-
Vizag : విశాఖలో ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
విశాఖ తీరం : మహా కోటి శివ లింగానికి భక్తుల రద్దీ (ఫొటోలు)
-
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను ఆర్కే బీచ్లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్క్రాఫ్ట్ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
విశాఖ బీచ్ సూపర్
విశాఖ సిటీ: విశాఖ ఆర్కే బీచ్ అందానికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టీవ్ హార్మిసన్ ఫిదా అయ్యాడు. భారత్లో తాను చూసిన బీచ్లలో రామకృష్ణ బీచ్ అత్యంత శుభ్రమైనది అని కితాబిచ్చాడు. భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కోసం హార్మిసన్ విశాఖకు వచ్చాడు. ఆయన మ్యాచ్ చివరి రోజు ఆర్కే బీచ్ను సందర్శించాడు. హార్మిసన్ యూకేకు చెందిన టాక్స్పోర్ట్స్ చానల్తో మాట్లాడుతూ భారత్లో తాను అనేక బీచ్లను సందర్శించానని, విశాఖ ఆర్కే బీచ్ ఉన్నంత క్లీన్గా మరెక్కడా కనిపించలేదన్నాడు. రోడ్డుకు అతి సమీపంలోనే బీచ్ ఉండడం, యంత్రాల ద్వారా క్లీనింగ్ చేయడం అద్భుతంగా ఉందని చెప్పాడు. విశాఖ ప్రజలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని హార్మిసన్ ప్రశంసించాడు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో... రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విశాఖ సముద్ర తీర ప్రాంతాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. సముద్రం కోతకు గురికాకుండా విశాఖ పోర్టు డ్రెడ్జింగ్ చేపడుతోంది. గతంలో లేని విధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ప్రత్యేక పర్యాటక బీచ్లను అభివృద్ధి చేస్తోంది. రుషికొండ బీచ్లో కల్పించిన సదుపాయాల కారణంగా ప్రతిష్టాత్మకమైన బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ -
కిక్కిరిసిన సాగర తీరం.. ఆర్కే బీచ్లో ఘనంగా నేవీ డే విన్యాసాలు (ఫొటోలు)
-
విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే వేడుకలకు సర్వం సిద్ధం
-
భయంకరంగా మిచాంగ్ తుఫాన్..
-
విశాఖ బీచ్ లో వైజాగ్ మారథాన్ వేడుకలు
-
విశాఖ RK బీచ్ లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతు
-
విశాఖ బీచ్లో భారీ చెక్కపెట్టె.. ఇంతకీ ఆ బోషాణంలో ఏముంది?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరానికి భారీ బోషాణం (చెక్క పెట్టె) కొట్టుకు రావడం కలకలం రేపింది. ఆ పెట్టెలో ఏముందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందులో భారీ ఎత్తున నిధులు ఉండే అవకాశం ఉందని కొందరు.. స్మగ్లర్లు విలువైన వస్తువుల్ని అందులో దాచి ఉంటారని ఇంకొందరు.. శత్రు దేశాలు విధ్వంసం సృష్టించేందుకు పంపించిన బాక్స్ అని మరికొందరు పేర్కొనడంతో శుక్రవారం రాత్రంతా బాంబ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు పహారా కాశారు. శనివారం ఉదయానికి ఈ సమాచారం ఆ నోటా.. ఈ నోటా ప్రచారం కావడంతో భారీ పెట్టెను చూసేందుకు వేలాదిగా జనం ఎగబడ్డారు. చివరకు అది సముద్రం మధ్య నౌకల లంగర్ వేసేందుకు వినియోగించే స్లీపర్ బార్జ్ (చెక్క దిమ్మె)గా నిర్థారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అలల ఒడిలో.. భారీ వస్తువు! విశాఖ సాగర తీరంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అలల మధ్య భారీ వస్తువేదో కదులుతున్నట్టు సందర్శకులు గుర్తించారు. తొలుత అది భారీ సముద్ర జంతువు అని భయాందోళన చెందారు. ఒడ్డుకు పరుగులు తీశారు. రాత్రి పహారాకు బీట్ కానిస్టేబుళ్లకు కొందరు సమాచారం అందించగా.. అది ఒక భారీ చెక్క పెట్టె అని గుర్తించారు. చైనా, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏవైనా పేలుడు పదార్థాలున్నాయా అని భయాందోళనలకు గురయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలెర్ట్ అయిన సిటీ సెక్యూరిటీ వింగ్ పొక్లెయిన్ల సాయంతో బాక్స్ను ఒడ్డుకు తీసుకొచ్చింది. అది పురాతన బాక్స్గా కనిపించడంతో అందరి అనుమానాలు మరింత బలపడ్డాయి. కొందరు బాంబులు