చి భూమి కోతకు గురవుతోంది. అంతర్వేది బీచ్లో అలల ఉధృతి స్థానికంగా ఉన్న రిసార్ట్స్ వరకూ వస్తోంది. స్థానికంగా ఉన్న పల్లిపాలెం గ్రామంలోకి సైతం అలలు అప్పుడప్పుడు వచ్చి ఇళ్లను ముంచెత్తుతున్నాయి. కేశవదాసుపాలెం తూర్పులంక వంటి గ్రామాల్లోకి ఉప్పు నీరు ముంచెత్తడంతో కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయి. కాలుష్యాన్ని కలిపేస్తూ.. అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం అత్యంత ప్రమాదకరం. దేశంలో చాలా వరకూ నదులన్నీ దీనిలోనే కలుస్తాయి. ఉత్తరాదిన గంగా, బ్రహ్మపుత్ర, మధ్యభాగంలో మహానది, దిగువన గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, వంశధార, నాగావళి వంటి నదుల సంగమం బంగాళాఖాతంలోనే. దేశంలో చాలా వరకూ కాలుష్యాన్ని మోసుకువస్తున్న ఈ నదులు దానిని బంగాళాఖాతంలో కలిపేస్తున్నాయి. ఫలితంగా బంగాళాఖాతం త్వరగా వేడెక్కుతోంది. దీనివల్ల తరచూ తుపాన్లు ఏర్పడుతున్నాయి. అందుకే అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే తుపాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు అధికం. వీటి ప్రభావంతో అలలు ఎగసిపడి కోత ఉధృతి పెరుగుతోంది. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ భూభాగ నైసర్గిక స్వరూపం సముద్రంలోకి చొచ్చుకు వచ్చినట్టు ఉంటుంది. దక్షిణాయన కాలంలో అంటే జూలై 16 నుంచి జనవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు వస్తాయి. ఫలితంగా అప కేంద్ర బలాలతో తీరం పొడవునా కోత తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. అలలు ఎగసిపడి.. కాకినాడ జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరం కోతకు తరుక్కుపోతుంది. కాకినాడ తీరం సమీపంలో హోప్ ఐలెండ్ ఉండడం, డీప్ వాటర్ పోర్టు కోసం సముద్రంలో ఇసుక తవ్వకాల ప్రభావం సమీపంలోని “ఉప్పాడ’ గ్రామంపై పడుతోంది. సముద్రంలో తవ్వకాలు చేసిన ప్రాంతాల్లో తిరిగి ఇసుక పూడుకునేటప్పుడు ఏర్పడుతున్న ఒత్తిడితో ఉప్పాడ వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. హోప్ ఐలెండ్ వద్ద తీరం పెరుగుతుండగా, ఉప్పాడ వద్ద కోత పెరుగుతోంది. కోత ఇలా కొనసాగితే కొద్ది సంవత్సరాల్లో ఉప్పాడ గ్రామం కనుమరుగు కానుంది. భూములను కలిపేసుకుని.. ప్రకృతి ప్రకోపానికి ఓడలరేవు నదీ సంగమం నుంచి రిసార్ట్స్ వరకూ వందలాది ఎకరాల జిరాయితీ, డీపట్టా భూములు సముద్రంలో కలసిపోయాయి. 25 ఏళ్లుగా సముద్రం 500 మీటర్లకు పైగా ముందుకు వచ్చింది. ఇటీవల నెల రోజుల్లో రెండు పర్యాయాలుగా సముద్రం ముందుకు వచ్చి 936, 937 సర్వే నంబర్ గల జిరాయితీ, డీ పట్టా భూములు సుమారు 17 ఎకరాలను సముద్రం తనలో కలిపేసుకుంది. దీంతో ఓడలరేవులో సీతారామస్వామి దేవస్థానానికి చెందిన 11 ఎకరాలు, పెమ్మాడి సూర్యనారాయణ, ఇల్లింగి కాసులమ్మ, తదితరులకు చెందిన మరో ఆరు ఎకరాలు భూమి కోతకు గురైంది. –పాల వర్మ, ఓడలరేవు, అల్లవరం మండలం ప్రమాదంలో ఓఎన్జీసీ టెర్మినల్ కోనసీమ జిల్లా పరిధిలోని ఓడలరేవు ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్లోకి సముద్రం నీరు చొచ్చుకు రావడంతో ఉద్యోగులు, స్థానికులు ఆందోళన చెందారు. సముద్ర అలల తాకిడికి ఈ టెరి్మనల్ ప్రధాన గోడ వరకూ భూమి కోతకు గురైంది. ఇప్పుడున్న టెరి్మనల్ గోడకు సముద్ర తీరం సుమారు కిలోమీటరు దూరంలో ఉండేది. నెమ్మది నెమ్మదిగా సముద్రం చొచ్చుకొస్తూ గోడ వరకు వచ్చింది. కోత నివారణకు జియోట్యూబ్ పద్ధతిలో రాళ్లు వేసినా కోత ఆగడం లేదు. తాజాగా తుపాన్లతో అలల ఉధృతికి కోత తీవ్రత మరింత పెరిగింది. భారీ రక్షణ గోడ ఏర్పాటు చేస్తే తప్ప ఇక్కడ కోత ఆగే పరిస్థితి లేదు. మానవ తప్పిదాలే కారణం ప్రకృతిలో జరుగుతున్న మార్పుల కన్నా మానవ తప్పిదాల కారణంగానే సముద్రాలు గతి తప్పుతున్నాయి. సముద్ర ఉషో్టగ్రతలు పెరిగి తుపాన్లకు దారి తీస్తున్నాయి. తీరానికి రక్షణగా ఉండే మడ అడవులు, సరుగుడు తోటలను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలు, ఆక్వా చెరువులతో కూడా తీరం కోతకు గురవుతోంది. ఇటీవల కాలంలో చంద్రుడు, భూమికి మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతోందని, ఫలితంగా అలల ఉధృతి పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. -
సినీ ఫక్కీలో హత్య.. ఫిషింగ్ హార్బర్లో మృతదేహం
సాక్షి,విశాఖపట్నం: సినీ తరహాలో జరిగిన దారుణ హత్య విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కాలికి బరువైన బండరాయి కట్టేసిన ఓ వ్యక్తిని సముద్రంలో పడేసి హత్య చేశారు. ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 10 వద్ద మృతదేహం సముద్రంలో తేలుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని మంగళవారం(నవంబర్ 26) బయటికి తీశారు.మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: అనారోగ్యంతో భార్యాభర్తల ఆత్మహత్య -
పాతాళంలోనూ ఇస్రో పరిశోధనలు
సూళ్లూరుపేట: ఆకాశం వైపు గురిపెట్టి అంతరిక్ష ప్రయోగాలు చేయడానికే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసి పాతాళంలోకి వెళ్లి పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రయాన్ పేరిట ఈ ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినా.. ఇంతటి సాంకేతికతను ఉపయోగించలేదు. 1980లోనే సముద్రాలపై అధ్యయనం చేయడానికి స్కూబా డైవింగ్ పద్ధతిలో అధ్యయనానికే పరిమితమయ్యారు.దేశం చుట్టూ 7 వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాలనే ఆలోచన పురుడు పోసుకుంది. 2019 నుంచి ఈ ప్రయత్నాలు సాగిస్తున్నా.. ఇప్పటికి దీనికి ఓ రూపం వచ్చింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో సుమారు 6వేల మీటర్ల లోతుకెళ్లి అధ్యయనం చేసేందుకు సముద్రయాన్ పేరుతో మత్స్య–6000 అనే సబ్మెర్సిబుల్ నౌకను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.సబ్మెర్సిబుల్ వాహనంలో.. ప్రపంచంలో మానవ రహిత జలాంతర్గాములు ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే మానవ సహిత జలాంతర్గామిని తయారు చేసిన చరిత్ర ఉంది. సముద్రయాన్ ప్రాజెక్ట్లో భాగంగా సముద్ర గర్భంలోకి వెళ్లి పరిశోధనలు చేసేందుకు వీలుగా సబ్మెర్సిబుల్ వాహనాన్ని ఎన్ఐఓటీ డిజైన్ చేసి అభివృద్ధి చేస్తోంది. ఈ వాహనానికి మత్స్య–6000 అని నామకరణం చేశారు. ఈ వాహనం 6 కిలోమీటర్ల లోతుకు వెళ్లినపుడు నీటి పీడనం 600 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.ఈ పీడనాన్ని తగ్గించేందుకు టైటానియం అలాయ్ను ఉపయోగించి నీటి పీడనాన్ని తట్టుకునేలా సబ్మెర్సిబుల్ వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు. 2022 డిసెంబర్లో ‘సాగర్ నిధి’ నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపిన విషయం తెలిసిందే. ఓషన్ మినరల్ ఎక్స్ప్లోరల్ పేరిట సముద్ర గర్భంలో 5,271 మీటర్ల లోతులో అన్వేషణ సాగించారు. అక్కడున్న మాంగనీస్పై పరిశోధించారు. ఇప్పుడు మత్స్య–6000 ప్రయోగంలో ముగ్గురు వ్యక్తులు వాహనంలో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఒకరు సబ్మెర్సిబుల్ వాహనం ఆపరేటర్ కాగా.. మిగిలిన ఇద్దరు పరిశోధకులు ఉంటారు. గంటల తరబడి సముద్రంలోనే.. ఈ వాహనం సముద్ర గర్భంలో 108 గంటలు ఉండేలా వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు. సముద్ర గర్భంలోకి పోవడానికి 3 గంటలు, మళ్లీ పైకి రావడానికి 3 గంటలు సమయం తీసుకుంటుందని ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థకు ఇస్రో కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. ఇస్రో చేసిన చంద్రయాన్–3 ప్రయోగం, భవిష్యత్లో చేయబోతున్న గగన్యాన్ మిషన్ ప్రయోగ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమేరకు వినియోగించుకుంటున్నారు. మత్స్య–6000 జలాంతర్గామిని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో తయారు చేశారు.ఈ వాహనం సంక్లిష్టమైన సమయంలో 96 గంటలు నీటిలోనే ఉండేందుకు వీలుగా 67 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతంలో 108 గంటలపాటు సముద్రంలోనే ఉండేలా మత్స్య–6000 డిజైన్ చేశారు. ఈ పరిశోధనల్లో సముద్ర గర్భంలో ఉన్న మాంగనీస్ కోబాల్ట్, నికెల్ లాంటి ఖనిజాల అన్వేషణలతో పాటు సముద్ర గర్భంలో వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకపోకలు లాంటి వాటిపై అధ్యయనం చేయడానికి ఇది దోహదపడుతుంది.ఖనిజాలు.. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి.. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓçషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంయుక్తంగా సముద్ర గర్భంలో ఖనిజాల అన్వేషణ, సముద్రాల నుంచి వచ్చే రుతు పవనాలు, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మత్స్య–6000 అనే పేరుతో సముద్రయాన్ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. సముద్రపు అడుగున ఏముందో పరిశోధనలు చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. సుమారు రూ.4 వేల కోట్లతో 2026 నాటికి ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. -
శక్తి: ఆటుపోట్లకు వెరవని ‘షి’జర్నీ
ప్రమాదాల సముద్రం మీద 8 నెలల పాటు ప్రపంచ దేశాలు తిరిగి రావడానికి ఇద్దరు సాహస నేవీ మహిళా అధికారులు దిల్నా, రూపా అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరారు. కేవలం వారిద్దరు మాత్రమే ఉండే ఈ సాహసభరిత యాత్రలో వారు తోడు తీసుకెళుతున్నవి ఏమిటి? వారికి తోడుండేవి ఏమిటి? ఇంత సాహసం చేసే వీరిని చూస్తే ప్రతి అమ్మాయిలోనూ కలగదా సముద్రమంత సాహస భావన!‘గమ్యం ఎలాగూ ముఖ్యమే. కాని ప్రయాణం కూడా ముఖ్యం. ఈ యాత్రలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి’ అని అక్టోబర్ 2న గోవాలో జెండా ఊపి భవిష్యత్ చరిత్రలో చిరస్థాయిగా నిలబడనున్న ‘నావికా సాగర్ పరిక్రమ–2’ను ప్రారంభించారు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి. కేవలం ఇద్దరు మహిళా నేవీ ఆఫీసర్లు ఐఎన్ఎస్వి తారిణి పేరున్న సెయిల్ బోట్లో ఎనిమిది నెలల పాటు చేయనున్న ఈ సాహసయాత్ర విజయవంతం కావాలని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.ఐదు అంచెల యాత్రయాభై ఆరు అడుగుల ΄పొడవుండే సెయిల్ బోట్ తారిణిలో కమాండర్లు దిల్నా, రూప ఒకరికి ఒకరు తోడుగా నిలిచి మొత్తం 23000 నాటికల్ మైళ్లు అంటే 40000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరిన వీరు ఈ యాత్రను ఐదు భాగాలుగా చేస్తారు. ⇒ గోవా నుంచి ఆస్ట్రేలియా 2.ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ 3. న్యూజిల్యాండ్ నుంచి ఫాక్ల్యాండ్ ఐలాండ్స్ (దక్షిణ పసిఫిక్ సముద్రం) 4.ఫాక్ల్యాండ్ నుంచి సౌత్ ఆఫ్రికా 5. సౌత్ ఆఫ్రికా నుంచి గోవా. భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు సాగుతున్న ఈ యాత్ర కోసం తరిణికి సారధిగా లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా.కే వ్యవహరిస్తుండగా.. మరో లెఫ్టినెంట్ కమాండర్ రూపా సారథ్యం వహిస్తున్నారు.మైక్రోప్లాస్టిక్స్పై పరిశోధన‘నావికా సాగర్ పరిక్రమ–2’ మన స్త్రీ శక్తిని నిరూపించడానికే కాదు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’తో అనుసంధానమై సముద్రజలాల్లోని మైక్రోప్లాస్టిక్స్ను అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడనుంది. అలాగే ‘వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’తో కలిసి సముద్రాలలోని పుష్పపత్రాలు, భారీ సముద్ర జీవులపై కూడా పరిశోధనకు అవసరమైన సమాచారం కూడా సేకరిస్తారు. వీటన్నింటికి వీలుగా ‘తారిణి’ని సిద్ధం చేశారు. ఈ బోట్ ముందు భాగంలో మాస్ట్సెయిల్స్ ఉంటాయి.వెనుక భాగంలో రెండు స్టీరింగ్ వీల్స్, ఆటో పైలట్ సిస్టమ్, నెలకు 20 జీబీ వినియోగించుకునే సౌకర్యంతో కూడిన శాటిలైట్ యాంటెన్నా ఉంటుంది. సముద్ర జలాల్ని శుద్ధి చేసి గంటకు 30 లీటర్లు మంచినీరు ఇవ్వగల ఆర్వో ప్లాంట్ అమర్చారు. అవసరమైన సందర్భాల్లో వినియోగించుకునేందుకు 22 తాళ్లను అందుబాటులో ఉంచారు. ల్యాప్టాప్లు, మ్యూజిక్ సిస్టం సైతం బోట్లో ఉన్నాయి. బోట్ తయారీలో అధికభాగం ఫైబర్ గ్లాస్ను ఉపయోగించారు. వీరి యాత్రను జీపీఎస్ విధానం ద్వారా ట్రాక్ చేస్తూ ప్రయాణం ఎలా సాగుతోందో భారత నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది.సోదరి ఇచ్చిన పాండా బొమ్మతో ‘ప్రయాణం చేయడానికి భయం లేదని చెప్పడం లేదు. కానీ అంతకుమించిన ఆత్మ విశ్వాసం కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటుందని నా సోదరి పాన్పాన్ అని పిలుచుకునే పాండా బొమ్మ ఇచ్చింది. దీంతోపాటు ఖగోళశాస్త్రవేత్త కార్ల్సాగన్ రచించిన పుస్తకాలు తోడు తీసుకెళ్తున్నాను’ అంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఈ సందర్భంగా.అమ్మ చేసిన ఊరగాయలతో‘సముద్రం ఒక గొప్ప గురువు. మాకు సహనాన్ని నేర్పిస్తుంది. బోట్ను మనం మంచిగా చూసుకుంటే, అది మనల్ని మంచిగా చూసుకుంటుందనే సూత్రాన్నే పాటిస్తాను. తరిణిలో మేమే ఇంజినీర్లం, ఎలక్ట్రీషియన్లం, కార్పెంటర్లం. వాతావరణ నివేదికల్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించాలి. ఎనిమిది నెలల పాటు తరిణిలోనే మా నివాసం కాబట్టి పుస్తకాలు తెచ్చుకున్నా. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్, సంగీత వాద్య పరికరాలతోపాటు అమ్మ చేసిన ఊరగాయలు, కాలికట్ చిప్స్, టాపియోకా చిప్స్ తీసుకెళ్తున్నా. ఈ ప్రయాణం మొత్తానికి సరిపడా దోశల పిండి కూడా మా వెంట తీసుకువెళుతున్నాం. డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ రూ΄పొందించిన ప్రత్యేకమైన ఆహారాన్ని మాకు అందుబాటులో ఉంచారు’ అని తెలిపింది లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా. వీరి యాత్ర సఫలం కావాలని కోరుకుందాం. – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నం -
walking fish: నడిచే చేపల గురించి విన్నారా?
సీ రాబిన్ చేపల్లో కొత్త రకం జాతుల వైవిధ్యమైన లక్షణాలను శాస్తవేత్తలు తాజాగా కనుగొన్నారు. సీ రాబిన్స్ చేపల్లోని ప్రియోనాటస్ కారోలైనస్ జాతుల మొప్పల వెనకాల రెక్కలతోపాటు, కిందిభాగంలో పీత ఉన్న మాదిరిగా ఆరు కాళ్లను గుర్తించారు. చేప ఈ కాళ్లతో ఎంచక్కా సముద్రగర్భం అడుగుభాగంపై చకచకా ముందుకు కదులుతోంది. ఆ కాళ్లకు మరో ప్రత్యేకత ఉంది. వాటి అడుగున ఉన్న పాదాల్లాంటి మెత్తని భాగానికి జ్ఞానేంద్రియంలాంటి గుణం ఉండటం విశేషం. సముద్రం అడుగున మట్టి కింద ఏదైనా చిన్న జీవి దాక్కున్నా, ఇంకేదైనా ఆహారం ఉన్నా ఈ చేప తన కాళ్లతోనే గుర్తించగలదు. అవసరమైతే మట్టిలో కూరుకుపోయిన ఆహారాన్ని తవ్వి బయటకు తీయగలదు. ఇలాంటి కొత్త విషయాలతో కూడిన అధ్యయన వివరాలు తాజాగా ‘కరెంట్ బయోలజీ’సైన్స్ జర్నల్లో గురువారం ప్రచురితమయ్యాయి. మట్టి అడుగున అమైనో ఆమ్లాలను కల్గిన చిన్న జీవి జాడనూ చేప గుర్తించగలదు. అక్కడి ఆహారం, జీవి నుంచి విడుదలయ్యే రసాయనాలను గుర్తించే ఏర్పాట్లు సీ రాబిన్ పాదాల్లో ఉన్నాయి. పాదాల్లోని నరాలు ఇందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయని అధ్యయనకారులు తెలిపారు. మనిషి నాలుక మీద ఉండే రుచి మొగ్గల లాంటి బొడిపెలు ఈ చేప పాదాల కింద ఉన్నాయి. వీటి సాయంతో అది తన ఆహారం జాడ కనిపెడుతోందని అధ్యయనం వెల్లడించింది. -
నేల మీద కాకుండా.. నీటిలో తేలియాడే ఇల్లును ఎప్పుడైనా చూశారా!
నేల మీద ఇల్లు కట్టుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా స్థలాల ధరలు చుక్కలను తాకే నగరాల్లో ఇల్లు కట్టుకోవాలంటే, ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే, నేల మీద కాకుండా నీటిలో తేలియాడే ఇల్లుకు చైనీస్ ఆర్కిటెక్ట్లు రూపకల్పన చేశారు. బీజింగ్కు చెందిన ‘క్రాస్బౌండరీస్ ఆర్కిటెక్చర్ స్టూడియో’కు చెందిన నిపుణులు సాధారణమైన ఇంటికి కావలసిన అన్ని వసతులతో కూడిన పడవలాంటి ఈ ఇంటిని తయారు చేశారు.నదుల్లోను, సముద్రంలోనూ తేలుతూ ప్రయాణించేలా దీన్ని తీర్చిదిద్దారు. పడవలాంటి ఈ ఇంటికి ‘ఫాంగ్ సాంగ్’ అని పేరు పెట్టారు. పడవలు నడవాలంటే ఇంధనం కావాలి. పడవలాంటి ఈ 667 చదరపు అడుగుల ఇంటికి మాత్రం ఇంధనం అక్కర్లేదు. ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. దీని పైకప్పుల మీద అమర్చిన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ ఇంటి అవసరాలన్నింటికీ పూర్తిగా సరిపోతుంది. ఈ ఇంటి ధర 26 వేల డాలర్లు (రూ.21.85 లక్షలు). ఈ తేలే ఇంటిని కొనేందుకు యూరోపియన్లు సైతం ఎగబడుతుండటం విశేషం. -
చమురు నౌక మునక: ఎనిమిది మంది భారతీయులు సురక్షితం
ఒమన్ తీరంలో మునిగిన చమురు నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయులలో ఎనిమిదిమందిని ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ ట్యాగ్ సురక్షింతగా బయటకు తీసుకువచ్చింది. ఈ చమురు నౌక సముద్రంలో మునిగిపోయినప్పుడు దానిలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులు. ఈ ప్రమాదంలో మునిగిన ఒక శ్రీలంక పౌరుడిని కూడా ఇండియన్ నేవీ రక్షించింది. మరో శ్రీలంక పౌరుని మృతదేహాన్ని వెలికితీసింది.ఒమన్ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్ను గుర్తించడానికి భారత్కు చెందిన యుద్ధనౌక ఐఎస్ఎస్ టెగ్ను రెస్క్యూ ఆపరేషన్కు పంపారు. ఒమన్లోని రాస్ మద్రాక్కు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో జులై 15న ఈ నౌక మునిగిపోయింది. ఒమన్ అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ అనే కార్గో నౌకలో 13 మంది భారతీయులు,ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమన్ మారిటైమ్ సేఫ్టీ సెంటర్ (ఎంఎస్సీ)పేర్కొంది. -
శేషాచలంలో సాగర ఘోష!
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు. ‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
రీల్స్ పిచ్చి పీక్స్కు.. సముద్రంలో కార్లతో ఇరుక్కపోయిన యువకులు
కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. తాగా ఇలాంటి ఘటనలో మరొకటి వెలుగు చూసింది.ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొంతమంది యువకులు తమ కారును సముద్రంలోకి నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన గుజరాత్లోని కచ్ సముద్ర తీరంలో జరిగింది. ఇద్దరు యుకులు రీల్స్ కోసం తమ రెండు మహీంద్రా థార్ ఎస్యూవీ కారులను ముంద్రా సముద్ర తీరంలోకి పోనిచ్చారు. నీరు లోతు పెరగడం, అలల కారణంగా రెండు వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో యువకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రెడ్, వైట్ మహీంద్రా థార్ వాహనాలను నీటిలో నుంచి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కచ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు ఎస్వీలను స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు.Gujarat: In an attempt to make a reel, two young men drove 2 Thar vehicles into the deep waters near the seashore in Mundra, Kutch due to which both vehicles get stuck in the water. With the help of locals, both vehicles were retrieved, also Kutch police filed an FIR against the… pic.twitter.com/m9YR0ByK7b— IANS (@ians_india) June 23, 2024 -
సముద్రంలో మునిగి ఇద్దరు మృతి
వేటపాలెం: దూరప్రాంతాల నుంచి విహారం కోసం వస్తున్న పర్యాటకులు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు. రామాపురం బీచ్లో నలుగురు యువకులు మృత్యువాత పడి రెండురోజులు గడవక ముందే అదే ప్రాంతంలో ఆదివారం మరో ఇద్దరు సముద్ర కెరటాలకు బలైపోయారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు విహారయాత్ర కోసం రామాపురం బీచ్కు చేరుకున్నారు. స్నేహితులంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గడిపారు.సముద్రం నీటిలో మునుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అలల తాకిడికి నలుగురు కొట్టుకుపోతుండగా గమనించిన స్నేహితులు ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరు నాగేశ్వరరావు (27), బాలసాయి (26) మృత్యువాత పడ్డారు. వీరంతా విజయవాడలోని వివిధ బంగారం షాపుల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఈపురుపాలెం ఎస్సై శివకుమార్ యాదవ్ పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.అయితే రెండురోజుల వ్యవధిలో రెండు సంఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చీరాల, వేటపాలెం ఎస్సైలకు పలు సూచనలు ఇచ్చారు. సముద్ర తీరం వద్ద నిఘా పెంచాలని, గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు బీచ్పై అవగాహన కల్పించాలని సూచించారు. -
సముద్రంలో తిరగబడిన బోటు
వేటపాలెం: బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, పొట్టిసుబ్బయ్యపాలెం మత్స్యకారులకు సంబంధించిన బోటు సముద్రంలో సోమవారం రాత్రి బోల్తాకొట్టింది. అందులో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రంలోనే ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన కొండూరు రాములు, పెద్ద కుమారుడు కొండూరు గోవిందు, చిన్నకుమారుడు చిట్టిబాబు, కఠారివారిపాలేనికి చెందిన కఠారి శ్రీను నలుగురు కలిసి సోమవారం సాయంకాలం బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో వేట సాగించేటప్పుడు అలల తాకిడికి బోటులోకి సముద్రం నీరు పెద్ద మొత్తంలో చేరుకొని తిరగబడింది. అందులో ఉన్న నలుగురు సముద్రం నీటిలో పడిపోయారు. వీరి పై వేట సాగించే వల పడింది. నలుగురు సముద్రం నీటిలోపలకు వెళ్లి వలను తప్పించుకొని ఈతకొట్టుకొంటూ తిరగబడిన బోటు పై భాగానికి ఎక్కి కూర్చున్నారు. వీరి వద్ద ఉన్న సెల్ఫోన్లు నీటిలో పడిపోవడంతో సమాచారం ఇవ్వడానికి వీలు పడలేదు. ఆరు గంటల పాటు తిరగబడిన బోటు పైనే కూర్చున్నారు. చిన్నగంజాం మండలం, చిన్నంగారివారిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం తెల్లవారుజామున వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన బోటు పై భాగంలో కూర్చొని ఉన్న నలుగురిని గమనించారు. వెంటనే వారిని తమ బోటులో ఎక్కించుకొని తెల్లవారుజామున 5 గంటలకు పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రం నీటిలోనే ఉండిపోయామని మత్స్యకారులు తెలిపారు. వల, బోటు, ఇంజన్లు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రూ.6.50 లక్షలు నష్ట పోయామని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్ మీ కోసమే.అడ్వెంచర్ సిమ్యూలెషన్ గేమ్ ‘ఎండ్లెస్ ఒషియన్ లుమినస్’ విడుదలైంది. జపాన్ గేమింగ్ కంపెనీ ‘అరిక’ డెవలప్ చేసిన గేమ్ ఇది. ‘ఎండ్లెస్ ఓషన్’ సిరీస్లో వస్తున్న థర్డ్ గేమ్. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్ చేయడానికి ఈ గేమ్లో ప్లేయర్ స్కూబా డైవర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.ప్లాట్ఫామ్: నిన్టెండో స్విచ్,జానర్స్: అడ్వెంచర్, సిమ్యులేషన్,మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
ఉన్నట్టుండి రంగు మారిన కాకినాడ సముద్రం..
-
తెగిన తేలియాడే వంతెన.. సముద్రంలో పడిపోయిన టూరిస్టులు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం వర్కల బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిన ఘటనలో 13 మంది పర్యాటకులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం(మార్చ్ 9) సాయంత్రం 5 గంటలకు జరిగింది. సముద్రంలో పడిపోయి గాయపడిన వారిలో ఇద్దరు చిన్నపిల్లలున్నారు. సందర్శకులు సముద్రంలో బ్రిడ్జిపై నిలుచున్నపుడు ఒక్కసారిగా భారీ అలలు రావడంతో బ్రిడ్జి హ్యాండ్ రెయిల్ విరిగిపోయింది. దీంతో అది పట్టుకుని నిల్చున్నవారంతా సముద్రంలో పడిపోయారు. అయితే సందర్శకులంతా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారిని వెంటనే రక్షించి తీరానికి తీసుకురాగలిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 14 ఏళ్ల చిన్నారి తప్ప మిగిలిన వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి మూసి ఉంటుందని అయితే శనివారం సాయంత్రం భారీ అలలు వస్తున్నప్పటికీ సందర్శకులను దానిపైకి అనుమతించడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. STORY | Floating bridge accident at Varkala beach; 11 injured: Police READ: https://t.co/DVzkSIMP3v VIDEO: pic.twitter.com/wjRfXkMUHx — Press Trust of India (@PTI_News) March 9, 2024 ఇదీ చదవండి.. ఫోక్రాన్ యుద్ధ విన్యాసాల్లో రోబో డాగ్ ప్రత్యేకత -
Mumbai Trans Harbour Link: పొడవైన సముద్రవంతెన.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!
ముంబయి: భారత్లోనే అతిపొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జనవరి 12)న ప్రారంభించనున్నారు. భారత్లోనే అతిపెద్ద సముద్ర వంతెన రవాణా వినియోగానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 100కిలోమీటర్ల దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలుకు అనుమతిని నిరాకరించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికిల్స్, మిని బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వంతెన ఎక్కేప్పుడు, దిగేప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. రూ. 18,000 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్ బ్రిడ్జ్.. ముంబైలోని సెవ్రీ నుండి ప్రారంభం అవుతుంది. రాయ్గఢ్ జిల్లా ఉరాన్ తాలూకాలోని న్హవా షెవాలో ముగుస్తుంది. అటల్ వంతెన అనేది 6-లేన్ సముద్రం లింక్. ఇది సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.5 కి.మీ. ఉంటుంది. ఈ వంతెనతో వాహనదారులు ముంబయి, నవీ ముంబయి మధ్య దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో అధిగమించగలరు. ఈ వంతెన లేకపోతే 2 గంటల సమయం పడుతుంది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
సముద్రపు వంతెన ‘అటల్ సేతు’.. ప్రత్యేకతలివే!
దేశంలోనే అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన నిర్మాణం పూర్తయింది. దీనిని జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ముంబయి- నవీ ముంబయిలను కలిపే ఈ అతిపెద్ద సముద్రపు వంతెన పొడవు 22 కిలోమీటర్లు. దీనికి ‘అటల్ సేతు’ అనే పేరు పెట్టారు. దీని విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఇవి భద్రత పరంగా ఎంతో ఉపయోగపడతాయి. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్కి అందిస్తాయి. రూ. 20 వేల కోట్లతో నిర్మించిన ఈ వంతెనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వంతెన కారణంగా ముంబై నుండి నవీ ముంబైకి ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. ఇంతవరకూ ఈ దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టేది. ఈ వంతెన ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సముద్రపు వంతెన ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ వంతెన మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలను కలుపుతుంది. ఇది ఆరు లేన్ల వంతెన. ఈ వంతెనలోని 16.5 కిలోమీటర్ల రహదారి సముద్రం మీద నిర్మితమయ్యింది. దాదాపు 5.5 కిలోమీటర్ల రహదారి భూభాగంపై ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు రూ.250 టోల్ వసూలు చేయనున్నారు. శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనకు ఒకవైపు సౌండ్ బారియర్ను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు. ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్ను దాటుతుంది. -
#Lakshadweep : ప్రకృతి చెక్కిన ‘అందాలు’.. లక్షదీప్ చూసొద్దామా.. (ఫొటోలు)
-
నడి సముద్రంలో తప్పిన పెనుముప్పు
కాకినాడ క్రైం: భారీ మత్స్య సంపదతో తీరానికి చేరుతున్నామని పట్టరాని ఆనందంలో ఉన్న 11 మంది మత్స్యకారుల తలరాత క్షణాల్లో మారిపోయింది. ఆనందపు అంచుల నుంచి ఒక్కసారిగా మృత్యు ఒడికి దాదాపుగా జారుకున్నారు. సంద్రపు అలని తలదన్నే ఎత్తులో అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతుంటే నివ్వెరపోయారు. ఆ కీలలన్నీ తమ బోటు నుంచేనని తెలిసే లోపే మంటల్లో చిక్కుకున్నారు. తక్షణమే లైఫ్ జాకెట్లు వేసుకుని సముద్రంలోకి దూకేశారు. ఒకొక్కరూ గంటకు పైగా మృత్యువుతో పోరాడారు. చివరికి అటుగా వచ్చిన సహ మత్స్యకారులు, కార్పోరేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో బోటులోని సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడి తమ బోటులోకి చేర్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ఓడలరేవు తీరం భైరవపాలెం సముద్ర ఉపరితలంలో శుక్రవారం జరిగింది. కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగకు చెందిన 11 మంది కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ బోటు యజమాని పరం రామకృష్ణ. నారాయణ అనే మత్స్యకారుడు బోటు మాస్టర్. ఈ 11 మంది కాకినాడ తీరం నుంచి సుదూరానికి వెళుతూ...వెళ్లే దారిలో తిరుగు ప్రయాణంలో భైరవపాలెం వద్ద ఒక భారీ వల వేశారు. సముద్ర తీరంలో 135 నాటికల్ మైళ్ల దూరంలో వేటలో ఉండగా గురువారం రాత్రి కోస్ట్గార్డ్ బృందం తుఫాను హెచ్చరికలు చేసి తీరానికి వెళ్లిపోవాలని వీరిని అప్రమత్తం చేసింది. వీరు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ తీరానికి బయల్దేరారు. భైరవపాలెంలో వేసిన వల తీసేందుకు వెళ్లి ఆ దారిలో కాకినాడ తీరం వైపుగా వెళ్లాలని అనుకున్నారు. భైరవపాలెంలో వల తీస్తుండగా అప్పటికే వేడెక్కి ఉన్న ఇంజన్ నుంచి ఇంధనం ట్యాంకులకు అనుసంధానం చేసిన పైపుల నుంచి డీజిల్ చిమ్మింది. గొట్టాల పరిసరాలన్నీ ఇంధనంతో తడిసి..ఇంధన ట్యాంక్పై చమురు చిమ్మి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు దావనలంలా వ్యాపించాయి. ఓడ పూర్తిగా దగ్ధమై నీట మునిగిపోతున్న చివరి క్రమంలో వీరు సముద్రంలోకి దూకేశారు. సరిగ్గా అటుగా వస్తు్తన్న మత్స్యకార బృంద ఈ11 మందిని చూశారు. రిలయన్స్ సిబ్బందితో కలిసి వారు 11 మందిని రక్షించారు. కోస్ట్గార్డ్ సిబ్బంది మత్స్యకారులను ఐసీజీఎస్ చార్లీ–438 ఫిప్ ద్వారా కాకినాడ తీరానికి చేర్చారు. కోస్ట్గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ విశ్వాస్ తాపా ఆధ్వర్యంలో 10 మంది కోస్ట్గార్డు సిబ్బంది మత్స్యకారుల్ని కాకినాడ తీరానికి చేర్చారు. మొత్తం రూ.70 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై ఓడలరేవు మెరైన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృత్యుంజయులు వీరే... బొమ్మిడి వీరబాబు, సంగాడి నారాయణ, పెమ్మాడి సత్యం, చెక్కా నాగూర్, పాలెపు నూకరాజు, పినపోతు తాతారావు, ఆదం ధనరాజు, కొప్పిడి సత్యనారాయణ, పంతాడి సతీష్, పినపోతు ధర్మరాజు, దోమ వీరబాబు -
సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం
-
బుర్జ్ ఖలీఫా ఎత్తును దాటేసిన పర్వతం.. ఎక్కడుందంటే..
ప్రపంచంలో అత్యంత ఎత్తయినది ఏదంటే ఎవరైనా వెంటనే బుర్జ్ ఖలీఫా అని చెబుతారు. అయితే దీనికి మించినది మరొకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా అది భూమి మీద కాకుండా సముద్రపు లోతుల్లో ఉందని తెలిస్తే.. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలకు సలాం చేయకుండా ఉండలేరు. దక్షిణ అమెరికా దేశమైన గ్వాటెమాల తీరంలో నీటి అడుగున ఒక భారీ పర్వతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర మట్టాన్ని మ్యాపింగ్ చేసే శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 5,249 అడుగులకు పైగానే ఉంది. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 2 వేల 722 అడుగులు. ఈ భారీ పర్వతం భూ ఉపరితరం నుంచి 7 వేల 874 అడుగుల దిగువన ఉంది. ఈ పర్వతాన్ని స్మిత్ ఓపెన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్నారు. స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు వెండీ స్మిత్ ఒక ప్రకటనలో ఫాకర్ యాత్రలో ఉన్న పరిశోధకులు.. ఊహించని, విస్మయం కలిగించే అంశాన్ని కనుగొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో మనకు అంతుచిక్కని అంశాలు వెల్లడైనప్పుడు ఎంతో ఆసక్తి కలుగుతుంది. దీనిపై అన్వేషణ కొనసాగించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ పర్వతం 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వారు సముద్రపు అడుగుభాగపు మ్యాప్ను రూపొందించడానికి మల్టీబీమ్ ఎకోసౌండర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. ఇది కూడా చదవండి: ‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక! -
సముద్రంలో రెస్టారెంట్.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు
సముద్రంలో రెస్టారెంట్ సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఒక కొండ మీద పూరిగుడిసెలా కనిపిస్తున్నది ఒక రెస్టారెంట్. కొండ కొమ్ముమీద నిర్మించడం వల్ల దీనికి ‘ది రాక్’ అని పేరుపెట్టారు. టాంజానియాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉందిది. ఈ రెస్టారెంట్లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే! పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ వంటి సీఫుడ్కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్కు వచ్చి, ఇక్కడి రుచులను ఆరగించి వెళుతుంటారు. View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) విగ్గుతో గిన్నిస్ రికార్డ్ విగ్గుల వాడకం అందరికీ తెలిసిందే! సినీ నాటక రంగాల్లో విగ్గుల వాడకం ఎక్కువ. ఇటీవలి కాలంలో బట్టతలలు గల సాధారణ వ్యక్తులు కూడా విగ్గులు వాడుతున్నారు. సాధారణంగా వాడుకలో ఉన్న ఈ విగ్గులు నెత్తిని జుట్టుతో నిండుగా కప్పేంత పరిమాణంలో ఉంటాయి. కొన్ని విచిత్రవేషాల కోసం వాడే విగ్గులైతే తల మీద దాదాపు ఒక అడుగు మందం వరకు కూడా ఉంటాయి. అయితే, అలాంటి విగ్గులు చాలా అరుదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ డిజైనర్ డానీ రేనాల్డ్స్ రూపొందించిన అతిభారీ విగ్ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. బైక్ హెల్మెట్ను చట్రంగా చేసుకుని రూపొందించిన ఈ విగ్గు వెడల్పు ఎనిమిది అడుగుల ఆరంగుళాలట. దీని తయారీకి పీవీసీ పైపులు, అల్యూమినియం రాడ్లు, కేబుల్ వైర్లు వంటి వస్తువులను ఉపయోగించడం విశేషం. ఈ విగ్గు ప్రపంచంలోనే అత్యంత వెడల్పాటి విగ్గుగా గిన్నిస్ రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
విశాఖ తీరంలో అత్యంత అరుదైన సీ హార్స్
సాక్షి, విశాఖపట్నం: అత్యంత అరుదైన సీ హార్స్ మత్స్యకారుల వలలకు చిక్కుతున్నాయి. విశాఖ తీరంలో అప్పుడప్పుడు ఇవి దర్శనమిస్తున్నాయి. ఇవి రెండు మూడు అంగుళాల సైజులో రొయ్యలను పోలి ఉంటాయి. ఇవి రొయ్యల్లో కలిసిపోతుండడం వల్ల మత్స్యకారులు వీటిని పెద్దగా పట్టించుకోరు. తాజాగా మంగళవారం విశాఖ మత్స్యకారుల వలకు ఇవి దొరికాయి. నగరంలోని ఒక వ్యక్తి సాయంత్రం హార్బర్లో రొయ్యలను కొనుగోలు చేశాడు. ఇంటికి తెచ్చి చూడగా రొయ్యలతో పాటు ఈ సీ హార్స్ కూడా అందులో ఉన్నట్టు కె.విజయ్కుమార్ అనే వ్యక్తి గుర్తించారు. దొరికిన సీ హార్స్ను తన వాట్సాప్ స్టేటస్లో పెట్టడంతో ఈ విషయం బయట పడింది. కాగా సముద్ర గుర్రంగా పిలిచే ఈ చిన్న చేపలు (సీ హార్స్) ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల, సమశీతోష్ణ జలాల్లో కనిపిస్తాయి. వీటికి వంకర మెడలు, పొడవైన గొంతు, తల, శరీరం నిటారుగా ఉండి తోక వంకరగా ఉంటుంది. ఈ జంతువులకు నోట్లో పళ్లుండవు. పగడపు దిబ్బలు, మడ అడవులు వంటి ప్రాంతాల్లో నివశిస్తాయి. నిట్టనిలువుగా నిలిచి ఈదుతాయి. మగ సముద్రపు గుర్రాలు తమ శరీరం ముందు భాగంలో సంతానాన్ని పొదగడానికి అనువైన ఒక సంచి వంటి అరను కలిగి ఉంటాయి. జతకట్టే సమయంలో ఆడ చేప గుడ్లను ఈ మగ చేప సంచిలోకి విడుస్తుంది. అప్పుడు మగ చేప వాటిని అంతర్గతంగా ఫలదీకరణ చేసి పిల్లలు గుడ్లలో నుంచి బయటకు వచ్చాక వాటిని నీటిలోకి విడుదల చేస్తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి జి.విజయ ‘సాక్షి’కి చెప్పారు. విశాఖ ప్రాంత సముద్ర జలాల్లో సీ హార్స్ల ఉనికి అరుదు అని తెలిపారు. -
నడి సముద్రంలో చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులు
-
ఉనికి కోల్పోతున్న బొక్కు సొర చేప
సాక్షిప్రతినిధి, కాకినాడ: సముద్ర కాలుష్య నివారణలో కీలకపాత్ర పోషించే బొక్కు సొర చేప కాలక్రమేణా ఉనికిని కోల్పోతోంది. వేల్ షార్క్గా పిలిచే ఈ చేప ‘రిన్ కో డాంటిడే’ జాతికి చెందింది. ఏళ్ల సంవత్సరాల కిందట డైనోసార్లతో సముద్ర జలాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అతి ప్రాచీన సముద్ర జీవిగా ప్రసిద్ధి. 65 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సాదు జీవి మనుగడ కోసం ప్రస్తుతం పోరాడుతోంది. ఈ జీవి ప్రపంచవ్యాప్తంగా 20వేల వరకు ఉండగా ప్రస్తుతం 10 వేలకు తగ్గిపోయనట్లు ‘ఐయూసీఎన్( ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) తన నివేదికలో పేర్కొంది. అలాగే తన నివేదికలో ఇది అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా రెడ్బుక్లో పేర్కొంది. నిశ్శబ్ద జలాల్లోనే నివాసం.. ఈ చేపలు నిశ్శబ్దంగా ఉండే సముద్ర జలాల్లోనే ఉండటానికి ఇష్టపడతాయి. ఎప్పుడైన ఓడలు, బోట్లు ఫ్యాన్లు తగిలితే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. చూస్తే భయంతో వణికిపోయేలా భారీ ఆకారంతో తిమింగలానికి నాలుగు రెట్లు అధికంగా ఉండే వేల్ షార్క్(»ొక్కు సొర) ఎవరికీ ఏ హాని తలపెట్టదు. ఈ చేపలు 13 మీటర్లు(42 అడుగులు) పొడవు, 20 నుంచి 25 మెట్రిక్ టన్నుల బరువుతో భారీ ఆకారంతో ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా వేల్షార్క్కు పేరుంది. తీరం నుంచి 50 నుంచి 60 కిలో మీటర్లు (డీప్సీ)దూరంలో సముద్రంలో సుమారు ఐదు కిలోమీటర్ల లోతులో ఇవి ఉంటాయి. సముద్ర ఉపరితలంపై ఎక్కడా కనిపించవు. లోతు జలాల్లో ఉండే అరుదైన జలచరం ఇది. రెండేళ్ల కిందట విశాఖలో ప్రత్యక్షం ఈ చేప చమురు, మాంసం, రెక్కలు, అంతర్జాతీయంగా వాణిజ్య విలువలతో మంచి డిమాండ్ ఉంది. ఉష్ణ మండలం, సమశీతోష్ణ సముద్ర జలాల్లో కనిపిస్తుంటాయి. సేనిగల్ నుంచి గునియా, న్యూయార్క్ నుంచి కరేబియన్, మెక్సికో నుంచి టోంగా, తూర్పు ఆఫ్రికా నుంచి థాయిలాండ్, ఎర్ర సముద్రం, యూఎస్ఏ, అరేబియన్, గల్ఫ్, జపాన్, ఆ్రస్టేలియా, బ్రెజిల్, పిలిపీన్స్ సముద్ర జలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. దేశంలో గుజరాత్, తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు, ఉప్పాడ, కోనపాపపేట, కాకినాడ కుంభాభిషేకం, భైరవపాలెం తదితర తీరప్రాంతాల్లో వేట సమయంలో సముద్రంలో మత్స్యకారులకు కనిపిస్తుంటాయి. రెండేళ్ల కిందట విశాఖబీచ్కు వచ్చిన బొక్కు సొరను రక్షించి తిరిగి సముద్రంలో విడిచిపెట్టారు. వేల్షార్క్ సంరక్షణపై అవగాహన.. గతంలో ఈ చేపలను చూసి భయంతో వేటకు వెళ్లే మత్స్యకారులు చంపేసేవారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం కల్పిస్తోన్న అవగాహనతో తీర ప్రాంతంలో కొంతవరకు సత్ఫలితాలన్నిస్తున్నాయి. తూర్పు తీరంలో పరిరక్షణ కోసం వన్యప్రాణి సంరక్షణ విభాగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వేల్షార్క్ సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా తూర్పు తీరంలోని మత్స్యకార గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం, అవగాహన కార్యక్రమాలు ప్రారంభించి ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తోంది. నేరుగా పిల్లలను పెట్టే ఒకే ఒక చేప.. దక్షిణాఫ్రికా తీరంలో మొట్టమొదటిసారి ఈ తిమింగలం సొరను డాక్టర్ ఆండ్రూ స్మిత్ గుర్తించాడు. 70 నుంచి 100 సంవత్సరాల జీవితకాలం కలిగిన ఈ చేపలు లైంగిక పరిపక్వతకు రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. సహజంగా చేపలన్నీ గుడ్లు పెట్టి చేప పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. కానీ బొక్కు సొర మాత్రం నేరుగా పిల్లలను పెడుతుంది. అదీ కూడా రెండు, మూడు చేప పిల్లలను మాత్రమే పెట్టడం ప్రత్యేకం. ఇది గుడ్లు పెట్టినా బయటకు రిలీజ్ చేయదు. తన అంతర్భాగంలోనే దాచుకుంటుంది. ఒకేసారి 200–300 గుడ్లు వరకు పెడుతుంది. 2–3 ఏళ్ల అనంతరం నేరుగా పిల్లల రూపంలో బయటకు వదులుతుంది. ప్లైటో ప్లాంటాన్స్ అనే మొక్కలే ఆహారం. సముద్ర కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చేపలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్లైటో ప్లాంటాన్స్(సృష్టిలో మొదటిగా వచ్చాయి) అనే మొక్కలను పోలిన జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ప్లైటో ప్లాంటాన్స్ ఎక్కువగా పెరిగితే సముద్రంలో పైకి తెట్టులా పెరిగిపోయి ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ బొక్కు సొర దానిని తినడం వల్ల సముద్రంలో ప్లైటో ప్లాంటాన్స్ పెరగకుండా సముద్ర కాలుష్యాన్ని తగ్గిస్తోంది. సముద్రంలోని సూక్ష్మ మృత జీవరాశులు, సముద్రకాలుష్యాన్ని శుద్ధి చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంటుంది. పులులతో సమాన హోదా... వన్యప్రాణి పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బొక్కు సొర చేపను పరిరక్షిస్తున్నాం. గత కొన్నేళ్లుగా తీర ప్రాంత ప్రజల్లో, మత్స్యకారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. అడవుల్లో ఉండే పులులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అంతే ప్రాధాన్యం బొక్కు సొరకు ఇస్తున్నాం. బొక్కు సొరను చంపినా, శరీర భాగాలను విక్రయించినా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 50, 51 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, అధిక మొత్తంలో జరిమానా విధిస్తాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వన్యప్రాణి విభాగం -
ఈ క్యారవాన్కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్లోను, 7.50 మీటర్ల మోడల్లోను దొరుకుతుంది. ‘సీల్వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. -
36 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదిన మహిళ.. వైరల్ వీడియో
నీళ్లతో ఆడుకోవడం చాలా మందికి సరదా. అందుకే చాలామంది ఈత అంటే ఇష్టపడతారు. అయితే.. ఎంతసేపు ఈత కొట్టగలుగుతారు? ఎంత దూరం ఈద గలుగుతారు? ఓ కిలోమీటర్కూడా కష్టమే కదా! కానీ ఏకంగా 36 కిలోమీటర్లు ఏకబిగిన ఈదిందో మహిళ. అరేబియా సముద్రంలో వర్లీ సీలింక్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు 36 కి.మీ ఈత కొట్టి రికార్డు సృష్టించారు ముంబైకి చెందిన సుచేతా బర్మన్. ఈత వీడియోను ఇన్స్ట్రాగామ్లో పంచుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఆ్రల్టా–మారథాన్ స్విమ్మర్ అయిన సుచేతా దేవ్ బర్మన్.. పోస్ట్ ఇన్స్ట్రాగామ్లో దాదాపు 4 మిలియన్ల మంది చూశారు. ఆమె సాధించిన విజయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు అరేబియా సముద్రంలో ఈతేంటి? అత్యంత కలుషితమైన ఆ నీటిలో ఈత కొట్టడం ప్రమాదాలే ఎక్కువని కామెంట్స్ చేశారు. ఇలాంటి ఇన్ఫ్లూయర్స్మనకు కావాలి, వీళ్లే చాలామందిని ప్రభావితం చేస్తారని మరికొందరు స్ఫూర్తిదాయకంగా రాశారు. ముంబై ట్రాఫిక్ని చూస్తే, ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే బెటరేమో అనిపిస్తుందని మరో వినియోగదారు రాశారు. 36 కి.మీ ఈత కొట్టడానికి ఎంత సమయం, పట్టుదల కావాలో నాకు తెలుసంటూ ఓ స్విమ్మర్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కొన్ని గంటలపాటు పదుల కిలోమీటర్లు సముద్రంలో ఈదడమంటే మామూలు విషయం కాదుకదా అంటున్నారు. View this post on Instagram A post shared by Sucheta Deb Burman (@suchetadebburman) -
అంతా క్షణాల్లో జరిగిపోయింది.. సముద్రంలోకి జారి పడిన యువతి, చివరికి
ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే బయట ప్రాంతాలకు వెళ్లి జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇటీవల ఓ యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టంట వైరల్గా మారింది. ఆ వీడియోలో కొందరు పీర్ స్లిప్వేపై ఆడుకుంటూ ఉంటారు. సముద్ర అలలు వస్తూ పోతూ ఉండగా వారు దాన్ని ఆనందిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి చోట ఆటలే కాదు అజాగ్రతగా ఉన్నా ప్రమాదమే అని తెలియక వాళ్లు అక్కడ గంతులెస్తుంటారు. అకస్మాత్తుగా, ఊహించని విధంగా ఒక బలమైన కెరటం అందులోని ఓ యువతిని తాకింది. దీంతో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలోకి వెళ్లిపోయింది. ఒడ్డుకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కెరటాల ధాటికి యువతి చేరుకోలేకపోతుంది. చివరికి ఆమెను కాపాడేందుకు సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాలకు ఎదురెళ్లి ఓ వ్యక్తి బాలికను రక్షించగలిగాడు. ఈ ప్రమాదం నుంచి బయటక పడిన యువతికి స్వల్ప గాయలయ్యాయి. నార్త్ డెవాన్ కౌన్సిల్ అత్యవసర హెచ్చరికతో పాటు ట్విట్టర్లో ఈ వీడియోని షేర్ చేసింది. సముద్రం తీరం వద్ద అధిక ఆటుపోట్లు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను కోరింది. "సముద్రంలోని అలలు పరిస్థితులు బట్టి మారుతుంటాయ్.. కొన్ని సార్లు ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయి,. కాబట్టి దయచేసి తీరం వెంబడి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. Sea conditions can be changeable and volatile, so please be mindful along the coast. This incident took place at Ilfracombe Harbour on Thursday evening and could have been much more serious were it not for quick-thinking members of the public. pic.twitter.com/TA7r9Itz83 — North Devon Council (@ndevoncouncil) August 8, 2023 -
సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే..చివరికి ఒక్కడే సముద్రంలో..