ఉన్నాయేమో అని భయపడగా.. భారీ నిధితో కూడిన పెట్టె ఒడ్డుకు వచి్చందని మరికొందరు భావించారు. భద్రతా బలగాలు బీచ్కు చేరుకుని ప్రజల్ని అప్రమత్తం చేశాయి. బీచ్ రోడ్డుని క్లియర్ చేశాయి. శనివారం ఉదయం ఆ భారీ పెట్టె మిస్టరీని ఛేదించేందుకు బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. చేతులతో దానిని తెరిచేందుకు బాంబ్ డిస్పోజల్ టీమ్ ప్రయత్నించగా.. సాధ్యం కాలేదు. బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో చెక్ చేశారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని గుర్తించారు. జీవీఎంసీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న రెండు పొక్లెయిన్లను పోలీసులు రంగంలోకి దించారు. 14 గంటల నిరీక్షణ తరువాత.. సమాచారం అందుకున్న ఆర్కియాలజీ బృందం చేరుకుని బాక్స్ను క్షుణ్ణంగా పరిశీలించింది. ఇది పురాతన కాలం నాటి పెట్టె కాదని.. రెండు నుంచి నాలుగేళ్ల క్రితం బర్మా టేకుతో తయారు చేసిన పెట్టె అని నిర్థారించింది. 10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల దానిని విడదీసేందుకు ప్రయత్నించగా.. చివరకు అది కేవలం చెక్క దిమ్మెగా గుర్తించారు. ఆర్కియాలజీ బృందంతో పాటు మత్స్యకారులు, పోర్టు అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరపగా.. అది నౌకల్లో వినియోగించే స్లీపర్ బార్జ్ అని స్పష్టమైంది. చిన్న సైజు నౌకలు అలల తాకిడికి గురైనప్పుడు అవి దెబ్బ తినకుండా కర్రలతో చేసిన స్లీపర్ బార్జ్లను ఒక బ్లాక్గా బిగించి వినియోగిస్తారని తేలింది. సముద్రం మధ్యలో షిప్లని లంగరు వేసేందుకు వీటిని ఉపయోగిస్తారని తెలిసింది. కంటైనర్ కార్గో వెసల్స్ నుంచి కంటైనర్లను దించే సమయంలోనూ ఈ తరహా బార్జ్లను వినియోగిస్తుంటారనీ.. వాటిలో ఒకటి షిప్ నుంచి విడిపోయి ఇలా కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి విశాఖ నగరానికి 14 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా.. ఓవైపు ఆందోళనల్ని.. మరోవైపు ఉత్కంఠని కలిగిస్తూ.. యాక్షన్ సినిమా తలపించిన భారీ చెక్క కథ సుఖాంతమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: మత్స్యకారులకు కష్టాలుండవిక -
సాక్షి టీవీ రిపోర్టర్పై టీడీపీ కార్యకర్తల దాడి
విశాఖపట్నం: ఆర్.కె.బీచ్లో మంగళవారం రాత్రి జరిగిన చంద్రబాబునాయుడు సభ కవరేజీకి వెళ్లిన ఆరిలోవ జోన్ ‘సాక్షి’ టీవీ రిపోర్టర్ సురేష్పై టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. సుమారు 30 మంది వరకు దుర్భాషలాడుతూ సురేష్ సెల్ఫోన్ లాక్కొని.. పిడిగుద్దులు గుద్దుతూ బయటకు నెట్టేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారించినా వినకుండా పెట్రేగిపోయారు. ఈ దాడిపై మూడో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ కోరాడ రామారావుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. టీడీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం
-
ఆర్కే బీచ్: దీపక్కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ఆర్కే బీచ్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సరదా కోసం సముద్రంలో ఈతకు దిగిన యువకుడు అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి కొట్టికుపోయాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన బీచ్ లైఫ్ గార్డ్స్ అతడిని రక్షించారు. వివరాల ప్రకారం.. ఈరోజు ఆదివారం కావడంతో ఆర్కే చీచ్ వద్దకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక, పలు పక్క రాష్ట్రం ఒడిషా నుంచి కూడా కొందరు పర్యాటకులు అక్కడికి వచ్చారు. కాగా, వీరిలో దీపక్(26) అనే వ్యక్తి ఈత కోసం సముద్రంలోకి దిగాడు. సరదాగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సముద్ర అలలు ఎక్కువయ్యాయి. అలల తాకిడికి దీపక్ సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దీంతో, వెంటనే రంగంలోకి దిగిన బీచ్ లైఫ్ గార్డ్స్ దీపక్ను రక్షించారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఇది కూడా చదవండి: నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో.. -
పాము..19 పిల్లలు ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి
-
విశాఖలో టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు
-
విశాఖ ఆర్కే బీచ్ లో సైకిల్ ర్యాలీ నిర్వహించిన GVMC,PCB
-
YMCA బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి
-
Vizag : విశాఖ ఆర్కే బీచ్లో జి 20 సదస్సు సన్నాహక మారథాన్ (ఫొటోలు)
-
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో విజయవంతంగా మారథాన్
-
భక్తులతో కిటకిటలాడుతోన్న విశాఖ ఆర్కే బీచ్
-
‘కేజ్ కల్చర్’.. అసలేంటీ కథ..!
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో పంజరం వంటివి ఏర్పాటు చేసి వాటిలో చేపలను పెంచే విధానాన్ని కేజ్ కల్చర్గా పేర్కొంటారు. వీటిలో పెరిగే చేపలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఇలాంటి కేజ్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్ల నుంచి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు విశాఖ ఆర్కే బీచ్కు సమీపంలో సముద్రంలో కేజ్లను అమర్చి పరిశోధనలు సాగిస్తున్నారు. వీరు అక్కడ ఉన్న 30 కేజ్ల్లో వివిధ రకాల చేపలను పెంచుతున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) ద్వారా మత్స్యకారులతో పాటు వివిధ కులాల మహిళలకు ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, మత్స్యకార మహిళలకు 60 శాతం, బీసీ మత్స్యకారులకు 40 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. ఇలా విశాఖ జిల్లాకు 18 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో జనరల్ కేటగిరీ వారికి 14, ఎస్సీలకు 4 చొప్పున కేటాయించారు. ఒక్కో యూనిట్ విలువ రూ.5 లక్షలు. ఇందులో 10 శాతం లబ్దిదారు వాటాగా భరిస్తే సబ్సిడీ సొమ్ము 40/60 శాతం) పోగా మిగిలినది బ్యాంకు రుణంగా సమకూరుస్తోంది. సబ్సిడీ సొమ్మును లబ్ధిదారునికి దశల వారీగా చెల్లిస్తారు. విశాఖ జిల్లాలో బి.రేవతి అనే మహిళకు 10 ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేశారు. వీటిని సీఎంఎఫ్ఆర్ఐ నిర్వహిస్తున్న కేజ్ల సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేజ్ల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని సీఎంఎఫ్ఆర్ శాస్త్రవేత్తలే అందజేస్తారు. అంతేకాదు.. వీరి పర్యవేక్షణలోనే కేజ్ల్లో చేపల పెంపకం కూడా జరుగుతుంది. చేప పిల్లలు, మేత, రవాణా తదితర అవసరాలకు సీఎంఎఫ్ఆర్ఐ సహకరిస్తుంది. విశాఖలో సముద్రంలో కేజ్ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. నెల రోజుల్లో వీటిలో చేపల పెంపకం ప్రక్రియ ప్రారంభమవుతుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేజ్ల నిర్మాణం ఇలా.. ఒక్కో ఓపెన్ సీ కేజ్ను ఆరు మీటర్ల వ్యాసార్ధంలో, నాలుగు మీటర్ల లోతులో రబ్బరు ట్యూబ్లు, పీవీసీ పైప్లతో నిర్మిస్తారు. వీటికి ప్లాస్టిక్ డ్రమ్ములు, వెదురును కూడా ఉపయోగిస్తారు. చుట్టూ ఔటర్, ఇన్నర్ నెట్లను ఫ్రేమ్ల మాదిరిగా అమరుస్తారు. ఈ కేజ్లు కొట్టుకుపోకుండా సముద్రంలో లైన్లు, యాంకరింగ్కు వీలుగా చైన్లను ఏర్పాటు చేస్తారు. ఈ కేజ్ల్లో పండుగప్పల పెంపకం విశాఖలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కేజ్ల్లో పండుగప్ప రకం చేపలను పెంచనున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో పండుగప్ప చేపలకు మంచి డిమాండ్ ఉంది. ఈ పండుగప్ప చేప పిల్లలను (3–4 అంగుళాల పొడవు) పాండిచ్చేరి సమీపంలోని సీడ్గాళిలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ నుంచి తీసుకొచ్చి ఈ కేజ్ల్లో పెంచుతారు. 10–12 నెలల్లో చేప పూర్తి స్థాయిలో (కిలో వరకు బరువు) ఎదుగుతుంది. ఇలా ఒక్కో కేజ్ నుంచి 2–3 టనునల చేపల దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో పండుగప్ప ధర రూ.500–700 వరకు పలుకుతోంది. -
విశాఖ ఆర్ కె బీచ్ లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