చావు అంచులదాక వెళ్లి బతికితే మృత్యుంజయుడి అంటాం. కానీ చుట్టూ నీరు కనుచూపు మేరలో ఎవ్వరూ లేకుండా ఒక్కడే 24 గంటలు పైగా గడిపి ప్రాణాలతో బయటపడితే ఏం అనాలో చెప్పండి. వింటేనే వామ్మో అనిపిస్తుంది. బఆశలన్ని వదులుకునే స్థితిలో అదికూడా 24 గంటల పైగా అంటే మాటలు కాదుకదా. అంతటి కష్టాన్ని జయించి చివరి దాక ఆశను వదలక ప్రాణాలతో బయటపడి ఔరా! అనిపించుకున్నాడో ఓవ్యక్తి. ఈ భయానక ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల చార్లెస్ గ్రెగొరీ తన బోట్పై శుక్రవారం ఫ్లోరిడా తీరానికి 12 మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా.. సడెన్గా ఓ రాకాసి అల అతని బోట్ని గట్టిగా తాకింది. దీంతో ఒక్కసారిగా బోటు మునిగిపోపయింది. దీంతో అతడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఏకంగా 24 గంటలు పాటు అలానే సముద్రంలో ఒంటరిగా బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. ఓ పక్క ఆకలితో ఉన్న సోర చేపలు, జెల్లి ఫిష్లు దగ్గర నుంచి వెళ్తుంటే..బతుకుతానా ఆహారమైపోతానా అన్నట్లు భయాందోళలనతో గడిపాడు. శనివారానికి ఓ కోస్ట్గార్డ్ గ్రెగోరి పడవ మునిగిపోవడాన్ని గుర్తించి అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చి వైద్యసాయం అందించాడు. ఈ మేరకు సదరు కోస్ట్గార్డు నిక్ బారో మాట్టాడుతూ.. ఆ వ్యక్తి తల్లిదండ్రుల తమ కుమారుడు పడవతో వెళ్లాక తిరిగి అగస్టిన్కి తిరిగి రాకపోవడంతో భయంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము రంగంలోకి దిగి అతన్ని రక్షించినట్లు చెప్పాడు. ఐనా ఇలా ఎప్పుడైనా ఇలా సముద్రంలోకి వెళ్లాలనుకుంటే మాత్రం లైఫ్ జాకెట్, విహెచ్బై మెరైన్ గ్రేడ్ రేడియో, సిగ్నలింగ్ పరికారాలు తోపాటు ఎలాంటి ఆపదలోనైనా చిక్కుకుంటే సమాచారం అందించ గలిగేలా ఎమర్జెన్సీ పర్సనల్ లొకేటర్ బెకన్ని తదితర రక్షణను ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #FinalUpdate @USCG crews rescued 25YO Charles Gregory, Saturday, after he went missing on a 12-foot jon boat, 12 miles offshore of #StAugustine, #Florida. Press release: https://t.co/OGaPL6S6nS#USCG #CoastGuard #SAR pic.twitter.com/WezyZHEXB8 — USCGSoutheast (@USCGSoutheast) August 5, 2023 (చదవండి: సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!) -
సముద్ర గర్భంలో సంగీత కచేరి!..ఈదుకుంటూ వచ్చి మరీ వింటారట!
ఎన్నో రకాల సంగీత కచేరీల గురించి విని ఉంటారు. నీటి అడుగును ప్రేక్షకులను అలరించేలా మ్యూజిక్ షో నిర్వహించడం గురి విని ఉన్నారా. అదికూడా సముద్రంలోనా! అసలు ఎలా ప్లే చేయగలం. వినేవాళ్లు ఎవర?... ఎవరబ్బా?.. ఇలాంటి మ్యూజిక్ షో నిర్వహించాలనుకున్నారు.. అసలు ఇది ఎక్కడ జరుగుతుంది? ఏంటీ అనే కథ కమామీషు గురించి చూద్దాం! వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ఫ్లోరిడాలో అభయారణ్యానికి సుమారు 201 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడా కీస్ నేషనల్ మైరైన్ శాంక్చురీ ప్రాంతంలోని లూకీ రీఫ్లో ఈ మ్యూజిక్ షో జరుగుతుంది. దీన్ని "లోయర్ కీస్ అండర్వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్" అంటారు. ప్రతి ఏడాది ఆగస్టులో నిర్వహిస్తుంటారు. ఎంతోమంది డైవింగ్ చేసుకుంటూ వచ్చి మరీ ఆ మ్యూజిక్ షాలో పాల్గొంటారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు అక్కడి అధికారులు. ఆ సంగీతాన్ని వినేందుకు ఔత్సాహికులు ఈదుకుంటూ వచ్చి మరీ పాల్గొనడం విశేషం. పగడపు దిబ్బలపై పర్యావరణ ప్రభావాలను తగ్గించేలా అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఇలా వినూత్న రీతిలో మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు ఫ్లోరిడా అధికారులు. ఆ సంగీత కచేరిలో సింగర్స్ 'వాటర్' నేపథ్య సంగీతాన్ని అలపిస్తారు. వాటర్ప్రూఫ్ స్పీకర్ల ద్వారా సంగీతం సముద్రంలోకి పైప్ చేస్తారు. అంతేకాదు పగడపు దిబ్బల రక్షణపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది ఒక్కో థీమ్తో ఈ మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. చూసేందుకు అవకాశం లేని ప్రజల కోసం ఈ మ్యూజిక్ని స్థానిక ఎఫ్ఎం రేడియోస్టేషన్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ కార్యక్రమం నాలుగు గంటల పాటు ఆహ్లాదభరితంగా జరుగుతుంది. ఈ పగడపు దిబ్బలను వారంతా సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు. కాగా, ఈ ఏడాది శనివారం జరిగిన 39వ వార్షిక లోయర్ కీస్ అండర్ వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్కు డజన్ల కొద్దీ డైవర్లు, స్నార్కెలర్లు హాజరయ్యారు. పర్యావరణంపై స్ప్రుహ కలిగించేలా ఇంతటి సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడం గ్రేట్ కదా!. (చదవండి: అతనో రాజవంశస్తుడు..'గే' కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..) -
సముద్రం మధ్యలో టూరిస్ట్ బోటు బోల్తా
-
నెదర్లాండ్స్ నౌకలో భారీ అగ్నిప్రమాదం
ది హేగ్: నెదర్లాండ్స్లోని ఉత్తర సముద్రంలో సరుకు రవాణా చేసే ఒక నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో నౌకలో ఉన్న 3 వేల కార్లు దగ్ధమైనట్టు అంచనా. నౌక సిబ్బందిలో ఒకరు మంటల్లో చిక్కుకొని మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణరక్షణ కోసం సముద్రంలో దూకారు. ఆ నౌకలో దట్టంగా పొగ అలుముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి 22 మంది నౌకా సిబ్బందిని ఆస్పత్రికి తరలించినట్టుగా డచ్ కోస్ట్గార్డ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్ కారుల్లో ఒక దానిలో మంటలు చెలరేగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. జర్మనీలోని బ్రెమర్హెవన్ పోర్టు నుంచి ఈజిప్టులో మరో పోర్టుకి ఈ నౌక వెళుతుండగా మంగళవారం రాత్రి అమెలాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో మంటలు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. నౌకకి ఇరువైపులా నీళ్లు పోస్తూ మంటల్ని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల నీళ్లు వేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు తరలించడం కూడా ఒక ముప్పుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
మిస్టరీ: సముద్రంలో దాగి ఉన్న రహదారి.. ఎప్పటిదో తెలుసా?
కడలి అడుగున పురాతన రహదారి బయటపడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు ఇటీవల అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. ఇటీవల సముద్రంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని నిర్మించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది కొత్తరాతి యుగంలోని మంచుయుగం చివరి రోజులకు చెందినది కావచ్చని, కనీసం ఏడువేల ఏళ్ల కిందట దీనిని నిర్మించి ఉంటారని చెబుతున్నారు. సముద్ర గర్భానికి పదహారు అడుగుల లోతున దీనిని కనుగొన్నారు. జదార్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ మేట్ పారికా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సముద్రంలో దాగి ఉన్న ఈ పురాతన రహదారిని కనుగొంది. ఈ రహదారిపై రాతి గొడ్డళ్లు, పలుగులను కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించి, ఇవి క్రీస్తుపూర్వం 4,900 నాటివని తేల్చారు. వీటిని ఉపయోగించి జంతు బలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఇక్కడ లభించాయి. -
‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు!
ప్రపంచంలో లెక్కకుమించినంతమంది తమ ఉద్యోగాలను అయిష్టంతోనే చేస్తుంటారనే వాదన వినిపిస్తుంటుంది. అయితే వారు తమ హాబీతో ఏమైనా సాధించవచ్చని తపన పడుతుంటారు. అయినా అందుకు తగిన ప్రయత్నాలు చేయరు. కొందరు మాత్రం ఈ ప్రపంచం ఏమనుకున్నా, ఎటుపోయినా తాము అనుకున్నది చేసి చూపిస్తారు. అద్భుతాలు అందిస్తారు. ఇదే కోవలోకి వచ్చే ఒక మహిళ తన హాబీనే తన ఉద్యోగంగా మలచుకుని అత్యధికంగా సంపాదిస్తోంది. ఇందుకోసం ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన బోరింగ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసింది. మత్స్య కన్యగా మారిన మాస్ గ్రీన్ మాస్ గ్రీన్ అనే యువతి స్కూలులో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసేది. అయితే ఇప్పుడామె ‘మత్స్య కన్య’గా మారిపోయింది. ఇది వినేందుకు వింతగా అనిపిస్తుంది. ఆమె ఒక ఫుల్టైమ్ ‘రియల్ లైఫ్ మత్స్య కన్య’గా మారేందుకు తన ఉద్యోగాన్ని వదిలివేసింది.యూకేలోని ‘మెట్రో’తో మాట్లాడిన ఆమె ‘మత్స్య కన్య’గా ఉండటం తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని, తన కెరియర్ మార్చుకున్నాక ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. డెవొన్కు చెందిన 33 ఏళ్ల మాస్ గ్రీన్ ఇంగ్లీషు నేర్చుకునేందుకు 2016లో సిసిలీ వెళ్లింది. మత్స్య కన్యగానే ఎందుకు.. మీడియాతో మాట్లాడిన మాస్ తాను గతంలో ఒక సాగర తీరంలో మత్స్యకన్య మేకప్తో ఒక వ్యక్తిని చూశానని, అప్పటి నుంచి తనకు మత్స్యకన్యగా మారాలనే ఆలోచన తరచూ వచ్చేదని తెలిపింది. అయితే అప్పుడు తాను చూసినది ఒక ఇంద్రజాలమని, అయితే తాను నిజంగా మత్స్యకన్యగా మారిపోవాలనుకున్నానని తెలిపింది. ఇది వినేందుకు అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దీనిని తాను చేసి చూపించానని మాస్ గర్వంగా తెలిపింది. తనను చూసేందుకు జనం విపరీతంగా రావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని పేర్కొంది. అభిరుచే ఆదాయమార్గంగా మారి.. ‘రియల్ లైఫ్ మత్స్యకన్య’గా మారాక తాను నీటిలో సయ్యాటలాడున్నప్పుడు తన తోక భాగాన్ని చూసి అందరూ ఆనందిస్తారని తెలిపింది. తనకు సముద్రంలో అధిక సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని మాస్ తెలిపింది. తాను సముద్రతీర సందర్శనకు వచ్చే పర్యాటకులకు పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తానని పేర్కొంది. మత్స్యకన్యగా మారేందుకు తాను అధిక సమయం ఊపిరి నిలిపివుంచే శిక్షణ పొందానని తెలిపింది. తాను తనకు ఎంతో ఇష్టమైన అభిరుచిని నెరవేర్చుకోవడంతో పాటు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నానని మాస్ గ్రీన్ ఆనందంగా తెలిపింది. ఇది కూడా చదవండి: ఉన్నట్టుండి షాపింగ్ మాల్లో తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్లో ఏం జరిగిందంటే.. -
34 ఏళ్లుగా సముద్రంలో తేలాడిన ఆ బాటిల్... ఆమె చేతికి చిక్కడంతో...
కెనడాకు చెందిన ఒక మహిళకు 34 సంవత్సరాల క్రితం నాటి ఒక బాటిల్ సముద్రపు ఒడ్డున దొరికింది. ఆ బాటిల్లోని ఒక కాగితంలో ఒక మెసేజ్ ఉంది. దానిని చదివిన ఆ మహిళ తెగ ఆశ్చర్యపోయింది. ఆ మెసేజ్ ఆధారంగా ఆ మహిళ ఆ బాటిల్ యజమాని కోసం వెదికింది. అప్పుడు ఆమెకు ఒక విషయం తెలియడంతో నిలువునా వణికిపోయింది. పురాతన కాలం నాటి వస్తువు ఏదైనా దొరికితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఏదైనా మెసేజ్ లాంటిది ఏదైనా లభ్యమైతే ఇక అప్పుడు కలిగే ఆసక్తికి హద్దులు ఉండవు. కెనడాకు చెందిన ఒక మహిళ విషయంలో ఇదే జరిగింది. షెల్టెర్ అనే మహిళకు సముద్రపు బీచ్ను శుభ్రం చేస్తుండగా ఒక వస్తువు దొరికింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. 34 ఏళ్లుగా నీటిపై తేలుతున్న బాటిల్ ఆ మహిళ ఒక బాటిల్ ఫొటోను, ఒక మెసేజ్ను షేర్ చేసింది. ఆ మెసేస్పై 1989, మే 29 తేదీ ఉంది. అంటే ఆ బాటిల్ 34 ఏళ్ల క్రితం నీటిలో పడవేశారు. అది ఇన్నేళ్లుగా నీటిలో కొన్ని వేల మైళ్లు దూరం వరకూ తేలుతూవస్తోంది. షెల్టెర్ ఆ పోస్టులో ఇలా రాసింది.. ‘నాకు ఎప్పటికై నా ఏదైనా పురాతన వస్తువు దొరుకుతుందని తరచూ అనిపించేంది. ఇప్పుడు అది దొరికింది’ అని పేర్కొంది. బాటిల్లో ఏం మెసేజ్ ఉంది? నిజానికి అ బాటిల్లో ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడిన ఎటువంటి మెజేస్ లేదు. అయినా దీనిలో ప్రత్యేకత ఉన్నట్లే కనిపిస్తుంది. దానిలో కొన్ని ఏళ్ల క్రితం నాడు రాసిన మెసేజ్ ..‘ఇది ఒక సన్నీ డే, గాలి వీయడం లేదు’ అని ఉంది. ఎవరో వినోదం కోసం ఈ మెసేజ్ రాసి, దానిని బాటిల్లో ఉంచి, నీటిలో పడవేశారు. ఏదో ఒకరోజు ఎవరికో ఒకరికి ఈ బాటిల్ లభ్యమవుతుందని వారు భావించివుంటారు. బాటిల్ యజమాని ఎవరంటే.. షెల్టెర్ తన ఫేస్బుక్ పోస్టులో ఒక అప్డేట్ కూడా ఇచ్చింది. దానిలో ఆమె తనకు ఈ బాటిల్ యజమాని చిరునామా తెలిసిందని పేర్కొంది. న్యూఫౌండ్ల్యాండ్కి చెందిన గిల్బర్ట్ హేమలిన్ 1989 మే 29న ఈ బాటిల్ను తాను ప్రయాణిస్తున్న బోటు నుంచి సముద్రంలోకి విసిరేశారు. దీనిని పోర్ట్ ఓ చోక్స్కు 10 మైళ్ల దూరంలో నీటిలో విసిరివేశారు. ఆ బాటిల్వెనుక భాగంలో ఒక చిరునామా ఉంది. ఆ ప్రాంతం సెయింట్ ఆగస్టాన్ నది, క్యూబెక్కు 12 మైళ్ల దూరంలో ఉంది. అక్కడకు వెళ్లిన షెల్టెర్ ఆ బాటిల్ యజమానిని కలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే అతను రెండేళ్ల క్రితమే మృతి చెందారని షెల్టెర్కు తెలిసింది. దీంతో ఆమె అతని కుమారునికి ఫోనులో విషయమంతా చెప్పింది. త్వరలోనే ఈ బాటిల్ పంపిస్తానని అతనికి తెలిపింది. ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు -
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 సముద్ర జీవులు
-
అదే ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్.. 15 వేలమందిపై సర్వే.. ఆసక్తికర వివరాలు వెల్లడి!
మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాడని చెబుతారు. శాంతియుతంగా జీవించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ఇదే ఉత్తమ మార్గమని పరిశోధకులు, నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ సలహాలు, సూచనల నేపధ్యంలోనే చాలామంది ప్రకృతితో మమేకమై జీవించాలనుకుంటారు. తాజాగా పరిశోధకులు ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలిపారు. సముద్రతీరంలో నివసించేవారు అరోగ్యంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ‘కమ్యూనికేషన్ అర్త్ అండ్ ఎన్విరాన్మెంట్’లో ప్రచురితమైన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని యూనివర్శిటీ ఆఫ్ వియానాకు చెందిన ఎన్విరాన్మెంటల్ సైకాలజీ గ్రూప్ చేపట్టింది. ఈ బృందానికి సాండ్రా జోయిగర్ సారధ్యం వహించారు. సముద్రతీరం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. అందుకే మనుషులు సాగరతీరంలో కాలం గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. చాలా దేశాలు సముద్రతీరం వెంబడి ఉన్నాయని, సాగరతీర ప్రాంతాల్లో ఉన్నవారు మిగిలినవారికన్నా ఆరోగ్యంగా ఉంటున్నట్లు తేలిందన్నారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం 1660వ సంవత్సరంలోనే దీనిపై పరిశోధనలు ప్రారంభమయ్యాయన్నారు. ఆ కాలంలో ఆంగ్ల ఫిజీషియన్లు తమ దగ్గరకు వచ్చేవారికి సముద్ర స్నానం చేయాలని, సముద్రతీరంలో నడవాలని సూచించేవారు. ఈ దిశగా ప్రోత్సహించేవారు. అలాగే 19వ శతాబ్ధపు మధ్యభాగంలో యూరప్కు చెందిన ధనవంతులు సముద్ర తీరంలో సేదతీరేందుకు తహతహలాడిపోయేవారు. 20వ శతాబ్ధంలో ఈ దిశగా జనం ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడు తాజాగా పరిశోధకులు సముద్రతీరప్రాంతంలో పర్యటించడం ఆరోగ్యకరమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధనకులు సముద్రతీర ప్రాంతాల్లో నివసించే 15 వేల జనాభా ఆరోగ్యంపై సర్వేచేశారు. దీనిని క్రోడీకరించి సముద్రతీరంలో నివాసం ఉండటం ఎంతో లాభదాయకమని తేల్చిచెప్పారు. -
ఆలివ్ రిడ్లే.. సముద్రంలోకి వెడలె
సాక్షి, అమరావతి: ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ చర్యల్లో భాగంగా ట్రీ ఫౌండేషన్, రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతం వెంబడి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,036 తాబేళ్ల గూళ్లను రక్షించాయి. ఆ గూళ్లలో 3.41 లక్షల గుడ్లను కాపాడగా.. వాటినుంచి 2.39 లక్షల తాబేళ్ల పిల్లలు పుట్టుకొచ్చాయి. వాటన్నిటినీ సముద్రంలోకి వదిలారు. శ్రీకాకుళం, విజయ నగరం, కృష్ణా, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 23న అంతర్జాతీయ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. ట్రీ ఫౌండేషన్ అటవీ శాఖతో కలిసి గత 16 సంవత్సరాలుగా సముద్ర తాబేళ్ల రక్షణ, సముద్ర జీవ సంరక్షణలో పాలుపంచుకుంటోంది. ఈ 16 సంవత్సరాల్లో ఇప్పటివరకు 33.68 లక్షలకు పైగా సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలో వదిలారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతంలోని ఒడిశా, ఆంధ్రా ప్రాంతాలు ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనువైనవి. ఏటా ఈ తీరాల్లో గుడ్లు పెట్టేందుకు వేల తాబేళ్లు సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తీరంలో గుడ్లు పెట్టిన తాబేళ్లు వెళ్లిపోయాక.. ఆ గూళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే చాలా సంవత్సరాలుగా ట్రీ ఫౌండేషన్ వంటి సంస్థలు అటవీ శాఖతో కలిసి వాటి సంరక్షణకు నడుం బిగించాయి. వెయ్యి తాబేళ్లలో ఒకటే.. ప్రతి ఆడ తాబేలు ఒక సీజన్లో (డిసెంబర్ నుంచి మార్చి) రెండుసార్లు గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి తీర ప్రాంతానికి వస్తుంది. గుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి 48 నుంచి 60 రోజులు పడుతుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీలుంటే.. మగ పిల్లలు, 30 నుంచి 35 డిగ్రీలుంటే ఆడ పిల్లలు జన్మిస్తాయి. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లు నక్షత్రాలు, చంద్రుడి వెలుతురు ఆధారంగా సముద్రంలోకి చేరుకుంటాయి. పిల్ల తాబేళ్లకు బొడ్డు దగ్గర యోక్ సాక్ (పచ్చసొనలా) ఉంటుంది. దీని ద్వారానే పిల్ల తాబేళ్లకు 48 గంటల వరకు పోషకాహారం అందుతుంది. అందుకే గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లను వెంటనే సముద్రం తీరంలో విడిచిపెట్టాలి. ఈ పనిని చాలాకాలంగా మేం చేస్తున్నాం. పుట్టిన తాబేళ్లకు వాటి మెదడు కణాల చూట్టూ మేగ్నటైట్ సెల్స్ ఉంటాయి. ఇవి వాటికి జీపీఎస్లా ఉపయోగపడతాయి. అందుకే ఆడ తాబేళ్లు 12 నుంచి 15 సంవత్సరాలకు అవి పుట్టిన తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తాయి. వెయ్యి తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళితే గుడ్లు పెట్టే సమయానికి ఒకే ఒక తాబేలు మాత్రమే మిగులుతుంది. మిగిలిన 999 పిల్లలు పెద్ద చేపలకు ఆహారమైపోతాయి. – డాక్టర్ సుప్రజ ధారిని, ఛైర్పర్సన్, ట్రీ ఫౌండేషన్ -
హైదరాబాద్ లో సముద్రం ఎక్స్ పీరియన్స్
-
మే రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా
సాక్షి, అమరావతి: రెండునెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం సముద్రంలో 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. వేట నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం వచ్చేనెల రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేటనిషేధ భృతి) పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వేట విరామాన్ని ఉల్లంఘించిన వారి బోట్లను సీజ్ చేయడమేగాక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో తడ మొదలు ఇచ్ఛాపురం వరకు 974 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్రతీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలున్నాయి. వీటిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా పెరుగుతున్న బోట్లు డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది. వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేటనిషేధ భృతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది. పైగా ఈ మొత్తాన్ని నిషేధకాలం ముగియకుండానే బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తూ గంగపుత్రులకు అండగా నిలుస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందించగా, గడిచిన 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం 4.14 లక్షల మందికి రూ.414.49 కోట్ల భృతిని అందించింది. అదేరీతిలో ఈ ఏడాది కూడా మే రెండో వారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అర్హుల గుర్తింపునకు బృందాలు ఆర్బీకేల్లో పనిచేసే గ్రామ మత్స్య సహాయకునితో పాటు వలంటీర్, సాగరమిత్రలతో ఏర్పాటు చేసిన బృందాలతో ఈ నెల 17వ తేదీన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. ఆరోజు తీరంలో లంగరేసిన బోట్లను ఈ బృందాలు పరిశీలించి వివరాలు నమోదు చేస్తాయి. గుర్తింపు సమయంలో బోటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్సు, ఆధార్, రైస్కార్డుతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 18వ తేదీ గ్రామ సచివాలయ డిపార్టుమెంట్ రూపొందించే సాప్ట్వేర్లో అప్లోడ్ చేస్తారు. ఈ డేటా ఆధారంగా ఆరుదశల వెరిఫికేషన్ తర్వాత అర్హుల జాబితాలను సామాజిక తనిఖీకి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హత పొందిన వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత ఉంటే జాబితాల్లో చేర్చి తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. అర్హులు వీరే.. ♦ 18 మీటర్లకుపైన పొడవు ఉండే మెకనైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా 10 మంది, 18 మీటర్ల లోపులో ఉండే మోటరైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా ఎనిమిదిమంది, ఇతర మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురు, సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లకు యజమానితో సహా ముగ్గురు చొప్పున అర్హులు. ♦ వయసు 18–60 ఏళ్ల మధ్య ఉండాలి. ♦ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో 1.44 లక్షలలోపు ఉండాలి. ♦ సంక్షేమ పథకాలు పొందినవారు, మత్స్యకార పింఛన్ పొందుతున్నవారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు చేస్తున్నవారు. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. ♦ అర్బన్ ప్రాంతాల్లో కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉండకూడదు. ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండకూడదు. -
కాంతులీనుతున్న సాగరతీరం.. రాత్రి వేళ నీలిరంగులోకి భీమిలి బీచ్
సాక్షి, విశాఖపట్నం: సాగరతీర అందాలకు స్వర్గధామంగా ఉన్న విశాఖలో ఇప్పుడు మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పగలంతా అలల సవ్వడితో పర్యాటకులను అలరిస్తున్న భీమిలి బీచ్.. వారం రోజులుగా రాత్రి సమయంలో నీలివర్ణంతో కాంతులీనుతూ కనువిందు చేస్తోంది. బయోలుమినిసెంట్ తరంగాల కారణంగా అలల పొంగులో కాంతి వెదజల్లుతుండటంతో పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వారం రోజుల కిందట భీమిలి బీచ్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆహ్లాదకరంగా కనిపించే సాగరతీరం... రాత్రి సమయంలో నీలివర్ణంలో వెలిగిపోతోంది. మొదట్లో ఏమవుతుందో అర్థంకాక పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. కానీ.. నీలి అలలు ఎగసిపడుతుంటే.. క్రమంగా వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ ప్రాంతంలో ముందెన్నడూ చూడని అద్భుతమైన సహజసిద్ధ సముద్ర అందాలను చూసి పులకించిపోతున్నారు. మరోవైపు సముద్రంలో ఏదో జరిగిందంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. బయోలుమినిసెంట్ కారణంగా... బీచ్లో ఈ తరహా మార్పులు చూసేందుకు ఆహ్లాదకరంగా ఉన్నా... ఒకింత ఆందోళన కూడా కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఫైటో ప్లాంక్టన్ అని పిలిచే చిన్నచిన్న సముద్ర జీవులు విడుదల చేసిన రసాయనాల కారణంగా ప్రకాశవంతమైన నీలి కాంతి విడుదలవుతుంది. దీంతో బయోలుమినిసెంట్ తరంగాలు ఏర్పడుతున్నాయి. అయితే, సముద్రంలోని అతి సూక్ష్మ నీలి, ఆకుపచ్చ శైవలాలే (ఆల్గే) భీమిలి బీచ్ నీలివర్ణంలో మెరిసిపోవడానికి కారణమని నిపుణులు వివరిస్తున్నారు. కొన్నిరకాల ఆల్గేల వల్ల బీచ్లు ఆకుపచ్చ వర్ణంలోనూ మెరుస్తుంటాయని, నీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నంతవరకూ బీచ్ ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఎక్కువ రోజులు ఉంటే ఆందోళనకరమే... దేశంలో ఈ విధంగా బీచ్లు తళుక్కున మెరిసిపోవడం కొత్తేమీ కాదు. లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవుల్లోని హేవ్లాక్ ద్వీపం, రాధానగర్ బీచ్, మహారాష్ట్రలోని కొంకణ్ తీరం, మాల్దీవుల్లోని వాధూ ద్వీపంతోపాటు చెన్నైలోని మెరీనా బీచ్లోనూ కొన్నిసార్లు ఈ తరహా బయోలుమినిసెన్స్ కనిపించింది. ఈ గ్లో–ఇన్–డార్క్కు కారణమైన ఆల్గేలు భారీగా ఉంటే చాలా ఆక్సిజన్ను తీసుకుంటాయి. దీనివల్ల సముద్రంలో ఆక్సిజన్ కొరత రావొచ్చు. ఎక్కువ పోషకాలు, వ్యర్థాలు ఉన్నచోట ఈ ఆల్గే పోగుపడుతుంది. ఎక్కువ రోజులు ఈ నీలి మెరుపులు ఉంటే ఆ ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఆక్సిజన్ తగ్గి సాగరజలాల్లోని జీవరాశులకు కాస్త ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుందనే ఆందోళన కూడా ఉంది. ఏది ఏమైనా... భీమిలి బీచ్లో ఈ తరహా అద్భుతం మాత్రం ఆహ్వానించదగిన పరిణామం. – సాయి కిరణ్, వాతావరణ నిపుణుడు -
సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి
పురాణాల్లో వింటుంటాం సముద్రాల్లో నీటి అడుగున జీవించే మనుషుల గురించి. అంతేందుకు మహాభారతంలో దుర్యోధనడు నీటి అడుగున్న ధ్యానం చేయగల ధీరుడని విన్నాం. అవన్నీ వినడమే గానీ నిజంగా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మాములుగా ఓడల్లో సముద్ర ప్రయాణాలు రోజుల తరబడి జరిగినప్పటికీ అది నీటిపైనే కానీ అడుగున కాదు. ఐతే నీటి అడుగున జీవించగలమా అక్కడ పరిస్థితులను మన శరీరీం తట్టుకోగలదా అనే దానిపై చాలా సందేహాలు శాస్తవేత్తలను మదిలో ప్రశ్నలుగా మిగిలాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఫ్లోరిడాకు చెందిన ప్రోఫెసర్ జో డిటూరి ఒక అసాధారణమైన ప్రయోగానికి నాంది పలికారు. బయో మెడికల్ ఇంజనీరింగ్ పీహెచ్డీ చేసిన డిటూరి అనేక వ్యాధులను నివారించగల మెడికల్ టెక్నాలజీపై కూడా పలు పరిశోధనలు చేశారు. ఈ మేరకు ఆయన సముద్రాన్ని మూడు నెలలపాటు తన నివాసంగా మార్చుకున్నాడు. అతను సముద్రంలోని 30 అడుగుల లోతుల్లో 100 రోజులు జీవించే ప్రయాగాన్ని నిర్వహించాడు. ఈ ప్రయోగానికి నెఫ్ట్యూన్ 100 అని పేరు పెట్టాడు. ఈ ప్రయోగం కోసం రిటైర్డ్ యూఎస్ నేవీ కమాండర్ ప్రోఫెసర్గా ఎంచుకున్నాడు. పనిలో పనిగా మనస్తత్వ వేత్త ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. అంతరిక్ష పర్యాటనకు సమానమైన వాతావరణంలో ఉన్నప్పుడూ మనిషి మానసిక స్థితి, ప్రభావాలు ఎలా ఉంటాయనేద దానిపై వారు పర్యవేక్షిస్తారు. ఈ ప్రయోగం సక్స్స్ అయితే భూమిపై అనుభవించిన ఒత్తిడికి 1.6 రెట్ల ఒత్తిడిని అధిగమించి బతికిబట్టగట్ట గలిగితే ప్రపంచ రికార్డుగా నిలుస్తుంది. వాస్తవానికి మానవ శరీరం నీటి అడుగున ఇంత కాలం ఉండలేదని ప్రోఫెసర్ డిటూరి అన్నారు. కాబట్టి నా శరీరం ఏమౌవుతోందో అనేది అధ్యయనాలకు ముఖ్య భూమికగా ఉపయోగపడుతుంది. అలాగే నా శరీరాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిశోధనకు ఉపకరిస్తుంది. ఒకవేళ నీటి అడుగున ఒత్తిడిని ఎదుర్కొనగలిగితే తన ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటయని చెబుతున్నారు. ఈ మేరకు డిటూరి ఈప్రయోగాన్ని మార్చి1న ప్రారంభించారు. ఐతే తాను సూపర్ హ్యుమన్గా బయటకు వస్తానో లేదో అనేది కాస్త సందేహంగానే ఉందన్నారు. View this post on Instagram A post shared by Joe Dituri (@drdeepsea) (చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..) -
వేటకు వేళాయె..రా!
సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం: విస్తారమైన సముద్ర తీరం.. అపారమైన మత్స్యసంపద.. వేటలో సిద్ధహస్తులైన మత్స్యకారులకు కోనసీమ సముద్ర తీరం మత్స్య సంపదకు అక్షయపాత్రే. అందుకే స్థానిక మత్స్యకారులతోపాటు వేటలో నిష్ణాతులైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన అనేకమంది మత్స్యకారులు కుటుంబాలతో ఇక్కడకు వలస వచ్చి వేటను సాగిస్తుంటారు. ఏటా ఎనిమిది నెలల పాటు ఇక్కడి తీరంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర తీరాన్ని ఆనుకుని పలు మత్స్యకార గ్రామాలున్నాయి. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద సముద్రతీరం గట్టు మీద పదుల సంఖ్యలో గుడిసెలతో చిన్నచిన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. అంతమాత్రాన ఇవి రెవెన్యూ రికార్డుల్లో నమోదైన గ్రామాలు కాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిసర ప్రాంతాల నుంచి వేట కోసం ఇక్కడకు వలస వచ్చిన మత్స్యకారుల ఆవాసాలు. ఒక విధంగా ఇవి ‘వలస’ గ్రామాల కింద లెక్క. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం. వినాయక చవితి తరువాత మత్స్యకారులు నక్కపల్లి నుంచి నేరుగా బోట్ల మీద తాము నివాసముండే ప్రాంతాలకు కుటుంబాలతో సహా వస్తారు. అప్పటి నుంచి మేలో సముద్ర వేట నిషేధం విధించే వరకు ఎనిమిది నెలలపాటు ఇక్కడే నివాసముంటారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సముద్ర వేటకు వెళ్లడం.. శనివారం వేటకు సెలవు పెట్టి స్థానికంగా మార్కెట్ పనులు చూసుకోవడం వీరి దినచర్య. గడిచిన 25 ఏళ్లుగా మత్స్యకారులు ఇక్కడకు వలస వస్తుండడం గమనార్హం. కోనసీమకు ఎందుకు వలస అంటే.. గోదావరి నదీపాయలతోపాటు ప్రధాన మురుగునీటి కాలువలు మొగల ద్వారా సముద్రంలో కలుస్తాయి. సముద్ర ఉప్పునీటిలో మొగల ద్వారా చప్పనీరు వివిధ మార్గాల ద్వారా పెద్దఎత్తున చేరడంవల్ల ఈ తీరంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుంది. నక్కపల్లి తీరం కన్నా కోనసీమ తీరంలోనే మత్స్య సంపద అధికంగా దొరుకుతుందని వీరు చెబుతుంటారు. పండుగప్ప, చందువా, కొయ్యింగ, బొమ్మిడి చుక్క, గులిగింత, మడ పీత, చుక్కపీత, టైగర్ రొయ్యలు, జెల్లలు, ఇసుక దొందులు, టేకు చేపలతోపాటు అత్యంత ఖరీదైన ‘కచ్చిడి చేప’లు కూడా దొరుకుతాయి. కచ్చిడి చేప ఖరీదు రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటోంది. స్థానిక మత్స్యకారుల ఎదురు పెట్టుబడి వలస మత్స్యకారులకు స్థానిక మత్స్యకార వ్యాపారులు ఎదురు పెట్టుబడి పెడతారు. సీజన్లోని ఎనిమిది నెలలకు గాను బోటుకు వచ్చి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తారు. వలస మత్స్యకారులు వేటాడి తెచ్చిన మత్స్య సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం ఈ వ్యాపారులు తిరిగి తీసుకుంటారు. తెల్లవారుజాము నుంచే వేట.. నిజానికి.. ఈ మత్స్యకారులు తెల్లవారుజామునే బృందాలుగా బోటు మీద వేటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట, రెండు మధ్య వేట నుంచి తిరిగి వస్తారు. మత్స్య సంపదకు తీరాన్ని ఆనుకునే వేలం నిర్వహిస్తారు. గులిగింత, ఎర్ర గులిగింత, కచిడి, కూనాలు, పండుగప్ప, చందువాలు ఇటు చెన్నై, అటు కోల్కతా, హైదరాబాద్ మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిపోయిన చేపలను మత్స్యకార మహిళలు ఎండబెట్టి ఎండుచేపలుగా తయారుచేస్తారు. వేటకు వెళ్లే బోటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విలువ చేసే మత్స్య సంపద వస్తోంది. ఏటా క్రమం తప్పకుండా.. మా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల కాలుష్యంవల్ల కొన్నేళ్లుగా వేట గిట్టుబాటు కావడంలేదు. ఇక్కడ మాకు వేటకు వెళ్లడానికి పడవలు గట్టుపై పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మత్స్య సంపద మా ప్రాంతంలో కన్నా ఇక్కడ ఎక్కువ. – దోని చిన్నా, వేంపాడు గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మత్స్య సంపద ఎక్కువ ఈ జిల్లాలో గోదావరి పాయలు ఎక్కువ. చప్పనీరు, ఉప్పునీరు కలిసే చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. మా ప్రాంతం కన్నా ఇక్కడ రెట్టింపు ఆదాయం వస్తోంది. 8 నెలలు ఇక్కడే ఉంటాం. – సోడిపల్లి అప్పలరాజు, రాజయ్యపేట, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మేం పెట్టుబడి పెడతాం నాకు సొంతంగా రెండు బోట్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నుండి వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తున్న మత్స్యకారులకు మేం పెట్టుబడి పెడతాం. వేటలో వచ్చే ఆదాయంలో 10% మాకు ఇవ్వాలి. వారికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. – బొమ్మిడి రాంబాబు, వ్యాపారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
కరీబియన్ దీవి కారుచౌక
ఫొటోలో కనిపిస్తున్నది కరీబియన్ సముద్రంలోని దీవి. దక్షిణ అమెరికా దేశం నికరగ్వా తీరానికి ఆవల పన్నెండు మైళ్ల దూరంలో ఉందిది. చుట్టూ నీలి కడలి, నడి మధ్యన పచ్చదనంతో అలరారే ఈ ప్రైవేటు దీవి పేరు ‘ఇగ్వానా దీవి’. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవిలో అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తున ఉన్న అబ్జర్వేటరీ టవర్తో కూడిన ఒక మూడు పడకగదుల ఇల్లు, దీవి పడమటి వైపున చక్కని ఈతకొలను, వైఫై, మొబైల్, టీవీ తదితర సౌకర్యాలు, చుట్టూ ఎటుచూసినా పచ్చని అరటి, కొబ్బరిచెట్లతో ఉన్న ఈ దీవి ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర 3.76 లక్షల పౌండ్లు మాత్రమే! లండన్ నగరంలోని ఒక సామాన్యమైన ఫ్లాట్ ధర కంటే ఇది చాలా చౌక. దీనిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరి! -
సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు.. ఆహా అనిపించేలా నగరం!
ఇప్పటి వరకు మనకు జలాంతర్గాముల గురించి తెలుసు. ఇకపై జలాంతర నగరాలు కూడా సముద్ర గర్భంలో వెలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రెజిల్లోని రియో డి జనీరో తీరానికి ఆవల సముద్ర గర్భంలో తొలి జలాంతర నగరం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన బెల్జియన్ డిజైనర్, ఆర్కిటెక్ట్ విన్సెంట్ కాలెబాట్ ఈ జలాంతర నగరానికి రూపకల్పన చేశారు. ఇరవైవేల మందికి నివాసం కల్పించేలా వెయ్యి టవర్లతో ‘ఆక్వారియా’ పేరిట ఈ జలాంతర నగరాన్ని నిర్మించనున్నారు. సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు వరకు విస్తరించేలా ఈ జలాంతర నగర నిర్మాణాన్ని తలపెట్టారు. సముద్ర జలాల్లో కలిసిపోయి, కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం వ్యర్థాలను నిర్మూలించే లక్ష్యంతో ఈ నిర్మాణాన్ని తలపెట్టారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి, అంటార్కిటికా వద్ద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, సముద్రపు నాచు వంటి పదార్థాలతో ఈ నగరాన్ని నిర్మించనున్నట్లు చెబుతున్నారు. -
సముద్రంలో ఛేజింగ్ సీన్
-
వైరల్ వీడియో: పూల్ క్లీనర్కు సహాయం చేస్తున్న చిన్న సముద్రపు ఒట్టర్
-
Viral Video: సముద్రంలో చేపను ఒడిసి పట్టుకున్న గ్రద్ద..
-
విషాదం నింపిన పుట్టిన రోజు వేడుక
సాక్షి, హైదరాబాద్: స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు ఉత్సాహంగా జరుపుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. చెన్నై ప్రాంతంలోని ఐఐటీలో ఉన్నత చదువు చదువుకునేందుకు వెళ్లి పుట్టిన రోజు నాడే తనువు చాలించడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బౌద్ధనగర్కు చెందిన గంజి ఉమాపతి, భాగ్యలక్ష్మి దంపమతులకు కుమారుడు నితిన్ (21), ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు నితిన్ దార్వాడిలోని ఐఐటీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 23న శుక్రవారం నితిన్ పుట్టిన రోజు కావడంతో మహాబలిపురంలో సముద్ర స్నానానికి స్నేహితులతో కలిసి వెళ్లారు. సముద్రస్నానం చేస్తుండగా నితిన్తో పాటు మరో ఇద్దరు స్నేహితులు సముద్రం లోపలికి వెళ్లగా బలమైన అలలు రావడంతో సముద్రం లోపలికి కొట్టుకుని పోయారు. ఇద్దరు స్నేహితులు ఎలాగో బయటపడగా నితిన్ మాత్రం శవమై బయటకు వచ్చాడు. స్థానిక పోలీసులు వచ్చి మృతదేహాన్ని శంగర్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం ఉదయం బౌద్ధనగర్కు తీసుకుని వచ్చారు. కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు.. చెట్టంత కొడుకు త్వరలోనే ప్రయోజకుడై వస్తాడని ఎదురు చూస్తుండగా శవమై ఇంటికి రావడంతో వారి బాధ వర్ణనాతీతం. మధ్యాహ్నం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీజేపీ సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు రవిప్రసాద్గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు నరేందర్, దేవదాసు, భాస్కర్, నవీన్, శ్రీకాంత్లు మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చదవండి: ఆత్మహత్య చేసుకోవడం ఎలా? నటిస్తూ.. పాఠశాల విద్యార్థి మృతి -
రోబో రక్షిస్తుంది
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న వారిని క్షణాల్లో రక్షించేందుకు రోబో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైజాగ్ సేఫ్ సంస్థ ‘లైఫ్ బాయ్’ పేరుతో ఈ రోబోను రూపొందించింది. దీనిని ఇటీవల నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ ప్రారంభించారు. ఈ రోబో పూర్తిగా బోటు తరహాలోనే పనిచేస్తుంది. ఒకేసారి ముగ్గురిని కాపాడనుంది. సెకనుకు 7 మీటర్ల వేగంతో 600 మీటర్ల వరకు పనిచేస్తుంది. ఈ రోబో ధర రూ.5.50 లక్షలు కాగా, వీటిని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉంచేందుకు ఐదు యంత్రాలను ప్రభుత్వ అనుమతితో కొనుగోలు చేయనున్నారు. అలలపై దూసుకుపోతున్న రోబో -
షాకింగ్ ఘటన.. నాన్నను కాపాడేందుకు వెళ్లి..
తొండంగి(కాకినాడ జిల్లా): సముద్రంలో గల్లంతైన తన తండ్రిని కాపాడేందుకు వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మండలంలోని పెరుమాళ్లపురం పంచాయతీ కొత్తచోడిపల్లిపేట సముద్రతీరంలో గురువారం వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెరుమాళ్లపురం పాత చోడిపల్లిపేటకు చెందిన యదాల వరహాలు (30), చింతకాయలపేటకు చెందిన పిట్ల శ్రీను (28) వినాయక నిమజ్జనంలో భాగంగా సముద్రంలో స్నానానికి దిగారు. స్నానం చేస్తూ మొత్తం పది మంది గల్లంతవ్వగా స్థానిక మత్స్యకారులు శ్రీలం కొండబాబు, యాదాల సుబ్రహ్మణ్యం, కడారి రామారావు, కడారి రాంబాబు, పేకేటి యతిమాని, కడారి రమణలతో పాటు మరో ఇద్దరిని కాపాడారు. వరహాలు, శ్రీను గల్లంతయ్యారు. చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? ముమ్మరంగా గాలింపు గల్లంతైన వారిలో తన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండడంతో కాపాడేందుకు వెళ్లిన వరహాలు గల్లంతయ్యాడు. కాసేపటికి ఇతని మృతదేహం లభ్యంకాగా గల్లంతైన శ్రీను ఆచూకీ కోసం మత్స్యకారులు, అతని బంధువులు గాలిస్తున్నారు. యాదాల వరహాలు తండ్రి సుబ్రహ్మణ్యం కొత్తచోడిపల్లిపేటలో కిరణా షాపు నిర్వహించకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు వరహాలుకు వివాహం కాగా భార్య, రెండున్నరేళ్ల కుమార్తె, 15 రోజుల వయసు గల బాబు ఉన్నారు. చింతకాయలపేటకు చెందిన పిట్ల సుబ్బారావు, సుబ్బలక్ష్మి కుమారుడు పిట్ల శ్రీను, మృతుడు వరహాలు హేచరీలో వర్కర్లుగా పని చేస్తున్నారు. శ్రీనుకు రెండేళ్ల క్రితం అక్క కూతురు ప్రశాంతితో వివాహమైంది. ప్రస్తుతం ప్రశాంతి ఏడు నెలల నిండు గర్భిణి. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతుకావడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని తుని రూరల్ ఎస్సై సన్యాసిరావు, ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్రంలో చదరంగం.. 60 అడుగుల లోతుకు డైవ్ చేసి
కొరుక్కుపేట: చెన్నైలో 44వ చెస్ ఒలంపియాడ్ జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు స్థానిక ఆటగాళ్లు వినూత్నంగా ఇలా సముద్రం లోపల చెస్ ఆడారు. అరవింద్ తరుణ్ శ్రీ అనే టెంపుల్ అడ్వెంచర్స్ డైవింగ్ సెంటర్ల వ్యవస్థాపకుని నేతృత్వంలో ఆదివారం ఈ ఘనత సాధించారు. స్థానిక నీలంకరై తీరం నుంచి పడవలో సముద్ర తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి 60 అడుగుల లోతుకు డైవ్ చేశారు. పావు గంటకు ఓ గేమ్ చొప్పున రెండు గంటల పాటు చెస్ ఆడారు. ఇందుకోసం ప్రత్యేకమైన చెస్ బోర్డులు, పావులు రూపొందించారు. ఇందులో పాల్గొన్న ఆటగాళ్లంతా శిక్షణ పొందిన స్కూబా డైవర్లు కావడం విశేషం. 20 నిమిషాలకోసారి నీళ్లలో నుంచి పైకి వచ్చిపోయారట. -
బంతి సాయంతో సముద్రంలో 18 గంటల పోరాటం
అథెన్స్: నడి సముద్రంలో పడిపోతే బయటకు రావటమన్నది దాదాపుగా అసాధ్యం. కానీ, సముద్రంలో పడిపోయిన ఓ వ్యక్తికి చిన్నారులు పడేసిన చిన్న బంతి వరంలా మారింది. బొమ్మ బంతి సాయంతో 18 గంటలు పోరాటం చేశాడు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన గ్రీస్లోని కస్సాండ్రాలో జరిగింది. యూరప్లోని ఉత్తర మెసిడోనియాకు చెందిన ఇవాన్ అనే వ్యక్తి, అతడి సహచరుడు.. మైటీ బీచ్లో సేదతీరుతుండగా బలమైన అలలు వారిని సముద్రంలోకి లాక్కెళ్లినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ పేర్కొంది. కస్సాండ్రా మైటీ బీచ్ నుంచి 130 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన ఇవాన్.. ఓ చిన్న బంతి సాయంతో బయటపడినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఆ బంతిని ఇద్దరు బాలురు 10 రోజుల క్రితం సముద్రంలో పడేసుకున్నట్లు పేర్కొంది. 30 ఏళ్ల ఇవాన్ అలల్లో కొట్టుకుపోయిన క్రమంలో అతడి సహచరులు గ్రీక్ కోస్ట్గార్డ్స్కు సమాచారం అందించారు. దీంతో వారు హెలికాప్టర్ సాయంతో సుమారు 18 గంటల తర్వాత కాపాడారు. ఆ తర్వాత గ్రీక్ మీడియాతో మాట్లాడారు ఇవాన్. తన వైపు వచ్చిన ఓ చిన్న బంతి సాయంతో ఊపిరి తీసుకుంటూ బలమైన అలలను తట్టుకుంటూ బయటపడే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. మరోవైపు.. ఇవాన్ స్నేహితుడు మార్టిన్ జోవనోవ్స్కీ ఆచూకీ ఇంకా లభించలేదని ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఇవాన్ బయటపడిన క్రమంలో ఓ మహిళ బంతి కోసం వచ్చారని, తన కుమారులు బీచ్లో పడేసుకున్నారని పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సంఘటన అనంతరం స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఇవాన్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: నడిరోడ్డులో వ్యక్తిపై బాలుడి కాల్పులు.. లైవ్ వీడియో -
సముద్రంలో గల్లంతయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు సురక్షితం
సాక్షి, మచిలీపట్నం: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల ఒకటో తేదీన మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేటకు చెందిన పలువురు మత్స్యకారులు నాలుగు బోట్లలో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారంతా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది తీర ప్రాంతంలో ఉండగా ఓ బోటు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తి, కదలక మొరాయించింది. బోటులో సాధారణ కీప్యాడ్ ఫోను మాత్రమే ఉంది. ఆ ఫోను చార్జింగ్ అయిపోవడంతో బోటులోని మత్స్యకారులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి మత్స్యకారుల ఆచూకీ లభ్యంకాక పోవటంతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు హెలికాప్టర్లతో ప్రత్యేక బృందాలు కాకినాడ సముద్ర పరిసర ప్రాంతాల్లో మంగళవారం నుంచి రేయంబవళ్లు గాలించాయి. మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా బోట్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: (చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం) -
సెల్ఫోన్ స్విచ్చాఫ్.. చేపల వేటకు వెళ్లిన వాళ్లు ఏమయ్యారు?
సాక్షి, కృష్ణా: పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మచిలీపట్నం మండలంలో చోటు చేసుకోంది. వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం చేపల వేట కోసం నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనుకోకుండా వాళ్లు ప్రయాణిస్తున్న బోటు ఇంజన్ పాడైనట్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే గత రెండు రోజుల నుంచి వారి సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ వారు ప్రాణాలతో ఉన్నారో...లేరో తెలియక గల్లంతైన మత్స్యకారుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఆ నలుగురు క్యాంబెల్పేటకి చెందిన వారుగా అధికారులు తెలిపారు. గల్లంతైన మత్యకారుల వివరాలు..విశ్వనాథపల్లి చినమస్తాన్(55), రామాని, నాంచార్లు(55), చెక్క నరసింహారావు (50), మోకా వెంకటేశ్వరరావు (35). మరో బోటులో క్యాంబెల్ పేట మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. చరిత్రలో ఇది రెండోసారి -
వెస్టిండీస్తో తొలి టీ20.. తీవ్ర అస్వస్థతకు గురైన బంగ్లా ఆటగాళ్లు..!
వెస్టిండీస్తో తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. సెయింట్ లూసియా నుంచి డొమినికాకు ఐదు గంటలు పాటు సముద్ర మార్గం గుండా ప్రయాణం చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే బంగ్లా ఆటగాళ్లలో చాలా మంది ఇప్పటి వరకు సముద్ర ప్రయాణం చేయలేదు. దీంతో ఫెర్రీ(వ్యాపార నౌక) బయలుదేరగానే చాల మంది ఆటగాళ్లు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. వీరిలో ముఖ్యంగా షోరీఫుల్ ఇస్లాం, నఫీస్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు "ఫెర్రీ సముద్రం మధ్యలోకి చేరుకోగానే అలలు మొదలయ్యాయి. ఇది పెద్ద ఫెర్రీ కాదు కాబట్టి, అలలు కారణంగా ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఫెర్రీ విపరీతంగా ఊగింది. ఫలితంగా, క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారని" బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో పేర్కొంది. "నేను చాలా దేశాలు తిరిగాను. కానీ సముద్ర మార్గం గుండా ప్రయాణించడం ఇదే తొలి సారి. మాలో ఎవరికీ ఇటువంటి ప్రయాణాలు అలవాటు లేదు. ఆ సమయంలో మేము ఆట గురించి మర్చిపోయాం.ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలి అనుకున్నాము. ఇది నా జీవితంలో అత్యంత చెత్త పర్యటన" అని బంగ్లాదేశ్ క్రికెటర్ ఒకరు పేర్కొన్నారు. ఇక ఇరు జట్లు మధ్య తొలి టీ20 డొమినికా వేదికగా శనివారం జరగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్లో ఓటమి చెందిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్నైనా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. చదవండి: Rishabh Pant Century: పంత్ సెంచరీ... సాధారణంగా ద్రవిడ్ ఇలా రియాక్ట్ అవ్వడు! వైరల్ వీడియో! -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి?
భూమి ఉపరితలంపై 70 శాతం ఆవరించి ఉన్నవి సముద్రాలే. పైకి సింపుల్గా కనిపిస్తున్నా.. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితులు, అసలు సూర్యరశ్మి సోకని నిండు చీకట్లో బతికే జీవులు.. వంటి విచిత్రాలెన్నో. అంతేకాదు సముద్రాల్లో పరిశోధనలతో గ్రహాంతర జీవం (ఏలియన్ల) గుట్టునూ తేల్చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద సముద్రాలేమిటి, ఏలియన్ల గుట్టు ఏమిటి అన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. మనకు తెలిసింది కొంచెమే! మానవ నాగరికత ఇంతగా అభివృద్ధి చెందినా.. అత్యాధునిక టెక్నాలజీలు వచ్చినా.. ఇప్పటివరకు సముద్రాల్లో జీవం, అడుగున పరిస్థితుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. భూమ్మీద ఉన్న మొత్తం సముద్ర భాగంలో 80 శాతం మేర ఏముందో, ఎలా ఉందో, అక్కడి పరిస్థితులు ఏమిటో అన్నది ఇప్పటివరకు తెలియకపోవడం గమనార్హం. మన సముద్రాల అడుగున భూమి కంటే.. చంద్రుడి ఉపరితలం, అంగారకుడి నేల గురించి మనకు ఎక్కువ తెలుసని శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు. ఏలియన్లకు లింకేంటి? అసలు గ్రహాంతర జీవం గురించిన ఆనవాళ్లు సముద్రాల్లో ఉండవచ్చని ఎప్పటి నుంచో వాదనలున్నాయి. ఎందుకంటే భూమిపై 70 శాతానికిపైగా సముద్రాలు, మరో 10 శాతం మేర అంటార్కిటికా, ఆర్కిటిక్ వంటి మంచుతో మునిగి ఉన్న ప్రాంతాలే ఉన్నాయి. ఏలియన్లు గానీ, గ్రహాంతర జీవ పదార్థాలుగానీ భూమ్మీదికి వస్తే.. సముద్రాల్లో పడే అవకాశాలే ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు భూమ్మీద జీవానికి మూలం గ్రహశకలాలు, తోక చుక్కల నుంచి వచ్చిన సేంద్రియ పదార్థాలే కారణమనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ‘ర్యుగు’ అనే గ్రహ శకలం (ఆస్టరాయిడ్) నుంచి తెచ్చిన మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా.. అవే పదార్థాలు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు, వాటి ఉపగ్రహాలకూ చేరే అవకాశాలూ ఎక్కువే. అంటే.. వాటిలోనూ ఎక్కడో జీవం అభివృద్ధి చెంది ఉండొచ్చని అంచనా. ఇక సౌర కుటుంబంలో గ్రహాల చుట్టూ తిరుగుతున్న పలు ఉపగ్రహాల (ఆ గ్రహాలకు చందమామలు)లో ఉండే వాతావరణాన్ని పోలిన పరిస్థితులు.. భూమ్మీద సముద్రాల అడుగున ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అత్యంత చల్లగా, తీవ్ర ఒత్తిడి (ప్రెషర్)తో కూడిన ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల జీవరాశులు మనుగడ సాగించగలుగుతున్నాయని తేల్చారు. ఈ లెక్కన సదరు ఉపగ్రహాల్లో కూడా జీవం మనగలదని.. మన సముద్రాల అడుగున పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశోధన చేస్తే.. గ్రహాంతర జీవుల గుట్టు కనుగొనడం సులువని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హడల్ జోన్.. గురుడి ఉపగ్రహం ‘యురోపా’లా.. గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాల్లో ఒకటైన యురోపాపై.. దట్టమైన మంచుతో కప్పబడిన సముద్రాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితులు అచ్చంగా.. మన భూమ్మీది సముద్రాల అడుగున ‘హడల్ జోన్’ను పోలి ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ జీవంపై పరిశోధనలు చేస్తే.. యురోపాపై జీవం ఉండే అవకాశాలు, ఉంటే ఎలా ఉండొచ్చన్న వివరాలు తెలుస్తాయని వారు చెప్తున్నారు. సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతున ఉండే ప్రాంతాన్ని ‘హడల్ జోన్’గా పిలుస్తారు. సూర్యరశ్మి ఏమాత్రం సోకని చిమ్మ చీకటి, అతి శీతల పరిస్థితులు, తీవ్రమైన ఒత్తిడి ఉండే హడల్ జోన్లో జీవం మనుగడ కష్టం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కొన్ని రకాల జీవులు బతుకుతున్నాయి. ప్రయోగాలు మొదలెట్టిన నాసా.. సముద్రాల అట్టడుగున ఉండే క్లిష్టమైన పరిస్థితులపై నాసా ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ పరిస్థితులపై పరిశోధన చేసి.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై సముద్రాలు, అక్కడి పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అంచనాలను రూపొందిస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల పరిస్థితులను తట్టుకునే పరికరాలను రూపొందించి.. భవిష్యత్తులో ఆయా గ్రహాలు, ఉపగ్రహాలపై పరిశోధనలు చేయనుంది. చంద్రుడిపైకి నాసా ‘వైపర్’ మంచు, దాని అడుగున నీటిలో (సబ్ సీ) ప్రయాణిస్తూ, పరిశోధన చేయగల రోవర్ ‘వైపర్’ను నాసా వచ్చే ఏడాది చంద్రుడిపైకి పంపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మంచు, నీటి జాడ గుట్టును ‘వైపర్’ తేల్చనుంది. దీని పనితీరును భూమిపై సముద్రాల్లో పరిశీలిస్తున్నారు. ఆ నీటి అడుగున చిత్రాలెన్నో.. ► సౌర కాంతి సముద్రాల్లో 200 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోగలదు. తర్వాత ఒక కిలోమీటర్ వరకు స్వల్పంగా ఉంటుంది. అంటే మసక చీకటిలా ఉంటుంది. అంతకన్నా లోతున అంతా చిమ్మ చీకటే ఉంటుంది. ► గత ఏడాది అమెరికా తీరానికి సమీపంలో అట్లాంటిక్ సముద్రంలో అత్యంత అరుదైన భారీ ‘ఫాంటమ్ జెల్లీఫిష్’ను గుర్తించారు. రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో అవి జీవిస్తుంటాయని తేల్చారు. ►నాలుగైదు కిలోమీటర్ల లోతులో సముద్రపు నేలపై ‘హైడ్రో థర్మల్ వెంట్స్ (వేడి నీరు, పొగను వెలువరించే బిలాలు)’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నుంచి వెలువడే వేడి, సేంద్రియ రసాయనాల ఆధారంగా.. అంత లోతులో కూడా కొన్నిరకాల జీవులు బతుకుతున్నట్టు తేల్చారు. ► మంచుతో కప్పిఉన్న ఉపగ్రహాల్లోనూ ఇలాంటి ‘హైడ్రో థర్మల్ వెంట్స్’ ఉంటే.. జీవానికి అవకాశాలు ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. -
ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా విశాఖపట్నం జిల్లా పూడిమడక మారింది. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవు అనే మాట తప్పని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) పరిశోధనలు నిరూపించాయి. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల కోరల్స్(పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. వీటిని మరోచోటికి తరలించి అభివృద్ధి చేసేందుకు కూడా అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా రాష్ట్రంలో జెడ్ఎస్ఐ.. విశాఖ జిల్లా పూడిమడక నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు సర్వే నిర్వహించగా.. ఈ ప్రాంతమంతా విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా ఉందని స్పష్టమయ్యింది. భారతీయ పగడాల వర్గీకరణపై నిరంతర పరిశోధన చేస్తున్న జెడ్ఎస్ఐ మొట్టమొదటిసారిగా ఆంధ్రా తీరంలో 2020 నుంచి ప్రతి ఏటా జనవరి 17 నుంచి 26వ తేదీ వరకు మూడేళ్ల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక అంశాలు వెల్లడయ్యాయి. విభిన్న రకాల పగడపు దిబ్బలు.. పూడిమడక, భీమిలి, రుషికొండ, యారాడ, కైలాసగిరి, సాగర్నగర్, ఆర్కేబీచ్, మంగమూరిపేట, తెన్నేటిపార్కు, చింతపల్లి బీచ్లలో ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రదేశాల్ని సర్వే పాయింట్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 30 మీటర్ల లోతులో సాగరగర్భంలో అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబాడైవింగ్ సంస్థ లివిన్ అడ్వెంచర్స్ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తల బృందం చేపట్టిన సర్వేలో పూడిమడక కేంద్రంగా విభిన్న పగడపు దిబ్బలున్నట్లు గుర్తించారు. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనాఎస్పీ, లిథోపిలాన్ ఎస్పీ, మోంటీపోరా ఎస్పీ, పోరిటెస్ ఎస్పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్లు కనుగొన్నారు. సాగర గర్భంలో కనుగొన్న పగడపుదిబ్బలు మరోచోట పెంచుకునేందుకు వీలుగా.. ఒక చోట పెరిగే పగడపు దిబ్బల్ని కొంత భాగం తీసి.. మరోచోట పెంచే రకాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి అరుదైన కోరల్స్ పూడిమడకలో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. ఈ తరహా కోరల్స్.. మేరీటైమ్ మెడిసిన్ తయారీకీ ఉపయోగపడతాయని గుర్తించారు. ప్రతి ఏటా 9 రోజుల పాటు ఆయా బీచ్లలో సబ్–టైడల్, ఇంటర్–టైడల్ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి.. విభిన్న జీవరాశులకు సంబంధించిన నమూనాలు సేకరించారు. 1,597 మొలస్కా జాతులు, 182 సినిడారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్లు, 12 అసిడియన్లు, 3 ఫ్లాట్ వార్మ్లతో పాటు.. అన్నెలిడ్ జీవజాతుల నమూనాల్ని సేకరించారు. మత్స్యసంపదకు ఉపయుక్తం.. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బల్ని పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే.. సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. విభిన్న జీవరాశుల సమాహారం... పూడిమడక తీరం విభిన్న జీవరాశులతో కళకళలాడుతోందని జెడ్ఎస్ఐ సర్వేలో వెల్లడైంది. విదేశీ తీరాల్లో కనిపించే సూక్ష్మ జాతి సముద్ర జీవ రాశులు కూడా పూడిమడకలో ఉన్నట్లుగా గుర్తించారు. పీత జాతికి చెందిన అరుదైన తెనస్, స్పాంజ్, స్టార్ఫిష్, ఇండో పసిఫిక్ సముద్రంలో ఉండే స్టోమోప్నిస్టెస్ సముద్రపు ఆర్చిన్లు, సీ బటర్ఫ్లైస్గా పిలిచే హెనియోకస్ చేపలు, ఒంటెరొయ్యలు.. ఇలా భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు. మరోసారి సర్వే.. పూడిమడక తీరం.. విభిన్న సముద్ర జీవజాతుల సమాహారంగా ఉంది. ఇక్కడ ఉన్న పగడపు దిబ్బలు చాలా అరుదైన రకాలు. ఈ తరహా సముద్ర గర్భ వాతావరణం ఇక్కడ ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. మొత్తం డాక్యుమెంటేషన్ నిర్వహించాం. ఇక్కడి కోరల్స్.. సముద్ర పర్యాటకానికి, వైద్యరంగంలో ఔషదాల తయారీకి, మెరైన్ రిలేటెడ్ రీసెర్చ్కు ఎంతగానో ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది మరోసారి లోతైన అధ్యయనం చేయాలని భావిస్తున్నాం. – డాక్టర్ జేఎస్ యోగేష్ కుమార్, జెడ్ఎస్ఐ సీనియర్ సైంటిస్ట్ చింతపల్లి వరకు అరుదైన జీవజాలం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనలకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందించాం. పూడిమడక నుంచి చింతపల్లి వరకు ప్రతి ప్రాంతం విభిన్న రకాల జీవజాతులతో అద్భుతంగా కనిపించాయి. 30 మీటర్ల లోతు వరకు పగడపు దిబ్బల్లో ఉన్న జంతుజాలం ఫొటోల్ని జెడ్ఎస్ఐకి అందించాం. రీఫ్లు, కోరల్స్ ద్వారా.. మత్స్యసంపద చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అయితే కాలుష్యం బారిన పడకుండా వీటిని సంరక్షించుకోవాలి. – బలరాం, లివిన్ అడ్వెంచర్స్ స్కూబా ఇన్స్ట్రక్టర్ -
విహారంలో విషాదం.. అంత వరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది!
రణస్థలం(శ్రీకాకుళం): విహారం విషాదంగా మారింది. సరదాగా సముద్ర స్నానానికి వెళితే ప్రాణాలమీదకు వచ్చింది. మండలంలోని ఎన్జీఆర్పురం పంచాయతీలో గల పోతయ్యపేటలో సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. జేఆర్ పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కొవ్వాడ పంచాయతీలో గల రామచంద్రపురం గ్రామానికి చెందిన గాదం పాపాయమ్మ, గాదం కృష్ణ ఇంటికి వారి అల్లుడు తిరుపతి గణేష్ తన భార్య ఈశ్వరమ్మతో కలిసి ఇద్దరు పిల్లలతో రెండు వారాల కిందట వచ్చారు. ఈయన స్వగ్రామం విశాఖలోని భీమిలి. భార్యా పిల్లలను కొవ్వాడలోనే వదిలేసి గణేష్ మరుసటి రోజు వైజాగ్ వెళ్లిపోయారు. మళ్లీ శనివారం ఉదయం ఆయన తన మేనకోడలు దీవెనతో కలిసి రామచంద్రపురం వచ్చారు. సాయంత్రం ఏడుగురు కుటుంబ సభ్యులు పోతయ్యపేటలోని సముద్ర తీరానికి సరదాగా వెళ్లారు. అంతా కాసేపు ఉల్లాసంగా గడిపారు. ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో తిరుపతి గణేష్(32), తిరుపతి మానస (9), మేనకోడలు వానమామల దీవెన (18)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. దీంతో ఒడ్డున ఉన్న వారంతా గగ్గోలు పెట్టారు. స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇవ్వగా.. వారు పడవలపై సముద్రంలోకి వెళ్లారు. వలలు వేసి గల్లంతైన వారి కోసం వెతికినా లాభం లేకపోయింది. గల్లంతైన వారిలో భీమిలి మండలంలోని కాపులుప్పాడ సమీపంలోని నగరప్పాలెం గ్రామం. ఆయన మేనకోడలు దీవెనది విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో గల వడ్డాది గ్రామం. జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చదవండి: Jagananna Thodu: చిరు వ్యాపారులకు గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. -
దురదృష్టకరమైన ఘటన...పక్షిని రక్షించడమే శాపమైంది: వీడియో వైరల్
రోడ్డుప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. నిర్లక్షపూరితమైన డ్రైవింగ్, పక్కవారికి ఏమైన అవుతుందనే భయం లేని స్పీడ్ డ్రైవింగ్ తదితరాలే ఈ ప్రమాదాలకు కారణం. కనీసం ముందున్న కారు ఎందుకు ఆగిందో అని కూడా లేకుండా తమదారి తమదే అన్నట్లుగా ఢీ కొట్టి వెళ్లిపోతున్నారు. కొంతమంది యాక్సిడెంట్ చేసి కేసు నుంచి తప్పించుకునేందుకు ఆగకుండా వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక ఒక ప్రబుద్ధుడు వేగంగా ట్యాక్సీ నడుపుతూ.. రోడ్డు పై ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టి వెళ్లిపోయాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలపిన కథనం ప్రకారం...ముంబై నేపీన్సీ రోడ్లో వాసం ఉంటున్న వ్యాపారవేత్త అమర్ మనీష్ జరీవాలా తన డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్తో కలసి ముంబై బీచ్ హైవైపై మలాడ్ వైపుగా వెళ్తున్నారు. ఐతే ఇంతలో ఒక పక్షి వారి కారుని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాపారవేత్త, అతని డ్రైవర్ గాయపడిన పక్షిని రక్షించేందుకు కారులోంచి దిగారు. ఇంతలో వేగంగా వస్తున్న ఒక ట్యాక్సీ వారిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యాపరవేత్త అక్కడికక్కడే చనిపోయాడు, డ్రైవర్ కామత్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ట్యాక్సీ డ్రైవర్ కుమార్ జైశ్వర్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే ఈ ఘటన హైవే పై ఉన్న సీసీఫుటేజ్లో రికార్డు అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. What a tragedy. This is Mumbai’s Bandra Worli Sea Link pic.twitter.com/VSTQz27vqY — Singh Varun (@singhvarun) June 10, 2022 (చదవండి: కసాయి కొడుకు...కన్న తల్లిదండ్రులనే కడతేర్చి... సోదరికి కాల్ చేసి మరీ...) -
ధగధగల బంగారు నిధి.. సముద్ర గర్భంలో.. లక్ష కోట్ల విలువ!
కార్టజినా: 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. కొలంబియా స్వాతంత్య్ర పోరాటానికి ముందు బ్రిటన్, స్పెయిన్ మధ్య 1708లో జరిగిన యుద్ధంలో శాన్జోస్ మునిగిపోయింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో ఘటన సమయంలో 600 మంది ఉన్నారని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతులో ఉన్న శిథిల నౌక వద్దకు రిమోట్తో పనిచేసే యంత్రాన్ని పంపి ఫొటోలను సేకరించారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణీ కప్పులు, మృణ్మయపాత్రలు అందులో కనిపిస్తున్నాయి. ఈ సంపద విలువ లక్ష కోట్లకు పైమాటేనని అంచనా. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు. ఈ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ నవల నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది! -
అమెరికాలో వేములవాడ యువకుడి మృతి
వేములవాడ: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నత చదువులకు వెళ్లిన వేములవాడ యువకుడు కంటె యశ్వంత్(25) విహార యాత్రకు వెళ్లి సముద్రంలో అలల తాకిడికి మరణించారు. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం అందింది. యశ్వంత్ మిత్రులు, కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. వేములవాడ సుభాష్నగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్ ఎమ్మెస్ చదివేందుకు 8 నెలల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. వారాంతం కావడంతో ఈనెల 29న యశ్వంత్, అతడి స్నేహితులు శుభోదయ్, మైసూరా, చరణ్, శ్రీకర్, శార్వరితో కలిసి ఐర్లాండ్లోని దీవులకు వెళ్లారు. అక్కడే ప్రైవేట్ బోటు తీసుకుని పిటా దీవుల వద్దకు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు బోట్ స్టార్ట్ చేయగా.. ఇంజిన్ ఆన్ కాలేదు. అలల తాకిడికి బోటు 3 మీటర్ల లోతు ప్రాంతం నుంచి 25 మీటర్ల లోతు ప్రాంతానికి చేరుకుంది. ఇది గమనించని యశ్వంత్ నీటిలోకి దిగారు. అలలు ఎక్కువగా ఉండటంతో ఎంత ఈతకొట్టిన బోటును చేరుకోలేకపోయారు. యశ్వంత్ను కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. లైఫ్ జాకెట్స్ ధరించి నీటిలోకి దిగి దాదాపు 3 గంటలపాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు ఈ విషయాన్ని యశ్వంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మిత్రుడిని కోల్పోయిన దుఃఖంలో వీరంతా సమీపంలోని వసతి గదులకు చేరుకున్నారు. పోలీసులు గాలింపు చేపట్టగా.. సోమవారం రాత్రి మృతదేహం లభ్యం అయినట్లు తెలిసింది. ఉన్నత చదువులకు వెళ్లిన యశ్వంత్ మృతితో సుభాష్నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్
సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్మెరైన్లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్గా ఉంది కదా! సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్కు చెందిన యూ–బోట్వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్మెరైన్లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి. సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్డెక్ను, దాని చుట్టూ రెయిలింగ్ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్మెరైన్ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే. (చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి.) -
సరదాగా ‘వెర్రి పని’.. పదేళ్ల జైలు శిక్ష
సాటి మనషుల మీదే కాదు.. మూగ జీవాల పట్లా వేధింపులు, హింసకు పాల్పడితే చట్టం ఊరుకోదు. అలా ఓ చిన్నప్రాణితో, అదీ తన పెంపుడు జంతువుతో వెర్రి వేషాలు వేసిన వ్యక్తికి.. కఠిన కారాగార శిక్ష స్వాగతం చెప్పింది. ఇంటర్నెట్లో(యూట్యూబ్లో) ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయ్యింది. సముద్రం ఒడ్డున రెండు పిల్లులను ఆహారం ఎరవేసి కొద్దిసేపు ఆడించాడు ఓ వ్యక్తి. అలా ఆడిస్తూ.. అదంతా వీడియో తీశాడు. చివరకు.. ఓ పిల్లిని సముద్రంలోకి లాగి పెట్టి తన్నాడు. వెకిలి చేష్టలకు తోడు నవ్వులు నవ్వాడు. రెండో పిల్లితో అలానే వ్యవహరించబోయాడు. గ్రీస్లోని ఎవియా ఐల్యాండ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అది తన పెంపుడు పిల్లే అని, అక్కడ నీళ్లు లేవని, ఆ పిల్లి సురక్షితంగానే ఉంది కదా! ఆ వ్యక్తి వాదించడం మొదలుపెట్టాడు. తనకు జంతువులంటే విపరీతమైన పనే అని చెప్తున్నాడు. కానీ, అతని నేరం మాత్రం రుజువైంది. దీంతో అక్కడి చట్టాల ప్రకారం.. అతనికి పేదళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక పౌర హక్కుల పరిరక్షణ మంత్రి టకిస్ థియోడోరికాకోస్ నిందితుడి అరెస్ట్ను ధృవీకరించారు. మూగ జీవాల పట్ల ఇలాంటి హింసను సహించే ప్రసక్తే లేదని అంటున్నారాయన. గ్రీస్ చట్టాల ప్రకారం.. ఎవరైనా మూగ జీవాలను హింసించినా, దాడులకు పాల్పడినా పదేళ్లు జైలు శిక్షతో పాటు ఐదు నుంచి పదిహేను వేల డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రమాదం నుంచి ఆ పిల్లి సురక్షితంగా బయటపడిందని, స్థానికంగా ఉన్న యానిమల్ సొసైటీ దాని సంరక్షణ చూసుకోవడంతో పాటు సదరు నిందితుడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. -
శత్రువులకు సింహస్వప్నం.. సైలెంట్ కిల్లర్ 'వాగ్షీర్'.. ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: సముద్రం లోతుల్లో ప్రయాణిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే జలాంతర్గామి. దాని పేరు ఐఎన్ఎస్ వాగ్షీర్. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా.. అని శత్రువు సైతం ఆశ్చర్యపోయేలా చేసే సైలెంట్ కిల్లర్. ప్రాజెక్టు–75లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్మెరైన్ వాగ్షీర్ ఈ నెల 20న జలప్రవేశం చేయనుంది. మన దేశ సముద్ర సరిహద్దుని శత్రు దుర్బేధ్యంగా నిలిపేందుకు ముంబైలోని మజ్గావ్ డాక్యార్డులో పీ–75 స్కార్పెన్ ప్రాజెక్ట్ కింద నిర్మితమైన అల్ట్రామోడ్రన్ సబ్మెరైన్ (ఆరో జలాంతర్గామి)గా.. చిట్టచివరిదిగా ‘వాగ్షీర్’ రూపొందింది. ప్రాజెక్ట్–75లో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా భారత నౌకాదళంలో ప్రవేశించగా.. ఐఎన్ఎస్ వగీర్ సీట్రయల్స్ పూర్తి చేసుకుంది. కాగా, వాగ్షీర్ జలాంతర్గామి కల్వరి తరగతికి చెందిన చిట్టచివరిది కావడం విశేషం. ఇది భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తర్వాత.. తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సముద్రంలో మందుపాతర పేల్చగలదు ఇప్పటివరకూ ఉన్న సబ్మెరైన్లలో వాగ్షీర్ని అత్యంత భయంకరంగా, శక్తిమంతంగా తయారు చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్మెరైన్లో అమర్చారు. ఇందులో 533 మి.మీ. వైశాల్యం గల 6 టార్పెడో ట్యూబ్లు ఉన్నాయి. ఏదైనా భారీ ఆపరేషన్ సమయంలో ఈ సైలెంట్ కిల్లర్ 18 టార్పెడోలు లేదా ఎస్ఎం39 యాంటీ–షిప్ క్షిపణులను మోసుకెళ్లగల సత్తా దీని సొంతం. శత్రు జలాంతర్గాములను, యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు సముద్రంలో మందుపాతరలను పేల్చగల సామర్థ్యం కూడా దీనికున్న ప్రత్యేకత. ఏకకాలంలో దాదాపు 30 మందుపాతరలను పేల్చగలదు. సైలెంట్ కిల్లర్ వాగ్షీర్ని సైలెంట్ కిల్లర్గా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఇందులోని అధునాతన వ్యవస్థ శబ్దం లేకుండా సముద్రంలో దూసుకుపోతుంది. స్టెల్త్ టెక్నాలజీ కారణంగా శత్రు నౌకలు లేదా సబ్మెరైన్లు రాడార్ సాయంతో కూడా వాగ్షీర్ ఎక్కడుందో కనుక్కోలేరు. ఈ జలాంతర్గామిలో రెండు అధునాతన పెరిస్కోప్లను అమర్చారు. ఆధునిక నావిగేషన్, ట్రాకింగ్ సిస్టమ్లతో కూడిన ఈ సబ్మెరైన్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తన పని తాను చేసుకుపోగలదు. -
వేట విరామానికి వేళాయె..
మచిలీపట్నం: సముద్రంలో చేపల వేటకు కొద్దిరోజులపాటు బ్రేక్ పడనుంది. సాగర గర్భంలో చేపలు పునరుత్పత్తి సమృద్ధిగా జరిగే సీజన్ ఇదే కావడంతో ఈ ఏడాదీ వేట నిషేధం అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈనెల 15 నుంచి జూన్ 14 వరకు 61రోజుల పాటు వేట నిషేధ కాలంగా మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం మొదలుకుని తిరుపతి జిల్లా వరకు 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో 1.60 లక్షల మంది మత్స్యకారులకు చేపల వేట వృత్తి కాగా, వీరి ద్వారా 6 లక్షల మంది జీవనోపాధికి సముద్రం భరోసాగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన 30,107 మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు ద్వారా సముద్రంపై చేపల వేట సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిషేధ కాలంలో జీవనభృతి.. వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతి కల్పిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా సకాలంలో ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా మత్స్యకారుల చేతికి వెళ్లకుండానే దళారులు మింగేసేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ జీవనభృతిని రూ.10 వేలుకు పెంచటమే కాక, డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తూ పారదర్శకత చాటుకున్నారు. రాష్ట్రంలో గతేడాది అర్హత గల వారు 97,619 మంది ఉండగా.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.97.61 కోట్లును మత్స్యకారులకు భరోసాగా అందజేశారు. అర్హుల జాబితా తయారీ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవన భృతి అందించేందుకు అర్హులైన వారి జాబితాను సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వేట నిషేధ భృతి పొందాలంటే తప్పనిసరిగా బోటు రిజిస్ట్రేషన్ చేసుకుని.. మత్స్యకార సంఘంలో సభ్యుడై ఉండాలి. 18 నుంచి 60 ఏళ్లు మధ్య వయసు ఉండాలి. సోనా బోట్లకు 8 మంది, మోటార్ బోట్లకు ఆరుగురు, ఇంజిన్ తెప్పలకు ముగ్గురు మాత్రమే అర్హులు. ఇక జాబితాలో పేరులేని మత్స్యకారులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకంతో వలంటీర్ ద్వారా మత్స్యశాఖ సిబ్బందిని సంప్రదించాలి. సంప్రదాయ పడవలకు అవకాశం సంప్రదాయక పడవలు కలిగిన మత్స్యకారులు సముద్రం తీరానికి 8 కిలోమీటర్లలోపు, అనుమతించిన సైజు వలలతో చేపలు పట్టుకోవచ్చు. ఇందుకోసమని మత్స్యకారులు తగిన ఆధారాలతో అధికారులు నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా తీర ప్రాంత పోలీసులు (మెరైన్), తీర ప్రాంత గస్తీ సిబ్బంది (కోస్ట్గార్డ్) చర్యలు తీసుకుంటున్నారు. నిషేధం పక్కాగా అమలు ఈ నెల 15 నుంచి సముద్రంపై మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేట నిషేధం పక్కాగా అమలుచేసేలా దృష్టిసారించాం. నిషేధాజ్ఞలు ఉల్లంఘించే బోటు యజమానులపై చర్యలు తీసుకుంటాం. నిషేధ కాలపు భృతికి అర్హులైన వారందరికీ మంజూరు చేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. – లాల్ మహమ్మద్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, కృష్ణా జిల్లా -
సముద్రంలో చేపల వేటపై 2 నెలల నిషేధం
భోగాపురం: సాగరంలో జలసంపదను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం లాగానే చేపలు గుడ్లు పెట్టే సమయం ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రభుత్వం వేట నిషేధాజ్ఞలు జారీచేసింది. ఈ సమయంలో ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. మత్స్య భరోసా పథకం ద్వారా అదుకుంటుంది. గత ప్రభ్వుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సంవత్సరం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో మత్స్యభరోసా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు సాయాన్ని అందిస్తుండడంతో గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 15,138 మంది మత్స్యకారులు విజయనగరం జిల్లాలోని తీరప్రాంత మండలాలు పూసపాటిరేగ, భోగాపురంలో 14 సముద్రతీర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 15,138 మంది మత్స్యకారులు ఉన్నారు. వారిలో 10 వేల నుంచి 12 వేల మంది మత్స్యకారులు నిరంతరం సముద్రంలో వేట కొనసాగిస్తుంటారు. రెండు మండలాల్లో 706 మోటార్ బోట్లు, 424 సంప్రదాయ బోట్లకు రిజిస్ట్రేషన్ అయింది. మత్స్యశాఖ అధికారులు మోటార్ బోట్లు, సంప్రదాయ పడవల్లో వేట కొనసాగిస్తున్న 2,335 మంది మత్స్యకారులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించారు. పారదర్శకంగా అమలు మత్స్యకారులకు మంజూరైన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకే ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - నిర్మలాకుమారి, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్, విజయనగరం మత్స్యకారులకు భరోసా వేట నిషేధ సమయంలో మత్స్యకారులను అదుకునేందుకు మత్స్యకార భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు సాయం అందజేస్తోంది. జిల్లాలో 2,335 మందికి మత్స్యకార భరోసా అందనుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. - వాసుపల్లి రేయుడు, సర్పంచ్ ముక్కాం గ్రామం -
విశాఖ బీచ్ : బుడి బుడి అడుగుల బుల్లి తాబేళ్లు (ఫొటోలు)
-
Olive Ridley Turtle: వెళ్తాం..పెరిగి పెద్దయి.. మళ్లొస్తాం!
బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): వెళ్తాం.. పెరిగి పెద్దయి.. గుడ్లు పెట్టేందుకు మళ్లీ ఇక్కడకు వస్తాం అంటూ బుల్లి తాబేళ్లు బుడి బుడి అడుగులు వేసుకుంటూ.. సముద్రంలోకి వెళ్లిపోయాయి. అంతరించే ప్రమాదమున్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను జిల్లా అటవీ శాఖ పరిరక్షించి సముద్రంలోకి విడిచిపెట్టింది. సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లను చూసి పిల్లలు, ప్రకృతి ప్రేమికులు, యువతీయువకులు పరవశించిపోయారు. ఆర్.కె.బీచ్ వేదికగా ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారులతో కలిసి కలెక్టర్ మల్లికార్జున బుల్లి తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టి.. వాటి తల్లుల వద్దకు చేర్చారు. బుడిబుడి అడుగులతో సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లు ఏటా జనవరి నుంచి మార్చి వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరానికి చేరుకుని గుడ్లు పెడతాయి. అది కూడా రాత్రి 2 గంటల నుంచి వేకువ 5.30 గంటల్లోపు మాత్రమే. ఈ సమయంలోనే ఇసుక తిన్నెల్లో బొరియలు చేసి గుడ్లను పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. ఆ గుడ్లను సేకరించిన అటవీ శాఖ అధికారులు బీచ్రోడ్డులోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో 45 రోజుల పాటు సంరక్షించారు. సేకరించిన గుడ్లు పొదిగి పిల్లలుగా మారాయి. చదవండి: అంత యాక్షన్ వద్దు.. పులి కూడా బ్రష్ చేస్తుంది! తాబేలు పిల్లను పట్టుకుని ఆనందిస్తున్న కలెక్టర్ మల్లికార్జున అలా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 982 బుల్లి తాబేళ్లను సూర్యోదయం సమయంలో కలెక్టర్ సముద్రంలోకి విడిచిపెట్టారు. ఆ సమయంలో తల్లులు తీరానికి చేరువలో ఉంటాయి. అందుకే పిల్లలను సూర్యోదయ సమయంలో సముద్రంలోకి విడిచిపెట్టడం ద్వారా అవి తల్లుల వద్దకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారి అనంత్శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ సముద్ర జలాలను శుద్ధి చేసే ఈ రకం తాబేళ్లు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సముద్రంలోకి విడిచిపెట్టేందుకు బుట్టల్లో సిద్ధంగా ఉన్న తాబేలు పిల్లలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Bheemili Beach: విశాఖ భీమిలీ బీచ్లో అరుదైన దృశ్యం..
భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి తీరంలో సముద్రం శుక్రవారం వెనక్కి తగ్గింది. అలల ఉధృతితో ప్రతి రోజూ సముద్రం ముందుకు వస్తుంది. చాలా అరుదుగా వెనక్కి వెళ్తుంది. అయితే శుక్రవారం సముద్రం వెనక్కి వెళ్లడంతో రాళ్లు బయటపడ్డాయి. అలల ఉధృతి లేకపోవడం, హోలీ కావడంతో సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. ఇక్కడ స్నానాలు చేశారు. కాగా.. ఇక్కడి తీరం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. స్నానాలకు దిగే వారిలో చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. నీటి అడుగున ఉండే రాళ్లకు తగలడం వల్ల తీవ్రగాయాలపాలవడం, లేదా చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ బయటపడ్డ రాళ్లను చూస్తే తీరం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం.. -
హరివిల్లు.. చేప బ్యూటీఫుల్లు
చేపల్లో ఇప్పటికే మనకు చాలా రకాలు తెలుసు. వండుకొని తినే కొర్రమీను, పులస, జెల్ల, పాపెరల లాంటి చేపలతో పాటు అక్వేరియంలో పెంచుకునే రకరకాల రంగుల చేపలను చూసే ఉంటాం. శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే ఎన్నో రకాల చేపలను కనుగొన్నారు. తాజాగా ఇంకో రకం చేపను కూడా గుర్తించారు. అచ్చం హరివిల్లు రంగులో ఉండే ఈ కొత్తరకం చేపను మాల్దీవుల్లోని సముద్రంలో కనుగొన్నారు. వ్రాస్సె జాతికి చెందిన ఈ సముద్ర చేపకు సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా అని మాల్దీవుల జాతీయ పువ్వు పేరును కలిపి పెట్టారు. ముఖానికి గులాబీ రంగు ముసుగు వేసుకుందా అన్నట్టుండే ఈ చేపను సముద్రంలో 40 నుంచి 70 మీటర్ల లోతులో ట్విలైట్ జోన్లో గుర్తించారు. ఇంతకుముందు 30 ఏళ్ల కిందటే ఈ చేపను చూశామని, అయితే అప్పుడు ఇంకోరకం చేప అనుకున్నామని సైంటిస్టులు తెలిపారు. తాజా పరిశీలనలో అసలు విషయం తెలిసిందన్నారు. పెరుగుతూ.. రంగు మారుతూ.. చాలా రకాల చేపలు యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకేలా అనిపిస్తాయి. పెద్ద వయసుకు వచ్చాక వాటి పూర్తి రూపును సంతరించుకుంటాయి. అలాగే వ్రాస్సె జాతికి చెందిన చేపలు కూడా వయసు పెరుగుతున్నాకొద్దీ రంగు మారుతుంటాయి. ఆ ప్రకారమే పెద్ద వయసుకు వచ్చాక ఈ రెయిన్బో చేపలు.. మెజెంటా, నారింజ, గులాబీ, ముదురు ఉదా, ఎరుపు రంగులతో అద్భుతంగా కనిపిస్తుంటాయి. ట్విలైట్ జోన్ అంటే? సముద్రంలో సూర్యకాంతి కొద్దికొద్దిగా చొచ్చుకెళ్లే ప్రాంతం ట్విలైట్ జోన్. సముద్ర ఉపరితలానికి 35 నుంచి 70 మీటర్ల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో కిరణజన్యసంయోగ క్రియ జరిగేంత స్థాయిలో సూర్యరశ్మి ఉండదు. కాబట్టి ఇక్కడ మొక్కలు పెరగవు. ఈ జోన్లో ఉండే జంతువులు అధిక పీడనం, చల్లని ఉష్ణోగ్రతలు, చీకటి వాతావరణానికి అలవాటు పడి జీవిస్తుంటాయి. ఈ నీటిలో ఉండే జంతువులు స్పష్టంగా చూసేందుకు కళ్లు పెద్దగా ఉంటాయి. అలాగే పెద్ద దంతాలు, దవడలు కూడా ఉంటాయి. – సాక్షి సెంట్రల్డెస్క్ -
చేప దాడి.. మత్స్యకారుడి మృతి!
పరవాడ (పెందుర్తి): వినడానికి కొంత ఆశ్చర్యంగానూ, మరికొంత వింతగానూ ఉన్నప్పటికీ.. సముద్రం సాక్షిగా ఇది నిజం. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ మత్స్యకారుడు.. భారీ చేప చేసిన దాడిలో మృత్యువాత పడ్డాడనే వార్త బుధవారం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.. పోలీసులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం శివారు జాలారీపేట గ్రామానికి చెందిన నొల్లి జోగన్న (45).. కంబాల చినదేముడు, కంబాల కొర్లయ్య, కంబాల మహేష్, ఓలిశెట్టి అప్పలరాజు, ఓలిశెట్టి ముత్తురాజుతో కలిసి ఆదివారం రాత్రి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు. కొమ్ము కోనాం చేప దాడిలో మృతి చెందిన మత్స్యకారుడు జోగన్న బుధవారం తెల్లవారుజామున తీరానికి చేరే క్రమంలో జోగన్న భారీ చేపకు గేలం వేశాడు. జోగన్న వేసిన గేలానికి 100 కిలోల బరువు కలిగిన కొమ్ము కోనాం అనే భారీ చేప చిక్కింది. గేలానికి చిక్కిన కొమ్ము కోనాం చేపను బోటులోకి లాగే ప్రయత్నంలో భాగంగా నీటిలో దిగిన జోగన్నపై భారీ చేప దాడి చేసి తన కొమ్ముతో కడుపులో పొడిచింది. ఈ దాడిలో జోగన్న తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో జరగడం వల్ల గాయపడిన జోగన్నకు సకాలంలో వైద్య సేవలు అందించడం సాధ్యపడలేదని, తీరానికి చేరడానికి తమకు 8 గంటల సమయం పట్టిందని తోటి మిత్రులు వాపోయారు. మృతుడికి భార్య లక్ష్మి, నరేష్, అరవింద్ అనే ఇద్దరు కుమారులున్నారు. పోషించే యజమాని మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, ఓ భారీ చేప దాడి చేసిన ఘటనలో మత్స్యకారుడు మృతి చెందడం ముత్యాలమ్మపాలెం తీరంలో ఇదే ప్రథమమని మత్స్యకారులు చెబుతున్నారు. జోగన్న మృతి కేసును విశాఖ మెరైన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పరవాడ ఎస్ఐ పి.రమేష్ తెలిపారు. -
మళ్లీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
సియోల్: అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతల్ని బేఖాతర్ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. తూర్పు సముద్రంలో సోమవారం ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ వన్ ఇన్ చౌల్ వెల్లడించారు. ఆ క్షిపణి 700 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదించగలదని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్ విసిరారు. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది. -
ఐఏసీ విక్రాంత్ మూడోదఫా జలపరీక్షలు ఆరంభం
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మించిన యుద్ధవిమాన వాహక నౌక (ఐఏసీ) విక్రాంత్ మరో దఫా జల పరీక్షలు ఆదివారం ఆరంభమయ్యాయి. రూ.23వేల కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నౌకను వచ్చే ఆగస్టులో దీన్ని నేవీకి అందిస్తారు. అందుకే ఈ లోపు వివిధ దఫాలుగా వివిధ పరిస్థితుల్లో దీన్ని పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఆగస్టులో, అక్టోబర్లో సముద్రంలో ట్రయిల్స్ నిర్వహించారు. చదవండి: మీసాలపై తగ్గేదేలే... తీయననంటే తీయను తాజాగా మరోమారు సీ ట్రయిల్స్ ఆరంభిస్తున్నామని, స్వేచ్ఛాజలాల్లో(హై సీస్) పలు రకాల నౌకా విన్యాసాలు నిర్వహిస్తామని నేవీ ప్రతినిధి వివేక్ మధ్వాల్ చెప్పారు. నౌకకున్న సెన్సార్ సూట్లను కూడా పరీక్షిస్తామన్నారు. డీఆర్డీఓకి చెందిన ఎన్ఎస్టీఎల్ సైంటిస్టులు తాజా పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఈ నౌక నుంచి ఎంఐజీ జెట్లు, కమోవ్ హెలిక్యాప్టర్లును ప్రయోగించవచ్చు. దీని గరిష్ట వేగం 28 నాట్స్. #WATCH | Indigenous Aircraft Carrier INS Vikrant heads out for the next set of sea trials. pic.twitter.com/S1Yt8crcqu — ANI (@ANI) January 9, 2022 కొచ్చిన్ షిప్యార్డ్ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే యుద్ధ నౌక ఉంది. విక్రాంత్ నిర్మాణంతో సొంతంగా తయారు చేసుకున్న యుద్ధనౌకలున్న దేశాల జాబితాలోకి భారత్ చేరింది. కరోనా కారణంగా విక్రాంత్ పరీక్షల్లో జాప్యం జరిగింది. వీలైనంత త్వరగా ట్రయిల్స్ పూర్తిచేసి, సకాలంలో నౌకను నావికా దళంలో చేర్చేందుకు పలు సంస్థలకు చెందిన పలువురు నిపుణులు సంయుక్తంగా శ్రమిస్తున్నారని వివేక్ తెలిపారు. -
అమ్మకానికి ఒంటరి మేడ.. ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే..
ఎక్కడో దూరంగా కొండకోనల్లో ఉన్న గ్రామంలో ఉంటున్నారా? అయినా కూడా ఏకాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదా! అయితే ఈ సముద్రం మధ్యలోని బిల్డింగ్ మీకోసమే. పేరు స్పిట్బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. పోర్టులు, ఓడల రక్షణ కోసం ఇంగ్లండ్లో 1870ల్లో కట్టిన కొన్ని పోర్టుల్లో ఇదీ ఒకటి. ఇందులో 9 బెడ్రూమ్లు, బాత్రూమ్లు, ఓ సినిమా రూమ్, ఓ గేమ్ రూమ్, ఓ వైన్ సెల్లార్ ఉన్నాయి. బిల్డింగ్ పైన ఒక వేడి టబ్, మంట కాచుకునే గదులున్నాయి. అద్భుతమైన సముద్రం వ్యూ కనబడుతుంది. దీని వ్యాసం 50 మీటర్లు. లండన్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్లు. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు! -
సముద్రంలో ఫ్లోటింగ్ ప్యాలెస్.. చుట్టూ విల్లాలు.. వెకేషన్ అదిరిపోద్దంతే!
చాలా మంది ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెకేషన్కు వెళ్తుంటారు. కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లాంటి మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రాంతాలకైతే మరీ మరీ ఇష్టపడి వెళ్తారు. ఇలాంటి వాళ్లను మరింత ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన ఫ్లోటింగ్ ప్యాలెస్ రెడీ కాబోతోంది. అది కూడా సముద్రంలో. అలా ఇలా కాదు.. నీటిపై తేలేలా 156 రూములతో నిర్మితమవుతోంది. ప్యాలెస్ ఒక్కటే కాదండోయ్.. దాని చుట్టూ విల్లాలు కూడా సిద్ధం కాబోతున్నాయి. అవి కూడా నీటిపై తేలేవే. అలా సముద్రాన్ని చుట్టొద్దామనుకుంటే ఆ విల్లాలే ప్యాలెస్ నుంచి విడిపోయి బోట్లలా మారిపోతాయి. అలా తిరిగొచ్చాక షిప్లు కదా ‘డాక్’ అయినట్టు ఆ పెద్ద ప్యాలెస్కు అతుక్కుపోతాయి. వినడానికి భలేగా ఉన్నా, వెంటనే చూడాలనేలా ఊరిసున్నా ఈ ప్యాలెస్ హోటల్ దుబాయ్లో జుమెయ్రా బీచ్కు దగ్గర్లో నిర్మితమవుతోంది. 2023లో అందుబాటులోకి రానుంది. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ బోట్లు, హెలికాప్టర్ల ద్వారా ప్యాలెస్ను చేరుకోవచ్చు. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ ఏర్పాటు చేశారు. తేలాడే హెలిప్యాడ్ను కూడా నిర్మించబోతున్నారు. ప్రధాన ప్యాలెస్ 4 భాగాలుగా ఉంటుంది. వాటిని మధ్యలో ఉండే గ్లాస్ పిరమిడ్ కలుపుతుంది. ప్యాలెస్లో రెస్టారెంట్, బార్, స్పా, పూల్స్, బొటీక్స్ లాంటి సౌకర్యాలెన్నో ఉన్నాయి. విల్లాల్లో ఉండే వాళ్లు కూడా ఈ సౌకర్యాలు పొందవచ్చు. ప్యాలెస్ను, విల్లాలను నీటిపై తేలేలా ఎలా నిర్మిస్తున్నారో వెల్లడించలేదు. ప్యాలెస్ ఓపెనింగ్ తేదీ.. అందులోని రూమ్లు, సర్వీసుల ధరలు కూడా చెప్పలేదు. చదవండి: పాపికొండల సోయగాలు.. నదీ విహారం విల్లాల్లో ఏమేముంటాయ్? తేలియాడే ఆ పెద్ద ప్యాలెస్ చుట్టూ 12 విల్లాలను నిర్మించనున్నారు. ఒక్కోటి రెండంతస్తులు ఉంటుంది. 1, 4 బెడ్రూమ్ల గదులతో పాటు పైన టెర్రస్.. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంతేకాదు.. విల్లాలను పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నారు. వాటిల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్లో గాని, విల్లాలో గాని ఏ ప్రాపర్టీనైనా కొనుక్కోవచ్చు. చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త! – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఈ దోసకాయ ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?
సాదారణంగా మన ఊరిలో దోసకాయ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే రూ.50 - రూ.100 మధ్య ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దోసకాయ ఖరీదు ఎంతో తెలిస్తే!.. షాక్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సముద్ర దోసకాయ ఖరీదు అక్షరాల రూ.2 లక్షల పైనే ఉంటుంది. మరి, ఇవి ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?. ఈ సముద్ర దోసకాయలు ఎక్కువగా దొరకవు. వీటిని పట్టుకోవడం కోసం కొన్ని సార్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే, ఈ సముద్ర దోసకాయలు చాలా ప్రత్యేకమైన జీవులు. చికిత్స కోసం... వీటికి ఎలాంటి అవయవాలు ఉండవు. కేవలం, నోరు మాత్రమే ఉంటుంది. ఈ జీవులకు కొన్ని శతాబ్దాలుగా ఆసియాలో మంచి గిరాకీ ఉంటుంది. ఎక్కువ సంపన్న వర్గ కుటుంబాలు వీటిని ఆహారంగ స్వీకరిస్తారు. ప్రపంచంలోని 1,250 విభిన్న జాతుల సముద్ర దోసకాయలో జపనీస్ సముద్ర దోసకాయ చాలా ప్రత్యేకమైనది. గోల్డెన్ శాండ్ ఫిష్, డ్రాగన్ ఫిష్, కర్రీ ఫిష్ వంటి ఇతర రకాలతో పోలిస్తే ఇవీ అధిక శాతం ప్రోటీన్స్ కలిగి ఉంటాయి.ఈ సముద్ర దోసకాయల చర్మంలో ఫ్యూకోసిలేటెడ్ గ్లైకోసామినోగ్లైకాన్ అనే రసాయనం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ రసాయనంను ఆసియాలోని ప్రజలు కొన్ని శతాబ్దాలుగా బాధపడుతున్న ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు. (చదవండి: సుమారు మూడేళ్ల నిరీక్షణ..! సింపుల్గా రూ. 5.67 కోట్లను వెనకేశారు..!) ఇటీవల ఐరోపాలోని ప్రజలు కొన్ని క్యాన్సర్లకు చికిత్స చేయడానికి, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. దీంతో రోజు రోజుకి సముద్ర దోసకాయ క్రేజ్ ఎక్కువగా పెరుగుతుంది. 1980లలో ఆహారం కోసం భారీగా డిమాండ్ వచ్చేది. అది ఇప్పుడు పాశ్చాత్య ఔషధ కంపెనీలకు ఔషదంగా పనిచేస్తుంది. మొరాకో నుంచి యునైటెడ్ స్టేట్స్, న్యూ గినియా వరకు సముద్ర దోసకాయలను ఎగుమతి చేస్తున్నాయి. సముద్ర దోసకాయలను ఎగుమతి చేసే దేశాల సంఖ్య 35 నుంచి 83కు పెరిగింది. వీటికి డిమాండ్ భారీగా పెరగడంతో ఈ జీవులలో కొన్ని జాతులు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. -
కిరణా వ్యాపారం.. ఆశలన్నీ కొడుకుపైనే.. కళ్ల ముందే..
సాక్షి,శ్రీకాకుళం రూరల్: సముద్ర స్నానానికి వెళ్లిన విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ సంఘట న పెదగనగళ్లవానిపే ట తీరంలో ఆదివారం చోటు చేసుకుంది. శ్రీకాకుళం రూరల్ పోలీసుస్టేషన్ ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలోని బోడెమ్మ కోవెల ప్రాంతంలో నివాసం ఉంటున్న కాశం రమేష్ కిరణా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్నవాడైన సురేంద్ర (17) నగరంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్నా డు. కార్తీక మాసం కావడంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులతో కలిసి పెదగనగళ్లవాని పేట సమీపంలోని సరుగు తోటల్లో పిక్నిక్ జరుపుకున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సముద్రంలో స్నానాలకు దిగారు. అలలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో సురేంద్ర గల్లంతైనట్లు ప్రత్యేక సాక్షు ల ద్వారా తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల వరకూ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు.. -
లోపల ఊపిరి ఆడట్లేదు.. మమ్మల్ని బతకనివ్వండి ప్లీజ్
ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండే విశాఖ సముద్ర తీరం మృత్యు కుహరంగా మారిపోతోంది. నిత్యం కడలి కెరటాల ఘోష వినిపించే ప్రాంతం.. సముద్ర జీవరాశుల మృత కబేళాలతో నిండిపోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగర గర్భంలో ఉండే జీవరాశులు సైతం ఒడ్డుకు కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా విభిన్న జీవరాశులు విశాల విశాఖ తీరంలో ఎక్కడో ఒక చోట నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్లతోపాటు విశాఖ తీరంలో అరుదైన డాల్ఫిన్లు ఆలివ్ రిడ్లే తాబేళ్లు, స్టింగ్రే(టేకు చేప), ముళ్లచేప మొదలైన జీవరాశులు మరణిస్తున్నాయి. సముద్ర జలాలు కలుషితం అవుతున్న కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ( చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది ) సాక్షి, విశాఖపట్నం: వాతావరణంలో మార్పులను మానవ నివాసానికి అనుకూలంగా మార్చేవి సముద్రాలే. ఇందులోని జలాలు ఆవిరై వర్షాలుగా కురిసి నీటివనరులు అందేందుకు దోహదపడుతున్నాయి. మనిషి తీసుకునే ప్రోటీన్లలో సింహభాగం సముద్రం ఇస్తున్నదే. ఇన్ని ఇస్తున్న సాగరానికి.. తిరిగి మనమేం ఇస్తున్నామంటే కాలుష్య రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలే. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా సముద్ర గర్భంలో కలుస్తున్నాయి. ( చదవండి: గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ.. ) ప్లాస్టిక్ సీగా మార్చేస్తున్నారు.. అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులే ప్రధాన సమస్యగా మారుతున్నారు. బీచ్ ఒడ్డున కూర్చొని.. తినుబండారాల్ని తినేసి ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు సముద్రంలో పారేస్తున్నారు. ఇలా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ మోతాదుకి మించి సముద్రాల్లో చేరుతుండటంతో ఆమ్లగాఢత పెరుగుతోంది. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విడుదలవుతున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు చేపలకు హాని చేస్తోంది. సముద్ర గర్భం నుంచి ఒడ్డుకి తీసుకొచ్చిన వ్యర్థాలతో లివింగ్ అడ్వెంచర్స్ బృందం అడుగున ఉన్న ఆకర్షణీయమైన ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహారంగా భావిస్తున్న జలచరాలు.. వాటిని తిని మృత్యువాత పడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సముద్ర జీవులు మనుగడ సాధించేందుకు జలాల్లో ఆక్సిజన్, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుంచి 10 పీపీటీ వరకూ ఆక్సిజన్ అవసరంకాగా.. 30 నుంచి 33 శాతం వరకూ లవణీయత ఉండాలి. కానీ విషపూరిత రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తుండటంతో అసమతుల్యత ఏర్పడి.. సరైన స్థాయిలో ఆక్సిజన్ అందక ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ వెలికితీస్తున్న స్వచ్ఛంద సంస్థలు సముద్ర జలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు జలచరాలకు ఎలాంటి హాని తలపెడుతున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన శూన్యమనే చెప్పుకోవాలి. అందుకే.. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాసిక్ వ్యర్థాల్ని తొలగించేందుకు లివిన్ అడ్వెంచర్ సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ఒడ్డు నుంచి ప్రారంభించి.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. మరోవైపు సాగర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు విడిచిపెట్టకుండా తీరానికి వస్తున్న సందర్శకులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినా.. పర్యాటకుల నుంచి స్పందన కరువవడంతో జలచరాల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. ( చదవండి: CM Stalin: రూ.150కు చేరిన టమాటా.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం ) జీవవెవిధ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రంలో విసిరేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సముద్రంలో ఉన్న ప్రాణులు చనిపోతూ కనిపిస్తుంటే మనసు తరుక్కుపోతోంది. అందుకే వెలికితీస్తున్నాం. మన సముద్రాన్ని మనం పరిరక్షించుకుందాం. ప్రజలు, సందర్శకులు కూడా దీనికి సహకరించాలి. ప్లాస్టిక్ సముద్ర ప్రాణుల్ని అంతరించిపోయేలా చేస్తోంది. ఇది జాతి మనుగడకే చాలా ముప్పు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. – బలరాంనాయుడు, లివింగ్ అడ్వెంచర్స్ సంస్థ ప్రతినిధి చేపల శరీరాల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్స్ సంస్థతో కలిసి ఎన్ఐవో చేసిన ఓ పరిశోధనలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేపల శరీరాల్లోకి వెళ్తున్నట్లు తెలిసింది. ఇది ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మెరైన్ పొల్యూషన్ అనేది కేవలం జలచరాలకే కాదు.. మానవాళి ఉనికికే పెను ముప్పు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలపై కాలుష్య నియంత్రణ మండలితో పాటు జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ఐఓ) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. భూ ఉపరితలంతో పాటు సముద్ర తీరాల్ని కాపాడుకునే దిశగా విశాఖ ప్రజలు అడుగులు వేయాలి. – డా. కె.ఎస్.ఆర్.మూర్తి, ఎన్ఐవో విశ్రాంత శాస్త్రవేత్త చదవండి: సరదాగా కుటుంబంతో అత్తవారింటికి.. అంతలో దారుణం -
విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో..
సాక్షి, సంతబొమ్మాళి(శ్రీకాకుళం): మండలంలోని భావనపాడు సముద్ర తీరంలో ఆదివారం స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో శేఖర్ కుమార్ బెహరా (21) మృతి చెందగా.. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతున్న 50 మంది విద్యార్థులు బస్సులో ఆదివారం బీచ్కు వచ్చారు. భోజనాల అనంతరం విద్యార్థులు సముద్రంలో స్నానాలకు దిగారు. ఇంతలో ఓ రాకాసి అల తాకిడికి శేఖర్కుమార్, ముక్తా ప్రధాన్తో పాటు మరికొందరు విద్యార్థులు చెల్లాచెదురైపోయారు. కాసేపటికే అంతా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే శేఖర్ మునిగిపోతున్నాడని గ్రహించిన ముక్తా ప్రధాన్ అతడిని కాపాడే ప్రయత్నంలో తాను కూడా అలల మధ్య చిక్కుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితులు ఎలాగోలా కష్టపడి ముక్తాను రక్షించగలిగారు. కానీ శేఖర్ను మాత్రం ఒడ్డుకు తీసుకురాలేకపోయారు. సాయంత్రం సమయంలో మృతదేహం ఒడ్డుకు చేరడంతో అంతా బోరుమన్నారు. శేఖర్కుమార్ స్వస్థలం బరంపురం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని నౌపడ ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. చదవండి: ప్రేమవివాహం సాఫీగా సాగిన జీవనం.. ఇటీవల కష్టంగా ఉందని లెటర్ రాసి.. -
వైరల్: ఆకాశంలో క్రేజీ కపుల్స్.. అంతలో అనుకోకుండా ..
ప్రస్తుత బిజీ లైఫ్లో తీరిక దొరికినప్పుడో, లేదా తీరిక చేసుకుని చాలా మంది విహారయాత్రకు వెళ్తుంటారు. అయితే కొందరు పర్యాటక ప్రాంతాల్లో అడ్వెంచర్స్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే టూర్కి వెళ్లడం సరదానిస్తే, అలాంటివి కిక్కునిస్తాయి. అయితే సాహసాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి లేదంటే ప్రమాదాలను కోరి తెచ్చుకన్నట్లే. తాజాగా ఓ జంట ఇలాంటి సాహసమే చేస్తూ ప్రమాదం బారిన పడ్డారు. ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలో గుజరాత్కు చెందిన ఓ జంట విహారయాత్రకని వెళ్లారు. దీవి కావడంతో సముద్రం, బోటింగ్, పారాసెయిలింగ్ సహజమే. ఆదివారం ఆ జంట ఉనా తీరం బీచ్లో పారాసెయిలింగ్ చేశారు. పడవలో ఉన్న మరో వ్యక్తి దీన్ని వీడియో తీశారు. అయితే ఆ దంపతులు చాలా ఎత్తుకు ఎగిరిన తర్వాత పడవ, పారాసెయిలింగ్ మధ్య ఉన్న తాడు తెగిపోయింది. దీంతో ఆ జంట సముద్రంలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ముందస్తు జాగ్రత్తగా ఆ జంట లైఫ్ జాకెట్లు ధరించడంతో సముద్రంలో మునిగిపోకుండా నీటిపై తేలారు. తక్షణమే స్పందించిన బీచ్రెస్క్యూ సిబ్బంది జంటను కాపాడారు. పారాసెయిలింగ్ బోటు సిబ్బంది తమను పట్టించుకోలేదని, కొంత సేపటి తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చి తమను కాపాడినట్లు వాళ్లుతెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోటు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని దంపతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బోటు సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. @VisitDiu @DiuTourismUT @DiuDistrict @VisitDNHandDD Parasailing Accident, Safety measures in India, and they said very rudely that this is not our responsibility. Such things happens. Their response was absolutely pathetic.#safety #diu #fun #diutourism #accident pic.twitter.com/doN4vRNdO8 — Rahul Dharecha (@RahulDharecha) November 14, 2021 చదవండి: Umngot River In Meghalaya: ఇదేం వింత.. పడవ గాల్లో ఎగరడం ఏంటి..!? -
సముద్రంలో పడవ బోల్తా.. జాలరి గల్లంతు
అచ్యుతాపురం (అనకాపల్లి): సముద్రంలో వేటకు వెళ్లిన పడవ బోల్తాపడటంతో ఓ జాలరి గల్లంతయ్యాడు. విశాఖ జిల్లా పూడిమడక తీరంలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఇంజన్ లేని బోటులో పూడిమడకకు చెందిన తిక్కల వెంకన్న, మరో ముగ్గురు జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లాక బోటు బోల్తా పడింది. వీరిలో తిక్కల వెంకన్న (50) గల్లంతయ్యాడు. మిగిలిన ముగ్గురూ బోటును తిరగేసి వెంకన్న కోసం గాలించారు. అయినా జాడ కానరాకపోవడంతో ఒడ్డుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేటకు వెళ్లిన వారిలో వెంకన్నతో పాటు అతని కుమారుడు రాజు కూడా బోటులో ఉన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఉపేంద్ర చెప్పారు. -
900 ఏళ్ల నాటి పురాతన కత్తి
ఇజ్రాయెల్: పురావస్తు శాఖ తవ్వకాల్లో రకరకాల వస్తువులు, చాలా కోటలు, ఆనాడు వాళ్లు వినియోగించిన చాలా వస్తువులు బయటపడటం చూశాం. కానీ నదుల్లోనూ, సముద్రాల్లోనూ దొరకడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇక్కడొక వ్యక్తికి మాత్రం సముద్రం అడుగుభాగాన పురాతనమైన కత్తి ఒకటి లభించింది. (చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా!) వివరాల్లోకెళ్లితే..శ్లోమి కాట్జిన్ అనే డైవర్కి మధ్యధరా సముద్రం అడుగుభాగన డైవింగ్ చేస్తూ అక్కడ ఉండే అత్యద్భుతమైన వాటిని తన కెమరాతో బంధిస్తుండగా ఒక కత్తి పడి ఉండటాన్ని గుర్తించాడు. ఈ మేరకు అతను సముద్రగర్భంలో అనేక ఇతర పురాతన కళాఖండాలను కనుగొన్నాడు. అంతేకాదు ఈ కత్తి బార్నాకిల్స్తో కప్పబడి ఉంది. అయితే కాట్జిన్ ఆ కత్తిన్ని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీకి అప్పగించాడు. ఆ తర్వాత వాళ్లు అధ్యయనం చేస్తే ఇది 900 సంవత్సరాల నాటి నిజమైన క్రూసేడర్ కత్తిగా గుర్తించారు. ఈ మేరకు ఈ పురాతన కత్తి ఇనుముతో తయారు చేయబడటమ కాక కచ్చితమైన స్థితిలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పురాతన వస్తువుల అథారిటీ వద్ద ఆ కత్తి దోపిడీకి గురైనట్లు అథారిటీ అధికారులు చెప్పుకొచ్చారు. అంతేకాదు అథారిటీ అధికారులు కాట్జిన్కి మంచి పౌరసత్వ ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ దీనికి సంబంధించిన 2 నిమిషాల వీడియోను ఫేస్బుక్లో షేర్ చేసింది. ప్రస్తుతం నెట్లింట తెగ వైరల్ అవ్వడమే కాదు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. మీరు కూడా ఒక్కసారి వీక్షించండి. (చదవండి: ఏడాది చిన్నారి నెలకు ఏకంగా రూ.75 వేలు సంపాదన) -
దాదాపు నెలరోజలు సముద్రంలోనే!
మనం విదేశాల్లోనో లేక మరేదైనా రాష్ట్రంలోనూ దారితప్పిపోతే భాష రాకపోయిన ఏదో రకంగా మనం బయటపడగలం కానీ సముద్రంలో అనుకోకుండా బోటు మునిగిపోవడం లేదా మరే ఇతర కారణాల వల్లనో సముద్రంలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఇద్దరు వ్యక్తులకు. సోలమన్ దీవుల్లోని సమద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు దాదాపు నెల రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. అసలు వారు ఎవరు ? ఎందుకు అలా జరిగిందనే వివరాలు.. (చదవండి: కదిలే టాటుల అద్భుతమైన వీడియో) విషయంలోకి వెళ్లితే సోల్మన్ దీవులకు చెందిన లివే నంజికానా, జూనియర్ కోలోని అనే ఇద్దరూ వ్యక్తులు సోలమన్ దీవులలోని పశ్చిమ ప్రావిన్స్కి సెప్టెంబర్ 3న చిన్న మోటారు బోట్పై బయలుదేరారు. పశ్చిమ తీరంలోని వెల్ల లావెల్లా ద్వీపం, గిజో ద్వీపాలను ఆధారంగా చేసుకుని ప్రయాణిచారు. కొంత దూరం ప్రయాణించేటప్పటికే జీపీఎస్ పనిచేయడం మానేసింది. దీంతో వారు దాదాపు 29 రోజులు సముద్రంలో చిక్కుకు పోయారు. ఈ సోలామాన్ సమద్రంలో ప్రయాణించటం ఎంత క్లిష్టతరమైనదో ఈ పర్యటనలోనే వారికి అర్థమైంది. ఈ పర్యటన కోసం తెచ్చుకున్న నారింజపళ్లు, కొబ్బరికాయలు, వర్షపు నీటితో ఆ 29 రోజులు గడిపారు. ఆఖరికి న్యూ బ్రిటన్, పాపువా న్యూ గినియా తీరంలోని ఒక మత్స్యకారుడి సాయంతో బయటపడ్డారు. ఇలాంటివి సినిమాల్లో చూస్తేనే ఏదోలా అనిపిస్తోంది అలాంటిది నిజ జీవితంలో ఎదురైతే ఇక అంతే సంగతులు. కానీ నిజంగా ఇది చాలా ఒళ్లు గగుర్పోడిచేలాంటి పర్యటన కదా!. (చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’) -
ఇంజనీరింగ్ అద్భుతం.. భారత్లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్
న్యూఢిల్లీ: భారత్లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ పంబన్ బ్రిడ్జ్ మార్చి 2022 నాటికి వినియోగంలోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. అరేబియన్ సముద్రంలో రామేశ్వర ద్వీపంలోని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ దాదాపు 2 కి.మీటర్ల పొడవైన రైల్వే వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఉన్న 104 ఏళ్ల నాటి వంతెన స్థానంలో ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన పైకి లెగిసే వంతెనను ఏర్పాటు చేశారు. ఇది ఏవైనా చిన్నచిన్న షిప్లు వచ్చినప్పుడూ ఆటోమేటిక్గా ఆ వంతెన పైకి లెగిసి వాటికి దారి ఇస్తుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ మంత్రి కూ యాప్లో కొత్త పంబన్ వంతెన ఫోటోలు షేర్ చేశారు. అంతేకాదు ఇది ఇంజనీరింగ్ అద్భుతం అని "ఈ డ్యూయల్-ట్రాక్ అత్యాధునిక వంతెన దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెనగా నిలుస్తుందన్నారు. -
పగడపు దిబ్బల ఉనికి దట్టమైన మేఘాలతోనే సాధ్యం!
పెరుగుతున్న కాలుష్యం, పంటల కోసం విచ్చలవిడిగా వాడుతున్న పురుగుల మందులు తదితర కారణాల వల్ల సముద్రాల్లో అరుదైన పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు సరికొత్త ఆధునిక టెక్నాలజీతో ఈ పరిస్థితిని అదుపు చేయాలని చూస్తున్నారు. అదేంటే తెలుసుకుందామా! ఆస్ట్రేలియా: పగడపు దిబ్బుల గురించి చిన్నప్పుడూ కథలుగా విని ఉన్నాం గానీ వాటి గురించి పూర్తిగా తెలియదు. పగడపు దిబ్బలు సముద్రం అడుగ భాగాన ఏర్పడి ఎన్నో జీవరాశులకు నిలయంగా ఉంటాయి. పగడపు పాలిప్స్ నుంచి పగడపు దిబ్బలు ఏర్పడతాయి. చాలా పగడపు దిబ్బలు స్టోనీ పగడాల నుంచి ఏర్పడతాయి. పగడపు దిబ్బలు వెచ్చని, నిస్సారమైన నీటిలో ఉత్తమంగా పెరుగుతాయి. అలాంటి ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం కారణంగా వాతావరణ మార్పుల వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు కారణంగా అవి కనుమరగయ్యే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: రూ. 8 కోట్లకు అమ్ముడుపోయిన ‘ది కంజురింగ్’ దెయ్యాల కొంప) దీంతో శాస్త్రవేత్తలు క్లౌడ్ బ్రైటెనింగ్ ప్రాజెక్ట్ చేపట్టి ఆ పగడపు దిబ్బలను సంరక్షించుకునే సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగాంగా శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలో ఈశాన్య తీరంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బలు ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గించేలా సముద్ర జలాలను ఆకాశంలోకి వెదజల్లే టర్బైన్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. దీంతో సముద్ర జలాలు ఆవిరిగా మారి సూక్ష్మమైన ఉప్పు కణాలు మాత్రమే వాతావరణంలో తేలుతాయని, వాటి చుట్టూ నీటి ఆవిరి ఘనీభవించి మేఘాలుగా ఏర్పడతాయని సదరన్ క్రాస్ యూనివర్శిటీ సీనియర్ లెక్చరర్ డేనియల్ హారిసన్ వెల్లడించారు. ఈ విధంగా కొన్ని నెలలు తరబడి చేస్తే మునపటి వాతావరణంలా మార్పు చెంది పగడపు దిబ్బలు సురక్షితంగా ఉంటాయంటున్నారు. వేసవిలో అత్యంత వేడుగాలుల కారణంగా పగడపు దిబ్బలు ఏవిధంగా తమ సహజ రంగును కోల్పోయి పాలిపోయి కనుమరుగయ్యే స్థితిలో ఉందో పరిశోధనల ద్వారా తెలుసుకోవడంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. సూర్య కాంతి ఎక్కువ్వడంతో సముద్రపు నీరు వేడిక్కి పాలిపోతుందని వెల్లడించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగితే వేసవి కాలంలో కనీసం 6% ఉష్ణోగ్రత తగ్గితే పగడపు దిబ్బలు పాలిపోకుండా కాపాడగలం అని హారిసన్ పేర్కొన్నారు. దట్టమైన మేఘాల వల్లే కలుగు ప్రయోజనాలను కూడా ఈ పరిశోధనలు ద్వారా తెలుసుకోగలిగమని వివరించారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతరించిపోతున్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఆస్ట్రేలియా ప్రసిద్ధి గ్రేట్ బారియర్ రీఫ్లో ఉన్న భారీ పగడపు దిబ్బలు ఉండటంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు హారిసన్ పేర్కొన్నారు. (చదవండి: నా కెరియర్లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల) -
వైరల్: వలలో పడ్డ భారీ షార్క్.. పడవ దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే!
లండన్: యూకేకు చెందిన ఓ మత్స్యకారుడు అరుదైన రికార్డు బ్రేక్ చేశాడు. ఎలా అంటారా.. సముద్రంలో వేటకు వెళ్లిన అతను అనుకోకుండా ఓ భారీ షార్క్ను పట్టుకోగా ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే 1993లో ఓ మత్స్యకారుడికి 229 కిలోల షార్క్ దొరకగా ఇప్పటి వరకు ఆ రికార్డు అలానే ఉండిపోయింది. తాజాగా ఆ రికార్డు దీంతో బ్రేక్ అయింది. వివరాల్లోకి వెళితే.. నార్తాంప్టన్షైర్కు చెందిన సైమన్ డేవిడ్సన్ డెవోన్ తీరంలో ఎప్పటి లానే వేటకు వెళ్లాడు. కాకపోతే ఆ రోజు అతనికి అనూహ్యంగా 7 అడుగుల, 250 కిలోలు బరువున్న ఓ భారీ షార్క్ అతని వలలో పడింది. దీనిపై సైమన్ మాట్లాడుతూ.. తన ఎరకు ఏదో సాధారణ చేప చిక్కుకున్నట్లు అనుకున్నానని తెలిపాడు. ఒక గంటకు పైగా ఆ భారీ చేపతో కుస్తీ పడి, ఎలాగో చివరకు దాన్ని పడవలోకి లాగేశానన్నాడు. పడవలోకి లాగిన తర్వాత దాన్ని చూసి కంగారుపడినట్లు తెలిపాడు. అయితే కొంతసేపు అయ్యాక ఆ జీవిని మరో ఐదుగురితో కలిసి తిరిగి సముద్రంలో వదిలేశారు. సముద్రంలోకి వదిలే ముందు ఆ షార్క్ కొలతలు తీసుకున్నట్లు సైమన్ తెలిపాడు. చదవండి: మట్టి ముంతలో స్పెషల్ పిజ్జా.. నెటిజన్లకు నోరూరిస్తోంది -
వసతులు లేని కాటేజ్.. ఆ ప్రత్యేకత ఉందని కోట్లు పలుకుతోంది!
ఇల్లు కొనే ముందు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూసి కాస్త ఎక్కువైనా కొంటాం. అదే వసతులు సరిగా లేకపోతే ధర తక్కువ ఉన్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడం. అయితే వసతులు లేని ఓ కాటేజ్ మాత్రం భారీగా ధర పలుకుతోందట. ఎందుకో ఓ సారి చూసేద్దాం. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్లోని డేవాన్ సముద్రం ఒడ్డున ఈ ఆఫ్ గ్రిడ్ హౌస్ ఉంది. ఈ కాటేజ్కు కరెంట్ లేదు. నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్ కూడా ఉండదు. అయినప్పటికీ దాని ధర మాత్రం రూ.5.56 కోట్లట. అదేంటి కనీస వసతులు ఏవీ లేకపోయినా ఇంత రేటు ఎందుకు అనుకుంటున్నారా? దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. నీలి సముద్రం కొండపై ఉన్న కుటీరానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ఇల్లు ఎంతగానో నచ్చుతుంది. ఈ కాటేజ్ నేషనల్ ట్రస్ట్ యాజమాన్యంలోని మన్సాండ్ బీచ్పైన ఉన్న రిమోట్ గేట్అవేలో ఉంది. ప్రకృతితో మమేకమై ప్రశాంతమైన జీవనాన్ని గడపాలనుకునే వారికి ఈ కాటేజ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే అంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఆ కాటేజ్ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారంట. ఈ కాటేజ్లో రెండు పెద్ద బెడ్ రూమ్లు, పైన గడ్డితో చేసిన గది ఉంది. ఇందులో లాంజ్, డైనింగ్ రూం, ఫ్రంట్ అండ్ బ్యాక్ వరండా, రెండు గెస్ట్ బెడ్రూంలు, పవర్రూం, వంట గది ఉందంట. దీనిని 1,345 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. వర్షపు నీటిని నిల్వ చేసి తాగునీటిగా మార్చే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కాటేజ్కు వెళ్లేందుకు బీచ్ నుంచి రోడ్డు ఉందని, కారు పార్కింగ్ నుంచి 15 నిమిషాల్లో నడిచి చేరుకోవచ్చునని దీని ఆస్తి విక్రేత మిచెల్ స్టీవెన్స్ తెలిపారు. చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ -
‘టైటానిక్’ మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత..
‘టైటానిక్’ ఉదంతం చరిత్ర పుటల్లో ఓ దుర్ఘటన. 1912 నవంబర్ 14న అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీ కొట్టి, మునిగి.. వందల మందిని జలసమాధి చేసిన ఓ విషాదం. 73 ఏళ్ల తర్వాత కెనడాలోని న్యూఫౌండ్ ల్యాండ్కు 740 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల లోతున 2 ముక్కలైన టైటానిక్ అవశేషాలను గుర్తించిన విషయం తెలిసిందే. 109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు నేటికీ నీళ్లల్లో పదిలంగానే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో ఆ ఛాన్స్ కూడా ఉండదట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒకరకమైన బ్యాక్టీరియా టైటానిక్ అవశేషాలను వేగంగా తినేస్తోందట.. ‘మరో 12 ఏళ్ల తర్వాత టైటానిక్ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో ఒక్క ముక్క కూడా మిగలద’ని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ ‘ఆర్ఎంఎస్ టైటానిక్ సంస్థ’ పలు పరిశోధక యాత్రలు చేపట్టి.. దాదాపు 5 వేలకు పైగా.. వెండి పాత్రలు, బంగారు నాణాలు వంటివెన్నో టైటానిక్ శిథిలాల నుంచి బయటకు తీసింది. ఆనాడు ఈ ప్రమాదం నుంచి ఏడు వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్గా కనిస్తారు.. -
సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి..
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేదిలో మరోసారి సముద్రం వెనక్కి మళ్లింది. అన్నా చెల్లెలు గట్టు సమీపంలో 500 మీటర్లు ముందుకు వచ్చి, నాలుగు గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వెళ్లింది. సముద్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పౌర్ణమి పోటుతో అంతర్వేది బీచ్లో బుధవారం సముద్ర కెరటాలు ఎగసిపడ్డాయి. కెరటాలు తీరాన్ని దాటుకుని ముందుకు చొచ్చుకు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో అమావాస్య పోటుతో ఆరు రోజులు పాటు ఉగ్రరూపం దాల్చిన సముద్రం ప్రస్తుతం పౌర్ణమి పోటుకు అదే రీతిలో భయపెడుతోంది. కెరటాల ఉధృతికి ఇప్పటికే బీచ్ ఒడ్డున ఉన్న షాపులు ధ్వంసమయ్యాయి. అలాగే షాపులకు చేర్చి కట్టిన పెద్ద భవనం కూడా కోతకు గురవుతోంది. ఇదిలా ఉండగా, మరోసారి సముద్రం వెనక్కి మళ్లింది. ఇవీ చదవండి: ‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’ 'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ -
వలకు చిక్కిన సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్
సాక్షి, తూర్పుగోదావరి: రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి వద్ద మడేరు వాగులో మంగళవారం ఈ చేప ఓ గిరిజనుడి వలకు చిక్కింది. కిలో బరువు వుండే ఈ చేప వింతగా, భయం కలిగించేదిగా ఉంది. అక్కడి వారు దానిని వెంటనే వాగులోనే వదిలేశారు. ఈ చేపను సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటారని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూవాలజి లెక్చరర్ బొరుసు శ్రీకృష్ణ చెప్పారు. ఇది విషపూరితమైందన్నారు. రూపాన్ని బట్టి దీనిని దెయ్యం చేపగా కూడా పిలుస్తారన్నారు. చుట్టూ వుండే చేపలను గాయపరచి, చంపి తింటుందన్నారు. దీనివల్ల దేశవాళీ చేపలు, ఇతర విలువైన నీటి ప్రాణులకు ప్రమాదం అన్నారు. ఇది ఉన్నచోట మిగతా చేపలు అంతరించిపోతాయన్నారు. ఇతర దేశాలకు చెందిన ఈ చేపను మొదట ఆక్వేరియంలో పెంచేందుకు మనవారు తీసుకొని వచ్చారన్నారు. దీని సంతతి పెరిగిపోతోందన్నారు. చదవండి: ప్రియుడి మోజు: నిద్రపోతున్న భర్తపై దిండుతో అదిమిపట్టి.. -
లిబియాలో పడవ మునిగి 57 మంది మృతి
-
కృష్ణా జలాలు సముద్రం పాలు
సాక్షి, అమరావతి: తెలంగాణ సర్కారు శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో అక్రమంగా నిరంతరాయ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఆదివారం మరో టీఎంసీ నీరు సముద్రంలో కలిసింది. గత వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి 6.944 టీఎంసీలు వృథాగా కడలి పాలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే.. ఈ నీటితో రాష్ట్రంలో 45 వేలు, తెలంగాణలో 25 వేల ఎకరాల్లో రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉండేదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ దందుడుకు వైఖరి వల్ల రెండు రాష్ట్రాలకూ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహం ఆదివారం పూర్తిగా నిలిచిపోయింది. నీటిమట్టం 809.65 అడుగులకు తగ్గిపోయింది. అయినా తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 7,063 క్యూసెక్కులను తోడేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 34.04 టీఎంసీలకు పడిపోయింది. నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేయడం వల్ల సాగర్లో నీటి మట్టం 529.30 అడుగులకు పడిపోగా నీటి నిల్వ 177.76 టీఎంసీలకు తగ్గిపోయింది. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని ఆ రాష్ట్ర ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని తాత్కాలికంగా ఆపేసింది. కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు లేకపోయినా సరే.. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని నిర్విరామంగా కొనసాగిస్తోంది. పులిచింతల నుంచి వదిలేస్తున్న 5,600 క్యూసెక్కులకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల 73,50 క్యూసెక్కులు వెరసి 12,950 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్నాయి. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే కావడంతో మిగులుగా ఉన్న 11,479 క్యూసెక్కులను 20 గేట్లను అర్ధ అడుగు మేర ఎత్తి వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. -
సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు
సాక్షి, శ్రీకాకుళం: కవిటి మండలం పుక్కళ్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పెదపులిపాకలో విషాదం కృష్ణా జిల్లా పెదపులిపాకలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు సాయి శ్రీనివాస్(25), గోవింద్(22), సతీష్(22)లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: Guntur : పీకల వాగులో పడి బాలుడు మృతి గెయిల్ గ్యాస్ విస్పోటనానికి ఎనిమిదేళ్లు -
మరో సారి మా బాంబులు గురి తప్పవు : బ్రిటన్కు రష్యా వార్నింగ్
మాస్కో: శతాబ్దాల కాలం నుంచి సముద్రాల మీద అధిపత్యం కోసం సంపన్న దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పలు దేశాలు కొన్ని ప్రాంతాలలోని జలాలు తమకు చెందినవిగా ప్రకటించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహాలోనే.. తమ జలాల్లోకి ప్రవేశించిన బ్రిటన్కు రష్యా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ రాయల్ నేవికి చెందిన డెస్ట్రాయర్ హెచ్ఎంఎస్ డిఫెండర్ నౌక ఉక్రెయిన్ నుంచి జార్జియాకు వెళ్లే క్రమంలో క్రిమియా జలాల్లోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన రష్యా నౌకాదళ సిబ్బంది హెచ్చరికగా కాల్పులు జరిపింది. మళ్లీ ఈ ఘటన పునరావృతమైతే మా బాంబులు లక్ష్యాన్ని తాకుతాయని హెచ్చరించింది. ఇప్పటికే రష్యా.. బ్రిటన్ యుద్ధ నౌక తమ జలాల్లోకి వచ్చిందని, మాస్కోలోని బ్రిటన్ అంబాసిడర్ కార్యాలయానికి సమన్లు కూడా జారీ చేసింది. అయితే ఈ జలాలు ఉక్రెయిన్కు చెందినవిగా బ్రిటన్ సహా పలు దేశాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. తమ యుద్ధనౌక మార్గంలో రష్యా బాంబులేసిందని బ్రిటన్ ఆరోపిస్తోంది. కాగా ఈ ఘటనపై వీరివురి వాదనలు వేరువేరుగా ఉన్నాయి. ఈ ఘటనపై రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రిని బ్రిటన్ యుద్ధనౌక మార్గంలో బాంబులేశారట కదా అని ప్రశ్నిస్తే.. భవిష్యత్తులో మార్గంలో కాదు, టార్గెట్పైనే వేస్తామని అనడం గమనార్హం. There are conflicting reports over an incident involving Russian and British naval vessels in the Black Sea. Russia's defense ministry says warning shots were fired at a British ship — But Britain says any shots fired were pre-announced training exercises https://t.co/TKJpAnikuU pic.twitter.com/xZfUWwrsZU — Reuters (@Reuters) June 23, 2021 చదవండి: ఇదో వింత కేసు, ఇతనికి పది నెలలుగా పాజిటివ్..చివరికి -
ఆమెకు సముద్రమే అన్నం ముద్ద
భారతదేశంలో చేపలు పట్టే లైసెన్సు ఉన్న ఏకైక మహిళ రేఖ కోవిడ్ విసిరిన మృత్యుకెరటాలకు ఏమాత్రం చలించలేదు. లాక్డౌన్ వల్ల, తుఫాన్ల వల్ల, గుండె ఆపరేషన్ కోసం ఎదురు చూస్తూ వేటకు రాలేని నిస్సహాయ భర్త వల్ల ఆమె ఓడిపోదలుచుకోలేదు. ఇంత పెద్ద సముద్రం అమ్మలా ఉంది నాకేం భయం అనుకుంది. రోజూ తీరంలో దొరికే సముద్రపు చిప్పలను ఏరి బతుకు వెళ్లమారుస్తుంది. నలుగురు ఆడపిల్లలు ఉన్నారామెకు. భర్తతో కలిపి ఐదుగురు పిల్లలు అనుకుంటూ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటోందామె. కేరళ త్రిచూర్ జిల్లాలోని ఎత్తాయి సముద్రతీరం లో రోజూ తెల్లవారు జామున ఆమె కనిపిస్తుంది. ఒక నీలిరంగు ప్లాస్టిక్ బాస్కెట్ను పట్టుకుని కెరటాల వెంట సాగుతూ దేనినో అన్వేషిస్తూ ఉంటుంది. దేనిని? సముద్రపు చిప్పల్ని (సాధారణ ఆల్చిప్పలు/అయిస్టర్ షెల్స్). ఆమె వాటిని ఏరుకుంటూ ఆ బుట్ట నిండేవరకూ అక్కడే తిరుగుతుంది. బుట్ట నిండితే 60 రూపాయలు వస్తాయి. ‘ఒక్కోసారి సగం బాస్కెట్ కూడా దొరకవు. అమ్మ ముఖం చాటేస్తుంది’ అని నవ్వుతుంది. ఆమె పేరు రేఖ. ఆమె అమ్మ అంటున్నది సముద్రాన్ని. నిజానికి ఆమె సముద్రంలో చేపలు పట్టాలి. కాని సముద్రపు చిప్పల్ని ఏరాల్సి వస్తోంది. ‘సముద్రంలో కెరటాలకు నేను ఎప్పుడూ భయపడలేదు. కాని జీవితంలో కెరటాలకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది’ అంటుంది నలభై ఏళ్ల రేఖ. సముద్రంలో రేఖ తొలి డీప్ ఫిషింగ్ లైసెన్స్ హోల్డర్ డీప్ ఫిషింగ్ లైసెన్స్ను పొందడం చాలా కష్టం. దానికి యోగ్యత సాధించాలంటే అనుభవం, అర్హత ఉండాలి. దానిని పొందడం మగవారికే సొంతం. కాని దేశంలో మొదటిసారి ఆ లైసెన్స్ను పొందిన ఏకైక మహిళ రేఖ. ‘సముద్రంలో నేను 50 కిలోమీటర్లు వెళ్లి చేపలు పట్టేదాన్ని’ అంటుంది రేఖ. ఇంటర్ వరకూ చదువుకున్న రేఖ 2016లో త్రిచూర్ నుంచి దేశంలో తొలి మహిళగా డీప్ ఫిషింగ్ లైసెన్స్ పొందినప్పుడు మీడియాలో చాలా కవరేజీ వచ్చింది. ఒక స్త్రీ చేపల వేటకు వెళ్లడం విశేషం అని అందరూ మెచ్చుకున్నారు. ‘పడవలో నా భర్త చేపల వేటకు వెళ్లే ప్రతిసారీ సహాయకులు వస్తారా రారా అని టెన్షన్ పడేవాడు. సముద్రంలో చేపల వేటలో... చేపలు పట్టడానికి పడవలో కనీసం ముగ్గురు ఉండాలి. నిజానికి వాళ్లకు కూలి ఇచ్చే స్థితి కూడా కాదు మాది. ఈ టెన్షన్ అంతా ఎందుకు.. నేను వస్తాను కదా అని తోడు బయలుదేరేదాన్ని. అలా భార్యను తీసుకుని వేటకు వెళ్లడానికి మగవాళ్లు ఇష్టపడరు. కాని నా భర్త సమ్మతించాడు. తోడు తీసుకుని వెళ్లి వేట చేయడం నేర్పాడు. నేను బాగా నేర్చుకున్నాను. నాకు సముద్రంలో ప్రతి అల ఆనుపానులు తెలుసు.’ అంటుంది రేఖ. కేరళలో చాలామంది స్త్రీలు బ్యాక్వాటర్స్లో చేపలు పడతారు. కాని సముద్రం మీదకు వెళ్లరు. ఇంకా చెప్పాలంటే సముద్రం మీదకు వెళ్లేందుకు వారిని ఎవరూ ప్రోత్సహించరు. రేఖ ఆ ధైర్యం చేయడం వారికి పెద్ద స్ఫూర్తిగా మారింది. ‘మా దగ్గర సాంకేతిక పరికరాలు, ఆధునిక జాకెట్లు ఏమీ ఉండవు. మాకు తెలిసిందల్లా సముద్ర దేవత కడలమ్మే. ఆమె మమ్మల్ని చూసుకుంటుంది’ అంటుంది రేఖ. కుటుంబ సభ్యులతో... ‘సముద్రంలో వేటకు వెళ్లాలంటే వలను నిర్వహించడం తెలియాలి. చాలాసార్లు చేపలు పడకపోగా వలల్ని సముద్రపు పందులు (స్కాటోప్లేన్స్) కొరికేస్తాయి. నిరాశ పడక ఆ వలను రిపేరు చేసుకొని మళ్లీ వెళ్లాలి. సముద్రంలో వేట చావు–బతుకు, ఆశ నిరాశల మధ్య సాగుతుంది’ అంటుంది రేఖ. సెకండ్ వేవ్ సవాలు రేఖ జీవితం సజావుగా సాగుతుండేది. భర్త కార్తికేయన్తో వేటకు వెళ్లేది. ‘రాత్రంతా వేట చేసి తిరిగి వచ్చి పడ్డ చేపలను హార్బర్కు తీసుకెళ్లి అమ్మితే రోజుకు ఎంత లేదన్నా రెండు మూడు వేలు వచ్చేవి’ అంటుంది రేఖ. అయితే ఇలా రోజూ చేపలు పడలేదు. అయినా సగటున ముప్పయి వేల ఆదాయం అయితే వచ్చేది. రేఖకు నలుగురు ఆడపిల్లలు. సముద్ర తీరంలోనే ఆమెకో కచ్చా ఇల్లు ఉంది. పిల్లలను చదివించుకుంటూ జీవితం లాక్కువస్తుంటే హటాత్తుగా భర్త గుండెజబ్బు బయటపడింది. దానికి సర్జరీ అవసరం అని డాక్టర్లు అన్నారు. ఈలోపు సెకండ్ వేవ్ వచ్చి ఆ సర్జరీ కాస్త పోస్ట్పోన్ అయ్యింది. భర్త వేటకు వచ్చేలా లేడు. లాక్డౌన్ వల్ల సరుకు లావాదేవీలు స్తంభించి వేట సాగడం లేదు. తుఫాన్లు, భారీ వానలు కూడా పనికి అంతరాయం. ఏం చేయాలి? ఇల్లైతే గడవాలి. ‘సముద్రాన్నే నమ్ముకున్నాను. ధైర్యంగా ఉన్నాను’ అంటుంది రేఖ. తీరంలో దొరికే సాధారణ అయిస్టర్ షెల్స్ను కాల్షియం ముడిసరుకుగా కొంటారు. ఆ సముద్రపు చిప్పల్ని ఏరి అమ్మే పనిలోకి దిగింది రేఖ. ఒకోసారి రెండు మూడు డబ్బాలు దొరుకుతాయి. ఒక్కోసారి దొరకవు. కాని ధైర్యంగా జీవితం గడుపుతోందామె. కొత్త సముద్రం ‘సముద్రం కూడా రంగు మార్చుకుంటుంది. పాత చేపలు వెళ్లి కొత్త చేపలు వస్తాయి. ఈ కష్టాలు కూడా పోతాయి. మళ్లీ మాకు మంచి జీవితం వస్తుంది’ అంటుంది రేఖ. ఆమె దగ్గర ఇప్పుడున్నదల్లా ఒక పాత పడవ. ఆ పడవతో సముద్రంలో వెళ్లాలంటే భర్త కోలుకోవాలి. ‘కొట్టాయం ఆస్పత్రిలో డాక్టర్లు డేట్ ఇచ్చారు. పోస్ట్పోన్ అయ్యింది కరోనా వల్ల’ అందామె. చాలామంది కష్టాలు వస్తే ‘ఏ సముద్రంలో దూకి చావను’ అంటుంటారు. రేఖ సముద్రం దగ్గరే ఉంది. సముద్రంతోనే ఉంది. కాని ఆమె సముద్రంలో దూకి చావదల్చుకోవడం లేదు. సముద్రాన్నే ఆధారం చేసుకుని అనుక్షణం బతకాలనిపిస్తోంది. ‘కెరటం ఆదర్శం నాకు. పడినందుకు కాదు. పడినా లేచినందుకు’ అన్న కవి వాక్కు రేఖ జీవితాన్ని ఒక సజీవ వ్యాఖ్యానంలా ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
ట్యూనా.. ట్యూన్ అవ్వాల్సిందే!
సాక్షి, అమరావతి: కాకినాడ జాలరి పేటకు చెందిన శివయ్య 61 రోజుల విరామం తర్వాత గంగమ్మ తల్లికి పూజ చేసి మంగళవారం చేపల వేటకు బయలుదేరాడు. ఏ వైపు వెళితే చేపలు దొరుకుతాయా అని సందిగ్ధంలో పడ్డాడు. ఒక్కసారి వేటకు వెళితే ఏడెనిమిది రోజుల పని. ఓ మర పడవ, 3 వేల లీటర్ల డీజిల్, వంటావార్పు, ఆరేడుగురు మనుషులు.. ఇదో వ్యవస్థ. ఇంతా చేసి చేపలు దొరక్కపోతే అదో అవస్థ. ఇప్పటివరకు మత్స్యకారులందరిదీ ఇదే పరిస్థితి. ఇలాంటి సందిగ్ధాలకు ఇక తెరపడనుంది. ఇందుకోసం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ నడుం కట్టింది. ఇందుకోసం ఫిషర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్ (ఎఫ్ఎఫ్ఎంఏ)ను తీసుకొచ్చింది. క్వాల్కం సంస్థ ఆర్థిక సహకారం, ఇన్కాయిస్ సంస్థ సాంకేతిక సహకారంతో ఈ యాప్ రూపుదిద్దుకుంది. ఇంగ్లిష్ తోపాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, ఒడియా, బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లో ఉంటుంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్యూనాను ఇట్టే పసిగట్టేస్తుంది ఈ యాప్తో చేపలు ప్రత్యేకించి ట్యూనా జాతి చేపల సమాచారాన్ని ఇట్టే పసిగట్టేయొచ్చు. మత్స్యకారులు బయలుదేరిన ప్రాంతం నుంచి ఏ వైపు వెళితే చేపలు దొరుకుతాయో సూచిస్తుంది. రోజూ సాయంత్రం 6 గంటల సమయానికి.. ఆ మరుసటి రోజు వరకు ఎక్కడ చేపలు దొరుకుతాయో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతం, ఏయే రకం చేపలు ఎంత లోతులో దొరుకుతాయో సూచించడంతోపాటు అక్షాంశ, రేఖాంశాల వారీ సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ యాప్లో ఉండే జీపీఎస్ ఆప్షన్ ద్వారా మత్స్యకారులున్న ప్రాంతానికి ఎంత దూరంలో చేపలున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా సందేహం వస్తే మత్స్యకారులు యాప్లోని ఫీడ్ బ్యాక్ పేజీ నుంచి ఇన్కాయిస్కు సమాచారం పంపిస్తే మరింత సమాచారాన్ని ఇస్తుంది. తామున్న ప్రాంతం నుంచి వంద కిలోమీటర్లలోపు సముద్రంలో నీటి ప్రవాహం, వేగం, అలల ఎత్తును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మత్స్యకారులకు ఎంతో ఉపయోగం ఈ యాప్ మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందని, దీన్ని రూపొందించడానికి తమ సంస్థ సాంకేతిక నిపుణులు అహోరాత్రులు కష్టపడ్డారని డాక్టర్ స్వామినాథన్ ఫౌండేషన్ కన్వీనర్ డాక్టర్ వీరభద్రం తెలిపారు. ఇప్పటికే సుమారు 50 వేలమంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టు సమాచారం ఉందన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ఇందులో పొందుపరుస్తూ అప్డేట్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 3 రోజుల ముందస్తు సమాచారం సముద్రంలో వేటకు వెళ్లవచ్చో లేదో తెలియజేసే సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. 3 రోజుల ముందస్తు సమాచారాన్ని అంకెల రూపంలో, 7 రోజుల సమాచారాన్ని గ్రాఫ్ రూపంలో ఎఫ్ఎఫ్ఎంఏ అందిస్తుంది. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారులు తమ భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యల్ని వివరిస్తుంది. ఏదైనా విపత్తు ఏర్పడినప్పుడు ఎటువంటి రక్షణ సామగ్రి వాడాలో తెలుపుతుంది. సముద్ర జీవుల వల్ల కలిగే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానిక భాషల్లో తెలుసుకోవచ్చు. మత్స్యకారుల వద్ద జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) పరికరం లేకున్నా ఎఫ్ఎఫ్ఎంఏలోని జీపీఎస్ ఆప్షన్ ద్వారా రేవుల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించవచ్చు. తాము ఏవైపు వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. ఇందులో ఉండే కంపాస్ నుంచి కూడా జీపీఎస్ సాయంతో వేటకు అనువైన ప్రాంతాలను ఎంచుకోవచ్చు. చేపలు దొరికే ప్రాంతాల సమాచారాన్ని తెలుసుకోవడానికి జీపీఎస్ ఎంతో ఉపయోగపడుతుంది. మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల సమాచారాన్ని, అధికారుల ఫోన్నంబర్ల వివరాలు కూడా ఈ యాప్లో ఉన్నాయి. -
Yaas Cyclone: తుపానా ? సునామీనా ?
సునామీని మించిన బీభత్సం సృష్టిస్తోంది బంగళాఖాతం. యాస్ తుపాను దాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు, హోరున వినిపిస్తున శబ్ధాలు 2004 నాటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. పౌర్ణమి , చంద్ర గ్రహణం ఏర్పడిన రోజే యాస్ తుపాను తీరానికి చేరువగా రావడంతో రాకాసి అలలు తీరాన్ని ముంచెత్తాయి. సముద్రానికి, తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల మధ్య సరిహద్దులు చెరిపేశాయి.తీరం దాటేప్పుడు ప్రళయాకారంగా మారిన సముద్రం వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. తుపాను తీరం దాటుతున్నప్పుడు సముద్రం ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ వీడియోలో చూడండి చదవండి: yaas cyclone ప్రచండ గాలులు yaas cyclone తుపాను బీభత్సం #YaasCyclone video. pic.twitter.com/Jcta8Bh3KN — Mr Logician #Maskup 🇮🇳 (@MrLogician_) May 26, 2021 -
తుపానుకు తోడైన పౌర్ణమి పోటు
భద్రక్: యాస్ తుపాను ఒడిషాలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ఎఫెక్ట్కి పౌర్ణమి పోటు తోడవటంతో ఊరికి, సముద్రానికి మధ్యన ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. నిన్నటి వరకు సముద్ర తీరంలో ఉన్న ఊరు కాస్త ఈరోజు సముద్రంలో భాగమైంది. ఒడిషాలోని భద్రక్ జిల్లాలోని ధర్మ గ్రామంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. సునామీ తరహాలో అతి తీవ్ర తుపానుగా మారిన యాస్ ఒడిషా, బెంగాల్ తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తోంది. తుపాను తీరం దాటే ముందు పెను గాలులు, భారీ వర్షాలు సహజమే. కానీ ఈసారి తుపాను తీరం దాటే సమయంలో పౌర్ణమి కూడా రావడంతో సముద్రం పోటు అసాధరణంగా ఉంది. బంగళాఖాతంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు పది మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. ఇక భద్రక్ జిల్లాలో ధర్మా గ్రామ సమీపంలో అయితే సముద్రం మరింగా ఉప్పొంగింది. సునామీ తరహాలో గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టింది. ఈ గ్రామాన్ని తనలో కలిపేసుకుంది. #WATCH | Odisha: Water from the sea floods the residential areas in Dhamra of Bhadrak district. The landfall process of #CycloneYaas is continuing. It will take around 3 hours to complete. It is 30 km south-southeast of Balasore at 9:30 am, as per IMD's update. pic.twitter.com/j6JMo2f3sa — ANI (@ANI) May 26, 2021 -
ఆ నౌక నేను నడపలేదు.. నాపై నిందలు వేస్తున్నారు!
పిడుగు ఆకాశంలోంచి ఊడిపడుతుంది. బడబాగ్ని నిప్పుకణంలోంచి జ్వలిస్తుంది. ప్రకంపన పుడమి నుంచి ఉద్భవిస్తుంది. సుడిగుండం సముద్రంలో జనిస్తుంది. కానీ.. మహిళపై నింద ఎక్కడి నుంచి ఊడి పడి, ఎలా జ్వలించి, ప్రకంపించి, సుడిగుండమై ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందో చెప్పలేం. ప్రస్తుతం మర్వా ఎల్సెల్హదార్ అనే నేవీ కెప్టెన్ అలాంటి ఒక నింద నుంచి బయటపడే ప్రయత్నంలోనే ఉంది. మర్వా ఎల్సెల్హదార్ ఈజిప్టు నేవీలోని మెరైన్ విభాగంలో తొలి మహిళా కెప్టెన్. 29 ఏళ్ల యువతి. ఐదేళ్ల క్రితమే ఆమె నేవీలో చేరింది. ఇటీవల అక్కడి ‘అరబ్ న్యూస్’లో ఆమె గురించి పెద్ద కథనం వచ్చింది. తెల్ల యూనిఫామ్లో ఉన్న మర్వా చక్కటి ఫొటో ఒకటి పెట్టి ఈజిప్టు మెరైన్లో తొలి కెప్టెన్గా ఆమె సక్సెస్ స్టోరీ రాసింది ఆ పత్రిక. మెరైన్లో చేరిన ఐదేళ్ల తర్వాత ఆమెపై ఈ తాజా స్టోరీ రాయడానికి ‘అరబ్ న్యూస్’ చెప్పిన కారణం ఆలోచింపజేసే విధంగా ఉంది. ‘ఒక మహిళా మెరైన్ కెప్టెన్ అవడం గొప్పే. అంతకన్నా గొప్ప.. ఆ మహిళ మెరైన్ కెప్టెన్గా కొనసాగడం!’ అనే వాక్యంతో ఆ వార్తా కథనం ముగిసింది. నిజమే. మర్వా మెరైన్లో చేరిన తొలిరోజు నుంచీ ప్రతికూల పరిస్థితులను నెగ్గుకుంటూ వస్తోంది. 2015 వరకు ఈజిప్టు నేవీ మెరైన్లో మహిళా కెప్టెన్ ఒక్కరూ లేరు. పూర్తిగా పురుష ప్రపంచం అది. ఆ ప్రపంచంలోకి ధైర్యం చేసి వెళ్లింది మర్వా. అరబ్ న్యూస్లో మొన్న మార్చి 22న వచ్చిన ఆమె సక్సెస్ స్టోరీ కొన్ని గంటల్లోనే ట్విట్టర్లో, ఫేస్బుక్లో అనేకసార్లు షేర్ అయింది. అయితే రెండు రోజుల తర్వాత అదే ఫొటోతో ఇంటర్నెట్లో ఆమెను నిందిస్తూ ఒక వార్త వైరల్ అయింది! ఆ వార్త మర్వా చేతిలోని ఫోన్ వరకు చేరింది. మధ్యలోని ఆ కొద్ది గంటల్లోనే ఏం జరిగింది? సూయజ్ కెనాన్లో మార్చి 23న ‘ఎవర్ గివెన్’ అనే నౌక ‘బ్లాక్’ అయింది. కాలువకు రెండు వైపులా వాహనాల రవాణా స్తంభించిపోయింది. ఆరు రోజులు కష్టపడి నౌకను మళ్లీ దారిలో పెట్టగలిగారు. అయితే ఈ రెండు వారాల్లో తనపై వైరల్ అవుతూ వచ్చిన నిందను ‘క్లియర్’ చేసుకోడానికి నానా అవస్థలు పడుతోంది మర్వా. ఇక ఆమెపై పడిన నింద ఏమిటంటే.. ఎవర్ గివెన్ను ఆమే నడుపుతున్నారని, ఆమె సరిగా నడపలేకపోవడం వల్లనే ఆ నౌక.. కెనాల్లో అడ్డం తిరిగి, ప్రపంచ వాణిజ్య రంగానికి లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టిందనీ! ఇది మామూలు నింద కాదు. ఒక దేశం మాత్రమే తట్టుకోగల నింద. వ్యక్తులు భరించలేరు. తన గురించి అలాంటి అబద్ధపు వార్త ఒకటి వైరల్ అవుతున్నట్లు తెలియగానే మర్వా మొదట ఖిన్నురాలైంది. ఏమిటి ఆ నౌకకు, తనకు సంబంధం! తను నేవీలో కెప్టెనే తప్ప, సరకులను చేరవేర్చే ఓడకు కెప్టెన్ కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారు! ఆలోచించిన కొద్దీ మర్వా మళ్లీ మళ్లీ నివ్వెరపోతోంది. పురుషాధిక్య ప్రపంచంలో ఇలాంటి నివ్వెరపాట్లు ప్రతి మహిళకూ అనుభవంలోనికి వచ్చేవేనని ఆమెకు తెలియంది కాదు. ఒక మహిళపై వచ్చిన నిందను నమ్మేవారు నమ్ముతారు. కానీ, పుట్టించేవాళ్లు ఎలా పుట్టిస్తారు?! ‘‘నాకొకటి అనిపిస్తోంది. అలవాటు లేని రంగంలోనైనా అరుదైన విజయం సాధించిన మహిళలకు ఇలాంటివి తప్పవు. నాకూ అలాగే జరిగి ఉండొచ్చు’’ అంటోంది మర్వా. సముద్రంపై ఒక మహిళ ఉద్యోగం చేస్తోందంటే ఆమెను వీలైనంత త్వరగా ‘ఒడ్డుకు చేర్చేందుకు’ అక్కడి ప్రతికూలతలు అనుక్షణం అలల్లా నెట్టేస్తుంటాయి. ‘ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్’ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే సముద్ర ఉద్యోగాలు చేస్తున్నారు. మర్వాకు సముద్రం అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని చూసి ఆమె సోదరుడు ఆమె పేరును ఎ.ఎ.ఎస్.టి.ఎం.టి. (అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్)లో నమోదు చేయించాడు. అరబ్ లీగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాంతీయ విశ్వవిద్యాలయం అది. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యా నగరంలో ఉంది. అయితే పురుష అభ్యర్థులకే ఆ యూనివర్సిటీలో ప్రవేశం. మహిళలెందుకు చేరకూడదు అని మర్వా న్యాయపోరాటం చేసింది. ఆ పోరాటంతో స్త్రీలకూ తొలిసారి నేవీ మెరైన్లో ప్రవేశం లభించింది. పట్టు పట్టి చేరాక, నిలదొక్కుకోడానికి మర్వాకు మళ్లీ ఒక పోరాటం చేయడం అవసరమైంది! అదొక పురుష ప్రపంచం. అంతా తనకన్నా వయసులో పెద్దవాళ్లు. మహిళవు, నీకెందుకు ఇవన్నీ అన్నట్లే ఉండేది వారి చూపు, మాట. ట్రైనింగ్ పూర్తయ్యే సరికి మర్వాకు సప్త సముద్రాలలో మనకలేసి వచ్చినంత పనైంది. ‘‘నా మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకునేందుకు నేను చాలా కష్టపడవలసి వచ్చేది’’ అని మర్వా ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేసింది. కోర్సులో పట్టభద్రురాలయ్యాక మర్వా ఫస్ట్ మేట్ (ఫస్ట్ ఆఫీసర్) ర్యాంకుకు చేరుకుంది. ‘ఐదా 4’ శిక్షణ నౌకకు కెప్టెన్ అయింది! సూయజ్ కాలువను 2015లో ఆధునీకరించాక అందులో ప్రయాణించిన తొలి నౌక ‘ఐదా’ నే. అప్పుడే మర్వా.. సూయజ్ కెనాల్పై అతి చిన్న వయసులో నౌకను నడిపిన ఈజిప్టు మహిళగా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపును దెబ్బతీసేలా ఇప్పుడు ఏ మూల నుంచో ఆమెపై నింద వచ్చి పడింది! ‘ఎవర్ గివెన్’ నౌకను నడిపి, కెనాల్ బ్లాక్ అవడానికి కారణం అయిందని!! అయితే అది నిలబడే నింద కాదని, సోషల్ మీడియా వికృత కల్పననేని వెనువెంటనే తేలిపోయింది. ఇటీవల సూయజ్ కెనాల్లో ఇరుక్కుపోయిన ‘ఎవర్’ నౌక; (కాలువలో అడ్డుగా, విడిగా) ఎవర్ గివెన్ నౌక ఆ రోజు సూయజ కెనాల్లో బ్లాక్ అయిన సమయానికి మర్వా అక్కడికి కొన్ని వందల మైళ్ల దూరంలోని అలెగ్జాండ్రియాలో ఐదా 4 నౌకలో ఫస్ట్ మేట్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈజిప్టు సముద్ర భద్రతా సంస్థకు చెందినా ఐదా ఆ రోజు ఎర్ర సముద్రంలోని లైట్ హౌస్కు అవసరమైన సామగ్రిని తీసుకువెళుతోంది. అందులో కెప్టెన్గా ఉన్న మర్వా ఫొటోను ఎవర్ గివెన్కు కెప్టెన్గా ఉన్నట్లుగా మార్పులు చేసి నెట్లో కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ఈజిప్టు నేవీనే స్వయంగా ఖడించడంతో మర్వా కాస్త ఊపిరి పీల్చుకుంది. సోషల్ మీడియాలో కూడా అధిక శాతం మర్వాకు మద్దతుగా నిలబడ్డారు. అయినా మర్వా గురించి ఈజిప్టు నేవీలో గానీ, ఈజిప్టులో గానీ తెలియనివారు లేరు. ధైర్యంగల అమ్మాయి. 2017 మహిళా దినోత్సవం సందర్భంగా నాటి అధ్యక్షుడు అబెల్ ఫతా ఆమెను సత్కరించారు కూడా. వచ్చే నెలలో మర్వా కెప్టెన్ ర్యాంకుకు చివరి పరీక్ష పూర్తవుతుంది. అప్పుడామె రాబోయే యవతరానికి శిక్షణ నిచ్చే కెప్టెన్ కూడా అవుతారు. ‘‘మనం ఒక ఉద్యోగాన్ని ఇష్టపడి చేస్తున్నప్పుడు మన మీద వచ్చే విమర్శలు మన పై, మన పనిపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపలేవు’’ అంటోంది మర్వా. l -
ఒడ్డుకు కొట్టుకువచ్చిన భారీ తిమింగలం
భువనేశ్వర్ : 'సముద్రం ఒడ్డుకు గాయాలపాలైన ఓ భారీ తిమింగళం కొట్టుకు వచ్చిన ఘటన ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని గోపాలపూర్ తీరానికి ఆనుకుని ఉన్న సోన్పూర్ తీరానికి గురువారం 18 అడుగుల తిమింగలం కొట్టుకువచ్చింది. శుక్రవారం ఉదయం అటువైపుగా వెళ్లిన కొంతమంది మత్స్యకారులు గాయాలతో పడి ఉన్న ఆ తిమింగలాన్ని చూసి అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గాయాలపాలైన తిమింగలానికి చికిత్స చేశారు. అనంతరం దానిని సముద్రంలోకి సురక్షితంగా విడిచిపెట్టారు. -
14 గంటలు యముడితో పోరాడాడు!
అది పసిఫిక్ మహాసముద్రం. ఆ మహాసముద్రంలో మధ్యలో ఒంటిరిగా ఓ వ్యక్తి. తన ప్రాణాలు రక్షించుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డాడు. నీటిలో ఈదుతూ 14 గంటలు యముడితో పోరాడాడు. తుదకు తానే గెలిచాడు. తన కుటుంబంలో ఆనందం నింపాడు. ఈ సంఘటన ఎలా జరిగిందంటే.. సిల్వర్ సపోర్టర్ అనే ఓడలో విడామ్ పెరివెటిలోవ్ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న ఆ ఓడ న్యూజిలాండ్లోని టౌరంగా పోర్టు నుంచి పిట్కెయిర్న్ దీవులకు సరుకులతో బయలుదేరింది. ఇంజిన్ రూంలో నైట్ డ్యూటీ విధులు ముగించుకున్న 52 ఏళ్ల విడామ్.. తెల్లవారుజామున తన కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ ఓడ డెక్ పైకి వచ్చాడు. నిద్రవస్తోందని కూడా కుమారుడికి చెప్పాడు. నిద్ర మత్తులో ఉన్న విడామ్ ఆ తర్వాత కొద్ది సేపటికే ఓడపై నుంచి సముద్రంలో పడిపోయాడు. ఇది గమనించని ఓడ సిబ్బంది ముందుకు వెళ్లిపోయారు. నీటిలో పడ్డ విడామ్ పైకి వచ్చి చూసే సరికి ఓడ దూరంగా వెళ్లిపోయింది. ఫిషింగ్ బెలూన్ ఆసరా.. లైఫ్ జాకెట్ లేదు. ఎటు చూసినా నీళ్లు. ఎటు ఈదాలో తెలియదు. నడి సంద్రంలో విడామ్ పరిస్థితి కడు దీనంగా తయారైంది. దూరంగా ఏదో నల్లగా కనబడితే ఆదేదో దీవి అనుకుని అటు ఈదడం మొదలు పెట్టాడు. చాలా సేపు ఈదిన తర్వాత దానికి దగ్గరా వచ్చాడు. అప్పడు తెలిసింది అది దీవి కాదు. చేపల వేటకు ఉపయోగించే రబ్బరు బెలూన్ అని. దాన్నే ఆసరా చేసుకున్నాడు. దాన్ని అంటిపెట్టుకుని తాను మునిగిపోకుండా చూసుకున్నాడు. తాను ఎలాగైనా బతకాలని అనుకుని ఆ బెలూన్తోనే పాటే కొంత సేపు తేలుతూ.. కొంత సేపు ఈదుతూ ఉండిపోయాడు. ఆరు గంటల తర్వాత.. విడామ్ ఓడలో లేని విషయాన్ని ఉదయం పది గంటల తర్వాత సిబ్బంది గుర్తించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకూ విడామ్ షిప్లోనే ఉన్నట్లు నిర్దారించుకున్న సిబ్బంది.. ఎక్కడ పడిపోయి ఉంటాడో అనే అంచనా వేశారు. 400 నాటికల్ మైళ్ల దూరంలో అతను ఉండి ఉండవచ్చని నిర్దారణకు వచ్చారు. వెంటనే ఓడను వెనక్కు తిప్పారు. ఇంతలో సమీపంలోని ఆస్ట్రల్ దీవుల్లో ఉన్న ఫ్రెంచ్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా విమానంలో వెతుకులాటకు బయలుదేరారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో తాము అనుకున్న ప్రాంతానికి షిప్ చేరింది. అప్పటికే సముద్రంలో విడామ్ అలసిపోయాడు. దూరం నుంచి ఓడ కనబడటంతో నీరసించి ఉన్నా.. చేతిని పైకి ఎత్తి పిలిచాడు. దానిని గుర్తించిన ఓడ సిబ్బంది.. విడామ్ వద్దకు చేరుకుని ఓడ పైకి అతన్ని తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేశారు. సుమారు 14 గంటల పోరాటం తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. అతని విల్ పవర్ చూసి ఓడ సిబ్బంది ఆశ్చర్యపోయారు. విడామ్కు జేజేలు పలికారు. నౌక సిబ్బందిని విడామ్ ఓ కోరిక కోరాడు. అదేంటంటే, ఆ బెలూన్ను సముద్రంలోనే వదిలేయమని.. ఎందుకంటే అది మరొకరి జీవితాన్ని రక్షిస్తుందనే ఉద్దేశంతో. ► సముద్రంలో ప్రమాదానికి గురైన తర్వాత ఎక్కువ రోజుల బ్రతికున్న వ్యక్తిగా జపాన్కు చెందిన కెప్టెన్ ఓగురి జుకుచి రికార్డు సాధించారు. 1813లో జపాన్ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరిన ఆయన ఓడ మధ్యలో మునిగిపోయింది. వాటి శకలాలపైనే ఆయన, మరో నావికుడు ఓటోకిచి 484 రోజులు బతికి ఉన్నారు. ► ఎల్సాల్విడార్కు చెందిన అల్వెరెంగా 2012 నవంబర్లో సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదం బారిన పడింది. 2014 జనవరి వరకు అతను బతికుండి మార్షల్ ఐలాండ్ తీరానికి చేరుకున్నాడు. ► ఆరోగ్యవంతమైన మనిషి మంచి నీళ్లు తాగకుండా 3 నుంచి 4 రోజులు బతికుండే అవకాశం ఉంది. 5 డిగ్రీలు కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే నీటిలో మనిషి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం బతకడం కష్టం. -
టైటాన్ సముద్రం లోతు ఎంతో తెలుసా?
శని గ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో టైటాన్ ఉపగ్రహానికి పలు ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా దీనిపై వాతావరణం భూమి తొలినాళ్ల వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. భవిష్యత్లో జీవ ఆవిర్భావానికి ఈ గ్రహంపై అనుకూలతలు ఎక్కువని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు. జీవావిర్భివానికి సంబంధించిన అవకాశాల గురించి టైటాన్పై అతిపెద్ద సముద్రం క్రాకెన్ మారెపై సైంటిస్టులు పరిశోధన జరుపుతున్నారు. తాజాగా ఈ పరిశోధనల్లో ఈ సముద్ర కేంద్రం వద్ద వెయ్యి అడుగుల లోతు ఉంటుందని తేలింది. ఇంతవరకు దీని లోతు 300 అడుగులేనని భావించారు. దీంతో సముద్రం లోపలకి రోబోటిక్ సబ్మెరైన్ పంపి ప్రయోగాలు చేయవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. టైటాన్ ఉత్తర ధృవం వద్ద ఉన్న ఈ సముద్ర విస్తీర్ణం దాదాపు 1.54 లక్షల చదరపు మైళ్లు. భూమిపై ఉన్న కాస్పియన్ సముద్రం కన్నా ఇది పెద్దది. ఇందులో ద్రవరూపం లో ఉండే ఈథేన్, మీథేన్ ఇతర హైడ్రోకార్బన్లున్నాయి. ఇవన్నీ జీవి పుట్టుకకు మూలపదార్ధాలుగా ఉపయోగపడేవి కావడం గమనార్హం. తాజా పరిశోధనతో సముద్రం లోతు తెలిసిందని, టైటాన్పై భూమి తొలినాళ్లలో ఉన్న వాతావరణం ఉందని సీసీఏపీఎస్ సంస్థ తెలిపింది. 1997లో నాసా పంపిన కసిని స్పేస్ ప్రోబ్ టైటాన్పై ఈ సముద్రాన్ని గుర్తించింది. 2008లో ఈ సముద్రానికి క్రాకెన్ మారె అని పేరుపెట్టారు. ఈ సముద్రం మధ్యలో మైడా ఇన్సులా అనే ద్వీపం కూడా ఉంది. ఈ సముద్రం లోతు తెలియడంతో ఈ దఫా పరిశోధనల్లో సముద్ర అంతర్భాగంలో తిరిగే విధంగా ఒక జలాంతర్గామిని పంపేందుకు సైంటిస్టులు యోచిస్తున్నారు. -
సముద్ర ప్రాంతాల సర్వేకు రోబోటు
సాక్షి, హైదరాబాద్: దేశానికి సంబంధించిన వేలాది కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని సులువుగా సర్వే చేసేందుకు సరికొత్త రోబో బోటును ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దేశ సముద్ర సంబంధ రంగంలో స్వావలంబన సాధించే దిశగా రూపొందించిన ఈ రోబో బోటు పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. సముద్ర ప్రాంతాలతోపాటు నదీజలాల్లోనూ స్వతంత్రంగా సర్వే చేయడం, గస్తీ కాసేందుకూ దీన్ని ఉపయోగించవచ్చు. ధ్వనికి సంబంధించిన ఎకో సౌండర్, జీపీఎస్, బ్రాడ్బ్యాండ్ వంటి ఐటీ హంగులను, లిడార్, 360 డిగ్రీ కెమెరా కొలతలకు సంబంధించిన ఇతర పరికరాలు ఇందులో ఉంటాయి. ఈ రోబో బోటును ఇప్పటికే చెన్నై సమీపంలోని కామరాజర్ నౌకాశ్రయంలో పరీక్షించామని, కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంలో మరిన్ని కఠిన పరీక్షలకు గురిచేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్, వాటర్వేస్ అండ్ కోస్ట్స్ ఇన్చార్జి ప్రొఫెసర్ కె. మురళి తెలిపారు. లోతు తక్కువ సముద్ర జలాల్లోనూ ఇది కచ్చితమైన కొలతలు ఇవ్వగలదని, నౌకాశ్రయం సామర్థ్యం పెంచేందుకు పలు విధాలుగా ఉపయో గపడుతుందని ఆయన వివరించారు. పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఎంత సేపైనా ఉపయోగించుకోవచ్చని, అడ్డంకులను దానంతట అదే తప్పించుకొని పనులు నిర్వహించగలదని తెలిపారు. వచ్చే ఏడాది ఈ బోటు కార్యకలాపాలు సాగించగలదని అంచనా వేస్తున్నారు. -
సముద్రంలో మునిగిపోతున్న పక్షిని కాపాడి..
న్యూఢిల్లీ: సముద్రంలో మునిగిపోకుండా చిన్న పక్షిని ఓ వ్యక్తి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంగ్లాండ్కు చెందిన సైమన్ బీఆర్ఎఫ్సీ హాప్కిన్స్ అనే సంస్థ తన ట్విటర్ పేజీలో ‘ప్రపంచానికి ఇంకా ఇలాంటి వ్యక్తులు కావాలి’ అనే క్యాప్షన్కు రెండ్ హార్ట్ ఎమోజీని జత చేసి ట్వీట్ చేసింది. సముద్రం మధ్యలో నీటిపై కొట్టుకుంటున్న ఆ పక్షిని కాపాడటమే కాకుండా దానికి ఆహారం పెట్టిన అతడిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 5 వేలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: ఊహల్లోనే ఇవి సాధ్యం.. కానీ చేసి చూపించారు) ‘ఇది నన్ను ఎంతో ఆకట్టుకుంది’, ‘అందమై వ్యక్తి, పక్షి’, ‘అవును.. ప్రపంచానికి ఇలాంటి వ్యక్తులు అవసరం’ అంటూ నెటిజన్ కామెంట్స్ పెడుతున్నారు. 58 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బోటులో సుముద్ర పర్యటనకు వెళ్లిన వ్యక్తి సాగరం మధ్యలో ఆ పక్షి నీటిపై కొట్టుకోవడం గమనించాడు. వెంటనే ఆ వ్యక్తి పక్షిని తన చేతుల్లోకి తీసుకుని పడవలో దించాడు. నీటి తేమ లేకుండా ఆరబెట్టి, దానికి ఆహారం పెట్టాడు. ఆ తర్వాత నీటిని తాగించి ఆ పక్షితో కాసేపు సరదాగా ఆడుకున్నాడు. ఇక ఒడ్డు దగ్గరికి చేరుకోగానే ఆ పక్షిని ఆకాశంలోకి వదిలాడు. (చదవండి: అనుకోని అతిథి.. ఎక్కడివారక్కడే గప్చుప్) -
నడిసంద్రంలో బిక్కుబిక్కుమంటూ..
చీరాల టౌన్ : నడిసంద్రం.. ఇంజిన్ పాడైపోయిన బోటు.. కనుచూపు మేరలో మరో బోటు లేదు.. అంతలో పెనుగాలులు, ఎడతెరపి లేని వాన.. దిక్కుతోచని స్థితితో ఆ ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలపై ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో వారిని తెరచాపే తీరానికి చేర్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు శుక్రవారం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవుకు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీన కాకినాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పేర్ల రాంబాబు, మైలిపల్లి సింగరాజు, గుంటి దుర్గ, గరికిన యల్లాజీ, గుంటి పోలయ్య, పేర్ల తాతారావు, కారె సింహాద్రిలు తమ బోటుతో కొత్తపాలెంలోని ఆయిల్ రిగ్ వద్ద లంగరు వేసి వేటాడుతున్నారు. ( మహోగ్ర వేణి ) ఈ నెల 10న వాయుగుండం కారణంగా గాలివాన ఎక్కువవడంతో వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ఇంజిన్ పనిచేయలేదు. ఆ సమయంలో బోటుకు ఉన్న తెరచాప సాయంతో ప్రయాణాన్ని మొదలెట్టారు. తిండి గింజలు అయిపోవడంతో రెండ్రోజులు మంచినీళ్లు మాత్రమే తాగారు. ఆ దశలో వారిని నిజాంపట్నం–బాపట్ల తీర ప్రాంతంలోని మత్స్యకారులు గుర్తించి మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి వారిని చీరాల వాడరేవు ఒడ్డుకు చేర్చారు. -
అలల కల్లోలం: ఉప్పొంగుతున్న కడలి
సఖినేటిపల్లి: ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఘడియలకు అంతర్వేది వద్ద తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడే అలలు తీర ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలలుగా పౌర్ణమి, అమావాస్య ఘడియల్లో పోటెత్తుతున్న ఉప్పునీరు, ప్రస్తుత అల్పపీడన ప్రభావానికి అమావాస్య తోడవడంతో సముద్రుడు మరింత ఉగ్రుడవుతున్నాడు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. శుక్రవారం సముద్ర కెరటాలు తీరాన్ని దాటుకుని సుమారు 500 మీటర్ల మేర అంతర్వేదికర కొత్త వంతెనకు సమీపంలో రోడ్డును దాటి సరుగుడు తోటల్లోకి చేరాయి. సాగరసంగమానికి సమీపాన ఉన్న పల్లిపాలెంలో ఇళ్ల వద్దకు కూడా ఉప్పునీరు పోటెత్తింది. అంతర్వేదికర గ్రామంలో ఉప్పునీరు పోటెత్తిన ప్రాంతాలను, పల్లిపాలెంలో ముంపునకు గురైన నివాస గృహాలను తహసీల్దార్ రామ కుమారి పరిశీలించారు. ముంపు నీటి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఆమె వెంట ఆర్ఐ బి.మనోజ్, వీఆర్వో బొల్లాప్రగడ సీతారామం, గ్రామస్తులు ఉన్నారు. పర్ర ప్రాంతానికి పోటెత్తిన ఉప్పునీరు ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానాం సముద్ర తీరంలో శుక్రవారం ఉదయం సముద్రపు అలలు బీచ్ రోడ్డు పల్లపు ప్రాంతంలోకి భారీగా చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బీచ్రోడ్డు వద్ద కట్టు కాలువ వంతెన సమీపంలో ఎస్.యానాంలోని రవ్వ చమురు సంస్థ ఆన్షోర్, ఆఫ్షోర్లకు పైపులైన్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో పల్లంగా ఉండటం వల్ల అక్కడే సముద్రపు అలలు ఎగసి పడి నీరు కట్టు కాలువను దాటుకుని పర్ర ప్రాంతానికి ఎగబాకాయి. దీంతో పైప్లైన్ ఉన్న ప్రాంతంలో గాడిలా ఏర్పడి కాలువలా తయారయ్యింది. ఒక దశలో పైపులైన్ లీకయ్యిందంటూ వదంతులు వ్యాపించడంతో రవ్వ అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రపు అలలు వస్తున్న ప్రాంతాన్ని రవ్వ యాజమాన్య సిబ్బంది పరిశీలించి, సముద్రపు పోటు అధికంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్యాహ్న సమయం వరకూ సముద్రపు నీరు భారీగా పర్రలోకి చేరడంతో డ్రెయిన్ల ద్వారా ఉప్పనీరు పంట పొలాలకు చేరుతోందని స్థానికులు, రైతులు ఆందోళన చెందారు. తహసీల్దారు కె.పద్మావతి, ఆర్ఐ ఎన్.ప్రసూన, వీఆర్ఓ రాములు బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అమావాస్య, అల్పపీడన ప్రభావంతో ఆటు పోట్లకు సముద్రం అల్లకల్లోలంగా మారిందని తేల్చారు. అంతర్వేదికరలో కొత్తవంతెన వద్ద రోడ్డును దాటుకుని సరుగుడు తోటల్లోకి చొచ్చుకు వస్తున్న ఉప్పునీరు నేలకొరిగిన భారీ వృక్షాలు.. కోతకు గురైన తీరం.. అల్లవరం: ఓడలరేవు తీరం వద్ద రక్షణగా ఉన్న కరకట్టలను, సరుగుడు తోటలను దాటుకుంటూ సముద్ర అలలు పల్లపు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వృక్షాలు సైతం కెరటాల తాకిడికి నేలకొరిగాయి. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన అలల తాకిడి శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. దీని ప్రభావంతో తీరం కోతకు గురైంది. తీరానికి ఆనుకుని ఉన్న ఆక్వా చెరువులు సముద్రపు నీటితో నిండిపోయాయి. ఓడలరేవు ఆ‹ఫ్షోర్ టెరి్మనల్ ప్రహరీ, ఓడలరేవు తీరానికి పర్యాటకంగా పేరు తెచ్చిపెట్టిన సముద్ర రిసార్ట్సు గోడలను కెరటాలు తాకాయి. అమావాస్య ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చిందని, దీని ప్రభావం మరో మూడు, నాలుగు రోజులు ఉంటుందని అధికారులు అంటున్నారు. -
నలుగురు మత్స్యకారుల గల్లంతు
సాక్షి, కాకినాడ: బతుకుతెరువు కోసం బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో చోటుచేసుకుంది. ఈ నెల 11న ఉప్పాడ శివారు అమీనాబాద్కు చెందిన నలుగురు మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా భైరవపాలెం వద్ద బోటు ఇంజన్ పాడైనట్లు తమ వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆ తర్వాత నుంచి ఫోన్ పనిచేయలేదు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కలెక్టర్ను కోరారు. కలెక్టర్ ఆదేశాలతో ఇండియన్ కోస్టు గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. -
150 నదుల జలాలతో అయోధ్యకు..
న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలో భవ్య రామాలయం ఈ సోదరుల కల. అది నెరవేరుతుందనే విశ్వాసం నిలువెల్లా నింపుకుని దేశంతోపాటు శ్రీలంకలోని సముద్ర, నదీ జలాలతో పాటు పవిత్ర ప్రదేశాల్లో మట్టిని వీరు సేకరిస్తూ వచ్చారు. ఈ క్రతువును ప్రారంభించిన రాధేశ్యామ్ పాండే, శబ్ద్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫల అనే ఈ అన్నదమ్ముల వయస్సు 70ఏళ్లుపైనే. ఇప్పటివరకు 150కిపైగా నదుల జలాలను సేకరించి, భద్రపరిచారు. చివరికి వారి కల నిజమైంది. మందిర నిర్మాణం ఖాయమైం ది. తాము సేకరించిన జలాలను, మట్టిని తీసుకుని ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. ‘శ్రీరాముని కృపతో మా కల ఫలించింది. 151 నదులు, 8 మహానదులు, 3 సముద్రాల నీటితోపాటు శ్రీలంకలోని 16 పవిత్ర ప్రదేశాల మట్టిని సేకరించాము. వీటి కోసం 1968 నుంచి 2019 వరకు కాలినడకన, సైకిల్, బైక్, రైలు, విమాన ప్రయాణాలు చేశాము. వీటిని ఆ రాముడికి అర్పించుకుంటాం’అని వారు తెలిపారు. మందిరంతో సోదరభావం, సామరస్యం మందిరం ఉద్యమం కారణంగా రాజకీయంగా, సామాజికంగా ఏర్పడిన అంతరం, మందిరం నిర్మాణంతో సమసిపోతుందని ఆలయ ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. ‘అయోధ్యలో భూమిపూజ రామరాజ్యానికి పునాది కానుంది. శ్రీరాముని జీవితం సోదరభావం, సామరస్యాలతో ముడిపడి ఉంది. ఆలయ నిర్మాణంతో ఇవే విలువలు∙సమాజంలో పెంపొందుతాయి’అన్నారు. అయో«ధ్యలో ఆలయ పరిసరాలను శానిటైజ్ చేస్తున్న సిబ్బంది -
ఈ చేపలను తింటే ప్రాణాలు పోతాయ్
చెన్నై : రామనాథపురం జిల్లా సేతుకరై సముద్రతీరంలో అరుదైన విషపూరిత తేలు చేపలు వెలుగులోకి వచ్చాయి. మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో ఈ అరుదైన సముద్ర జలచరాలు జీవిస్తున్నాయి. ప్రపంచంలో వేరెక్కడా లేని విధంగా చేపలు, సముద్రపు పశువులు సహా నాలుగువేలకు పైగా అరుదైన జలచరాలు జీవిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా ప్రకటించి పర్యవేక్షణ జరుపుతున్నారు. ఇలా ఉండగా కేంద్ర మత్స్యశాఖ పరిశోధన సీనియర్ సైంటిస్టు జయభాస్కరన్ ఆధ్వర్యంలో పరిశోధక బృందం మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో సోమవారం పరిశీలనలు జరపగా తిరుపుల్లాని సమీపంలోని సేతుకరై సముద్ర ప్రాంతంలో మృతి చెందిన స్థితిలో తేలు చేపలు కనిపించాయి. వీటిని పరిశోధనల నిమిత్తం వెలికి తీశారు. ఇవి తరచుగా రంగులు మార్చే చేపలుగా జయభాస్కరన్ పేర్కొన్నారు. ఇవి మనిషిని కుడితే లేదా ఈ చేపలను ఆరగిస్తే శరీరంలో విషం వ్యాపించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నట్లు తెలిపారు. చదవండి : హెయిర్కట్కు ఆధార్ తప్పనిసరి! -
‘అంఫన్’ ఎఫెక్ట్; ముందుకొచ్చిన సముద్రం
సాక్షి, విశాఖపట్నం: సూపర్ సైక్లోన్ తీవ్రత తగ్గి పెనుతుపానుగా ‘అంఫన్’ మారినట్టు వాతావరణ కేంద్రం మంగళవారం సాయంత్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశాను ఆనుకుని.. పశ్చిమ బెంగాల్వైపు పెనుతుపాను పయనిస్తున్నట్టు వెల్లడించింది. పారాదీప్కు దక్షిణంగా 360 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు దక్షిణ నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో పెనుతుపాను కేంద్రీకృతం అయినట్టు పేర్కొంది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం దిఘా(పశ్చిమ బెంగాల్)-హతియా దీవుల(బంగ్లాదేశ్) మధ్య సుందర్బన్స్కు సమీపంలో పెనుతుపాను తీరం దాటనుంది. తీరందాటే సమయంలో గంటకు 155-185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. దీంతో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముంది. తీరంవెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అన్ని ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. (భయంకరమైన తుపాను దూసుకొస్తోంది!) అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అవంతి అంఫన్ పెనుతుపాను ప్రభావంతో విశాఖ జిల్లా మంగమారిపేటలో తీరం వెంబడి సముద్రపు అలలు ముందుకు వచ్చాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ మంగళవారం మంగమారిపేట గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తీరం దాటే సమయంలో తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వలలు, బోట్లను తీరానికి దూరంగా ఉంచాలని మత్స్యకారులకు సలహాయిచ్చారు. అంఫన్ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీర ప్రాంతంలో సముద్రం సుమారు 50 మీటర్లు ముందుకొచ్చింది. రాజోలు నియోజకవర్గం అంతటా ఈదురుగాలులు వీస్తున్నాయి. మంత్రి ధర్మాన సమీక్ష అంఫన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ మంగళవారం శ్రీకాకుళంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున విపత్తుల నిర్వహణ శాఖ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెట్లు కూలితే వెంటనే తొలగించడానికి రంపాలు సిద్దం చేయాలని సూచించారు. నదుల్లోకి వచ్చే వరద ప్రవాహంపై పొరుగునున్న ఒడిశా అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ లైన్లలకు తీవ్ర నష్టం వాటిల్లే సూచనలు ఉన్నందున అవసరమైన సామాగ్రి అందుబాటులో సిద్దం చేయాలన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు అంఫన్ తుపాను ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈదురుగాలులుతో కూడిన వర్షం పడింది. ఒడిస్సా పూరీ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ఉధృతికి జగన్నాథస్వామి దేవాలయ శిఖరంపై ఉన్న భారీ పతాకం ధ్వంసమయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా నగరాల్లో వర్షాలు పడుతున్నాయి. అంఫన్ పెనుతుపాను ప్రభావం ఎక్కువగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. (అంఫన్ బీభత్సం మామూలుగా ఉండదు!) -
కడలిని కప్పేస్తున్న ప్లాస్టిక్ భూతం
సాక్షి, అమరావతి: సముద్రం ప్లాస్టిక్ యార్డుగా మారింది. ప్రపంచంలో నివాసముంటున్న ప్రజల బరువుతో సమానంగా ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి అవుతుండగా.. ఏటా 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) అధ్యయనంలో తేలింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. 2050 నాటికి సముద్రంలో జలచరాల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల్ని తిని చేపలు, తాబేళ్లు వంటి జలచరాలు అంచనాలకు అందని రీతిలో చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమని.. ఇది రుతు పవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది. అధ్యయనంలో తేలింది ఏమిటంటే.. ► ఏటా వివిధ రూపాల్లో 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషుల బరువుతో సమానం. ► ఇందులో ఏటా 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల ద్వారానే 70 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి. ► ప్లాస్టిక్ వ్యర్థాల్లో 90 శాతం వ్యర్థాలు ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచే వస్తుండటం గమనార్హం. ► సముద్రంలో నాచు (ఫైటో ప్లాంక్టన్)ను చేపలు, తాబేళ్లు ఎక్కువగా తింటాయి. ఈ నాచు డై మిథైల్ సల్ఫైడ్ అనే వాయువును విడుదల చేసింది. ఆ వాసన ఆధారంగానే నాచును పసిగట్టి చేపలు, తాబేళ్లు తింటాయి. ► ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరాక నాచు లాంటి వాయువునే విడుదల చేస్తుండటం వల్ల.. చేపలు, తాబేళ్లు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని జీర్ణ క్రియ వ్యవస్థ దెబ్బతినడంతో మృత్యువాత పడుతున్నాయి. ► ఇలా అంచనాకు అందనంత భారీ స్థాయిలో జలచరాలు మరణించడంతో మత్స్య సంపద విపరీతంగా తగ్గిపోతోంది. ఫలితంగా చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. ► ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి రుతు పవనాల గమనం తీవ్రంగా దెబ్బతింటోంది. అనావృష్టి పరిస్థితులకు ఇదే కారణమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రంలో జలచరాల పరిమాణం కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. -
ఉప్పాడ గుండె‘కోత’కు అడ్డుకట్ట!
తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ గ్రామం 342.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. గత వందేళ్లలో దాదాపు 320 ఎకరాల భూమి కోతకు గురై సముద్రంలో కలిసిపోయింది. అలాగే 410 ఎకరాల్లో పంట భూములు, సరుగుడు తోటలు ఉండేవి. ఇందులో 320 ఎకరాలను బంగాళాఖాతం మింగేసింది. ఉప్పాడ సమీపంలోని కోనపాపపేట గ్రామంలో గత పదేళ్లలో దాదాపు 20 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. 150 ఇళ్లు కోతకు గురయ్యాయి. తుపాను వచ్చినప్పుడల్లా ఈ గ్రామం కోతకు గురవుతోంది. 8వ ఏషియన్ అండ్ పసిఫిక్ కోస్ట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లెక్కల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో 1990–2000 మధ్యకాలంలో 57.92 చదరపు కిలోమీటర్లు, 2000–2006 మధ్యకాలంలో 102.88 చదరపు కిలోమీటర్లు, 2006–2012 మధ్యకాలంలో 77.58 చదరపు కిలోమీటర్ల మేర తీరప్రాంతం కోతకు గురైంది. కాకినాడ నుంచి తుని వరకూ తీర ప్రాంతాన్ని కలుపుతూ 1978లో నిర్మించిన బీచ్ రోడ్డు ఇప్పటిదాకా 28 సార్లు సముద్రపు కోతకు గురైంది. నాలుగుసార్లు రోడ్డు మొత్తం కొట్టుకుపోగా, దాని పక్కనే కొత్త రోడ్డు నిర్మిస్తూ వస్తున్నారు. తుపాన్లకు ఛిద్రమవుతున్న బీచ్ రోడ్డు రక్షణ, మరమ్మతులకు ఆర్అండ్బీ శాఖ రూ.1,500 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు అంచనా. సాక్షి, తూర్పుగోదావరి: బంగాళాఖాతంలో తుపానులు వచ్చాయంటే చాలు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సమీపంలోని పల్లెలు వణికిపోతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర కెరటాలు తీరంపై విరుచుకుపడుతుంటాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ కోత వల్ల ఇప్పటివరకూ వందల ఎకరాల భూములు సముద్ర గర్భంలో కరిగిపోయాయి. వేలాది ఇళ్లు, ఆస్తులు కడలి కెరటాల్లో కలిసిపోయాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు ప్రారంభించారు. సముద్రపు కోత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల కేంద్ర బృందం కాకినాడ ప్రాంతాన్ని పరిశీలించింది. ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణానికి రూ.320 కోట్ల విడుదలకు సీఎం ఇప్పటికే ఆమోదం తెలిపారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వెల్లడించారు. అలాగే రూ.3 కోట్లతో జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.350 కోట్లతో తీర రక్షణ చర్యలు చేపట్టడానికి సన్నద్ధమవుతోంది. ఉప్పాడ సమీపంలో మినీ హార్బర్ నిర్మాణానికి నిర్దేశించిన స్థలం హోప్ ఐలాండే కారణం! ఉప్పాడ తీరానికి సముద్రపు కోత వల్ల ముప్పు ఉందని 1950లోనే అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదని ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. కోత తీవ్రతను 1971లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినా తదుపరి చర్యలపై దృష్టి పెట్టలేదు. గోదావరి నది నుంచి భారీగా ఇసుక కొట్టుకురావడంతో కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ కారణంగానే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు చెప్పారు. అలల తాకిడితో హోప్ ఐలాండ్లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు మట్టి కోతకు గురవుతోందని తేల్చారు. నివారణకు ప్రతిపాదనలు కోతకు గురవుతున్న ప్రాంతంలో ఇసుక వేయాలని అప్పట్లో బీచ్ ఎరోజన్ బోర్డు సూచించింది. ఏటా 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తెచ్చి తీరంలో నింపాలని సిఫారసు చేసింది. తద్వారా అలల తాకిడికి ఇసుక కోతకు గురవుతూ, తిరిగి అదే ఇసుక మేటలు వేస్తుందని పేర్కొంది. అయితే, ఏటా ఇసుక తరలింపునకు అధికంగా ఖర్చవుతుందని ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. సీ వాల్స్ (రక్షణ గోడ) నిర్మించాలని 1975 ఫిబ్రవరి 12న జరిగిన సమావేశంలో మరో ప్రతిపాదన చేశారు. ఈ మేరకు 1982లో రూ.31.86 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిని రాష్ట్ర వరద నివారణ బోర్డుకు చెందిన సాంకేతిక సంఘం పరిశీలించి 1982 జూలై 22న ఆమోదించింది. తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం సముద్రపు కోతపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (ఎన్సీఎస్సీఎం) డైరెక్టర్ డాక్టర్ రమేష్ రామచంద్రన్, శాస్త్రవేత్తలు పి.రామచంద్రన్, ఆర్ఎస్ రాబిన్, బి.సుబ్బారెడ్డి, ఎడ్విన్ రాజన్ తదితరులు ఇటీవల కోనపాపపేట, ఉప్పాడ తీర ప్రాంతాలను సందర్శించారు. ఉప్పాడలో సూరాడపేట, సుబ్బంపేట తదితర ప్రాంతాల్లో జియోట్యూబ్ రక్షణ గోడ సైతం కోతకు గురై, శిథిలం కావడాన్ని పరిశీలించారు. సముద్ర కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం (ఫైల్) వైఎస్సార్ హయాంలో రూ.12 కోట్లతో రక్షణ గోడ 1,000 మీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మాణ వ్యయం 1994–95 నాటికి రూ.1.25 కోట్లకు చేరింది. మరో ఏడాదిలోనే రూ.2.25 కోట్లకు పెరిగింది. 2008 నాటికి రూ.12 కోట్లకు చేరుకుంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఉప్పాడలో సముద్రపు కోత నివారణకు రూ.12 కోట్లతో జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ నిర్మించారు. పదేళ్ల క్రితం నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడ నిర్వహణను తరువాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఇది శిథిలమై కోత మళ్లీ ప్రారంభమైంది. ఉప్పాడ వద్ద నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడ సముద్రపు కెరటాల ఉధృతిని అడ్డుకోవడంతో కోత ప్రభావం ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనపాపపేట గ్రామంపై పడింది. నూతన టెక్నాలజీతో కెరటాల ఉధృతికి బ్రేకులు ‘‘సముద్రపు కోతను నివారించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. జియో ట్యూబ్ టెక్నాలజీ అనేది శాశ్వత పరిష్కారం కాదు. కొత్త టెక్నాలజీ ద్వారా సముద్రపు కెరటాలను ఒడ్డుకు చేరేలోపే నిర్వీర్యం చేయొచ్చు. వాటి ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చు. తీరప్రాంతం కోతకు గురి కాకుండా ఉంటుంది. కొత్త టెక్నాలజీని ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు’’ – డాక్టర్ రమేష్ రామచంద్రన్, డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ -
సునామీ అంటే...
సముద్రంలో ఒక విస్ఫోటం జరిగితే ఏమవుతుంది? అంతెత్తు నుంచి ఒక పర్వత శిఖరం సముద్రంలోకి ఒరిగిపోతే ఏం జరుగుతుంది? సముద్ర తీర ప్రాంతంలో ఉండే అగ్ని పర్వతాలు హఠాత్తుగా బద్దలైతే ఫలితమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. అదే సునామీ. సముద్రపు అలలు నోరు తెరుచుకున్న రాకాసిలా విరుచుకుపడి ఊళ్లకు ఊళ్లను ముంచేయడాన్ని సునామీ అంటారు. 2004లో తొలిసారిగా భారత్ సునామీని కళ్ల చూసింది. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కూడా ప్రభావం పడింది. ఇండోనేసియా సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం తీవ్రతకి సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు ఎగిసిపడి క్షణాల్లో మనుషుల్ని మింగేశాయి. సునామీల చుట్టూ నెలకొని ఉన్న వాస్తవాలేంటో ఓ సారి చూద్దాం. ►సునామీ నాలుగు రకాలుగా ముంచుకొస్తుంది. సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు, కొండచరియలు సముద్రంలో విరిగిపడినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, ఉల్కాపాతం సంభవించినప్పుడు (ఇది అత్యంత అరుదు) సునామీలు ఏర్పడతాయి. ►సునామీ అన్న పదం జపనీస్ భాషకు చెందింది. హార్బర్ కెరటం అని దీని అర్థం. ►సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. ►పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. ►సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్తో ఇది సమానం. ►ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోరి్నయాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. ►2004లో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ చరిత్రలోనే అత్యంత భయంకరమైంది. ఇండోనేసియా కేంద్రంగా సుమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం. ఈ భూకంపంతో సముద్రంలో నింగికెగిసిన మృత్యు కెరటాలు తీర ప్రాంతంలో ఉన్న 11 దేశాలను ముంచేశాయి. 2 లక్షల 83 వేల మందిని రాకాసి అలలు పొట్టన పెట్టుకున్నాయి. -
సముద్రంలో బోటుపై పిడుగు
సాక్షి, పెదవాల్తేరు (విశాఖ తూర్పు): సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుపై పిడుగు పడింది. దీంతో ఒక మత్స్యకారుడు గల్లంతు కాగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖలోని పెదజాలారిపేటకు చెందిన అరిసిల్లి పోలిరాజు (19), పిల్లా సతీష్ (24), పిల్లా జగ్గారావు (25), వాడమొదుల లక్ష్మణ (30), తెడ్డు వెంకన్న (40), పిల్లా పరశురాం (20) ఆరుగురు మత్స్యకారులు గురువారం ఫైబర్ బోటుపై చేపల వేటకు వెళ్లారు. విశాఖ తూర్పు దిశగా 20 కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి వర్షం పడింది. ఈ క్రమంలో బోటుపై పిడుగు పడడంతో పోలిరాజు సముద్రంలోకి పడిపోయాడు. మిగిలిన మత్స్యకారులు గాయపడ్డారు. మధ్యాహ్నం వీరు సురక్షితంగా ఒడ్డుకి చేరుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన సతీష్ను ఏఎన్ బీచ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఒక్కసారిగా మంటలు రావడంతో తమకు కళ్లు బైర్లు కమ్మి అసలు ఏం జరిగిందో తెలియలేదని ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు ‘సాక్షి’కి తెలిపారు. గాయపడిన సతీష్ను మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీచ్రోడ్డులోని ఏఎన్ బీచ్ ఆస్పత్రిలో చేర్పించారు. సతీష్కు భార్య పి.రాణి, దీక్షిత (4), అలేఖ్య (1) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెదజాలారిపేటలో ఎదురుచూస్తున్న మత్స్యకార మహిళలు పెదజాలారిపేటలో విషాదం ఈ దుర్ఘటనతో పెదజాలారిపేటలో విషాదం నెలకొంది. పోలిరాజు తల్లి నూకరత్నం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఆమె భర్త తాతాలు 16 సంవత్సరాల క్రితం చనిపోగా, ఇద్దరు కుమారులలో ఒకడైన పోలిరాజు గల్లంతవడంతో ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. స్థానిక మత్స్యకార మహిళలు ఆమెను ఓదార్చుతున్నారు. మరోవైపు పోలిరాజు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పరామర్శించారు. ఆర్థికసాయం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు సతీశ్ -
సైబీరియాలో ‘మండుతున్న’ సముద్రం
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు సైబీరియా సముద్రం వేడితో ఉడుకుతోందని, సముద్రం ఉపరితలంపై బుడగలు వస్తున్నాయని స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ సహకారంతో ఆ సముద్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు 80 శాస్త్రవేత్తల బృందం అక్కడికి వెళ్లింది. సముద్రం అట్టడుగు నుంచి విడుదలవుతున్న మితిమీరిన మిథేన్ గ్యాస్ సముద్రం ఉపరితలంపై బుడగలుగా పేరుకుంటోందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. మంచుతో కప్పబడిన ప్రాంతంలో కూడా తవ్వితో మిథేన్ గ్యాస్ వెలువడుతోంది. అంతటి మంచులోనూ మిథేన్ గ్యాస్ తగులబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఉన్న సరాసరి మిథేన్ గ్యాస్కన్నా సైబీరియాలో ఆరేడింతలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతికి గురైనట్లు ‘న్యూస్వీక్ రిపోర్ట్’ వెల్లడించింది. ‘ఇదొక మిథేన్ గ్యాస్ ఫౌంటేన్. ఇంతటి ఈ గ్యాస్ నా జీవితంలో నేను ఎక్కడా చూడలేదు’ అని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న ‘టామ్స్క్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ’ ప్రొఫెసర్ ఇగార్ సెమిలేటర్ వ్యాఖ్యానించారు. మిథేన్ గ్యాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతం వాతావరణం వేడిగా ఉంది. సముద్రం ఉపరితలంపై పేరుకున్న మిథేన్ బుడగలు నిప్పు తగిలితే మండుతాయని లేదా వాటంతట అవే పేలిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మిథేన్ గ్యాస్ 20 శాతం పెరగడం వల్ల ప్రపంచ వాతావరణంలో ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుందట. కార్బన్ డై ఆక్సైడ్ కంటే మిథేన్ గ్యాస్ వల్ల వాతావరణం 23 శాతం ఎక్కువ వేడెక్కుతుందట. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడానికి మనషులు ఎలా కారణం అవుతున్నారో, ఈ మిథేన్ గ్యాస్ పెరగడానికి కూడా వారే కారణం అవుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చమురు కోసం జరుపుతున్న తవ్వకాల వల్ల మిథేన్ ఎక్కువగా వాతావరణంలోకి విడుదలవుతోందని వారు తెలిపారు. ప్రపంచ భూవాతావరణంలో మిథేన్ గ్యాస్ నిల్వలు ఇంతకుముందు శాస్త్రవేత్తలు అంచనావేసిన దానికన్నా 25 శాతం ఎక్కువగా ఉంటుందని సైబీరియా సముద్ర తలాన్ని అధ్యయనం చేసిన అనంతరం శాస్త్రవేత్తలు చెప్పారు. -
వలలో పడ్డ 23 కోట్లు.. వదిలేశాడు!
ఐర్లాండ్లోని వెస్ట్కార్క్కు చెం దిన డేవ్ ఎడ్వర్డ్స్కు సముద్రంలో ఒక భారీ ట్యూనా చేప చిక్కింది. దాని విలువ అక్షరాలా మూడు మిలియన్ల యూరోలు. మన కరెన్సీలో చెప్పా లంటే దాదాపు రూ. 23 కోట్లు. అయితే, డేవ్ అమ్మడానికి ఎప్పుడూ చేపలు పట్టలేదు. అట్లాంటిక్ సముద్రంలో చేపలపై అధ్యయనం కూడా ఆయన సరదాలో భాగమే. ఇదే కోవలో ఆయన చేపలు పడు తుండగా ఈ ఎనిమిదన్నర అడుగుల భారీ చేప చిక్కింది. ట్యూనా చేపకు ఉన్న డిమాండ్ దృష్ట్యా 270 కేజీలు ఉన్న మత్స్యరాజం విలువ 23 కోట్ల రూపాయల పైమాటే. అయితే ఈ విషయాన్ని ఆయన ఫేస్బుక్ ద్వారా షేర్ చేసిన అనంతరం ట్యూనాను తిరిగి సముద్రంలోకి వదిలేశానని తెలిపారు. -
కరిగినా కాపాడేస్తాం!
అడవులు అంతరిస్తూంటే... కోట్లకు కోట్ల మొక్కలు నాటాలి. భూగర్భ జల వనరులు ఇంకిపోతూంటే.. ఇంకుడు గుంతలతో పునరుద్ధరించుకోవాలి. మరి.. ధ్రువాల్లో మంచు కరుగుతూంటే...? ఏం చేయాలో తెలియడం లేదు కదూ... దీనికీ ఓ ఐడియా ఉందంటున్నారు ఇండోనేసియా ఆర్కిటెక్ట్లు. అదేంటో చూసేయండి మరి! సముద్రపు అడుగుభాగంలోని నీటి ఉష్ణోగ్రత ఎంతో మీకు తెలుసా? ధ్రువ ప్రాంతాల్లోనైతే –2 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉన్నా.. అం దులోని లవణాల కారణంగా సముద్రపునీరు గడ్డకట్టదు. ఇండోనేసియా ఆర్కిటెక్ట్లు ప్రతిపాదిస్తున్న పథకం ప్రకారం.. మినీ మంచుముద్దల తయారీకి జలాంతర్గాములను వాడతారు. సముద్రపు అడుగు భాగంలో ఉన్న నీటిని నింపుకునే ఈ జలాంతర్గాములు ఉపరితలంపైకి వచ్చి... షట్భుజి ఆకారంలో ఉన్న నిర్మాణంలోకి వదులుతాయి. అదే సమయంలో ఆ నీటిలోని లవణాలను కూడా తొలగిస్తారు. చుట్టూ ఉన్న చల్లటి ఉష్ణోగ్రతలు, సబ్మెరైన్ టర్బయిన్ ఫ్యాన్ల గాలి కారణంగా నీరు గడ్డకడుతుంది. ఇందుకు సౌరశక్తి సాయమూ తీసుకుంటారు. ఒక్కోనిర్మాణం దాదాపు 82 అడుగుల వెడ ల్పు, 16 అడుగుల మందం ఉంటుందని, ఒకదాని నిర్మాణం పూర్తయిన తరువాత జలాంతర్గామి మళ్లీ సముద్రపు అడుగుభాగం నుంచి నీరు సేకరించి మరో మంచుముద్ద తయారీని ప్రారంభిస్తుందని వారు వివరిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ మంచుముద్దలను తయారు చేస్తే.. తెల్లటి ఉపరితలం కారణంగా సూర్యుడి నుంచి వచ్చే రేడియోథార్మికత మళ్లీ అంతరిక్షంవైపు వెళ్లిపోతుందని, తద్వారా భూతాపాన్ని నివారించవచ్చని ప్రాజెక్టు లీడర్ ఆర్కిటెక్ట్ ఫారిస్ రజాక్ తెలిపారు. షట్భుజి ఆకారంలో... పెట్రోలు, డీజిల్ విచ్చలవిడి వాడకం, అడవుల నరికివేత వంటి అనేక కారణాలతో భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనకు తెలుసు. ఈ భూతాపం కారణంగా ధ్రువప్రాంతాల్లో యుగాలనాటి మంచు కొండలు కూడా ముక్కలైపోతున్నాయి. ఈ విషయం గురించి కూడా మనం చాలాసార్లు వినే ఉంటాం. భవిష్యత్లో సముద్రమట్టాలు పెరిగిపోకుండా... భూతాపాన్ని మన జీవితాలను ఎక్కువ నష్టపరచకుండా ఎన్నోచర్యలు చేపడుతున్నాం కూడా. అయితే, వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చారు ఇండొనేసియా ఆర్కిటెక్ట్లు. జలాంతర్గాముల సాయంతో సముద్రపునీటిని మినీ మంచుఖండాలుగా మలచవచ్చని, తద్వారా ధ్రువ ప్రాంతాల్లో నష్టాన్ని కొంతమేర నివా రించవచ్చని వీరు ఇటీవలే ముగిసిన అసోసియేషన్ ఆఫ్ సియామీస్ ఆర్కిటెక్ట్స్ వార్షిక పోటీల్లో ప్రకటించారు. సాధ్యమేనా? ఇదంతా కాగితాలపై అద్భుతంగా అనిపిస్తున్నా ఆచరణకు వచ్చే సరికి అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంచు ముద్దల తయారీకి వాడే జలాంతర్గాములన్నీ ఏదో ఒక ఇంధనంతో నడవాలి కాబట్టి.. దాని ప్రభావం భూతాపోన్నతిపై ఉంటుందని వీరు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఏకకాలంలో భారీ సంఖ్యలో జలాంతర్గాములను తయారు చేసుకుని వాడటం కూడా అంత సులువైన పని కాదని చెబుతున్నారు. ఏదేమైనా రాగల ప్రమాదం నుంచి తమని తాము రక్షించుకునేందుకు ఈ ఆర్కిటెక్ట్లు తీసుకుంటున్న చొరవ మాత్రం స్ఫూర్తిదాయకమైనవని పలువురు శాస్త్రవేత్తలు కొనియాడారు. -
సంధి ముగిసె.. ఇక వేటకు వెడలవలె!
సాక్షి, ఒంగోలు : గంగమ్మ తల్లిని నమ్ముకున్న గంగపుత్రుల పరిస్థితి ముందు వేట.. వెనుక అప్పులు అన్నచందంగా మారింది. మరో 24 గంటల్లో మత్స్యకారులు వేటకు బయలుదేరే సమయం ఆసన్నమైంది. వేట నిషేధ సంధికాలం ముగియనుండటంతో మత్స్యకారులు వేటకు కావాల్సిన వలలు, పడవలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 60 రోజుల పాటు సముద్రంలో వేట లేక పూట గడవక నానా తంటాలు పడిన మత్స్యకారులు తిరిగి వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా సంధికాలం ఇచ్చే సాయాన్ని ప్రభుత్వం త్వరగా అందించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. సముద్రంలో వేటనిషేధ సమయంలో ప్రభుత్వం అందించే కరువుభత్యం సాయం గత టీడీపీ ప్రభుత్వం సరిగా అందించకపోవడంతో జాలర్లు నానా కష్టాలు పడ్డారు. అయితే గతనెల 30న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి తమకు అండగా నిలుస్తాడని మత్స్యకారులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. బాబు హయాంలో అరకొరగా సాయం.. సముద్రంలో మత్స్య సంపంద పునరుత్పత్తి సమయమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 60 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేట నిషేధాన్ని విధించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి ఏటా వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి జీవనభృతి కింద 31 కేజీల బియ్యాన్ని అందించేందుకు చట్టాన్ని రూపొందించింది. అయితే 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత మాజీ సీఎం చంద్రబాబు జీవన భృతి కింద ఒక్కో మత్స్యకారుడికి రూ.4వేలు అందిస్తానని హామీ ఇచ్చారు. సంధికాలం సాయం అరకొరగా అందించి చేతులు దులుపుకున్నారు. వేట నిషేధ కాలం శుక్రవారంతో పూర్తవుతున్నప్పటికి ధా సమయంలో అందించాల్సిన ప్రభుత్వ సాయం (జీవన భృతి) నేటికి ఒక్కరికి కూడా మత్య్సకారులకు అందలేదు. అయితే ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్య్సకారులకు జీవనభృతి కింద ఒకొక్కరికి రూ.10 వేలు సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో గంగపుత్రులు గండెడాశతో ఎదురు చూస్తున్నారు. ప జిల్లాలో 102 కిలో మీటర్ల మేర తీరం ఉండగా 74 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 80వేలకు పైగా మత్స్యకారులు ఉన్నారు. చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, విజయలక్ష్మీపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, రామాపురం, కఠారివారిపాలెం గ్రామాల్లో మత్య్సకారులే అధికం. వీరందరికి సముద్రంలో వేటే జీవన ఆధారం. ఈ గ్రామాల్లోని ప్రజలందరు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపల వేట, మత్య్స సంపద అమ్మకాలపైనే ఆదారపడి జీవిస్తున్నారు. గతేడాది నిషేధ సాయానికి మెలికలు పెట్టి కొందరికే తూతూ మంత్రంగా చంద్రబాబు సాయం అందించారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచి ఆ ఇబ్బందులు ఉండవని వేట నిషేధ సమయంలో ప్రభుత్వ అందించే సాయం సరైన సమయంలో వైఎస్ జగన్ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన యుద్ధనౌకల ఢీ
టోక్యో: తూర్పు చైనా సముద్రంలో అమెరికా, రష్యా యుద్ధనౌకలు శుక్రవారం ఢీకొట్టుకోబోయాయి. అయితే చివరి నిమిషంలో రెండునౌకల కెప్టెన్లు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయమై అమెరికాకు చెందిన 7వ ఫ్లీట్ స్పందిస్తూ..‘మా నౌక యూఎస్ఎస్ చాన్స్లర్విల్లే తూర్పుచైనా సముద్రంలో శుక్రవారం స్థిరంగా వెళుతోంది. ఈ క్రమంలో వెనుకే వస్తున్న రష్యన్ డెస్ట్రాయర్ యుద్ధనౌక ఒక్కసారిగా వేగం పెంచి 50 మీటర్ల సమీపానికి వచ్చేసింది. దీంతో యూఎస్ఎస్ ఛాన్స్లర్విల్లేలోని అన్ని ఇంజన్లను మండించి రెండు నౌకలు ఢీకొట్టకుండా చూడగలిగాం. రష్యా వ్యవహారశైలి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై రష్యా స్పందిస్తూ..‘మా అడ్మిరల్ వినొగ్రడోవ్ డెస్ట్రాయర్ నౌక వెళుతున్న మార్గానికి అడ్డంగా అమెరికా యుద్ధనౌక అకస్మాత్తుగా వచ్చేసింది. దీంతో మా నౌకను మరోదిశకు మళ్లించి రెండు యుద్ధనౌకలు ఢీకొట్టుకోకుండా నివారించగలిగాం. ఈ విషయంలో అమెరికాకు మా నౌకాదళం నిరసనను తెలియజేసింది’ అని చెప్పింది. -
పార్కుల్లో మందు‘పార్టీలు’
సాక్షి, పరవాడ: ఆహ్లాదాన్ని పంచే పార్కులు అసాంఘి క కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నా యి. తీర ప్రాంతాల్లోని పార్కుల్లో నిత్యం మందు‘పార్టీలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వచ్చే పర్యాటకులు, సందర్శకులు నానా అవస్థలు పడుతున్నారు. ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్కులు అధ్వానంగా తయారయ్యాయి. తీరంలో సేద దీరడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సీ వాటర్ పార్కు, మినీ పార్కుల దుస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇక్కడ పార్కులకు విశాఖ స్టీల్ ప్లాంటు, గాజువాక, అగనంపూడి, సబ్బవరం, అనకాపల్లి, పరవాడ, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల నుంచి ప్రతీ ఆదివారం, సెలవు దినాల్లో పర్యాటకులు నిత్యం అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. వేసవి సెలవుల్లో నిత్యం విద్యార్థులతో తీర ప్రాంతాలతో పాటు పార్కులు కళకళలాడుతుంటా యి. అయితే కొందరు ఆకతాయిల వల్ల ఇవి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే యువకులు పుట్టిన రోజు, పెళ్లి రోజు పేరుతో నిత్యం మందు పార్టీలు చేసుకుంటున్నారు. పర్యాటకానికి దెబ్బ... తాగిన మద్యం సీసాలు, ఆకులు, ప్లేట్లు, డ్రింకు బాటిళ్లు, సిగరెట్లు తదితర వస్తువులను ఎక్కడపడితే అక్కడే వదిలేస్తున్నారు. కొందరు ఆకతాయిలు ఖాళీ మద్యం సీసాలను చితక్కొట్టి విసేరేస్తున్నారు. చితికిన గాజు పెంకులు ఇసుకలో కూరుకుపోయి ఉంటున్నాయి. బీచ్లకు వస్తున్న పర్యాటకులు ఆట పాటలతో సరదాగా గడుపుతున్న సమయంలో ఇసుకలో ఉన్న గాజుపెంకులు కాళ్లకు గుచ్చుకొని తీవ్రంగా గాయపడుతున్న సంఘటనలు అనేకం. తిక్కవానిపాలెం తీరంలో ఎన్టీపీసీ జెట్టీ వద్ద ఏర్పాటు చేసిన సీ వాటర్ పార్కును ఆకతాయిలు పాల్పడుతున్న ఆసాంఘిక కార్యకలాపాల వల్ల పార్కు లోపటికి సందర్శకులను అనుమతించడం మానేశారు. ఇక్కడి మినీ పార్కును ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. పార్కులో నిర్మించిన గొడుగుల కింద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఆ తరువాత ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు, గాజు పెంకులు పడేస్తూ వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన చెత్తకుండీని కూడా ఉపయోగించడం లేదు. ఆదివారమైతే అధిక సంఖ్యలో యువకులు తరలివచ్చి ఇక్కడి సరుగుడు, జీడి మామిడి తోటల్లో జూదం ఆడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లను ఎత్తివేయడంతో ఆకతాయిలకు ఆగడాలకు అడ్డూ అదుపులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లో లొంగదు
ఒక మారుమూల సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఓడల మీద సముద్రాలను నాగరకులు గాలించారు. నాగరకులు సర్వ ప్రపంచము, సముద్రపు నీళ్లలో తేలిన ప్రతిమంటిగడ్డ తాము సాధించామని అనుకొన్న తరువాత ఆ ద్వీపం ఉన్నదని తెలుసుకునేందుకే కొన్ని వేల యేండ్లు పట్టినవి. తెలుసుకోవటమే ఆలస్యము. మతాలు, వర్తకులు, తుపాకులు అక్కడికి చేరినవి. ఒక నాగరకజాతి సేనానాయకుడు ఆ ద్వీపానికి సైనిక నియంత. అతడు బ్రహ్మచారి. అనగా అవివాహితుడన్నమాట. ఆ ద్వీపము శీతమండలాల్లో ఉండటం మూలంగా అక్కడి జనులు తెల్లనివాళ్లు. ఇతర ఖండములలోని అనాగరకులవంటివారు. అనగా కోట్ల కొలది సంవత్సరాలు బ్రతికిన జాతి అన్నమాట. చెట్టులో– పుట్టలో, సూర్యునిలో – చంద్రునిలో, మెరుపులో– మేఘములోనేదో దివ్యశక్తి యున్నదని దాని నారాధించినవాళ్లు. జీవుణ్ణి కాలిక్రిం బెట్టి త్రొక్కరు. బంగారము నాణెముగా వాడుకోరు. దానియందు తేజశ్శక్తి ఉన్నదని ఆరాధిస్తారు. కుండపెంకులలో వండుకొని తింటారు. లోహపాత్రలు నాగరకత అని యెరుగరు. శరీరావయవములు కావలసినంత మాత్రము కప్పుగొంటారు. ఈ యనాగరకులు నాగరకులయ్యే రోజులు వచ్చి ఆ ద్వీపం నాగరకుల కంట బడ్డది. సైనిక నియంత ఒక స్త్రీని చూచాడు. ఆమె అందం అతని కళ్లు పట్టరాకండా ఉండిపోయింది. ఆవిడ మొగుడికి కబురు పంపించాడు– నీ భార్యని నాకు తోలిపెట్టమని. ఆ జీవుడు యేమి చేస్తాడూ? ఇదివరకే తమ ద్వీపంలో జరిగిన ఘోరాలు తెలుసు. అయినా జీవుడు పెనగులాడటం స్వభావం. అది అన్యాయ మని, తన ప్రాణము పోయినా భార్యను వదిలిపెట్టనని కబురంపించాడు. నియంతకు కోపం వచ్చింది. పదిమంది సైనికులు, తుపాకులతో వాని యింటికి వెళ్లాడు. వీళ్లు వస్తారని తెలిసి పొయ్యిలో పెట్టుకొనే పొడుగాటి పుల్లలు తానొకటి, తన పెద్ద కొడుకొకటి చేతులతో పుచ్చుకొని, గుడిసె ముందర నిలుచున్నారు. వారి యాయుధాలను చూస్తే నియంతకు నవ్వు వచ్చింది. అతడు ‘‘ఎందుకు నవ్వుతావు’’ అని యడిగాడు. నియంత అన్నాడు: ‘‘ఓరి మూర్ఖుడా! మా తుపాకులముందు నీ కట్టెపుల్లలు నిలుస్తావా?’’. అతడన్నాడు కదా– ‘‘నా కట్టెపుల్లలు నీ తుపాకులకు సమాధానము చెపుతవని గాదు నే నీ కర్రలు పుచ్చుకొన్నది. నా మనస్సు నీ మనస్సుకు సమాధానం చెప్పవలెనని.’’ ఒక్క కత్తి విసరుతో తండ్రీకొడుకుల తలలు తెగిపోయినవి. నియంత గుడిసెలో ప్రవేశించి అతని భార్యను తీసుకు రాబోయినాడు. ఆరేండ్ల మొదలు చనుబాలు త్రాగే శిశువు వరకు నలుగురు పిల్లలు ఏడవ మొదలుపెట్టారు. ఆ స్త్రీ భర్త శవం, కొడుకు శవం మీదబడి యేడవటం మొదలుపెట్టింది. సైనికులు శవాలను సముద్రంలో పారవేశారు. ఆమె యింక పిల్లలను పట్టుకొని యేడవటం మొదలుపెట్టింది. సైనికులు నియంత ఆజ్ఞతో పెద్దపిల్లలను ముగ్గురినీ తల్లి చేతులలోంచి లాక్కుని పదిపదకొండు సార్లు విదిలించి వేయగా వేయగా వాళ్లు దెబ్బలు తగిలి, ఉస్సురని ప్రాణాలు కడవట్టి చనిపోయినారు. ఆ స్త్రీ పాలుత్రావు పిల్లతో నియంత యింటికి వెళ్లింది. ఈ కథ జరిగి అయిదేళ్లయింది. ఆ స్త్రీ ఆ పిల్లతో కాలం పుచ్చుతోంది. నియంత– ఆ పిల్లకూడ పోతేగానీ నీవు నాతో సరిగా ఉండవు. స్త్రీ– నీకన్న కర్కోటకుడవు నీవే! ఈ పసిపిల్ల ప్రాణములు కూడా తీస్తావా? నియంత– నిన్ను తీసుకువచ్చినప్పుడు ఇది పసిపిల్ల. ఇప్పుడు కాదే! దీని యీడు పిల్లలను అప్పుడు నీ దగ్గరనుండి లాగివేయలేదా? అట్లాగే యిప్పుడూను. ఆ స్త్రీకి అతనితో అయిదేండ్లున్న తరువాత అతని యేమాటకు ఎంత అర్థమో తెలిసినది. తన బిడ్డ తనకు మిగలదని తెలిసింది. పిల్లను చేతిలో పెట్టి ‘‘యిదిగో, చంపివేయి. ఈ పిల్ల ఉన్నన్నాళ్లు నేను దానిని వదిలిపెట్టలేను’’ అన్నది. అతడు ఆ పిల్లను నరికాడు. ఆమె యేడుస్తూ వెళ్లిపోయింది. ఆమె కొన్ని రాత్రులు ఉరి పోసుకుందామనుకుంది. పోసికోలేదు. సముద్రములో బడి చద్దామనుకుంది. చావలేదు. కిరసనాయిలు మీద పోసికొని నిప్పు ముట్టించుకుందా మనుకుంది. ముట్టించుకోలేదు. యెన్నో అనుకుంది. ఏమీ చేయలేదు. కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్ప త్రాగి మదించిన కళ్లతో ఆమె గదికి వచ్చాడు. నియంత– నీ మగడు, నీ పిల్లలు పోయి పదేళ్లయింది. స్త్రీ– నా ద్వీపపు స్వాతంత్య్రం పోయి పాతిక యేండ్లయింది. నియంత– ఇంకా యెన్నాళ్లీ దుఃఖం? స్త్రీ– ఈ శరీరం వున్నన్నాళ్లు. నియంత– నీకు ఏమి తక్కువగా ఉంది? పూర్వంకన్న మంచిదుస్తులు ధరిస్తున్నావు. మంచి భోజనం చేస్తున్నావు. నీ జాతికన్న నా జాతి గొప్పది. నీ భర్తకన్న నేను గొప్పవాడను. స్త్రీ– నా భర్తకన్న గొప్పవాడవు కావు. నియంత– కానా! స్త్రీ– భార్య పిల్లలను రక్షించుకునేందుకు కర్రపుచ్చుకొని నిలబడ్డాడు. రక్షించలేనని తెలుసు. అయినా తన ధర్మం తాను చేశాడు. తాను చచ్చిన తరువాతగాని నిన్ను నా దగ్గరకు రానీయలేదు. నేను నిజముగా నీ భార్యనై ఉంటే నీకన్న బలవంతుడు నాకోసం వస్తే, నీవు పారిపోయేవాడవు. నియంత– మరి యిటువంటివాడితో నీవు సంసార మెందుకు చేస్తున్నావు? స్త్రీ– నేను నీతో సంసారము చేయుట లేదు. నియంత– ఈ మాటలు వింటే యెవరైనా నిన్ను మూఢురాల వనుకొంటారు. స్త్రీ– నేను వాళ్లని మూఢులనుకొంటాను. నియంత– అయితే నీకు నాతో ఉండటం యిష్టం లేదన్నమాట. స్త్రీ– లేదని నీతో చెప్పుట యిది యెన్ని లక్షలో సారి. నియంత– నిన్ను చంపేస్తాను. స్త్రీ– పదియేళ్ల నుండి అల్లా చేస్తావేమోయని యెదురు చూస్తున్నాను. నియంత– నీకు చావంటే అంత యిష్టమా? స్త్రీ– అంతాయింత యిష్టమా! నియంత– ఎందుకు చావవు? సముద్రంలో పడి చావవచ్చు. ఉరి పోసికొని చావవచ్చు. స్త్రీ– నా కట్లా చావటం యిష్టం లేదు. నియంత– ఎట్లా చావటం యిష్టం? స్త్రీ– నీకు కోపము తెప్పించి నువ్వు నన్ను చంపితే చావాలని. నియంత– అంటే, నీకు నామీద ప్రేమ ఉన్నదన్నమాట. స్త్రీ– అవును, ఉంది. నా భర్త, నా పిల్లలు నీ చేతిమీదుగా చచ్చారు గనుక అల్లా నీ చేతిమీదుగానే చద్దామన్నంత ప్రేమ. నియంత– ఈ మాటల కేమిగాని నీకు చావటానికిష్టం లేదు. స్త్రీ– పొరపాటు. చావటాని కిష్టం ఉన్నది. ఆ యిష్టము కూడా ఒళ్లంతా తగలబెడుతూ ఉన్నంత యిష్టం. కాని చావు రెండు రకాలు. తనంతట తాను చచ్చే చావు. యెదటివాళ్లు చంపితే చచ్చేచావు. నాకు రెండవ చావే యిష్టం. నియంత– అంటే నాతో కలిసి సుఖించడం యిష్టమన్నమాట. స్త్రీ– నీవు పశువువు. నీ నాగరకత అంతా నీవు చేసే సురాపానంలో, ధరించే దుస్తుల్లో, తుపాకి మందులో ఉంది. నీ మనసులో లేదు. నీ జాతిలో లేదు. నేను బ్రతుకుచున్నానన్న విషయం నీకాశ్చర్యంగా ఉంది. ఉరి పోసికునో, సముద్రంలో పడో చావటం నా జీవుడికి యిష్టం లేదు. నా జీవుడు ఈ శరీరాన్ని పట్టుకున్నాడు. వాడంతట వాడు వదలిపోడు. ఆ నా చనిపోయిన భర్తకోసం, పిల్లల కోసం గుండె అటమటించి చావటం, మహాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోవటం ఈ జీవుడికి యిష్టం. ఈ జీవుడికి యిది యొక అనుభవం. చచ్చిపోవటానికి యిష్టపడడు. సౌఖ్య మనుభవిద్దామని కాదు. దుఃఖమనుభవిద్దామని. సౌఖ్యమో, దుఃఖమో ఈ శరీరంతో పుట్టి, యీ శరీరానికి సంబంధించినవి అనుభవించటమే అతని కిష్టం. ఈ శరీరానికి, యీ జీవుడికి యెడతెగరాని లంకె. నా అంతట నేను చావటం నా కిష్టం లేదు. నీవు చంపితే చచ్చిపోవటం యిష్టం. మృత్యువు దానియంతట అది వస్తే యింకా యిష్టం. అట్లాగే ఈ జీవుడు ఈ శరీరంతో తన యిష్టం వచ్చిన సౌఖ్యాన్ని అనుభవించి సౌఖ్యం అనుభవించా ననుకుంటాడు. ఇతరులవల్ల బలవంతంగా చేయబడ్డ అనుభవం అది వాడికి సౌఖ్యం కాదు. అది దుఃఖమే. ఆ దుఃఖమైనా అనుభవించటం అతని కిష్టం. నియంత– అయితే నీవు నా కక్కర లేదు. స్త్రీ– ఊరికే అనట మెందుకు? నియంత ఆమెను చంపెను. చనిపోవుచున్న యామె పెదవిమీద సంతోషపు నవ్వు తాండవించెను. కొనయూపిరితో నిట్టనెను: ‘‘నీవు నీ జన్మలో చేసిన మంచి పని యిది యొక్కటియే. నేను చనిపోవు చుంటిని గదా! నీవు తరువాత యేమి చేసెదవు?’’ నియంత– మరల నింకొక స్త్రీని సంపాదించెదను. స్త్రీ– నీకు తగిన మాట! నీ జాతికి జీవుని యిష్టము తెలియదు. ఆమె కొన్ని రాత్రులు ఉరి పోసుకుందామనుకుంది. పోసికోలేదు. సముద్రములో బడి చద్దామనుకుంది. చావలేదు. కిరసనాయిలు మీద పోసికొని నిప్పు ముట్టించుకుందామనుకుంది. ముట్టించుకోలేదు. యెన్నో అనుకుంది. ఏమీ చేయలేదు. కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్ప త్రాగి మదించిన కళ్లతో ఆమె గదికి వచ్చాడు. విశ్వనాథ సత్యనారాయణ -
55 ఏళ్ల కిందట కూలిన విమాన శకలాలు గుర్తింపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐదు దశాబ్దాల కిందట సముద్రంలో కూలిపోయిన కోస్ట్గార్డ్ యుద్ధవిమాన శకలాలను ఎట్టకేలకు ఇటీవల గుర్తించారు. స్కూబా డైవర్లు పదేళ్లగా చేసిన కృషి ఫలించింది. చెన్నై సమీపంలోని నీలాంగరై వద్ద సముద్రంలో విమానశకలాలను కనుగొన్నారు. 1964 ఆగస్టు 13న చెన్నై కోస్ట్గార్డ్కు చెందిన చిన్న విమానం చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరి నీలాంగరై సమీపంలోని సముద్రంలో కూలిపోయింది. అధికారులకు తెలియకుండా ఒక మెకానిక్ ఆ విమానాన్ని నడుపుతూ నేలపైకి దించడం చేతకాక, అదుపుచేయలేక పోవడంతో అది సముద్రంలో కూలిపోయింది. ఆ విమానాన్ని నడిపిన మెకానిక్ను సమీపంలోని మత్స్యకారులు ప్రాణాలతో కాపాడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తమిళనాడుకు చెందిన వివిధ ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లినపుడు వారి వలలు దేనికో చిక్కుకుని తెగిపోవడాన్ని గమనించారు. ఖరీదైన వలలు తరచు తెగిపోతూ నష్టపోతున్నామని మత్స్యశాఖ అధికారులకు చెప్పుకొని వాపోయారు. వలలు తెగిపోవడానికి కారణాలు అన్వేషించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. పుదుచ్చేరిలోని స్కూబా డైవింగ్ శిక్షకుడు అరవింద్ తరుణ్శ్రీ నేతృత్వంలో నీలాంగరై మత్స్యకార ప్రాంతానికి చెందిన సద్గురు, మరో ముగ్గురితో కూడిన బృందం కూలిపోయిన కోస్ట్గార్డ్ విమానం కోసం పదేళ్లుగా గాలిస్తోంది. ఈనెల 17న నలుగురు స్కూబా డైవర్లు, కొన్ని ఉపకరణాలు, చేపలు పట్టే 30 మరపడవలతో బయలుదేరారు. చెన్నై సమీపంలోని నీలాంగరై వద్ద తీరం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రపు అడుగుభాగంలో తనిఖీలు చేపట్టారు. సముద్రంలో 12 అడుగుల లోతున పాచిపట్టిన విమాన శకలాలను గుర్తించారు. ఈ విషయాన్ని కోస్ట్గార్డ్, విమానయానశాఖలకు తెలిపారు. -
క్షణ క్షణం.. భయం..భయం
విశాఖపట్నం , నక్కపల్లి/పాయకరావుపేట: పెథాయ్తో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తీరప్రాంత వాసులు ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులతో భయానక వాతావరణం చోటుచేసుకుంది. తీరం అలకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సాధారణ రోజుల్లో కంటే పది మీటర్లు ముందుకు వచ్చాయి. పాయకరావుపేట మండలం పెంటకోట, రాజానగరం, రాజవరం, పాల్మన్పేట, రత్నాయంపేట, వెంకటనగరం, నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు, దొండవాక, బంగారయ్యపేట ,పెదతీనార్ల ప్రాంతాల్లో తీరం కోతకు గురైంది. ఒడ్డున లంగరు వేసిన తెప్పలు అలల «తాకిడికి చెల్లా చెదురయ్యాయి. అక్కడక్కడ కొన్నిపాడయ్యాయి. ఈ పరిస్థితితో మత్స్యకారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం అంతా కుండపోతగా పడింది. రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులకు చెట్లు, కొమ్మలు పడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. బస్సులు, రైళ్లు తిరగకపోవడంతో పలువురు ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. అధికారులు అప్రమత్తం.. పెథాయ్తో ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావిత గ్రామాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జేసీ సృజన ఆది,సోమవారాల్లో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్రాయవరం మండలాల్లో పర్యటించి అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. తుపాను వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి, వేటకు వెళ్లకుండా ఇంటివద్ద ఉండిపోయిన వారికి పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయం కల్పించారు. బలహీన పడే వరకు బెంగే.. కాకినాడ వద్ద తీరం దాటిన పెథాయ్ మళ్లీ తుని సమీపంలో వాయుగుండం రూపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందంటూ సాయంత్రం వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. తుని సమీపంలో తీరం దాటితే కనక దీని ప్రభావం పాయకరావుపేట, నక్కపల్లి మండలాలపై ఉంటుంది. దీంతో అధికారులంతా గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. తీరానికి ఆనుకుని రాజయ్యపేట, బోయపాడు, బంగారయ్యపేట, అమలాపురం పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక గ్రామాలున్నాయి. సోమవారం సాయంత్రానికి ఈ రెండు మండలాల్లోను పెద్దగా నష్టమేమీ జరగలేదు.అయితే సోమవారం అర్ధరాత్రికి మళ్లీ తుని సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్న హెచ్చరికలు అధికారులను, ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సహాయ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ.. తుపాను సహాయ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు తమవంతు సాయం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ సూచనల మేరకు అమలాపురం మాజీ సర్పంచ్ సూరాకాసుల గోవిందు, సీడీసీ మాజీ చైర్మన్ గూటూరు శ్రీనులు తీరప్రాంత గ్రామాలకు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేశారు. ఎక్కడైనా చెట్లు కూలిపోతే తొలగించడానికి ట్రాక్టర్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచారు. -
సాగరగర్భంలో తొలి మ్యూజియం!
సాక్షి, చెన్నై: దేశంలో తొలిసారిగా పుదుచ్చేరిలో సముద్ర గర్భంలో ఓ మ్యూజియం రూపకల్పనకు బీజం పడింది. 26 అడుగుల మేరకు నిర్మాణాలు సాగరంలో జరగనున్నాయి. పుదుచ్చేరి సముద్ర తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్రెంచ్ వారి హయాంలో నిర్మించిన పురాతన చిహ్నాలు ఎన్నో ఈ తీరంలో ఉంటాయి. పుదుచ్చేరికి ఆదాయం విదేశీ, స్వదేశీ పర్యాటకుల ద్వారానే ఎక్కువగా వస్తోంది. దీంతో పర్యాటకంగా పుదుచ్చేరిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సముద్ర గర్భంలో ఓ మ్యూజియం ఏర్పాటుకు కార్యాచరణపై దృష్టి పెట్టింది. కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంతో సమష్టి భాగస్వామ్యంలో నిర్మాణాలపై కసరత్తు జరుగుతోంది. నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కడలూరు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో ఈ జలాంతర్గామిని మ్యూజియం కోసం ఎంపిక చేశారు. 61.3 మీటర్ల పొడవు, 10.2 మీటర్ల వెడల్పు, 11.98 మీటర్ల ఎత్తు కల్గిన ఈ జలాంతర్గామిలో ఉన్న యంత్రాలు, ఇతర పరికరాల్ని తొలగించి మ్యూజియంగా మార్చడానికి అవసరమైన పనులు విశాఖపట్నంలో సాగుతున్నాయి. ఈ మ్యూజియంలోకి వెళ్లే మార్గంలో డాల్ఫిన్తో పాటు సముద్ర జలరాశుల్ని వీక్షించేందుకు తగ్గట్టుగా అద్దాలతో నిర్మాణాలు చేపట్టనున్నారు. -
సముద్ర గర్భంలో రైలు ప్రయాణం
యూఏఈ: సముద్ర గర్భంలో రైలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ కొన్ని రోజుల్లో ఇది నిజం కాబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి భారత్ వరకు అండర్వాటర్ హైస్పీడ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. యూఏఈలోని ఫుజురాయ్ నగరం నుంచి ముంబై వరకు నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్షేహి వెల్లడించారు. ఈ విషయమై అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘భారత్లోని ముంబై నుంచి ఫుజురాయ్ నగరాన్ని కలుపుతూ నీటి అడుగున హైస్పీడ్ రైలును తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుంది. భారత్ నుంచి ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంద’న్నారు. -
సముద్రంలో ఏయూ విద్యార్థి గల్లంతు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): సముద్రంలో స్నానం చేస్తుండగా ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు గల్లంతయ్యారు. అతని స్నేహితులు, మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఆర్కేబీచ్లో శనివారం ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారిలోని నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు కురుసుర జలాంతర్గామి మ్యూజియం వెనుక భాగంలో సముద్రంలో స్నానాలకు దిగారు. వీరిలో బర్రి నీలేష్(18) బలమైన కెరటాల ఉధృతికి సముద్రంలో ఉదయం 8.30 గంటల సమయంలో కొట్టుకుపోయాడు. వెంటనే ఆందోళనకు గురైన తోటి విద్యార్థులు విషయాన్ని బీచ్ పెట్రోలింగ్, మూడో పట్టణ బ్లూ కోట్ పోలీసులకు తెలియజేశారు. వారు ఘటనాస్థలికి చేరుకున్నాక లైఫ్గార్డులు సముద్రంలో నీలేష్ కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. నీలేష్ ఏయూలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మద్దిలపాలెం చైతన్యనగర్లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. నీలేష్ తండ్రి బర్రి రవిశంకర్ నేవీలో యూసీడీగా పనిచేస్తున్నారు. అతనికి ఒక సోదరి కూడా ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఇమ్మానియేల్రాజు పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాశరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చైతన్యనగర్లో విషాదం మద్దిలపాలెం చైతన్యనగర్లో విషాదం నెలకొంది. సముద్రంలో ఉదయం నీలేష్ కొట్టుకుపోయాడని సమాచారం అందగానే అతని తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. కాలనీలో ఎప్పుడూ అందరితోనూ చలాకీగా వుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఉదయం బీచ్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి ఇలా గల్లంతవడంతో కాలనీవాసులు విషాదంలో మునిగిపోయారు. -
మంచు కరిగితే.. పెనుముప్పే...
వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగి అక్కడున్న మంచు మొత్తం కరిగిపోతే సముద్ర మట్టాలు కనీసం 1.2 మీటర్లు పెరుతాయని అంటోంది తాజా అధ్యయనం. అంటార్కిటికా ప్రాంతంలోని అనేక హిమనదాల్లో కొన్ని లక్షల ఏళ్లుగా మంచు గడ్డకట్టుకుని ఉందని, ఒక్క ద అమున్డ్సేన్ సీ ఎంబేయ్మెంట్ హిమనదంలోనే డెన్మార్క్ దేశం మొత్తాన్ని 11 కిలోమీటర్ల ఎత్తులో కప్పేయగలిగినంత నీరు మంచురూపంలో ఉందని, ఇదంతా ఒక్కసారిగా కరిగితే ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలు 5 అడుగుల మేర పెరుగుతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త టెర్రి విల్సన్ (ఒహాయో స్టేట్ యూనివర్శిటీ) అంటున్నారు. సుమారు 1.15 లక్షల ఏళ్ల నుంచి ఇక్కడ పేరుకుపోతున్న మంచు అడుగుభాగంలోని భూమిపై విపరీతమైన ఒత్తిడిని సష్టిస్తోందని వీరు అంటున్నారు. అయితే గత 200 ఏళ్లుగా ఈ హిమనదం కొద్దోగొప్పో స్థిరంగా ఉందని.. 2005 నుంచి మాత్రం కరిగిపోవవడం వేగం పుంజుకున్నట్లు వివరించారు. మంచు కరిగిపోవడంతో ఒత్తిడి తొలిగి భూ ఉపరితలం ఎత్తు కూడా పెరుగుతోందని విల్సన్ వివరించారు. -
తినే ఉప్పులోనూ ప్లాస్టిక్ భూతం
ముంబై: మనం ఆహారంలో భాగంగా తీసుకుంటున్న ఉప్పు స్వచ్ఛమైనది కాదా? ప్రముఖ కంపెనీలకు చెందిన ఉప్పు ప్యాకెట్లలో సైతం ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. ఐఐటీ బాంబేలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగం(సీఈఎస్ఈ) చేపట్టిన ఈ పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీఈఎస్ఈ చేపట్టిన పరిశోధనలో 8 కంపెనీలకు సంబంధించిన ఉప్పు ప్యాకెట్లను పరిశీలించగా వాటిలో 626 ప్లాస్టిక్ రేణువులు లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ రేణువుల సగటు పరిమాణం 5 మిల్లీమీటర్లుగా ఉంది. నదులు, కాలువల ద్వారా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో ఈ సూక్ష్మ రేణువులు ఏర్పడ్డాయని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొ. అమ్రితాన్షు శ్రీవాత్సవ్, చందన్కృష్ణ సేత్ తెలిపారు. ఈ కలుషిత నీటితో ఉప్పును తయారుచేయడంతో ప్లాస్టిక్ రేణువులు ఇంటింటికి చేరాయని వెల్లడించారు. పరిశోధన సాగిందిలా.. ఇందులో భాగంగా పరిశోధకులు తొలుత ముంబైలోని సూపర్మార్కెట్లు, దుకాణాల్లో 8 కంపెనీలకు చెందిన 24 ఉప్పు ప్యాకెట్లను(ఒక్కో బ్రాండ్కు మూడు చొప్పున) కొనుగోలు చేశారు. ఇవన్నీ ఒకే నెలలో తయారైనవి కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ఈ 8 సంస్థల్లో ఆరు గుజరాత్కు చెందినవి కాగా, కేరళకు చెందిన రెండు కంపెనీలు, మహారాష్ట్రకు సంబంధించి ఓ కంపెనీ ఉంది. వీటిని ప్రయోగశాలలో పరీక్షించగా.. మొత్తం 626 సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు బయటపడ్డాయి. ఈ ప్లాస్టిక్లో 63 శాతం చిన్నచిన్న రేణువుల రూపంలో, మిగిలింది ప్లాస్టిక్ ఫైబర్ రూపంలో ఉన్నాయి. ఈ ఉప్పు ప్యాకెట్లలో లభ్యమైన ప్లాస్టిక్లో 80 శాతం రేణువులు 2 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ లెక్కన ప్రతిఏటా 0.117 మిల్లీగ్రాముల ప్లాస్టిక్ను భారతీయులు తమకు తెలియకుండా ఆహారంలో తీసుకుంటున్నట్లు నిర్ధారించారు. ఈ ఫలితాలు హెచ్చరికే.. ఉప్పులో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల జాడ కన్పించడం అన్నది అన్నిదేశాలకు హెచ్చరికేనని ప్రొ.శ్రీవాస్తవ తెలిపారు. సముద్రపు నీటిలో కాలక్రమేణా విచ్ఛిన్నమవుతున్న ప్లాస్టిక్ రేణువులు.. ఉప్పు, ఇతర సముద్ర ఉత్పత్తుల రూపంలో మనుషుల ఆహారపు గొలుసులోకి చేరుతున్నాయని వెల్లడించారు. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ఉప్పును తయారుచేస్తున్న దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడోస్థానంలో ఉన్న నేపథ్యంలో ఈ పరిశోధన చేపట్టినట్లు శ్రీవాత్సవ పేర్కొన్నారు. సముద్రాల్లోకి దేన్ని, ఎంత మొత్తంలో పారేస్తున్నామన్న విషయమై ఎలాంటి తనిఖీలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమయిందని అభిప్రాయపడ్డారు. సాధారణ వడపోత పద్ధతుల ద్వారా ఈ నీటిలోని 85 శాతం ప్లాస్టిక్ రేణువులను తొలగించవచ్చని వెల్లడించారు. భారత్కే పరిమితం కాదు.. ప్లాస్టిక్ భూతం అన్నది కేవలం భారత్కే పరిమితం కాలేదనీ, చైనా, స్పెయిన్, టర్కీ, యూకే, ఫ్రాన్స్, యూఎస్ సహా పలుదేశాల సముద్ర జలాలు దీనితో కలుషితమయ్యాయని ప్రొ.శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఐదు ట్రిలియన్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్లు 2014లో ఓ సైన్స్ జర్నల్ కథనాన్ని ప్రచురించిందన్నారు. ‘సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులతో కలుషితమవుతున్న భారత సముద్రజలాలు– అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహం’ పేరుతో తాము చేపట్టిన అధ్యయనంలో భారతీయులు ప్లాస్టిక్ ఉన్న ఉప్పును ఆహారంగా తీసుకుంటున్నట్లు తేలిందన్నారు. ఈ పరిశోధన ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ పొల్యూషన్ రీసెర్చ్’ అనే ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమైందని శ్రీవాస్తవ వెల్లడించారు. -
సముద్ర గర్భంలో భారీ ఆకారం ఏంటి?
-
సముద్ర గర్భంలో ఆ రహస్యం ఏంటి
సుదూర విశ్వం.. అనంత సముద్రం అతుచిక్కని రహస్యాలకు ఆనవాళ్లు. ఈ అనంత విశ్వంలో మన సౌర కుటుంబం కేవలం ఒక భాగం మాత్రమే. ఈ సౌర కుటుంబంలో భూ గ్రహం మీద జీవం ఉన్నట్లే మిగతా విశ్వంలో జీవం మనుగడ ఉందా అనేది నేటికి అంతుచిక్కని రహస్యమే. ఈ అనుమానాలని మరింత పెంచేలా అప్పుడప్పుడు ఆకాశంలో ఫ్లైయింగ్ సాసర్స్ లేదా యూఎఫ్ఓలు దర్శనమిస్తుంటాయి. ఇన్నాళ్లు భూమి, ఆకాశంలో సంచరించే వీటి గురించే సరైన సమాచారం లేని సమయంలో మరో కొత్త సవాల్ ప్రపంచ ముందుకు వచ్చింది. అది కూడా సముద్ర గర్భంలో. నిధి అన్యేషణకు వెళ్లిన వారికి అద్భుతం కనిపించింది. కానీ అదేంటో స్పష్టంగా తెలియలేదు. నిర్మాణం, దాని వయసు ఏవి భూ గ్రహ వాసులకు సంబంధించినవిగా లేవు. మరేంటా భారీ ఆకారం..? అంటే ఇది కూడా గ్రహాంతర వాసులకు సంబంధించినదేనని అంటున్నారు దాన్ని చూసిన వ్యక్తులు. వివరాల ప్రకారం.. డారెల్ మిక్లోస్ డిస్కవరీ చానెల్లో ట్రెజర్ హంట్ కార్యక్రమం చేస్తుంటాడు. సముద్రం పాలైన నిధి, నిక్షేపాల ఉనికి గురించి తెలుసుకోవడం ఇతని ప్రధాన విధి. ఇప్పటికే పలు సీజన్లుగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో మిక్లోస్ అపార నిధి ఉన్న రెండు, మూడు స్థావరాలను కూడా గుర్తించాడు. ఈ అన్వేషణలో మిక్లోస్ నాసా మాజీ శాస్త్రవేత్త గోర్డాన్ కూపర్ రూపొందించిన మ్యాప్లతో పాటు సముద్ర గర్భంలో ఉన్న పరిసారాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించే స్కానర్తో పాటు ఇద్దరు మనుషులు పట్టే సబ్మెరైన్ లాంటి వాహనాన్ని వినియోగిస్తాడు. మరో సీజన్లో భాగంగా రూపొందించబోయే కార్యక్రమం కోసం ఈ సారి కరేబియన్ సమ్రుదాన్ని ఎన్నుకున్నాడు మిక్లోస్. బహమాస్ సమీపంలో సముద్రంలో 300 అడుగుల లోపల ప్రయాణించిన తర్వాత స్కానర్ అక్కడేదో అనుమానాస్పదమైన వస్తువు ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఆ సమాచారాన్ని మిక్లోస్కు అందించింది. దాంతో అదేంటో పరిశీలించడానికి మిక్లోస్ స్కానర్ సూచించిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఆ ఆకారాన్ని చూసిన మిక్లోస్కు నోట మాట రాలేదు. ఎందుకంటే సముద్రం అడుగున దాదాపు 1500 అడుగుల విస్తీర్ణంలో భారీ ఆకారంలో ఉన్న ఓ వింత వస్తువు కనిపించింది. చూడటానికి సిలిండర్ ఆకారంలో ఉన్న ఆ వస్తువును కొన్ని వందల ఏళ్ల క్రితం నాటిది అనుకున్నాడు మిక్లోస్. అంతేకాక దాని చుట్టూ ముందుకు పొడుచుకువచ్చిన 15 అసాధారణ ఆకారాలు కూడా ఉన్నాయని తెలిపాడు. తాను ఇంతవరకూ ఇలాంటి వింత ఆకారాన్ని చూడలేదని.. ఇది మన ప్రకృతికి సంబంధించినది, మానవులు నిర్మించినది కాదని తెలిపాడు. తర్వాత సముద్రం పైకి వచ్చి తాను చూసిన వింత గురించి మిగతా వారికి చెప్పాడు మిక్లోస్. వెంటనే ఒక శాస్త్రవేత్తల బృందం అక్కడకు చేరుకుంది. మిక్లోస్ చెప్పిన ఆ అనుమానాస్పద ఆకారాన్ని ఒక ఓడ లాగా తేల్చారు శాస్త్రవేత్తలు. అంతేకాక ఆ ఓడ దాదాపు 5 వేళ సంవత్సరాల క్రితం నాటిదని చెప్పారు. అంతేకాక మానవ నిర్మితమైంది కూడా కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మరి ఇంతకు ఇది ఎక్కడిది, దీని పుట్టు పూర్వోత్తరాలు గురించి తెలియాలంటే మరి కాస్తా సమయం పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ జనాలు మాత్రం ఇది కూడా ఏలియన్స్కు చెందినదిగానే చెప్పుకుంటున్నారు. అయితే ఓడ రూపంలో ఉన్న ఈ ఆకారం కూడా బెర్ముడా ట్రయాంగిల్కు సమీపంలోనే బయటపడటం గమనార్హం. -
సముద్రంలో బోటు గల్లంతు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఫిషింగ్ బోటు సముద్రంలో గల్లంతైంది. బోటులో దుమ్మలపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 7న కాకినాడ నుంచి చేపల వేటకు ఫైబర్ బోటు వెళ్లింది. మత్స్యకారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాధితుల కుటుంబసభ్యులు ప్రభుత్వాధికారుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోస్టుగార్డులను కోరారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముందుకొచ్చిన సముద్రం!
బాపట్ల : సముద్రం ముందుకొచ్చిందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీంతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఆదివారం అప్రమత్తమైంది. తహసీల్దార్ టి.వల్లయ్య, డీఎస్పీ గంగాధరంతోపాటు యంత్రాంగం సూర్యలంక సముద్రతీరానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సముద్రం ముందుకు రావడం కాదని, వర్షాల కారణంగా అలలు ఉధృతంగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. అందుకే సముద్ర స్నానాలకు అనుమతించలేదని పేర్కొన్నారు. ఒడ్డున ఉండి మాత్రమే సముద్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లవద్దంటూ సూచించారు. రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు, ఎస్ఐ గళ్ల రవికృష్ణ పాల్గొన్నారు. -
ముప్పు ముంగిట ఓడలరేవు
అల్లవరం (అమలాపురం): తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు వద్ద ఎగసిపడుతున్న అలల తాకిడికి సముద్రం 50 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. బుధవారం ప్రారంభమైన అలలు క్రమేపీ పెరుగుతూ సోమవారం నాటికి ఉగ్రరూపం దాల్చాయి. తీరానికి ఆనుకుని ఉన్న సరుగుడు తోటలు, ఆక్వా చెరువులు, పల్లపు ప్రాంతాలు సముద్రం నీటితో నిండిపోయాయి. సముద్ర రిసార్ట్స్ నుంచి నదీ సంగమం వరకూ తీరం కోతకు గురైంది. మునుపెన్నడూ లేని విధంగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు నెలకొరుగుతున్నాయి. కెరటాల ఉధృతికి సరుగుడు తోటల్లో ఇసుక మేటలు వేసింది. అలల ఎగసిపడుతుండటంతో ఓడలరేవుకు పర్యాటకులు రావడానికే భయపడుతున్నారు. తీరం వెంబడి సముద్రంలో చమురు నిక్షేపాల ఆన్వేషణకు చమురు సంస్థలు చేస్తున్న కార్యకలాపాలతో తీర గ్రామాలకు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఓఎన్జీసీ కార్యకలాపాలతో సముద్రగర్భం విధ్వంసం ఓడలరేవు సముద్ర లోతు జలాల్లో లభ్యమవుతున్న చమురును పైపుల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్న ఓఎన్జీసీ ఆయా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందనేది నగ్నసత్యం. చమురు అన్వేషణకు సిస్మిక్ సర్వేలో విధ్వంసకర బాంబులను భూమిలోకి పంపి బాంబింగ్ చేయడం వల్ల భూమి కుంగిపోతోంది. రెండు దశాబ్దాలకు ముందు, ఇప్పటి ఓడలరేవుకి ఎంతో తేడా కనిపిస్తోంది. 20 ఏళ్లలో సముద్రం 150 మీటర్ల పొడవున ముందుకు చొచ్చుకొచ్చిందంటే ఏ స్థాయిలో తీరం కోతకు గురవుతుందో అర్థమవుతోంది. తీరంలో ఓఎన్జీసీ బావులే అందుకు సాక్ష్యం. 2004లో సునామీ రాక ముందు ఓఎన్జీసీ బావులకు కనీసం 100 మీటర్ల దూరంలో సముద్రం ఉండేది. 2004లో సునామీ రాకతో తీరంలో చమురు అన్వేషణకు ఓఎన్జీసీ తవ్విన బావులు వరకూ కోతకు గురయింది. తుపాన్లప్పుడు మినహా సుమారు 18 ఏళ్లపాటు ఓఎన్జీసీ బావులను దాటి రాని సముద్రం ఇప్పుడు బీభత్సం సృష్టిస్తోంది. ఆ హామీ ఏమైంది? సునామీ వచ్చాక ఓఎన్జీసీ టెర్మినల్కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన ఓఎన్జీసీ అధికారులు కొమరగిరిపట్నం ఏడ్ల రేవు నుంచి ఓడలరేవు నదీ సంగమం వరకూ రూ.100 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపడతామని 2011లో ప్రతిపాదనలు చేశారు. తర్వాత వశిష్ట టెర్మినల్లో విస్తరణలో భాగంగా 2014 ఆగస్టులో మంత్రి రాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావు, అప్పటి ఆర్డీవో సమక్షంలో గ్రామస్థులతో చేసుకున్న ఒప్పంద సమయంలో రక్షణ గోడ తెరపైకొచ్చింది. టెర్మినల్ రక్షణకు నాలుగు కిలోమీటర్ల పొడవునా తీరం వెంబడి గోడ నిర్మాణానికి ఓఎన్జీసీ హామీ ఇచ్చింది గానీ అది ఇంతవరక కార్యరూపం దాల్చలేదు. తీరంలో దట్టంగా ఉండే సరుగుడు తోటలను దాటుకుని రైతుల భూములకు హద్దులుగా ఉండే తాటిచెట్లను సైతం సముద్రం నేడు తనలో కలుపుకొంటోంది. ఐదు రోజులుగా సాగుతున్న కెరటాల ఉధృతికి మెరక ప్రాంతాల్లో 50 మీటర్లు, పల్లపు ప్రాంతాల్లో 70 మీటర్ల పొడవునా సముద్రం ముందుకొచ్చింది. అలల ఉధృతి ఇలాగే కొనసాగితే తీరానికి 100 మీటర్ల దూరంలో ఉన్న ఓఎన్జీసీ టెర్మినల్కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రక్షణగోడ ఎప్పుడు నిర్మిస్తారో తెలియదు తీరంలో 150 మీటర్ల పొడవునా సరుగుడు తోటలుండేవి. అటవీ భూములు అన్యాక్రాంతమవడంతో సరుగుడు తోటలను నరికేశారు. రక్షణ గోడను ఎప్పడు నిర్మిస్తారో కూడా తెలియడం లేదు. సముద్రం ఉధృతి చూశాకైనా ప్రభుత్వం స్పందించాలి. – సోమాని వెంకటరమణ, ఓడలరేవు, అల్లవరం మండలం -
శ్రీకాకుళం జిల్లాలో సముద్రం అల్లకల్లోలం
-
సముద్ర గర్భంలో దొరికిన ఐఫోన్ పనిచేస్తుందోచ్!
న్యూఢిల్లీ : మనం పొరపాటున స్మార్ట్ఫోన్ను నీళ్లలో పడేసినా లేదా కింద పడేసినా.. ఇక దాని పని అంతే. ఆ స్మార్ట్ఫోన్ను ఓ మూలన పడేసి, కొత్తది కొనుక్కోవాల్సిందే. కానీ ఆపిల్ ఐఫోన్ల విషయంలో దాన్నే ఆపాదిస్తే, మనం తప్పులో కాలేసినట్టే. ఆపిల్ ఐఫోన్లు ఫర్ఫార్మెన్స్కు మారు పేరుగా నిలుస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 7 ఇదే నిరూపించింది. సముద్ర గర్భంలో నాని నాని ఉన్న ఆపిల్ ఐఫోన్ 7, బయటకి తీస్తే భలే పనిచేస్తుందట. దాని బ్యాటరీ పూర్తిగా నీళ్లలో తడిచిపోయినా కూడా ఇంకా మంచిగా పనిచేస్తూనే ఉందని డిజిటైమ్స్ వెల్లడించింది. అంతేకాక సముద్ర గర్భంలో కూడా ఈ స్మార్ట్ఫోన్ సిగ్నల్ను కరెక్ట్గా అందుకుంటుందని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ కెనడా సందర్శకుడికి చెందిన ఆపిల్ ఐఫోన్ 7 పొరపాటున సముద్రంలోకి పడిపోయింది. ఎంత వెతికినా అతనికి దొరకకపోయే సరికి దానిపై ఆశలు వదిలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరిస్ హార్సీకి ఆ ఫోన్ దొరికింది. ఇంగ్లండ్లోని డోర్డల్ డోర్ దగ్గరిలో గల సముద్ర గర్భం నుంచి ఓ వెలుగు రావడం కనిపించింది. అదేమిటా? అని దాని వద్దకు వెళ్లి చూసింది. సముద్ర గర్బంలో వెలుగులు చిందిస్తున్న ఆ వస్తువును చూసి ఆమె షాకైంది. అది ఐఫోన్ 7. టెక్ట్స్ మెసేజ్ రావడంతో, ఆ ఐఫోన్ 7ను వెలుతురును బ్లింక్ అవుతుంది. నీటిలో మునిగి ఉన్న ఆ డివైజ్ను హార్సీ బయటకు తీసింది. 48 గంటల పాటు ఆ ఐఫోన్ అక్కడే ఉన్నట్టు తెలిసింది. అంతసేపు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న 84 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఆ ఫోన్ మంచిగా పనిచేస్తుందని తెలిసింది. అంతేకాక సిగ్నల్స్ను కూడా అది కరెక్ట్గా పొందుతుంది. హార్సీ తనకు దొరికిన ఐఫోన్ 7 ను తన వద్దనే ఉంచుకోకుండా.. ఆ ఫోన్ పోగొట్టుకున్న కెనడియన్కు అందచేసింది. ఈ డివైజ్ వాటర్ రెసిస్టెన్స్తో ఐపీ67 రేటింగ్ను కలిగి ఉంది. ఈ కేసుతో ఐఫోన్ 7 ఎంత స్ట్రాంట్గా పనిచేస్తుందో మరోసారి వెల్లడైంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దీని పనితీరు అద్భుతమని టెక్ విశ్లేషకులు సైతం అంటున్నారు. -
నా ఉప్పు తిన్నారు
సముద్రాలంటే మనకు గొప్ప ఫాసినేషన్. సముద్రాన్ని ఒక్కసారి కూడా కళ్లతో చూడకున్నా, ఆ సముద్రాన్ని బాల్యంలోనే పరిచయం చేసుకొని ఉంటాం. దాన్ని కలలు కనుంటాం. కథలుగా వినుంటాం. కథలు కథలుగా చెప్పుకొని ఉంటాం. ఒక్కసారైనా చూసొస్తే ఇంక తెలీకుండానే ప్రేమలో పడిపోతాం. మనకు ఏకాంతాలన్నా సముద్రాలే, సమాధానాల్లేని ప్రశ్నలకైనా సముద్రాలే! అలాగని ఉల్లాసాన్నిచ్చేదిగా మాత్రమే ఉంటే అది మనం ఇంత ఇష్టపడే సముద్రం అయ్యేది కాదు. జీవి మనుగడకు కూడా సముద్రం ఒక కేంద్రం. అది లేకపోతే మన ఈ జీవితాన్ని ఇలాగే ఊహించుకోను కూడా లేం. మనకు ఇన్ని ఇచ్చి, ఇంతా చేసిన సముద్రానికి మనం తిరిగి ఏమిస్తున్నామంటే? కాలుష్యం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల కాలుష్యం. సముద్రం ఉప్పు తిని మనం చేస్తోంది ఏంటంటే.. ఆ సముద్రాన్నే ముంచేస్తున్నాం. ఇప్పటికీ ఓ అవకాశం ఉంది, ఎప్పటికీ ఉండదు అది.. సేవ్ ఓషన్... సేవ్ లైఫ్... కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నామని కొందరు మనుషులు వాపోతుంటారు గాని, కడలి కష్టాల గురించి ఎవరైనా ఏనాడైనా పట్టించుకున్నారా? సముద్రాల లోతు ఎరిగిన కొద్దిమంది శాస్త్రవేత్తలు మాత్రమే వాటి కష్టనష్టాల గురించి నిష్ఠుర సత్యాలను ఎప్పటికప్పుడు లోకానికి వెల్లడిస్తున్నారు. జీవరాశుల మనుగడకు కీలకమైన సముద్రాలను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లేనని శాస్త్రవేత్తలు ఎంతగా గొంతు చించుకుంటున్నా, వారి గోడును ఆలకించే వారే కరువవుతున్నారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు సైతం కడలి కష్టాలను కడతేర్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడొంతులు సముద్రాలే నిండి ఉన్నాయి. మిగిలిన ఒక వంతు స్థలభాగంలో మైదానాలు, పీఠభూములు, అరణ్యాలు, ఎడారులు, నదులు, సరస్సులు వంటివి ఉన్నాయి. ఒకవంతు స్థలభాగంలో జీవిస్తున్న మనుషులు సహా మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం. సముద్రాలను క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులూ, మిగిలిన జీవులు క్షేమంగా ఉండటానికి వీలవుతుంది. నానా చెత్తను సముద్రాల్లో పారవేయకుండా నియంత్రణ పాటిస్తేనే వాటిని కాపాడుకోగలుగుతాం. కష్టాలనేవి మనబోటి మనుషులకు ఉంటాయే తప్ప కడలికి కష్టాలేముంటాయని విసుక్కోకండి. కష్టాలు కడలికి కూడా ఉంటాయి. వాటిలో చాలా వరకు కష్టాలు మనబోటి మనుషుల వల్ల వచ్చిపడేవే. మనుషుల నిర్లక్ష్యం సముద్రాలను సమస్యల్లోకి నెట్టేస్తోంది. వాటిని కాలుష్య కాసారాలుగా మార్చేస్తోంది. తీరాల వెంబడి సంచరించే జనం ఎడాపెడా వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలను ముంచెత్తుతున్నాయి. ఎందులోనూ నాశనం కాని ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రజీవుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. మితిమీరిన చేపల వేట సముద్రాల్లోని జీవ వైవిధ్యానికి విఘాతం కలిగిస్తోంది. కాలాలతో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం కొనసాగించే వేట వల్ల సముద్రాల్లోని అరుదైన జీవరాశులు అంతరించిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. భూమ్మీద మితిమీరిన వాయు కాలుష్యం సముద్రాలనూ వదలడం లేదు. కార్బన్ డయాక్సైడ్ మోతాదుకు మించి సముద్రాల్లోకి చేరుతుండటంతో సముద్ర జలాల్లో ఆమ్లగాఢత పెరుగుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోకుంటే, సముద్రంలోని అరుదైన జీవరాశులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కలుషిత వాయువుల వల్ల భూతాపం పెరుగుతున్నందున సముద్రంలోని విలువైన పగడపు దీవులు క్రమంగా క్షీణించిపోతున్నాయి. బొగ్గు విద్యుత్ కేంద్రాలు, ఇతర పరిశ్రమల నుంచి వెలువడే పాదరసం వ్యర్థాలు కూడా సముద్రంలోనికి మోతాదుకు మించి చేరుతున్నాయి. సముద్రంలోకి చేరే పాదరసం చేపలు తదితర జలచరాల్లోకి చేరుతోంది. చేపలను తినే మనుషులకు ఇది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సముద్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటివల్ల సముద్రగర్భంలోని జీవరాశితో పాటు, నేల మీద నివసించే మనుషులకు వాటిల్లే ముప్పు గురించి శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచే మొత్తుకుంటున్నా, ఇరవయ్యో శతాబ్ది చివరి రోజుల్లో మాత్రమే ప్రపంచ దేశాల ప్రభుత్వాల్లో కొంత చలనం వచ్చింది. తొలిసారిగా 1992 జూన్ 8న వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ‘వరల్డ్ ఓషన్స్ డే’గా ప్రకటించి కెనడాలో ఒక సమావేశం నిర్వహించాయి. సముద్రాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపాయి. ఐక్యరాజ్య సమితి మాత్రం వరల్డ్ ఓషన్స్ డేను 2008లో అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి వివిధ దేశాల ప్రభుత్వాలు, సముద్ర పరిశోధనలు సాగించే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ రోజున సాగరాల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కార్బన్ కాలుష్యంతో చేటు భూమ్మీద మనుగడ సాగించే మనుషులు సహా సమస్త జీవరాశులకు అవసరమయ్యే ప్రాణవాయువును అందించడంలో సముద్రాల పాత్ర చాలా కీలకం. ప్రపంచంలోని జీవులకు అవసరమయ్యే ఆక్సిజన్లో దాదాపు సగానికి సగం సముద్రాల ద్వారానే అందుతోంది. అంతేకాదు, భూమిపై వాతావరణంలో వ్యాపించి ఉన్న దానికి యాభై రెట్ల పరిమాణంలోని కార్బన్ డయాక్సైడ్ను సముద్రాలు పీల్చుకుంటున్నాయి. సముద్రాలకు కార్బన్ డయాక్సైడ్ను ఇముడ్చుకునే శక్తి ఉన్నా, వాటి సామర్థ్యానికి మించిన పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ సముద్రాల్లోకి చేరుతోంది. సముద్రాల్లో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పరిమితిని మించితే, సముద్ర జలాలు ఆమ్లతత్వాన్ని సంతరించుకుంటాయి. గడచిన రెండువందల సంవత్సరాల్లో సముద్రాల్లో ఆమ్లతత్వం 30 శాతం మేరకు పెరిగినట్లు ‘గ్లోబల్ బయో డైవర్సిటీ’ నివేదిక వెల్లడించింది. సముద్ర జలాల్లో ఆమ్లతత్వం పెరుగుతున్న ప్రాంతాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన నాచు నశిస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో జలచరాల సంఖ్య కూడా తగ్గుతోంది. విలువైన పగడపు దీవులు సైతం 30 శాతం మేరకు క్షీణించాయి. సముద్రాల్లోకి కార్బన్ డయాక్సైడ్ మితిమీరి చేరుతున్న కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితలంపై ఆక్సిజన్ పరిమాణం గణనీయంగా తగ్గిపోయి ‘డెడ్ జోన్లు’గా తయారవుతున్నాయి. ఇలాంటి డెడ్జోన్ల సంఖ్య 1910 సంవత్సరం నాటికి పట్టుమని పదికి లోపే ఉంటే, 2010 నాటికి వీటి సంఖ్య 500 వరకు చేరుకుంది. ఈ డెడ్జోన్ల విస్తీర్ణం దాదాపు 2.50 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. గడచిన మూడు దశాబ్దాలుగా డెడ్జోన్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే సముద్రాల్లోని జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్రతీరాల వెంబడి ఉండే మడ అడవులు కార్బన్ కాలుష్యాన్ని హరించడంలో చాలా వరకు ఉపయోగపడతాయి. మడ అడవుల విస్తీర్ణం కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోతుండటం ఆందోళనకర పరిణామం. గడచిన అరవయ్యేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 శాతం మేరకు మడ అడవులు అంతరించాయి. ఫలితంగా సముద్రాల్లో కార్బన్ కాలుష్యం పెరుగుతోంది. కేవలం మడ అడవుల్లో మాత్రమే కనిపించే 70 రకాల అరుదైన జీవజాతుల్లో 11 జీవజాతులు పూర్తిగా అంతరించిపోయాయని ‘కన్జర్వేషన్ ఇంటర్నేషనల్’ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇకనైనా ప్రభుత్వాలు కళ్లుతెరిచి, విస్తారంగా మడ అడవుల పెంపకం చేపట్టకపోతే పసిఫిక్, అట్లాంటిక్ తీర ప్రాంతాల్లోని మడ అడవుల్లో మాత్రమే కనిపించే 40 రకాల అరుదైన జీవజాతులు త్వరలోనే అంతరించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. సాధారణ అడవులతో పోలిస్తే, అదే విస్తీర్ణంలో సముద్ర తీరాల వెంబడి ఉండే మడ అడవులు, సముద్రపు గడ్డి, నాచు, ఉప్పుమేటలు దాదాపు యాభై రెట్లు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయని, వీటి విస్తీర్ణం తగ్గుతూ పోతే భూతాపం గణనీయంగా పెరిగి, భూమ్మీద చాలా అనర్థాలు వాటిల్లుతాయని యూనెస్కో ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్లాస్టిక్తోనే పెనుముప్పు మనుషుల వల్ల సముద్రాలకు చాలా రకాల సమస్యలే ఎదురవుతున్నా, వాటిలో ప్లాస్టిక్ కారణంగానే పెను ముప్పు కలుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు, సముద్ర శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటి లెక్కలకు అందుతున్న అంచనాల ప్రకారం సముద్రాల్లో వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువుల సంఖ్య 5.25 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని, వాటి బరువు 28 కోట్ల టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2025 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం మరో మూడు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా సముద్ర జీవుల సంఖ్య గణనీయంగా నశించిందని, 1970 నుంచి 2012 మధ్య కాలంలో సముద్రంలో సంచరించే వెన్నెముక గల జీవులు 49 శాతం మేరకు నశించాయని, మిగిలిన రకాల జీవరాశులను కూడా కలుపుకొని చూస్తే ఇదే కాలంలో 39 శాతం మేరకు సముద్రాల్లోని జీవ వైవిధ్యం నాశనమైందని యూకే ప్రభుత్వ నిపుణులు ఒక నివేదికలో వెల్లడించారు. ప్లాస్టిక్ వాడకాన్ని కనీస స్థాయికి తగ్గిస్తే తప్ప సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోలేమని వారు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడుక నియంత్రణను ఈ ఏడాది ‘వరల్డ్ ఓషన్స్ డే’ థీమ్గా పాటిస్తున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ను ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిన తర్వాత 120 దేశాలు సముద్రాల పరిరక్షణపై అవగాహన, చైతన్యం పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నాయి. పలు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్లాస్టిక్ వాడకంలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. సముద్రాలకు మరిన్ని అనర్థాలు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వాడే రసాయనాలు, చమురు, సహజవాయువుల కోసం సముద్రగర్భంలో జరిపే తవ్వకాలు, ‘డీప్ సీ మైనింగ్’, చేపల కోసం మితిమీరి సాగిస్తున్న వేట, సముద్ర తీర ప్రాంతాల్లో పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణాలు, తీర ప్రాంతాలకు చేరువలో వస్తూత్పత్తి కేంద్రాలు, ఔషధ తయారీ, ఎరువుల తయారీ కేంద్రాల పెరుగుదల, ఓడరేవులు, తీర ప్రాంత పర్యాటకం వంటి కార్యకలాపాలు సముద్రాల్లోకి నానా రకాల కాలుష్యాలను చేరవేస్తున్నాయి. సముద్రాల్లోకి దాదాపు లక్షకు పైగా రసాయన వ్యర్థాలు చేరుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే విషపూరితమైన లోహాలు, చమురు కూడా సముద్రాల్లోకి చేరుతున్నాయి. ఇవన్నీ అరుదైన జలచరాలను, సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని హరించివేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. సముద్రం నుంచి లభించే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాల్లోకి చేరుతున్నాయి. వీటిని తినే మనుషుల ఆరోగ్యాలపై కూడా దుష్ప్రభావాలు కలిగిస్తున్నాయి. సముద్రం ఎగువ భాగంలో కాకుండా, అట్టడుగున సంచరించే అరుదైన జలచరాలు సైతం రసాయనిక కాలుష్యం బారిన పడుతున్నాయి. సముద్రాలు మనకేమిస్తున్నాయంటే..! మనం రోజూ ఆహారంలో వాడే ఉప్పు, మాంసాహారులు తినే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాలు సముద్రాల నుంచే లభిస్తున్నాయనే సంగతి తెలిసిందే. మనుషులు రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే జంతు సంబంధిత ప్రొటీన్లలో 15 శాతం ప్రొటీన్లు చేపలు వంటి జలచరాలకు చెందినవే. ఉప్పు, చేపలు వంటి జలచరాలే కాకుండా, ఆహారంలో వినియోగించే మరికొన్ని పదార్థాలు కూడా మనకు సముద్రం నుంచే దొరుకుతున్నాయి. సముద్రపు పాచి, నాచు నుంచి సేకరించే అగర్, కరాజీనాన్ ఆల్గిన్ వంటి పదార్థాలు ఐస్క్రీమ్లు, పెరుగు, సలాడ్లు, కేక్ మిక్స్ల తయారీలో ఉపయోగపడుతున్నాయి. సముద్రంలో దొరికే స్పాంజ్, ‘సీ విప్ కోరల్స్’ అనే ఒక రకమైన పగడాల నుంచి సేకరించిన పదార్థాలు పెయిన్ కిల్లర్స్, యాంటీ అలెర్జిక్ ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతున్నాయి. సముద్ర తీరాల్లో విస్తారంగా లభించే ఇసుక భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతోంది. సముద్రంలో లభించే శంఖాలు, నత్త గుల్లలు వంటివి అలంకరణల కోసం, ఇతర ప్రయోగాల కోసం చిరకాలంగా వాడుకలో ఉన్నాయి. సముద్రాల గురించి అవీ ఇవీ.. సముద్రాల సగటు లోతు 12,400 అడుగులు. సూర్యుని నుంచి వెలువడే కాంతి కిరణాలు సముద్రాల్లో 330 అడుగుల లోతును దాటి ముందుకు సాగలేవు. అందువల్ల సముద్రాల్లో 330 అడుగులు దాటిన తర్వాత దిగువన ఉండే ప్రాంతమంతా నిరంతరం చీకట్లోనే ఉంటుంది.ప్రపంచంలోనే అతి పొడవాటి పర్వతపంక్తులు ఉన్నది నేల మీద ఎక్కడో కాదు, ఆ పర్వత పంక్తులు సముద్రం అట్టడుగున ఉన్నాయి. ‘మిడ్–ఓషియానిక్ రేంజ్’ అనే ఈ పర్వత పంక్తులు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల అడుగున 56 వేల కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. సముద్రాల గురించి మనుషులు తెలుసుకున్నది చాలా తక్కువ. ఇప్పటి వరకు సముద్రాల్లోని కేవలం 5 శాతం మేరకు మాత్రమే మనుషులు అన్వేషణలు కొనసాగించగలిగారు. మిగిలిన 95 శాతం ఏమేమి వింతలు ఉంటాయో ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం సముద్ర గర్భమే. పెద్దపెద్ద మ్యూజియంలలో కనిపించే వాటి కంటే సముద్రం అట్టడుగున పెద్ద సంఖ్యలో పురాతన వస్తువులు, కళాఖండాలు దాగి ఉన్నాయి. సముద్రం అడుగున కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు, వేడినీటి బుగ్గలు ఉంటాయి. సముద్రగర్భంలోని అగ్నిపర్వతాలు లావాను కాకుండా, వేడి బురదను, మిథేన్ వాయువును వెదజల్లుతూ ఉంటాయి. సముద్రం అడుగున కొన్నిచోట్ల ఉండే వేడి నీటి బుగ్గలు ఏకంగా 3600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడినీటిని పైకి ఎగజిమ్ముతుంటాయి. వాటి నుంచి వెలువడే నీటి వేడికి సీసం లాంటి లోహాలు కరిగిపోతాయి. ఆస్ట్రేలియా తీరానికి ఆవల పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉండే ‘గ్రేట్ బ్యారీర్ రీఫ్’ పగడపు దీవి విస్తీర్ణం దాదాపు 2575 చదరపు కిలోమీటర్లు. భూ గ్రహంలోని అతిపెద్ద సజీవ నిర్మాణం ఇదే కావడం విశేషం.సముద్రంలో జీవించే భారీ జలచరాల్లో భయంకరమైన షార్క్ల గురించి అందరికీ తెలిసిందే. షార్క్ జాతుల్లో దాదాపు 99 శాతం రకాలు ఇప్పటికే అంతరించాయి. కేవలం ఒక్క శాతం జాతులకు చెందిన షార్క్లు మాత్రమే ప్రస్తుతానికి మిగిలి ఉన్నాయి. సముద్రం అట్టడుగున దాదాపు 2 కోట్ల టన్నుల బంగారం నిక్షిప్తమై ఉన్నట్లు నిపుణుల అంచనా. నేల మీద మనకు అందుబాటులో ఉన్న బంగారం కంటే ఇది చాలా ఎక్కువ. భూమ్మీద ఇప్పటి వరకు గనుల నుంచి తవ్వగలిగిన బంగారం 1,87,200 టన్నులు మాత్రమే.సముద్రపు నీటిలో కంటికి కనిపించని చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. ఒక మిల్లీలీటరు సముద్రపు నీటిలో దాదాపు పది లక్షల బ్యాక్టీరియా కణాలు, కోటి వరకు వైరస్ కణాలు ఉంటాయి. అయితే, వీటిలో చాలా వరకు హానికరమైనవి కావు. సాహిత్యంలో సముద్రం అనాదిగా సముద్రాలు మనుషులను అబ్బురపరుస్తూనే ఉన్నాయి. వాటి ఆటుపోట్లు, అప్పుడప్పుడు తెచ్చిపెట్టే తుపానులు, ఉప్పెనలు వంటి భయపెట్టే సందర్భాలు ఎన్ని ఉన్నా, సముద్రాలపై మనుషుల్లో తీరని కుతూహలం ఇంకా మిగిలే ఉంది. ప్రకృతిని పరిపరి విధాలుగా వర్ణించిన ప్రాచీన కవులు, సాహితీవేత్తలు తమ తమ రచనల్లో సముద్రాల గురించి కూడా విశేషంగా ప్రస్తావించారు. సముద్రాల చుట్టూ బోలెడన్ని కల్పనలను జోడించి కథలల్లారు. రామాయణంలో సముద్రం ప్రస్తావన తెలిసిందే. సీతమ్మవారిని చూడటానికి హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకుంటాడు. రామాయణంలో ఇదొక కీలక ఘట్టం. ఆ తర్వాత వానరసేన సముద్రాన్ని దాటడానికి వారధి నిర్మించడం మరో కీలక ఘట్టం. మన జానపద గాథల్లో సప్త సముద్రాలను దాటి రావడం రాకుమారుల శౌర్యానికి నిదర్శనం. అరేబియన్ జానపద గాథల్లో సముద్రంలో నౌకాయానానికి సంబంధించిన సాహస గాథలు అనేకంగా ఉన్నాయి. గ్రీకు మహాకవి హోమర్ రాసిన ‘ఒడెస్సీ’ కావ్యంలో పదేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన సముద్రయానం గురించి వర్ణన ఉంటుంది. ‘నోబెల్’ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘ఓల్డ్మేన్ అండ్ సీ’ ఇంగ్లిష్ సాహిత్యంలో ఒక క్లాసిక్గా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ నావికాదళంలో పనిచేసిన సైనికుల సాధక బాధకాలను వివరిస్తూ నికోలస్ మోన్సారట్ రాసిన ‘ది క్రూయెల్ సీ’ నవల కూడా ప్రసిద్ధి పొందింది. సినిమాల్లో సముద్రం సముద్రం చుట్టూ అల్లుకున్న కథలతో అనేక సినిమాలు కూడా వచ్చాయి. వాటిలో కొన్ని అమిత ప్రజాదరణ పొందాయి. అలాంటి వాటిలో ‘జాస్’, ‘టైటానిక్’ ‘ఫైండింగ్ నెమో’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘20,000 లీగ్స్ అండర్ ది సీ’, ‘పైరేట్స్ ఆఫ్ కరీబియన్: ది కర్స్ ఆఫ్ ది బ్లాక్ పెర్ల్’, ‘ది పెర్ఫెక్ట్ స్టోర్మ్’, ‘అట్లాంటిస్: ది లాస్ట్ ఎంపైర్’, ‘ది లైఫ్ ఆక్వాటిక్’ వంటివి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. – పన్యాల జగన్నాథదాసు -
భలే ఉందే ఈ బిల్డింగ్..
ఈ భవనమే కాదు.. దీని వెనుక ఉన్న ఐడియా కూడా సూపర్. పైర్పాలో లాజరానీ అనే ఇటాలియన్ డిజైనర్ సముద్రంపై ఇలాంటి పిరమిడ్ ఆకారపు ఇళ్లు, నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదిస్తున్నాడు. ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, పంటలు పండే గ్రీన్హౌస్లు, హోటళ్లు, సినిమాలు ఇలా బోలెడన్ని భవనాలను ఒకదగ్గర చేర్చి.. ఓ కొత్త నగరాన్ని కట్టేయాలన్నది లాజరానీ ఆలోచన. దీనికి ఆయన పెట్టిన పేరు.. ‘వాయాల్యాండ్’. ఒక్కో భవనాన్ని వాయా అని పిలుస్తారు. ఫైబర్గ్లాస్, కార్బన్లు, ఉక్కుతో తయారయ్యే ‘వాయా’లను మాయన్, జపనీస్ ఆర్కిటెక్చర్ ఆధారంగా డిజైన్ చేశారు. అన్నింటిపై వీలైనంత ఎక్కువ ప్రదేశంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటై ఉంటాయి. వీటితోపాటు వాటర్ టర్బయిన్ల ద్వారా కూడా కరెంటు ఉత్పత్తి అవుతుంది. అవసరమైనప్పుడు ఒక చోటి నుంచి మరోచోటికి వాయాలను తరలించేందుకు మోటార్లు కూడా ఉంటాయి. ఒక్కో వాయా (చిన్నసైజులో ఉండేది) ఖరీదు దాదాపు రూ.రెండున్నర కోట్ల వరకూ ఉంటుందని అంచనా. వాయాల్యాండ్ నిర్మాణం కోసం లాజరానీ నిధులు సేకరిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2022 నాటికి ఏదో ఒక మహా సముద్రంలో దీనిని నిర్మిస్తానని చెబుతున్నారు. -
నీలి రిబ్బన్ – ఇంద్రధనుస్సు
సముద్రం మీద ఆగ్రహించి నురగ పొందగా çసుడులు తిరుగుతూ ఎగిరెగిరి పడుతున్న కెరటాన్ని ఎవరో పట్టుకొని ఆకాశంలో తగిలించినట్లు ఒక మేఘం.. ఆ కింద వీధి మొనలో మట్టితో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు.వాళ్ళ వెనుక దృశ్యం. ఖాకీ నిక్కరు మీద చొక్కా లేదు. వెనుక ‘ఎక్స్’ ఆకారంలో నిక్కరు పట్టీలు. ఆ రెండుప్రక్కల క్రిందకు జాన దూరంలో రాగి రంగులో ఉన్న రెండు జడలు. ఒక జడ చివర నీలిరంగు రిబ్బన్ కట్టి ఉంది. నిక్కరు వేసుకున్నది ఆడపిల్లా లేక జడలు వేసుకున్న మగపిల్లాడా?... తిరిగి చూస్తే ముఖంలో గాని, స్వరంలో గాని భేదం తెలియలేదు. కేవలం బాల్యరూపం. మిగిలిన పిల్లలు కూడా ఇలాగే నిక్కరుతో ఉన్నారు. చింతాద్రిపేట ఆ సన్నని సందులో వరుసగా దుకాణాలు, కూడా చిన్న చిన్న వీధులు. ఒక సైకిలు రిపేరు దుకాణం ముందు.. అది దుకాణం ముందరి భాగమా లేక వీధిలోనడిచేదా? పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళు అంతా అక్కడి చిన్నచిన్న వీధుల నుండి వచ్చిన వారే!దుకాణదారుడు తన పనిలో నుంచి ఒకసారి ముఖం ఎత్తి వాళ్ళను చూసి చిరునవ్వు నవ్వాడు. సాయంకాలం పూట ఈ రకమైన ఆటలు అక్కడ సాధారణం. గౌను చివర రెండు వ్రేళ్ళతో పట్టుకొని, నెమ్మదిగా ఎత్తిపట్టుకొని, చిరిగిపోయి మాసిన చోటు తెలియకుండా పట్టుకున్న ఆ పిల్ల ‘నేనే! శ్రీదేవిని’ అని ప్రకటించింది.‘‘నిన్న శ్రీప్రియ అని చెప్పావే!’’ అన్నాడు దుకాణదారుడు. ‘‘నిన్న కదా!’’ ఆ చిన్నారి ప్రపంచంలో నేడు అన్నది నిన్న నుంచి ఒక జన్మ దూరం. తొందర తొందరగా వ్యాపించి పోయిన చీకటి. గాలిలో చల్లదనం. దూరంలో ఎక్కడో మందుగుండు సామాన్లు కాలుతున్నట్లు ఎక్కడో దూరంగా ఆకాశంలో ఉరుములు ఉరుముతున్న శబ్దం. వర్షం వస్తుందేమో! పిల్లలు దాగుడుమూతలు, చెడుగుడు వంటి ఆటలు ఆడుకోసాగారు. దగ్గరలో వాహనాల రద్దీకి, ప్రాణాన్ని నిమిషానికొకసారి పణంగా పెట్టే ఆపదను, వీధిలో చెత్తా చెదారం మధ్య శరీరం మట్టితో నిండిపోయినా లెక్కచెయ్యకుండా ఆడారు. కొందరు తమ సంతోషాన్ని, చిరిగిన బట్టలను నవ్వించడం ద్వారా ప్రదర్శించారు. మరికొందరు నాట్యమాడి, ఆ సందువీధిని రంగస్థలంగా చేశారు.వరుస దుకాణాల్లో ఒక పాన్షాపుకు వచ్చే వాడుకదారుడు, చేతిలో వున్న ఐదు రూపాయల నోటును స్టూలు మీద పెట్టి ఎప్పటిలాగే ‘‘50 గ్రాములు వక్కపొడి!’’ అని చెప్పి అక్కడ గోడమీద వాడిన పూలమాలతో ఉన్న గజలక్ష్మి ఫోటోను చూసి చేతులు జోడించాడు. వాడుకదారుని చూపు వీధి మీద పడింది. వీధిలో పది సంవత్సరాల పిల్లవాడు ఒక ప్లేటులో రెండు గాజుగ్లాసుల్లో కాఫీ తీసుకువెళుతున్నాడు. వీధి మలుపులో ఉన్న గీతా కేఫ్ నుండి ఎవరో తెమ్మంటే, వాళ్ళ కోసం తీసుకుపోయే పనివాడులా ఉన్నాడు. పిల్లవాడు కొంచెం ఆగాడు. ఒక గ్లాసు ఎత్తి కొంచెం కాఫీ గుటక వేశాడు. కళ్ళల్లో మెరుపు. పెదవులను నాలుకతో తుడుచుకున్నాడు. పిదప ఆ గ్లాసును పెట్టేసి రెండవగ్లాసును ఎత్తి ముందు మాదిరిగానే ఒక గుక్కెడు కాఫీ తాగి ఆనందించాడు. ఆ తర్వాత నోరు తుడుచుకొని గంభీరంగా ప్లేటు చేతిలో పెట్టుకొని వేగంగా ముందుకు కదిలాడు. ఆ దృశ్యాన్ని చూసి ‘‘అందరూ దొంగవెధవలు. మోసగాళ్ళు!’’ అన్నాడు వక్కపొడి వాడుకదారుడు. నోరు తెరిచి ఎవర్నో తిట్టినందుకు ఏదో తృప్తి కలిగింది అతడికి. రెండు షాపులు దాటి, ఆడుకుంటున్న పిల్లలపై పడింది అతడి దృష్టి. పాతవైనా రంగుల మయంగా ఉన్న చొక్కాలు, నిక్కర్లు, పావడాలు, గౌనులు. ఆ రంగుల్లో ఆ ఖాకీ దీవిని చప్పున గమనించాడు. ‘‘అరే! నిక్కరు జడలు ఆడా–మగా?’’వక్కపొడి దుకాణదారుడు తల బయటకు పెట్టి చూశాడు. ‘‘మగ పిల్లవాడే! పేరు ఉలగనాథన్. తిరుత్తణిలో పుట్టువెంట్రుకలు తీయించాలని మొక్కుబడి పాపం! వీడు కడుపులో ఉండగానే తండ్రి కన్నుమూశాడు. ఈ వీధిలోనే నాలాగే వక్కపొడి దుకాణం పెట్టుకొని ఉండేవాడు. ‘‘చిన్నాన్’’ ముక్కుపొడి దుకాణం అంటే ఈ ఏరియాలో చాలా ప్రసిద్ధి. కారులో కూడా వచ్చి ముక్కుపొడి తీసుకుపోయే వాళ్ళు. సడన్గా ఒకరోజు గుండెపోటు వచ్చి గుటుక్కుమన్నాడు. పాపం! అతడితోపాటే సంపద అంతా పోయింది. వాడి తల్లి అప్పుడప్పుడు కూలిపని, లేదంటే ఏ పని దొరికితే ఆ పని చేసుకొని కడుపు కట్టుకొని పిల్లవాడిని సాకుతోంది. ఈ పిల్లవాడి కోసమే బతుకుతున్నానని తల్లి పదేపదే చెబుతుంది పాపం! వీడిని తిరుత్తణికి తీసుకుపోయి, తలనీలాలు ఇవ్వాలని ఆమెకు ఆశ’’ అన్నాడు దుకాణదారుడు.రిబ్బను కట్టని ఉలగనాథన్ జడ, వాడు గెంతుతూ ఉంటే ఊడిపోయింది. జడలు కట్టిన భాగం గాలిలో ఆడుతూ కంటిలో పడ్తూ ఆటకు అడ్డం పడుతోంది. పిల్లవాడు మాటి మాటికి చికాకుగా ఎడమచేతితో జుత్తును వెనక్కు తోసుకుంటున్నాడు.‘‘ఏం అర్ధనారీశ్వరా! ఒక పిలకకు రిబ్బన్ ఏమైంది?’’ అని పాన్ షాపువాడు అడిగాడు.‘‘నాపేరు అర్ధనారీశ్వరుడు కాదు’’ అని మొదటే సరిదిద్ది, ‘‘మా అమ్మ కట్టలేదు’’ అన్నాడు ఆ పిల్లవాడు.టైము ఉండి ఉండదు. నాలుగు రోజుల పస్తు తర్వాత ఈవేళే ఎక్కడో ఇల్లు కట్టేచోట పని దొరికిందని వెళ్ళింది వీళ్ళ అమ్మ. ఆ మాట ఆ మూడవ ఇంటివాళ్ళు చెప్పారు. వీడికి రిబ్బన్ వేసి కట్టి అందం చూడ్డానికి టైమ్ దొరకాలి కదా?!’’ అన్నాడు సైకిల్ షాపు వాడు. ‘‘ఒక జడ కట్టడానికి టైముంది, ఇంకొక దానికి కట్టడానికి తొందర వచ్చిందా? ఏరా! అర్ధనారీ ఇంటిలో మరో రిబ్బన్ లేదా? లేకపోతే ఒకే జడ వేసుకోవచ్చు కదా! తిరుత్తణి స్వామి వద్దన్నాడా? రెండు జడలు లేకపోతే స్టయిల్కు కొరతా?’’‘‘నా పేరు అర్ధనారీ కాదు. ఇంకొక రిబ్బను ఉంది. అది మా అమ్మకు నచ్చలేదు. వద్దంది.’’‘‘మీ అమ్మ పెద్ద మహారాణిరా! తిండిలేక పస్తులు పడివుంటుందిగానీ, నచ్చే రిబ్బన్ నచ్చని రిబ్బన్ ఒకటా?’’‘ఛీ! జడ పూర్తిగా ఊడిపోయింది.’ అని ఉలగనాథన్, ఊడిపోయిన పిలకజుత్తును చేతిలో పట్టుకొని, దానివంక కోపంగా చూశాడు.‘‘ఉన్న రిబ్బన్తో కట్టి ఉండొచ్చుకదా మీ అమ్మ? ఇప్పుడు పడు అవస్థ! ఏరా అర్ధనారీ నీవైనా పిలక కట్టుకోకూడదు?’’ అన్నాడు పాన్ షాపువాడు. ఉలగనాథన్ బదులు చెప్పలేదు.‘‘ఏరా! కుర్రాడా! అడుగుతూనే ఉన్నాను నువ్వేం బదులు పలకడంలేదు పొగరా?’’‘‘అర్ధనారీ! అని పిలిస్తే బదులు చెప్పను.’’‘‘శభాష్! బాగా చెప్పావురా! ఇంతలోనే పెద్దమనిషివి అయిపోయావా? సరే పోనీ! నీకు జడ కట్టుకోవడం తెలీదా ఉలగూ?’’‘‘ఉహూ! ఈ శనినివదిలించుకోవాలంటే అమ్మ వినడంలేదు.’’‘‘ఛీ! ఛీ! స్వామికిచ్చేదిరా! శని–గిని అని మాట్లాడకూడదు. కళ్ళుపోతాయి. స్వామిని తలచుకొని మన్నింపుకోరి, చెంపలు వేసుకో!’’ఉలగనాథన్ భయపడి స్వామిని తలచుకోసాగాడు. గీతా కేఫ్లో డబుల్ సెవెన్ తాగి చేతిలో జంతికల పొట్లంలోని జంతికలు కొరుక్కు తింటూ వస్తున్న యువజంట, ఈ పిల్లలను చూసి నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి, ఒకొక్కరికి ఒకొక్క జంతిక ఇచ్చారు. రెప్పపాటు కాలంలో ఆట ఆగిపోయి, చురుకుగా వాళ్ళ కళ్లు మెరిశాయి. చేతులు ఎండాయి. ఒక చిన్న పాప జంతిక కొంచెం కొరికి, మిగిలింది చివరిన గౌనులో జాగ్రత్తగా ముడివేసుకుంది. ఇంకొక పాప తొందరగా మురికిగా ఉన్న చేతితో జంతికను నోటినిండా కూరుకొని, నోరు అరచేయితో మూసుకొని, జంతికను రెండే రెండు గుటకల్లో మింగేసి మళ్ళీ చెయ్యి చాపింది. ఒక పిల్లవాడు జంతిక తిన్న తర్వాత దట్టంగా మురికి పట్టిన నిక్కరు వెనుక పక్క చేతిని తుడుచుకున్నాడు. ఉలగనాథన్ నోరు ఊరింది. అయినప్పటికి చేతులు వెనక్కు పెట్టుకొని గీరగా ‘‘నాకు వద్దు’’ అన్నాడు. ‘‘ఏరా! బాబూ! ఏం అలా? జంతిక బాగుంటుంది వీళ్ళంతా తింటున్నారుకదా! నువ్వూ తీసుకో!’’ అని ఆ యువజంట బలవంతం చేసింది.ఉలగనాథన్ గట్టిగా ‘‘వద్దు’’ అన్నట్లు తల ఆడించాడు. కళ్ళు జంతికల మీద పడినప్పుడు కళ్ళల్లో నీరు తిరిగింది. దానితోపాటు నోరు ఊరింది. జంతికను లాక్కోవాలని ఉన్నా, కడుపు ఖాళీగా ఉన్నా కూడా వద్దని చెప్పాడు.‘‘ఊహు! వద్దు!’’‘‘ఏరా?’’‘‘మా అమ్మ ఎవరి దగ్గరా చెయ్యి చాపకూడదు అని చెప్పింది. ఈవేళ పని చేసి కూలి తీసుకొని, నాకు ఒక బన్ తీసుకువస్తానని చెప్పింది.’’‘‘సరే! పోరా! పెద్దగా బెట్టు ఎప్పుడు నేర్చుకున్నావ్? ఊ! తలరాత అలావుంటే ఎవరు మార్చగలరు? పస్తుండు! చెయ్యి చాపడు కదా దొర! పెద్ద జమీందారు పరంపర అనుకుంటున్నాడు. అవునురా అర్ధనారీ..! సారీ! మిష్టర్ ఉలగనాథన్’’ అని వేదనతో కూడిన కోపంతో మాట్లాడి దుకాణం లోపలకు వచ్చి వ్యాపారం గమనించసాగాడు. ఆ వాడుకదారు పోయి, మరికొంత మంది వచ్చారు. వీధిలో జనం వస్తూ పోతూ ఉన్నారు. ఆటలాడుకుంటున్న పిల్లలు ఒకొక్కరే వెళ్ళిపోయారు. వాన చినుకులతోనే సరిపెట్టుకుంది. పెద్దది అవలేదు. ఎక్కడో పడుతున్న పెద్ద వర్షానికి తోకలా మేఘాల్లో ఒక ఇంద్రధనుస్సు తొంగి చూసింది.‘‘ఇంద్రధనుస్సు!’’‘‘రెయిన్ బో!!’’‘‘అక్కడ చూడండి!’’ ‘‘అస్తమిస్తున్న సూర్యుడు రంగురంగులుగా కన్పిస్తున్నాడు. ఇంద్రధనుస్సు కాదు.’’‘‘కాదు! కాదు! ఇంద్రధనుస్సే! పెద్దగా వేరుగా కన్పిస్తుందే! గోళాకారంలో మీదకు పోతోంది చూడండి. తెలియలేదా? అదిగో పచ్చరంగు. ఇంద్రధనుస్సే!’’ఇలా ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఉలగనాథన్ అదేం గమనించలేదు. అతడి కంటి ముందు ఇంకా ఆ జంతికే ఉంది. తోటిపిల్లలు జంతికను ‘కటక్’మని కొరుక్కు తింటున్న శబ్దం ఇంకా చెవిలో పడుతూనే ఉంది. నోటిలో ఊరుతున్న నీటిని బయటకు ఉమ్మాడు.మట్టి తడిసిన వాసన. ఇలాంటి చినుకులతో వాన ఆగిపోతే తర్వాత తప్పక ఉక్క పెరిగిపోతుంది. అయితే ఈ క్షణం చల్లగా గాలి వీచింది. శరీరానికి హాయిగా ఉంది. ఒకరకంగా చల్లదనాన్ని అనుభవించాడు. చొక్కాలేని ఉలగనాథన్ రెండు చేతులు గుండెలపై పెట్టుకొని గట్టిగా పట్టుకున్నాడు. గాలి వెయ్యడంతో కళ్ళల్లో పడుతున్న జడను, తల ఊపి వెనక్కు నెట్టుకోవాలని చూశాడు. సైకిలు షాపు వానితో ‘‘మా అమ్మ వచ్చే వరకు ఇలాగే మెట్లమీద కొంచెం కూర్చునేదా?’’ అని అడిగాడు.‘‘సరే!’’ అన్నాడు. ఓ పక్కగా కూర్చున్నాడు. ఆకాశాన్ని చూశాడు. గమనించి చూస్తే నారింజా, పసుపా, నీలమా, పచ్చా! అని భేదం తెలియకుండా కళ్ళను మోసగించి కరిగిపోతాయి. ఆ రంగులు ఒక గుంపులా అర్ధవృత్తాకారంలో ఇమిడి పోయాయి. సాయంకాలం అవగానే ఆకాశం తన విల్లును ఎత్తుకొని మెల్లగా అదృశ్యం కాసాగింది. ‘‘అరే ఉలగూ! కూర్చొనే నిద్రపోతున్నావా? ఆకలి వేస్తోందా?’’కళ్ళు తెరచినప్పుడే, ఇంతవరకూ కళ్ళు మూసుకొని ఉన్నట్లు వాడికి తెలిసింది. ఎదురుగా చూస్తే అమ్మ! ముఖం వికసించింది.‘‘అమ్మా!’’‘‘ఇంటికి పోదామా! ఇంద! ముందు ఇది తిను.’’చేతిలో ఉన్న ఒక పేపరు పొట్లాన్ని, విస్తరాకులో చుట్టిన పొట్లాన్ని అతడికి ఇచ్చింది. లోపల ఒక బన్, మూడు ఇడ్లీలు ఉన్నాయి.‘‘ఇడ్లీ అమ్మా!!’’ పిల్లవాడు సంతోషంగా అన్నాడు.‘‘నీకే! తిను’’‘‘నీకమ్మా?’’‘‘నేను వచ్చేటప్పుడే టీ తాగాను. ఒక బన్ ఉంది. చాలు. ఇంకా డబ్బులు ఉన్నాయి. రాత్రికి వేరేదయినా కావలిసివస్తే కొనుక్కుందాం!’’ అంది. పిల్లవాడు ఆత్రంగా తినసాగాడు. ఆమె చిరునవ్వుతో పిల్లవాడిని చూసింది. ఆ చిరునవ్వు తప్ప వేరే సంతోషం ఆమె ముఖంలో కన్పించడంలేదు. బక్కగా, ఎండిపోయిన శరీరం. బక్కపలచగా ఉండడం చేత నోరు కొంచెం ముందుకు తీసుకువచ్చినట్లు ఉంది. మాసిపోయిన చీర. చెవుల కన్నాల్లో చీపురుపుల్లలు. బోసిమెడ. చేతులకు మట్టి గాజులు. కళ్ళల్లో అలసట. ఆ ఒక్కరోజే పని చేసిన అలసట కాదు. అది జీవిత యాతనవల్ల కలిగిన అలసట. చెప్పాలంటే ఈ వేళ ఆమె మంచి రోజుల్లో ఒకటి. ఈ వేళ పని దొరికింది. తిండి దొరికింది.చెమటతో నిండిన ముఖాన్ని, మెడను చేతులను తుడుచుకుంది. ‘‘రిబ్బను లేకుండా జడ ఊడిపోయింది కదూ!!’’ అని ఆమె కొడుకు ఊడిపోయిన జుత్తును వేళ్ళతో సవరించి జడవేసింది. తరువాత చివరలో ముడివేసింది. లోపల నుంచి ఒక అడుగు పొడవున్న నీలిరంగు రిబ్బన్ తీసింది. ఒక జడకు అందంగా నీలిరిబ్బన్ కట్టింది.‘‘ఇంటిలో ఉన్న ఇంకొకటి నల్లటిది కదూ! అది ఎలా కట్టడం? అది ఎలా నీలిరంగుతో జోడీ అవుతుంది? రెండు జడల్లో ఒకొక్క దానికి ఒకొక్క రంగు రిబ్బన్ కడ్తే అసహ్యంగా ఉండదా? అందుచేత ఈ వేళ దొరికిన డబ్బులతో దీనికి జతగా ఇంకొక నీలిరంగు రిబ్బన్ కొని తెచ్చాను.’’ అని మాట్లాడుతూ ఆ నీలిరిబ్బన్ కొడుకు రెండవ జడకు కట్టింది. రెండు జడల్ని మార్చిమార్చి జోడీగా చూస్తే ఆమె రెండుకళ్ళు కాంతితో నిండాయి. ‘‘ఇప్పుడు ఎంతో బాగుంది. రెండు జడలు వాటి రిబ్బన్లు రెండూ ఒకేరంగులో ముచ్చటగా ఉన్నాయి.’’షాపు మూసెయ్యడానికి తయారుగా వాకిలి తలుపు దగ్గరకు వచ్చిన పాన్షాపు వాని దృష్టిలో ఆ దృశ్యం పడింది. రెండు జడలకు వేసిన నీలి రిబ్బన్లతో ఆమె కొడుకు ఉన్నాడు. ఆ వెనుక తల్లి, రెండు రిబ్బన్లు మార్చిమార్చి చూసి, జత అందాన్ని చూసి మురిసిపోతున్న ఆమె కళ్ళల్లో కాంతిని కొంచెంసేపు చూశాక అతడి చూపు ఆకాశంలోకి పోయింది. అక్కడ ఇప్పుడు ఇంద్రధనుస్సు లేదు. ఉరుముల కారణంగా కొంచెంసేపటి వరకు బయటకు వచ్చి అంతర్ధానమైంది ఇంద్రధనుస్సు. అయితేనేం ఆకాశాన్ని ఎంత అందంగా అలంకరించింది. అతడు మళ్ళీ ఉలగనాథన్ తల్లిని చూశాడు. ఆమె తాను కట్టిన రెండవ జడను తృప్తిగా చేతితో పట్టుకొని చూస్తోంది. ఇంద్రధనుస్సు ఆమె చేతిలో ఒక నీలిరిబ్బన్ రూపం దాల్చింది. -
సముద్రంలో పోయింది.. రెండేళ్లకు దొరికింది!
ఒకినావా: ఒక్కోసారి సినిమాల్లోకంటే నిజజీవితంలో జరిగే అద్భుతాలు మనల్ని ఎంతో థ్రిల్ చేస్తాయి. అలాంటి ఓ ఘటనే థాయ్లాండ్లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. జపాన్లోని ఒకినావా బీచ్కు సరదాగా సర్ఫింగ్కు వెళ్లిన సెరినా సుబకిహారా సముద్రంలో తన కెమెరాను పోగొట్టుకున్నాడు. ఎంతగా వెతికినా దొరకలేదు. సముద్రగర్భంలో కలిసిపోయిందనుకొని ఆశలు వదిలేసుకున్నాడు. ఇది జరిగి రెండేళ్లయింది. కానీ ఆయనతోపాటు ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఆ కెమెరా మళ్లీ దర్శనమిచ్చింది. అదీ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయ్లాండ్లో..! ఇదే ఆశ్చర్యం కలిగించే విషయమైతే.. ఆ కెమెరా చెక్కు చెదరకుండా.. పర్ఫెక్ట్గా పనిచేసే కండిషన్లో, ఫుల్ చార్చింగ్తో ఉందట. అదెలా దొరికిందటే.. లీ అనే వ్యక్తి పిల్లలతో కలిసి సరదాగా బీచ్కు వెళ్లాడు. అక్కడ తమకు దొరికిన కెమెరాను పిల్లలు లీకి తెచ్చి ఇచ్చారు. అప్పటికే దానిచుట్టూ నాచు, షెల్స్ వంటివి పేరుకుపోయాయి. వాటన్నింటినీ తొలగించి చూస్తే కెమెరా కనిపించింది. ఆన్ ఆఫ్ బటన్ నొక్కగానే ఆశ్చర్యకరంగా కెమెరా ఆన్ అయింది. పైగా అందులో బ్యాటరీ కూడా ఫుల్గా ఉందట. దీంతో ఎలాగైనా దానిని పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయాలనుకున్నారు. అందుకు ఫేస్బుక్ను వేదికగా ఎంచుకొని విషయమంతా ఫొటోలతో సహా అందులో రాశారు. అలా.. చివరకు తన కెమెరా గురించి తెలుసుకున్న సెరినా సుబకిహారా ఎంతో ఆనందపడ్డాడు. కెమెరాను తిరిగి ఇచ్చినందుకు లీ, పిల్లల బృందానికి థ్యాంక్స్ చెప్పాడు. రెండేళ్లు నీళ్లలో ఉన్నా చెక్కు చెదరకుండా కాపాడిన వాటర్ప్రూఫ్ కేస్కు, కెమెరా తన వద్దకు చేరడానికి సహకరించిన ఫేస్బుక్ స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు. -
నావ.. మునగదిక..!
ఇలాంటి షిప్ ముందే తయారై ఉంటే ‘టైటానిక్’ మునగకపోయి ఉండేదేమో..! ‘టైటానిక్’ అనే ఓ అద్భుతమైన సినిమా వచ్చి ఉండకపోవచ్చేమో..! ఇలా ఎందుకు అంటున్నామంటే.. ఈ ఫొటోలో ఉన్న షిప్ పేరు ‘థండర్ చైల్డ్’. సముద్రాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు మనుషులను వెతికి ప్రాణాలు కాపాడేందుకు దీన్ని వినియోగిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నీటిలో అస్సలంటే అస్సలు మునగదు. ఆఖరికి బోల్తా కొట్టినా కూడా నీటిలో మునిగిపోదు! అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు వీలుగా ఐర్లండ్ నేవీ ఈ షిప్ను తయారు చేసింది. సేఫ్ హెవెన్ మెరైన్ అనే ఐరిష్ కంపెనీ దీన్ని అభివృద్ధి పరిచింది. ఇది సముద్రంలో గంటకు 62 మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. 10 మంది ప్రయాణించేందుకు వీలున్న ఈ షిప్ను సముద్రంలోని బలమైన ఆటుపోటులను తట్టుకునేలా తయారు చేశారు. ఇందులోని కేబిన్ లోపల ఎప్పుడూ గాలి నింపి మునిగిపోకుండా చేశారు. అంటే ఒక రకంగా మన టైర్లలో ఎప్పుడూ గాలి ఉండాలి కదా అలా అన్నమాట. -
హోలీ వేడుకల్లో అపశ్రుతి.. ముగ్గురు గల్లంతు
సాక్షి, బరంపురం: హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గోపాల్పూర్ సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం ఒడ్డుకు చేరుకోగా మిగిలిన ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. బినాయక్ ఆచార్య కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శి డి.హితీష్, ప్రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన సిద్ధాంత్ పాత్రో, ఎ.లోకేష్లతో సహా వివిధ కళాశాలలకు చెందిన 19 మంది విద్యార్థులు శుక్రవారం హోలీ పండగ చేసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం గోపాల్పూర్ సముద్ర తీరానికి స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో అలల ఉద్ధృతికి నలుగురు విద్యార్థులు కొట్టుకుపోగా ఒకరిని స్థానికులు రక్షించారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సిద్ధంత్ పాత్రో మృతదేహం హరిపురం తీరంలో ఒడ్డుకు చేరింది. హితీష్, ఎ.లోకేష్ల జాడ దొరకలేదు. వీరిద్దరి కోసం మెరైన్, గోపాల్పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. -
ఏం జరుగుతోంది?
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో స్వేచ్ఛగా సంచరించే విభిన్న జీవరాశులు విగతజీవులుగా విశాఖ తీరానికి చేరుతున్నాయి. మునుపెన్నడూ చూడని జలచరాలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. తీరం వెంట ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) సహకారంతో కాలుష్య నియంత్రణ మండలి సిద్ధమవుతోంది. 2019 నాటికి సమగ్ర నివేదిక ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. గత రెండు నెలలుగా లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్లతోపాటు అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు, స్టింగ్ రే (టేకు చేప), ముళ్ల చేప తదితరాలు మరణించి తీరానికి కొట్టుకొస్తున్నాయి. అసలు సాగర గర్భంలో ఏం జరుగుతోంది? అరుదైన జీవరాశులు ఇలా విగత జీవులు ఎందుకవుతున్నాయి అనేది నిగ్గు తేల్చనున్నారు. విశాఖ జిల్లావ్యాప్తంగా ఉన్న తీరం వెంట కాలుష్యాన్ని అధ్యయనం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఫార్మా, రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల నిర్వహణ సరిగా లేదనీ, వాటిని సముద్ర జలాల్లోకి విడుదల చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైడి భీమవరం నుంచి పాయకరావుపేట వరకూ సుమారు 200 కి.మీ. వరకూ ఉన్న తీరంలోని సముద్ర జలాల నమూనాలను సేకరించి, పరీక్షించి నివేదిక ఇవ్వాలని ఎన్ఐవోను కాలుష్య నియంత్రణ మండలి కోరింది. నైరుతి రుతుపవనాలకు ముందు, ఆ తర్వాత తీరంలోనూ, సముద్ర గర్భంలోనూ జరిగే పరిణామాలపై విశ్లేషణాత్మక అధ్యయనం జరగనుంది. దీనికోసం ఎన్ఐవోకు రూ.2 కోట్లు చెల్లించేందుకు మండలి అంగీకరించింది. 2009లోనూ ఎన్ఐవో ఈ తరహా అధ్యయనం నిర్వహించి నివేదికను 2010లో అందించింది. సముద్రంలో కాలుష్యం అంతగా లేదని నివేదికలో పేర్కొనడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తాజా అధ్యయనంలో భాగంగా పారిశ్రామిక వ్యర్థాలు వదిలే 11 చోట్ల నమూనాలు సేకరించడంతోపాటు మరికొన్ని కీలక అనుమానిత ప్రాంతాల్లోనూ సముద్రంలోని నీటి నమూనాలు తీసుకుంటారు. దీంతోపాటు తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడి నీటి శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని ప్రయోగశాలలో పరిశీలించి విశ్లేషణాత్మక నివేదికను రూపొందించి 2019లో ఎన్ఐవో నివేదిక సమర్పించనుంది. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర సముద్ర కాలుష్యం పెరుగుతుంది? ఎలా పెరుగుతుంది? వంటి అంశాలను నివేదికలో పొందుపరచనుంది. ఎన్ఐవోతో సముద్ర జలాల కాలుష్యంపై అధ్యయనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. విశాఖలో తీరం వెంట ఉన్న ప్రతి అనుమానిత ప్రాంతంలోనూ నమూనాలు సేకరించి వాటి స్థితిగతులు, కాలుష్యం మోతాదు వంటి అంశాలపై నిశిత పరిశీలన చేసి అధ్యయనం చేయాలని ఎన్ఐవో అధికారులకి సూచించాం. ఏడాదిలోపు నివేదిక అందించనున్నారు. – ఎన్వీ భాస్కరరావు, ఏపీపీసీబీ సంయుక్త ప్రధాన పర్యావరణ ఇంజనీర్, విశాఖపట్నం -
తూర్పు చైనా సముద్రంలో నౌకల ఢీ
బీజింగ్ : తూర్పు చైనా సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ నౌక, సరకు రవాణా నౌక ఢీకొన్న ప్రమాదంలో ట్యాంకర్కు చెందిన మొత్తం 32 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 30 మంది ఇరాన్ దేశస్తులు కాగా ఇద్దరు బంగ్లాదేశీయులు. ఇరాన్ నుంచి 1.36 లక్షల టన్నుల ముడి చమురుతో వెళ్తున్న సాంచీ అనే రవాణా నౌక శనివారం సాయంత్రం షాంఘైకి 160 నాటికల్ మైళ్ల దూరంలో చైనాకు చెందిన, 64 వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న సీఎఫ్ క్రిస్టల్ అనే మరో సరకు రవాణా నౌకను ఢీకొట్టింది. ముడిచమురు కావడంతో వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్కు చెందిన 32 మంది సిబ్బంది గల్లంతవ్వగా, క్రిస్టల్ నౌకలోని మొత్తం 21 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ముడి చమురు వ్యాపించడంతో సముద్ర జలాలు కలుషితమయ్యాయని చైనా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి కూడా సాంచి ఇంకా నీటిపై తేలుతూ, మండుతూనే ఉందనీ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. గల్లంతైన వారిని వెతికేందుకు చైనా సముద్రతీర విభాగం అధికారులు 8 ఓడలను పంపించారు. దక్షిణ కొరియా కూడా ఓ విమానాన్ని, తీర ప్రాంత రక్షణ దళానికి చెందిన ఓ నౌకను పంపించి గాలింపు చర్యలు చేపడుతోంది.