-
విశాఖ : సందర్శకులతో కిటకిటలాడుతున్న ఆర్కేబీచ్ ( ఫొటోలు)
-
వయ్యారి గాలిపటం.. పైపైకి ఎగిరే.. (ఫొటోలు)
-
Andhra Pradesh: ఇక టూరిస్ట్ పోలీసింగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ వెళ్లే పర్యాటకులను ‘హాయ్ వెల్కం టు వైజాగ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ’.. ‘ఇన్ వైజాగ్ యూ కెన్ సీ ఆర్కే బీచ్, రుషికొండ, భీమిలి, కైలాసగిరి, సింహాచలం టెంపుల్. ఇఫ్ యూ హేవ్ ఎనీ ప్రాబ్లమ్. ప్లీజ్ కాంటాక్ట్ అజ్’ అంటూ ప్రేమగా పలకరించేందుకు ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసులు అందుబాటులోకి రానున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు సమస్త సమాచారాన్ని అందిచడంతో పాటు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా టూరిస్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మొదటగా విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ కియోస్క్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పర్యాటక ప్రదేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఉమ్మడి విశాఖలో చూడదగిన పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని బ్రోచర్ల రూపంలో అందుబాటులో ఉంచనున్నారు. పర్యాటకులు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా.. ఎవరైనా తప్పిపోయినా వీరికి ఫిర్యాదు చేస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. పర్యాటకుల నుంచి ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే కూడా వీరికి సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి ప్రయాణం సాఫీగా సాగేలా చూడటంతోపాటు మరోసారి వచ్చే విధంగా ఆకర్షించేందుకు టూరిస్ట్ పోలీసింగ్ తోడ్పడుతుందనేది ప్రభుత్వ వర్గాల భావన. జీ–20 సమావేశాల నేపథ్యంలో.. విశాఖలో వరుసగా వివిధ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 28, 29 తేదీల్లో జీ–20 దేశాల సమావేశాలకు కూడా విశాఖ వేదిక కాబోతోంది. దీనికి విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం ప్రతినిధులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసింగ్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 55 ప్రాంతాల్లో 200 వరకూ జీ–20 గ్రూప్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. 2016 నుంచీ చేయాలనుకున్నా.. వాస్తవానికి దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీసింగ్ అభివృద్ధి చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఇందుకు అనుగుణంగా 2016లోనే ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఈ విధానం అమలుకు నోచుకోలేదు. 2019లో 25 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కోవిడ్ నేపథ్యంలో అమలుకు నోచుకోలేదు. తాజాగా జీ–20 సమావేశాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ విశాఖలో ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కియోస్క్ ఏర్పాటు చేస్తున్నాం విశాఖ నగరంలో టూరిస్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ఆర్కే బీచ్ ప్రాంతంలో మొదటగా ఒక కియోస్క్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా పర్యాటకులకు సేవలందించేందుకు పోలీసులు అందుబాటులో ఉంటారు. తర్వాత మిగిలిన పర్యాటక ప్రదేశాలైన భీమిలి, రుషికొండ, తెన్నేటి పార్కు, కైలాసగిరి, యారాడ వంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. – శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
శివమ్ దూబేపై వేటు.. వరల్డ్కప్ జట్టులో ఫినిషర్కు చోటు!
కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
ఇరాన్ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!
జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి
సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
తప్పక చదవండి
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement