rk beach
-
విశాఖ ఆర్కే బీచ్ లో ఇసుక లారీ బీభత్సం
-
ఆర్కేబీచ్ రోడ్డులో లారీ బీభత్సం
సాక్షి,విశాఖపట్నం:విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో మంగళవారం(ఫిబ్రవరి 18) ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. నోవాటెల్కు ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లోకి ఇసుకలారీ దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్,మరొకరికి గాయాలయ్యాయి.బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.గతంలో ఇదే ప్రాంతంలో రెండుసార్లు ప్రమాదాలు జరగడం గమనార్హం. -
విశాఖపట్నం : ప్రేమసాగరం ఆర్కేబీచ్లో ప్రేమికుల సందడి (ఫొటోలు)
-
విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు)
-
విశాఖపట్నం బీచ్ : అలలు పోయి.. శిలలు పైకి పర్యాటకులు సెల్ఫీలు (ఫొటోలు)
-
సత్తా చాటిన నౌకాదళం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఆర్కె బీచ్ వేదికగా తూర్పు నౌకాదళం సత్తా చాటింది. శనివారం సాయంత్రం బీచ్ వద్ద నౌకాదళం చేసిన విన్యాసాలు నౌకా దళం పటిష్టతను, ప్రతిభా పాటవాలను చాటి చెప్పాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గంటన్నర పాటు భారత నావికా దళ సంపత్తిని ప్రస్ఫుటం చేస్తూ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు చేసిన యుద్ధ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.నౌకాదళం, మెరైన్ కమాండోలు ఒళ్లు గగుర్పొడిచేలా సాహసోపేతమైన విన్యాసాలు చేశారు. యుద్ధ సమయంలో నేవీ కమాండ్ స్పందించే విధానం చూపరుల్ని ఆకట్టుకుంది. ఆయిల్ రిగ్ను పేల్చివేయడం, 8 వేల అడుగుల నుంచి పారాచూట్లతో నిర్దేశిత ప్రాంతంలో మెరైన్ కమాండోలు దిగడం వంటివి ఆకట్టుకున్నాయి. డార్నియర్ హెలికాప్టర్, హాక్ జెట్ ఫైటర్లు, నౌకలపై నుంచి జరిపే ఫైరింగ్తో పాటు దేశీయంగా అభివృధ్ధి చేసిన హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం చివరలో నిర్వహించిన లేజర్, డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. సముద్రంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో అందరినీ ఆకట్టుకున్నాయి. 8న పీఎంచే రైల్వే జోన్కు శంకుస్థాపన: చంద్రబాబునావికాదళం ధైర్యం, సామర్థ్యాలను, దక్షతకు నిదర్శనంగా ఈ విన్యాసాలు నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రైల్వేజోన్కి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఎన్టీపీసీ–జెన్కో సంయుక్తంగా దేశంలోని తొలి భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. విశాఖలో త్వరలో టీసీఎస్ ఏర్పాటు కానుందని, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు వస్తాయని, వచ్చే సంవత్సరం విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు.నేవీకి నగర ప్రజల సహకారం మరువలేనిది: తూర్పు నావికా దళాధిపతిఎటువంటి సవాళ్లనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ చెప్పారు. విశాఖ వేదికగా గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సామాజిక సేవ, పర్యావరణ కార్యక్రమాలలో తూర్పు నావికాదళం భాగమవుతోందని అన్నారు. ఇటీవల నిర్వహించిన నేవీ మారథాన్లో 14 వేల మందికి పైగా ప్రజలు, 9 దేశాలకు చెందిన వారు పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చారని చెప్పారు. తూర్పు నావికాదళానికి విశాఖ ప్రజలు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు మంత్రులు, అధికారులు, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తదితరులు హాజరయ్యారు. -
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్ను స్పోర్ట్గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్ -
విశాఖ : సాగర తీరంలో కొత్త సంవత్సరం జోష్.. యువత సెల్ఫీలు (ఫొటోలు)
-
విశాఖ సాగర తీరం.. కోత ఘోరం!
ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖపట్నం (Visakhapatnam) సాగర తీరంలో కొన్ని రోజులుగా ‘అల’జడి కొనసాగుతోంది. పర్యాటకానికి మణిహారంగా నిలిచిన ఆర్కే బీచ్తో (RK Beach) పాటు పలు ప్రదేశాలు.. ఇప్పుడు తీవ్ర కోతకు గురవుతున్నాయి. తుపాన్లకు తోడు ఇటీవల వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా విశాఖ తీరంలో జరుగుతున్న మార్పులను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న పార్కులో గోడ కూలిపోవడం, నేల కుంగిపోవడం, అంబికా సీ గ్రీన్ హోటల్ ఎదురు కోత పెరగడం వంటివి విశాఖ వాసులను కలవర పెడుతున్నాయి. తీరంలో కోతను నివారించే ప్రయత్నాలు చేపట్టాలని.. నిపుణుల సూచనలతో తీరాన్ని అభివృద్ధి చేసి విశాఖను సంరక్షించాలని అధికారులను విశాఖ వాసులు కోరుతున్నారు. – ఏయూ క్యాంపస్ఎలుగుబంటి కాదు.. మానుపిల్లిగూడెంకొత్తవీధి: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జడుమూరు వద్ద కాఫీతోటల్లో (Coffee Fields) గురువారం ఎలుగుబంటి (Bear) హల్చల్ చేసిందంటూ జరిగిన ప్రచారంపై అటవీ అధికారులు స్పందించారు. తోటల్లో కాఫీపండ్లను తింటున్నది ఎలుగుబంటి కాదని, అది అడవిలో సంచరించే మానుపిల్లి అని తెలిపారు. ఆకారంలో ఎలుగుబంటిని పోలి ఉన్నా.. ఇది సాధుజంతువని, మనుషులపై దాడిచేయదని పేర్కొన్నారు.చదవండి: నల్లమల అభయారణ్యంలో జాలీగా జంగిల్ సఫారీ -
విశాఖ: ఆర్కే బీచ్లో కుప్పకూలిన రిటైనింగ్ వాల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్లో రిటైనింగ్ వాల్ కుప్పకూలిపోయింది. వర్షాల నేపథ్యంలో రిటైనింగ్ వాల్పై ‘సాక్షి’ పలుమార్లు హెచ్చరించినా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.వివరాల ప్రకారం.. విశాఖలో భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అలాగే, ఇందిరా గాంధీ చిల్డ్రన్ పార్క్ సైతం దెబ్బతిన్నంది. గడిచిన పది రోజులుగా పెద్ద సాగర తీరం పెద్ద ఎత్తున కోతతకు గురవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సాక్షి టీవీ హెచ్చరించినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. -
విశాఖలో అలజడిగా మారిన సముద్రం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సముద్రం అలజడిగా మారింది. ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్ను కెరటాలు తాకుతున్నాయి. గతంలో వర్షాలకు రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తీరం భారీగా కోతకు గురవుతోంది. ఫెంగల్ తుపాను సమయంలో సబ్ మెరైన్ వద్ద తీరం కోతకు గురైంది. రాత్రి వేళలో అలలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. -
RK బీచ్ వద్ద అలల ఉగ్రరూపం
-
ఆదివారం విశాఖ సాగరతీరం కిటకిటలాడింది (ఫొటోలు)
-
విశాఖపట్నం బీచ్లో ఫ్రెండ్షిప్ డే సందడి (ఫొటోలు)
-
విశాఖ ఆర్కేబీచ్లో జన సందడి (ఫొటోలు)
-
రాత్రి వేళల్లోనూ విశాఖ బీచ్ ల్లో పర్యాటకుల సందడి
-
Vizag: తీరం.. జనసంద్రం (ఫోటోలు)
-
Vizag : విశాఖలో ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
విశాఖ తీరం : మహా కోటి శివ లింగానికి భక్తుల రద్దీ (ఫొటోలు)
-
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను ఆర్కే బీచ్లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్క్రాఫ్ట్ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
విశాఖ బీచ్ సూపర్
విశాఖ సిటీ: విశాఖ ఆర్కే బీచ్ అందానికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టీవ్ హార్మిసన్ ఫిదా అయ్యాడు. భారత్లో తాను చూసిన బీచ్లలో రామకృష్ణ బీచ్ అత్యంత శుభ్రమైనది అని కితాబిచ్చాడు. భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కోసం హార్మిసన్ విశాఖకు వచ్చాడు. ఆయన మ్యాచ్ చివరి రోజు ఆర్కే బీచ్ను సందర్శించాడు. హార్మిసన్ యూకేకు చెందిన టాక్స్పోర్ట్స్ చానల్తో మాట్లాడుతూ భారత్లో తాను అనేక బీచ్లను సందర్శించానని, విశాఖ ఆర్కే బీచ్ ఉన్నంత క్లీన్గా మరెక్కడా కనిపించలేదన్నాడు. రోడ్డుకు అతి సమీపంలోనే బీచ్ ఉండడం, యంత్రాల ద్వారా క్లీనింగ్ చేయడం అద్భుతంగా ఉందని చెప్పాడు. విశాఖ ప్రజలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని హార్మిసన్ ప్రశంసించాడు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో... రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విశాఖ సముద్ర తీర ప్రాంతాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. సముద్రం కోతకు గురికాకుండా విశాఖ పోర్టు డ్రెడ్జింగ్ చేపడుతోంది. గతంలో లేని విధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ప్రత్యేక పర్యాటక బీచ్లను అభివృద్ధి చేస్తోంది. రుషికొండ బీచ్లో కల్పించిన సదుపాయాల కారణంగా ప్రతిష్టాత్మకమైన బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ -
కిక్కిరిసిన సాగర తీరం.. ఆర్కే బీచ్లో ఘనంగా నేవీ డే విన్యాసాలు (ఫొటోలు)
-
విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే వేడుకలకు సర్వం సిద్ధం
-
భయంకరంగా మిచాంగ్ తుఫాన్..
-
విశాఖ బీచ్ లో వైజాగ్ మారథాన్ వేడుకలు
-
విశాఖ RK బీచ్ లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతు
-
విశాఖ బీచ్లో భారీ చెక్కపెట్టె.. ఇంతకీ ఆ బోషాణంలో ఏముంది?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరానికి భారీ బోషాణం (చెక్క పెట్టె) కొట్టుకు రావడం కలకలం రేపింది. ఆ పెట్టెలో ఏముందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందులో భారీ ఎత్తున నిధులు ఉండే అవకాశం ఉందని కొందరు.. స్మగ్లర్లు విలువైన వస్తువుల్ని అందులో దాచి ఉంటారని ఇంకొందరు.. శత్రు దేశాలు విధ్వంసం సృష్టించేందుకు పంపించిన బాక్స్ అని మరికొందరు పేర్కొనడంతో శుక్రవారం రాత్రంతా బాంబ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు పహారా కాశారు. శనివారం ఉదయానికి ఈ సమాచారం ఆ నోటా.. ఈ నోటా ప్రచారం కావడంతో భారీ పెట్టెను చూసేందుకు వేలాదిగా జనం ఎగబడ్డారు. చివరకు అది సముద్రం మధ్య నౌకల లంగర్ వేసేందుకు వినియోగించే స్లీపర్ బార్జ్ (చెక్క దిమ్మె)గా నిర్థారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అలల ఒడిలో.. భారీ వస్తువు! విశాఖ సాగర తీరంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అలల మధ్య భారీ వస్తువేదో కదులుతున్నట్టు సందర్శకులు గుర్తించారు. తొలుత అది భారీ సముద్ర జంతువు అని భయాందోళన చెందారు. ఒడ్డుకు పరుగులు తీశారు. రాత్రి పహారాకు బీట్ కానిస్టేబుళ్లకు కొందరు సమాచారం అందించగా.. అది ఒక భారీ చెక్క పెట్టె అని గుర్తించారు. చైనా, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏవైనా పేలుడు పదార్థాలున్నాయా అని భయాందోళనలకు గురయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలెర్ట్ అయిన సిటీ సెక్యూరిటీ వింగ్ పొక్లెయిన్ల సాయంతో బాక్స్ను ఒడ్డుకు తీసుకొచ్చింది. అది పురాతన బాక్స్గా కనిపించడంతో అందరి అనుమానాలు మరింత బలపడ్డాయి. కొందరు బాంబులు ఉన్నాయేమో అని భయపడగా.. భారీ నిధితో కూడిన పెట్టె ఒడ్డుకు వచి్చందని మరికొందరు భావించారు. భద్రతా బలగాలు బీచ్కు చేరుకుని ప్రజల్ని అప్రమత్తం చేశాయి. బీచ్ రోడ్డుని క్లియర్ చేశాయి. శనివారం ఉదయం ఆ భారీ పెట్టె మిస్టరీని ఛేదించేందుకు బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. చేతులతో దానిని తెరిచేందుకు బాంబ్ డిస్పోజల్ టీమ్ ప్రయత్నించగా.. సాధ్యం కాలేదు. బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో చెక్ చేశారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని గుర్తించారు. జీవీఎంసీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న రెండు పొక్లెయిన్లను పోలీసులు రంగంలోకి దించారు. 14 గంటల నిరీక్షణ తరువాత.. సమాచారం అందుకున్న ఆర్కియాలజీ బృందం చేరుకుని బాక్స్ను క్షుణ్ణంగా పరిశీలించింది. ఇది పురాతన కాలం నాటి పెట్టె కాదని.. రెండు నుంచి నాలుగేళ్ల క్రితం బర్మా టేకుతో తయారు చేసిన పెట్టె అని నిర్థారించింది. 10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల దానిని విడదీసేందుకు ప్రయత్నించగా.. చివరకు అది కేవలం చెక్క దిమ్మెగా గుర్తించారు. ఆర్కియాలజీ బృందంతో పాటు మత్స్యకారులు, పోర్టు అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరపగా.. అది నౌకల్లో వినియోగించే స్లీపర్ బార్జ్ అని స్పష్టమైంది. చిన్న సైజు నౌకలు అలల తాకిడికి గురైనప్పుడు అవి దెబ్బ తినకుండా కర్రలతో చేసిన స్లీపర్ బార్జ్లను ఒక బ్లాక్గా బిగించి వినియోగిస్తారని తేలింది. సముద్రం మధ్యలో షిప్లని లంగరు వేసేందుకు వీటిని ఉపయోగిస్తారని తెలిసింది. కంటైనర్ కార్గో వెసల్స్ నుంచి కంటైనర్లను దించే సమయంలోనూ ఈ తరహా బార్జ్లను వినియోగిస్తుంటారనీ.. వాటిలో ఒకటి షిప్ నుంచి విడిపోయి ఇలా కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి విశాఖ నగరానికి 14 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా.. ఓవైపు ఆందోళనల్ని.. మరోవైపు ఉత్కంఠని కలిగిస్తూ.. యాక్షన్ సినిమా తలపించిన భారీ చెక్క కథ సుఖాంతమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: మత్స్యకారులకు కష్టాలుండవిక -
సాక్షి టీవీ రిపోర్టర్పై టీడీపీ కార్యకర్తల దాడి
విశాఖపట్నం: ఆర్.కె.బీచ్లో మంగళవారం రాత్రి జరిగిన చంద్రబాబునాయుడు సభ కవరేజీకి వెళ్లిన ఆరిలోవ జోన్ ‘సాక్షి’ టీవీ రిపోర్టర్ సురేష్పై టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. సుమారు 30 మంది వరకు దుర్భాషలాడుతూ సురేష్ సెల్ఫోన్ లాక్కొని.. పిడిగుద్దులు గుద్దుతూ బయటకు నెట్టేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారించినా వినకుండా పెట్రేగిపోయారు. ఈ దాడిపై మూడో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ కోరాడ రామారావుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. టీడీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం
-
ఆర్కే బీచ్: దీపక్కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ఆర్కే బీచ్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సరదా కోసం సముద్రంలో ఈతకు దిగిన యువకుడు అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి కొట్టికుపోయాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన బీచ్ లైఫ్ గార్డ్స్ అతడిని రక్షించారు. వివరాల ప్రకారం.. ఈరోజు ఆదివారం కావడంతో ఆర్కే చీచ్ వద్దకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక, పలు పక్క రాష్ట్రం ఒడిషా నుంచి కూడా కొందరు పర్యాటకులు అక్కడికి వచ్చారు. కాగా, వీరిలో దీపక్(26) అనే వ్యక్తి ఈత కోసం సముద్రంలోకి దిగాడు. సరదాగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సముద్ర అలలు ఎక్కువయ్యాయి. అలల తాకిడికి దీపక్ సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దీంతో, వెంటనే రంగంలోకి దిగిన బీచ్ లైఫ్ గార్డ్స్ దీపక్ను రక్షించారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఇది కూడా చదవండి: నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో.. -
పాము..19 పిల్లలు ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి
-
విశాఖలో టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు
-
విశాఖ ఆర్కే బీచ్ లో సైకిల్ ర్యాలీ నిర్వహించిన GVMC,PCB
-
YMCA బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి
-
Vizag : విశాఖ ఆర్కే బీచ్లో జి 20 సదస్సు సన్నాహక మారథాన్ (ఫొటోలు)
-
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో విజయవంతంగా మారథాన్
-
భక్తులతో కిటకిటలాడుతోన్న విశాఖ ఆర్కే బీచ్
-
‘కేజ్ కల్చర్’.. అసలేంటీ కథ..!
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో పంజరం వంటివి ఏర్పాటు చేసి వాటిలో చేపలను పెంచే విధానాన్ని కేజ్ కల్చర్గా పేర్కొంటారు. వీటిలో పెరిగే చేపలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఇలాంటి కేజ్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్ల నుంచి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు విశాఖ ఆర్కే బీచ్కు సమీపంలో సముద్రంలో కేజ్లను అమర్చి పరిశోధనలు సాగిస్తున్నారు. వీరు అక్కడ ఉన్న 30 కేజ్ల్లో వివిధ రకాల చేపలను పెంచుతున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) ద్వారా మత్స్యకారులతో పాటు వివిధ కులాల మహిళలకు ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, మత్స్యకార మహిళలకు 60 శాతం, బీసీ మత్స్యకారులకు 40 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. ఇలా విశాఖ జిల్లాకు 18 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో జనరల్ కేటగిరీ వారికి 14, ఎస్సీలకు 4 చొప్పున కేటాయించారు. ఒక్కో యూనిట్ విలువ రూ.5 లక్షలు. ఇందులో 10 శాతం లబ్దిదారు వాటాగా భరిస్తే సబ్సిడీ సొమ్ము 40/60 శాతం) పోగా మిగిలినది బ్యాంకు రుణంగా సమకూరుస్తోంది. సబ్సిడీ సొమ్మును లబ్ధిదారునికి దశల వారీగా చెల్లిస్తారు. విశాఖ జిల్లాలో బి.రేవతి అనే మహిళకు 10 ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేశారు. వీటిని సీఎంఎఫ్ఆర్ఐ నిర్వహిస్తున్న కేజ్ల సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేజ్ల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని సీఎంఎఫ్ఆర్ శాస్త్రవేత్తలే అందజేస్తారు. అంతేకాదు.. వీరి పర్యవేక్షణలోనే కేజ్ల్లో చేపల పెంపకం కూడా జరుగుతుంది. చేప పిల్లలు, మేత, రవాణా తదితర అవసరాలకు సీఎంఎఫ్ఆర్ఐ సహకరిస్తుంది. విశాఖలో సముద్రంలో కేజ్ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. నెల రోజుల్లో వీటిలో చేపల పెంపకం ప్రక్రియ ప్రారంభమవుతుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేజ్ల నిర్మాణం ఇలా.. ఒక్కో ఓపెన్ సీ కేజ్ను ఆరు మీటర్ల వ్యాసార్ధంలో, నాలుగు మీటర్ల లోతులో రబ్బరు ట్యూబ్లు, పీవీసీ పైప్లతో నిర్మిస్తారు. వీటికి ప్లాస్టిక్ డ్రమ్ములు, వెదురును కూడా ఉపయోగిస్తారు. చుట్టూ ఔటర్, ఇన్నర్ నెట్లను ఫ్రేమ్ల మాదిరిగా అమరుస్తారు. ఈ కేజ్లు కొట్టుకుపోకుండా సముద్రంలో లైన్లు, యాంకరింగ్కు వీలుగా చైన్లను ఏర్పాటు చేస్తారు. ఈ కేజ్ల్లో పండుగప్పల పెంపకం విశాఖలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కేజ్ల్లో పండుగప్ప రకం చేపలను పెంచనున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో పండుగప్ప చేపలకు మంచి డిమాండ్ ఉంది. ఈ పండుగప్ప చేప పిల్లలను (3–4 అంగుళాల పొడవు) పాండిచ్చేరి సమీపంలోని సీడ్గాళిలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ నుంచి తీసుకొచ్చి ఈ కేజ్ల్లో పెంచుతారు. 10–12 నెలల్లో చేప పూర్తి స్థాయిలో (కిలో వరకు బరువు) ఎదుగుతుంది. ఇలా ఒక్కో కేజ్ నుంచి 2–3 టనునల చేపల దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో పండుగప్ప ధర రూ.500–700 వరకు పలుకుతోంది. -
విశాఖ ఆర్ కె బీచ్ లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
-
విశాఖ : సందర్శకులతో కిటకిటలాడుతున్న ఆర్కేబీచ్ ( ఫొటోలు)
-
వయ్యారి గాలిపటం.. పైపైకి ఎగిరే.. (ఫొటోలు)
-
Andhra Pradesh: ఇక టూరిస్ట్ పోలీసింగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ వెళ్లే పర్యాటకులను ‘హాయ్ వెల్కం టు వైజాగ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ’.. ‘ఇన్ వైజాగ్ యూ కెన్ సీ ఆర్కే బీచ్, రుషికొండ, భీమిలి, కైలాసగిరి, సింహాచలం టెంపుల్. ఇఫ్ యూ హేవ్ ఎనీ ప్రాబ్లమ్. ప్లీజ్ కాంటాక్ట్ అజ్’ అంటూ ప్రేమగా పలకరించేందుకు ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసులు అందుబాటులోకి రానున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు సమస్త సమాచారాన్ని అందిచడంతో పాటు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా టూరిస్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మొదటగా విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ కియోస్క్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పర్యాటక ప్రదేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఉమ్మడి విశాఖలో చూడదగిన పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని బ్రోచర్ల రూపంలో అందుబాటులో ఉంచనున్నారు. పర్యాటకులు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా.. ఎవరైనా తప్పిపోయినా వీరికి ఫిర్యాదు చేస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. పర్యాటకుల నుంచి ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే కూడా వీరికి సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి ప్రయాణం సాఫీగా సాగేలా చూడటంతోపాటు మరోసారి వచ్చే విధంగా ఆకర్షించేందుకు టూరిస్ట్ పోలీసింగ్ తోడ్పడుతుందనేది ప్రభుత్వ వర్గాల భావన. జీ–20 సమావేశాల నేపథ్యంలో.. విశాఖలో వరుసగా వివిధ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 28, 29 తేదీల్లో జీ–20 దేశాల సమావేశాలకు కూడా విశాఖ వేదిక కాబోతోంది. దీనికి విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం ప్రతినిధులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసింగ్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 55 ప్రాంతాల్లో 200 వరకూ జీ–20 గ్రూప్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. 2016 నుంచీ చేయాలనుకున్నా.. వాస్తవానికి దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీసింగ్ అభివృద్ధి చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఇందుకు అనుగుణంగా 2016లోనే ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఈ విధానం అమలుకు నోచుకోలేదు. 2019లో 25 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కోవిడ్ నేపథ్యంలో అమలుకు నోచుకోలేదు. తాజాగా జీ–20 సమావేశాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ విశాఖలో ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కియోస్క్ ఏర్పాటు చేస్తున్నాం విశాఖ నగరంలో టూరిస్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ఆర్కే బీచ్ ప్రాంతంలో మొదటగా ఒక కియోస్క్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా పర్యాటకులకు సేవలందించేందుకు పోలీసులు అందుబాటులో ఉంటారు. తర్వాత మిగిలిన పర్యాటక ప్రదేశాలైన భీమిలి, రుషికొండ, తెన్నేటి పార్కు, కైలాసగిరి, యారాడ వంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. – శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
ఘనంగా ఆర్కే బీచ్ లో నేవీ డే వేడుకలు
-
మహాదీపారాధనతో ప్రకాశించిన సాగరతీరం
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): విశాఖ సాగరతీరం దీపకాంతులతో ప్రకాశించింది. ఆర్కేబీచ్ భక్తులతో కిటకిటలాడింది. సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో మహాదీపోత్సవం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం మూడుగంటలకు శోభయాత్రతో బయలుదేరిన శ్రీవేంకటేశ్వరస్వామి సాయంత్రానికి ఆర్కేబీచ్ ప్రధానవేదిక వద్దకు చేరుకున్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రమిదలు, ఒత్తులు, మండపాలు, తులసి మొక్కలను టీటీడీ సమాకుర్చింది. డాక్టర్ పి.వి.ఎస్.ఎన్.మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు శ్రీఫణియాజులు బృందం వేదస్వస్తి వినిపించింది. అనంతరం డాక్టర్ మారుతి దీపప్రాశస్త్యాన్ని వివరించారు. టీటీడీ ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన చేశారు. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం శ్రీమహాలక్ష్మి పూజ చేశారు. భక్తులతో తొమ్మిదిసార్లు దీపమంత్రం పలికిస్తూ సామూహిక లక్ష్మీనీరాజనం సమర్పించారు. భక్తుల గోవిందనామ స్మరణతో విశాఖ సాగరతీరం మారుమోగింది. ఈ సందర్భంగా బాలకొండలరావు నేతృత్యంలో బృందం ప్రదర్శించిన దీపలక్ష్మీనమోస్తుతే నృత్యరూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. చివరిగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు కీర్తిస్తుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. టీటీడీ హిందూధర్మ ప్రచారం అద్భుతం ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మాట్లాడుతూ టీటీడీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూధర్మ ప్రచారం చేస్తోందని అభినందించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంతోపాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇటీవల శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో జమ్ములో శ్రీవారి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తామని చెప్పారు. స్వామికి వివిధ బ్యాంకుల్లో ఉన్న 15,938 కోట్ల నగదు, 10,258 కిలోల బంగారం డిపాజిట్లకు సంబంధించిన ఇటీవల శ్వేతపత్రం విడుదల చేశామని ఆయన గుర్తుచేశారు. టీటీడీ జేఈవో సదా భార్గవి, మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవేణుగోపాల దీక్షితులు, శ్రీశేషాచల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. -
రోబోటిక్ ‘లైఫ్బాయ్’తో సెకన్లలో సహాయం
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు): ఇటీవల సముద్రంలో రాకాసి అలలకు చిక్కుకుని అనేక మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలా మంది సరైన సమయంలో సహాయం అందకపోవడం వల్లనే కెరటాలకు బలైపోయారన్న వాదన ఉంది. ఇప్పుడు అటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు లైఫ్బాయ్ పేరుతో రోబోటిక్ బోట్లు(వాటర్ డ్రోన్లు) అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో సముద్రంలో మునిగిపోతున్న వారిని సెకన్ల వ్యవధిలో రక్షించి ఒడ్డుకు చేర్చవచ్చు. 25 కేజీల బరువు గల ఈ డ్రోన్ 28 కిలోమీటర్ల స్పీడ్తో 2 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళ్లి ఆపదలో ఉన్న 200 కేజీల వరకు బరువు ఉన్న వ్యక్తులను రక్షిస్తాయి. సేఫ్ బీచ్గా విశాఖ తీరం ఆర్కే బీచ్లో ఉన్న రోబోటిక్ బోట్(వాటర్ డ్రోన్లు)లను శుక్రవారం కలెక్టర్ మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పరిశీలించారు. వాటి పని తీరు, ఎలా రక్షిస్తుంది అనేది వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్గా రూపుదిద్దుతామన్నారు. జీవీఎంసీ సహకారంతో 39 మంది గజ ఈతగాళ్లను బీచ్లో నియమించామని, వారికి అవసరమైన లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రిని సమకూర్చినట్టు చెప్పారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు -
విశాఖ ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: గత నెల 25న భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ ఉదంతంలో ఆమె తండ్రి రాపిరెడ్డి అప్పలరాజుపై 3వ పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గత జులై 25న పెళ్లి రోజు నేపథ్యంలో భర్త శ్రీనివాస్తో కలిసి సాయిప్రియ ఆర్కేబీచ్కు విహారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు భర్త ఏమరపాటుగా వున్న సమయంలో ముందస్తు ప్రణాళికతో సాయిప్రియ తన ప్రియుడు రవితేజతో పరారైంది. అయితే ఈ ఘటనలో సాయిప్రియ బీచ్లో గల్లంతైనట్లు ఆమె తండ్రి రాపిరెడ్డి అప్పలరాజు 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన జిల్లా యత్రాంగం, పోలీసులు పెద్ద ఎత్తున బీచ్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం భారీగా ప్రభుత్వ వనరులను వినియోగించిన విషయం తెలిసిందే. అయితే సాయిప్రియకు గతంలో రవితేజ అనే యువకుడితో ప్రేమాయనం ఉన్నట్లు ఆమె తండ్రికి ముందే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా పోలీసులను, జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించడంపై అతనిపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రామారావు వెల్లడించారు. చదవండి: (ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్) -
మహాయజ్ఞంలా మెగా బీచ్క్లీనింగ్ (ఫొటోలు)
-
విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాన్ని 2027 నాటికి ప్లాస్టిక్ రహితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం సీఎం కార్యక్రమం అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో దశలవారీగా ప్లాస్టిక్ నిషేధించడానికి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారన్నారు. శుక్రవారం భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 22 వేలమందికిపైగా బీచ్క్లీనింగ్ చేసినట్లు తెలిపారు. త్వరలో 2.5 లక్షలమందితో బీచ్ క్లీన్చేసి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పుతామని వారు పేర్కొన్నారు. 20 వేలమందికి ఉపాధి కల్పన పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సీఈవో సెరిల్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.16 వేల జీతంతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మొదటిదశలో 1,100 మెట్రిక్ టన్నులు, రెండోదశలో 2,200 మెట్రిక్ టన్నులు, మూడోదశలో 3,300 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి సన్గ్లాసెస్, షూస్, బ్యాగ్స్, టీ–షర్టులు తయారుచేస్తామని వివరించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ మాజీ వైస్చైర్మన్ రాజీవ్కుమార్, జీఏఎస్పీ సెక్రటరీ జనరల్ శ్రీసత్యత్రిపాఠి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. మహాయజ్ఞంలా మెగా బీచ్క్లీనింగ్ విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచే భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 28 కిలోమీటర్ల మేర రికార్డు స్థాయిలో మెగా బీచ్క్లీనింగ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పార్లే సంస్థ సంయుక్తంగా 40 ప్రాంతాల్లో దాదాపు 22 వేలమందికిపైగా పాల్గొన్న ఈ కార్యక్రమం మహాయజ్ఞంలా సాగింది. 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ప్రత్యేక చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జీవిఎంసీ కమిషనర్ లక్ష్మీశ, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో ప్రారంభమైన మెగా బీచ్ క్లీనింగ్
-
నేను రవితోనే ఉంటా..సాయిప్రియ
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ, రవి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ప్రత్యక్షమయ్యారు. అక్కడికి వారిని త్రీ టౌన్ పోలీసులు తీసుకొచ్చి విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. సాయిసుప్రియ, రవి మాట్లాడుతూ తామిద్దరం కలిసి బతుకుతామని, ఇక ఇంటికి వెళ్లమని, తల్లిదండ్రుల వద్ద ఉండమని స్పష్టం చేశారు. తొలి భర్త ఇచ్చిన గాజులను అమ్మలేదని, తమ వద్దే ఉన్నాయని వారు చూపించారు. ముందుగా కుమార్తె సాయిప్రియతో తల్లిదండ్రులు మాట్లాడారు. తమ పరువు తీశావంటూ రోదించారు. తాను రవితో ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. తమ వల్ల ప్రభుత్వానికి కోటి రూపాయలు ఖర్చయినందుకు క్షమించమని రవి కోరాడు. మీడియాతో మాట్లాడుతుండగా సాయిప్రియ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు సపర్యలు చేయగా తేరుకుంది. కొద్దిసేపటి తర్వాత వారిని ప్రైవేటు కారులో త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు సమాచారం. -
విశాఖ ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్
సాక్షి, బెంగళూరు: వైజాగ్ ఆర్కే బీచ్లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఇప్పటిjకే భర్త శ్రీనివాస్కు మస్కా కొట్టి లవర్తో పరారైన సాయిప్రియ తాజాగా తను క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు వెల్లడించింది. అంతేగాక ప్రియుడు రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తాళిబొట్టుతో ఉన్న ఫోటోను తల్లిదండ్రులకు వాట్సప్లో పంపించింది. అలాగే ఓ వాయిస్ మెసెజ్ పంపింది. ‘నాన్న.. నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. నేను రవితోనే ఉన్నాను. నన్నేం రవి బలవంతంగా తీసుకెళ్లలేదు. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయిది. దయచేసి నాకోసం వెతకొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావు అయినా బతుకైనా రవితోనే ఉంటాను. ప్లీజ్ మమ్మల్ని వెతకద్దు ఒకవేళ నా కోసం వెతికితే చనిపోతా. రవి పేరెంట్స్ను ఏమీ చేయొద్దు’ అంటూ వాయిస్ మెసేజ్ చేసింది. ఇక సముద్రంలో గల్లంతైందని భావించి రెండు రోజులుగా భార్య కోసం ఎదురు చూస్తున్న శ్రీనివాస్కు, ఆయన తల్లిదండ్రులకు సాయిప్రియ పెద్ద షాక్ ఇచ్చినట్లు అయ్యింది. సంబంధిత వార్త: ఆర్కే బీచ్లో వివాహిత అదృశ్యం కేసులో ఊహించని ట్విస్టు కాగా సాయి ప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. విశాఖపట్నంలోని సంజీవ నగర్లో ఉంటున్నారు. అయితే సాయిప్రియ కొంతకాలంగా శాంతినగర్కు చెందిన రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్తో కలిసి ఆర్కే బీచ్కు వెళ్లింది. అక్కడ భర్త కళ్లు గప్పి సాయిప్రియ ప్రియుడితో కలిసి బీచ్ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముంద్రంలో కోట్టుకుపోయి ఉంటుందని కంగారు పడి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వివాహిత కోసం రెండు కోస్ట్ గార్డ్ షిప్లతో పాటు ఓ హెలికాప్టర్తో సముద్రం మొత్తం గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం సాయిప్రియ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. -
విశాఖలో అదృశ్యమైన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్
-
ఆర్కే బీచ్లో వివాహిత అదృశ్యం.. భర్త కళ్లుగప్పి ప్రియుడితో..
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ ఆర్కే బీచ్లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం వెనుక పక్కా ప్లాన్ బయటపడింది. సోమవారం ఆర్కే బీచ్లో కనిపించకుండా పోయిన వివాహిత సాయిప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. ఆమె ఆఖరి ఫోన్కాల్ను పోలీసులు కావలిలో ట్రేస్ చేశారు. ప్రియుడితో కలిసి సాయిప్రియ రైల్లో నెల్లూరు జిల్లాకు పరారైనట్లు తేలింది. సాయిప్రియ అదృశ్యమైన సమయంలో బీచ్ రోడ్లోనే ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే భర్తను బురిడి కొట్టించి లవర్ సాయితో పరారైనట్లు బయటపడింది. చదవండి: బీచ్లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..? అసలేం జరిగిందంటే చిరిగిడి సాయి ప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. కానీ సాయి ప్రియ కొంతకాలంగా రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్తో కలిసి ఆర్కే బీచ్కు వెళ్లింది. శ్రీనివాస్ ఫోన్లో మెసెజ్లు చూస్తుండగా.. అలలు దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీన్నే అవకాశంగా భావించిన సాయిప్రియ రాత్రి 7.30 గంటల సమయంలో ప్రియుడితో కలిసి బీచ్ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని కంగారు పడిన శ్రీనివాస్ వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పక్కా స్కెచ్ ప్రమాదవశాత్తు సాయిప్రియ సముద్రంలో పడిపోయి ఉంటుందని భావించిన అధికారులు.. వివాహిత ఆచూకీ కోసం సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ముందుగా గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నావీ సాయం కోరారు. దీంతో రెడు కోస్ట్ గార్డ్ షిప్లతో పాటు ఓ హెలికాప్టర్తో సముద్రం మొత్తం గాలించారు. అయినా జాడ దొరకలేదు. అయితే చివరకు అమ్మాయి సముద్రంలో గల్లంతు కాలేదని, ప్రియుడితో కలిసి నెల్లూరుకు చెక్కేసినట్లు తేలింది. ఎంతోమందిని టెన్షన్ పెట్టిన సాయిప్రియ మిస్సింగ్ చివరకు డ్రామాగా తేలడంతో అందరూ విస్తుపోయారు. -
బీచ్లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..?
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): రెండు రోజులు గడుస్తున్నా వివాహిత మిస్సింగ్ మిస్టరీ వీడలేదు. పెళ్లి రోజు సందర్భంగా సాగరతీరంలో సరదాగా గడిపిన ఆ జంట... ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధమైన సమయంలో బీచ్లో అసలేం జరిగిందో అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం భర్తతోపాటు కుటుంబ సభ్యులు, పోలీసులు, నగర వాసుల మదిలో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. వెనక్కి తిరిగి చూస్తే కనిపించలేదని ఫిర్యాదు సాయిప్రియ మిస్సింగ్పై ఆమె భర్త శ్రీనివాస్ సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం వారి పెళ్లి రోజు కావడంతో ఆమెతో కలిసి ఆర్కేబీచ్కు విహారానికి వచ్చినట్లు తెలిపాడు. తాను హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా భార్య విశాఖ ఎన్ఏడీలోని వాళ్ల అమ్మవారి ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నట్లు శ్రీనివాస్ తెలిపాడు. అయితే ఆదివారం పెళ్లిరోజు కావడంతో రెండు రోజుల క్రితమే విశాఖ వచ్చినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం సాయిప్రియతో కలిసి ఆర్కేబీచ్కు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నామన్నారు. అయితే రాత్రి 7.30 సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవగా... తన ఫోన్కు మెసేజ్ రావడంతో చూసుకుంటూ రోడ్డు వైపు వచ్చినట్లు శ్రీనివాస్ ఫిర్యాదులో వివరించాడు. ఆ సమయంలో కాళ్లు కడుక్కోవడానికి సముద్రంవైపు వెళ్లిన తన భార్య సాయిప్రియ వెనుక వస్తుందని భావించినట్లు తెలిపాడు. అయితే కొంతసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూడగా ఆమె కనిపించలేదన్నాడు. అనంతరం తీరంలో వెతగ్గా ఎక్కడా కనిపించలేదని వెల్లడించాడు. అయితే సోమవారం కూడా శ్రీనివాస్ని పలు విధాలుగా ప్రశ్నించినప్పటికీ తాను ఫిర్యాదులో మాదిరిగానే సమాధానం ఇచ్చినట్లు త్రీ టౌన్ సీఐ రామారావు వెల్లడించారు. అయితే సాయిప్రియ, శ్రీనివాస్ దంపతుల మధ్య ఎలాంటి గొడవలైనా ఉన్నాయా అనే అంశంపై సాయిప్రియ తండ్రి అప్పలరాజుతోపాటు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా గొడవలు లేవని, వారు అన్యోన్యంగానే ఉంటున్నారని వెల్లడించినట్లు సీఐ తెలిపారు. అయితే సాయిప్రియ బీచ్లో గల్లంతై ఉంటే 24 గంటల నుంచి 36 గంటల్లోపు ఒడ్డుకు కొట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బీచ్ వెంబడి పోలీసు నిఘా ఉంచినట్లు తెలిపారు. తీరంలో విస్తృతంగా గాలింపు సాయిప్రియ బీచ్లో గల్లంతై ఉంటుందా..? అనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆర్కే బీచ్ తీరం వెంబడి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో కోస్ట్గార్డ్స్, నేవీ అధికారుల సహాయం కోరడంతో 11 గంటల ప్రాంతంలో రెండు కోస్ట్గార్డ్ గస్తీ నౌకలతోపాటు హెలికాప్టర్ ద్వారా ముమ్మరంగా గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతోపాటు మంగళవారం మధ్యాహ్నం నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ శ్రీధర్ తదితరులు ఆర్కేబీచ్కు వచ్చారు. సాయిప్రియ గల్లంతైనట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. దర్యాప్తుపై పోలీసుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకటకుమారి కలెక్టర్ మల్లికార్జునతో ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన సహకారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. దీంతోపాటు తీరప్రాంతం వెంబడి గస్తీ పెంచాలని, హెచ్చరిక బోర్డులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యునిటీ గార్డుల ఏర్పాటుపైనా చర్చించినట్లు మేయర్ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు, ఇతర ఉన్నతాధికారులతోపాటు సాయిప్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంజీవయ్యనగర్లో విషాదం గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ఆర్కే బీచ్లో సాయిప్రియ గల్లంతైన ఘటనతో జీవీఎంసీ 52వ వార్డు సంజీవయ్యనగర్లో విషాదం నెలకొంది. సాయిప్రియ కుటుంబం శోకసంద్రంలో మునిగి పోయింది. సోమవారం సాయంత్రం గల్లంతైనప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. విజయనగరం జిల్లా కందివలసకు చెందిన శ్రీనివాసరావుకు సాయిప్రియకు వివాహమై రెండేళ్లయింది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త శ్రీనివాసరావు పెళ్లి రోజు కానుకగా బంగారు చేతి గాజులు చేయించి బహుమతిగా తీసుకొచ్చాడు. అల్లుడూ, కుమార్తెది అన్యోన్యమైన దాంపత్యమని గుర్తు చేసుకుంటూ తల్లి విలపించిన తీరు చూపరులకు కన్నీరుతెప్పిస్తోంది. త్వరలో భార్యను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోవాలనుకున్నంతలో ఘోరం జరిగిపోయిందని వాపోతున్నారు. -
పెళ్లిరోజు నాడే విషాదం.. ఆర్కే బీచ్లో వివాహిత గల్లంతు..
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): భర్తతోపాటు విహారానికి వచ్చిన ఓ వివాహిత ఆర్కేబీచ్లో గల్లంతైంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఏడీ ప్రాంతానికి చెందిన ఎన్.సాయిప్రియ భర్త శ్రీనివాస్తో కలిసి సోమవారం రాత్రి ఆర్కేబీచ్కు విహారానికి వచ్చింది. తీరంలో కొంతసేపు గడిపిన అనంతరం 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాళ్లు కడుక్కోవడానికి సాయిప్రియ తీరానికి వెళ్లినట్లు భర్త శ్రీనివాస్ పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో తాను సరిగ్గా వెనుకవైపు గమనించలేదని, కొంతసేపటికి తిరిగి చూస్తే తాను కనిపించలేదని అతను వెల్లడించినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో ఆమె బీచ్లో గల్లంతై వుంటుందని భావిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. అయితే విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని త్రీటౌన్ సీఐ రామారావు తెలిపారు. -
ఆర్కే బీచ్ లో వివాహిత గల్లంతు
-
కిటకిటలాడిన సాగర తీరం.. బీచ్లో యువతీయువకుల సందడి
-
ఆర్కే బీచ్ ని పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి
-
అమ్మ తపనే ఆయువై..
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): సముద్ర కెరటాలకు కొట్టుకుపోయిన బాలిక మృత్యువును జయించింది. ఒడిశాలోని రాయగడకు చెందిన ఓ కుటుంబం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్కు వచ్చింది. ఆ కుటుంబంలోని తొమ్మిదేళ్ల బాలిక అలేఖ్య సముద్రంలోకి దిగి కేరింతలు కొడుతుండగా కెరటాలకు కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు గమనించి మునిగిపోయిన బాలికను ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే బాలిక నీళ్లు తాగి స్పృహ కోల్పోయింది. నోటి వెంట నురగలు వచ్చాయి. దీంతో బాలికను చూసి ఆమె తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు. ఇంతలో స్థానిక యువకులు బాలికకు ప్రథమ చికిత్స చేశారు. కడుపు, ఛాతీ మీద గట్టిగా రుద్దినా చిన్నారిలో కదలిక రాలేదు. బాలిక తల్లి గట్టిగా హత్తుకున్న క్రమంలో ఒక్కసారిగా స్పృహ రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. వెంటనే చికిత్స నిమిత్తం బాలికను కేజీహెచ్కు తరలించారు. తమ కంటిపాపను కాపాడిన స్థానికులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
సండేసీన్
-
డ్రోన్ట్ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్
రాకాసి అలలు.. ఎన్నో కుటుంబాల్లో మరణ శాసనం రాసి సముద్రమంత దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఆరాటంగా వచ్చే కెరటాలను ఆప్యాయంగా హత్తుకునేలోపు పర్యాటకుల జీవితాల్లో తీరం విషాదాన్ని నింపుతున్నాయి. గజ ఈతగాళ్లు ఉన్నా.. మునిగిపోతున్నవారిని చేరేలోపే మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ చెప్పేందుకు విశాఖ వాసులు సరికొత్త డ్రోన్ను ఆవిష్కరించారు. సైఫ్సీస్ పేరుతో రూపొందించిన ఈ పరికరం మృత్యు అలలను ఎదిరించి మునిగిపోతున్న వారి ప్రాణాలు కాపాడగలదు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్ను పర్యాటక శాఖ నిర్వహించింది. సాక్షి, విశాఖపట్నం: సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఎవరికైనా ఈత కొట్టాలనిపిస్తుంటుంది. కానీ రాకాసి అలలు మింగేస్తాయని భయం అందరిలోనూ ఆందోళన రేకెత్తించినా.. అక్కడి పరిస్థితులు వాటిని లెక్కచెయ్యనీయవు. ఫలితంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పుష్కర కాలంలో సుమారు 600 మంది అలలకు బలయ్యారు. ఇందులో 60 శాతం మంది 15 నుంచి 30 ఏళ్లలోపువారే ఉండటం బాధాకరమైన విషయం. నగర పరిధిలోని అన్ని బీచ్పాయింట్లలో ఉండే లైఫ్గార్డులు సముద్రంలో మునిగిపోతున్న చాలా మందిని ప్రాణాలతో కాపాడారు. అయితే అలల ఉధృతికి లోపలకు కొట్టుకుపోతున్న వారి వద్దకు లైఫ్గార్డులు వెళ్లేలోపే కొందరు మృత్యువాతపడుతున్నారు. ఇటువంటి వారిని కాపాడేందుకు విశాఖకు చెందిన ఓ బృందం సైఫ్సీస్ పేరుతో డ్రోన్ను తయారు చేసింది. దగ్గరలోనే లోతు.. వదులుగా ఇసుక మిగిలిన సముద్ర తీరాలతో పోలిస్తే విశాఖ తీరం రూపురేఖలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు మచిలీపట్నం దగ్గర సముద్రంలో చాలా దూరం వెళ్తే గానీ లోతుండదు. గోవా దగ్గర సముద్రంలో దాదాపు కిలోమీటర్ దూరం వరకూ నడిచి వెళ్లొచ్చు. కానీ విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద పది మీటర్ల ముందుకెళ్తే చాలు లోతు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఆర్కే బీచ్కు దక్షిణ, ఉత్తరం వైపు రెండు నుంచి మూడు మీటర్ల లోతుంటుంది. కొన్నాళ్లుగా కోత ప్రభావంతో ఈ లోతు మరింతగా పెరుగుతూ వస్తోంది. ఆర్కే బీచ్తో పాటు భీమిలి, రుషికొండ, తొట్లకొండ, సాగర్నగర్ దగ్గర లోతుతో పాటు ఇసుక ఎక్కువ వదులుగా ఉంటుంది. కెరటం వచ్చి వెనక్కు వెళ్లే సమయంలో ఇసుక ఎక్కువగా జారిపోతుంటుంది. దీన్ని అంచనా వెయ్యలేక పోవడంతో కాళ్లు పట్టుకోల్పోయి లోతులోకి జారిపోయి గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సముద్రంలో ప్రమాదాల్లో ఉన్న వారిని కాపాడేందుకు ఈ సైఫ్సీస్ డ్రోన్లు ఉపయోగపడతాయి. సైఫ్ సీస్.. ఇలా రక్షిస్తుంది.. సాధారణంగా లైఫ్గార్డ్ సెకనుకు మీటరు నుంచి మీటరున్నర దూరం ఈదుతూ వెళ్లగలరు. 30 మీటర్ల దూరంలో పర్యాటకుడు మునిగిపోతుంటే.. అక్కడికి చేరుకోవడానికి కనీసం 25 సెకన్ల సమయం లైఫ్గార్డుకు పడుతుంది. కానీ.. గజఈతగాడి కంటే ఐదు రెట్లు వేగంగా ఈ మానవ రహిత డ్రోన్లు దూసుకెళ్తుంది. 30 మీటర్ల దూరాన్ని కేవలం 5 నుంచి 6 సెకన్ల వ్యవధిలోనే చేరుకొని బాధితుడిని రక్షించగలదు. అంటే లైఫ్గార్డు కంటే 7 రెట్లు వేగంగా స్పందిస్తుంది. లైఫ్గార్డు ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే రక్షించగలరు. కానీ.. సైఫ్సీస్ 200 కిలోల బరువు వరకూ ఎంత మంది ఉంటే అందర్ని ఒడ్డుకు తీసుకురాగలదు. గంటకు 15 కిలో మీటర్ల వేగంతో అలలను చీల్చుకుంటూ ముందుకు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. పూర్తిగా రిమోట్ ద్వారా ఒడ్డున నిలబడే ఆపరేట్ చేస్తూ.. మునిగిపోతున్న వారి వద్దకు ఈ డ్రోన్లను క్షణాల్లో పంపించవచ్చు. దాదాపు 3 కిలోమీటర్ల వరకూ దీన్ని పంపించవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీలు 90 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గంట పాటు పనిచేస్తాయి. స్టాండ్ బై మోడ్ 5 నుంచి 6 గంటల వరకూ ఉంటుంది. 22 కేజీల బరువుండే ఈ డ్రోన్ను పట్టుకుంటే మళ్లీ జారిపోకుండా గ్రిప్ ఉంటుంది. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.6 లక్షల వరకూ ఉంటుంది. 3 కిలోమీటర్ల దూరం వరకూ దీనిని కంట్రోల్డ్గా ఆపరేట్ చెయ్యవచ్చు. భారత ప్రభుత్వ ప్రశంసలు విశాఖ బృందం చేసిన ఈ సైఫ్సీస్ డ్రోన్కు అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్పోలో సైఫ్సీస్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ దీని పనితీరుని తెలుసుకొని బృంద సభ్యులను అభినందించారు. ఇప్పటికే హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పర్యాటక అవసరాల కోసం వీటిని కొనుగోలు చేసుకున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ.. కొద్ది నెలల క్రితం సైఫ్సీస్ డ్రోన్ ట్రయల్ రన్ను నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రోత్సహిస్తే.. ప్రాణాలు కాపాడతాం.. మూడేళ్ల పాటు శ్రమించి సైఫ్సీస్ డ్రోన్ని ఇండియన్ నేవీ స్పెసిఫికేషన్స్తో తయారు చేశాం. సైఫ్సీస్ని డీఆర్డీవో–ఎన్ఎస్టీఎల్ అప్రూవ్ డిజైన్తో రూపుదిద్దుకుంది. లైఫ్గార్డుల కంటే వేగంగా చేరుకోవడం వల్ల సముద్రంలో మునిగిపోతున్న వారిని కాపాడగలం. 100 శాతం ఆటోమేటిక్గా రోబోటిక్ ప్రోబ్స్తో దీన్ని తయారు చేశాం. పలు రాష్ట్రాల్లో చాలా మంది ప్రాణాలను కాపాడుతోంది. ఏపీలో ప్రోత్సహిస్తే వైజాగ్ బీచ్లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడగలమన్న విశ్వాసం మాకు ఉంది. – అలీఅస్గర్ కలకత్తావాలా, సైఫ్సీస్ కో–ఫౌండర్ (చదవండి: సీపోర్టు టు ఎయిర్పోర్టు 'సువిశాల రహదారి') -
విశాఖ ఆర్కే బీచ్లో హోలీ సంబరాలు
-
విశాఖ ఆర్కే బీచ్ లో కిడ్నీ వాక్
-
మిలాన్.. విశాఖ చరిత్రలో మైలు రాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొట్టమొదటి సారిగా విశాఖ సాగర తీరంలో మిలాన్–2022 నిర్వహణ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. తూర్పు నావికాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖ చేరడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. విశాఖ సాగర తీరంలో 39 దేశాలతో కలసి భారత నావికాదళం, తూర్పు నావికాదళం నిర్వహించిన విన్యాసాలు.. దేశ సైన్యం పట్ల మరింత నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచుతాయని చెప్పారు. విశాఖలోని ఆర్కే బీచ్లో మిలాన్–2022 వేడుకలను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అంతకుముందు సీఎం దంపతులు డాక్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విశాఖను జాతికి అంకితం చేశారు. కొత్తగా నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని సందర్శించారు. అక్కడి నుంచి ఆర్కే బీచ్కు చేరుకుని.. మిలాన్ వేడుకల్లో భాగంగా సిటీ పరేడ్ను ప్రారంభించారు. దాదాపు గంటకుపైగా సాగిన సైనిక విన్యాసాలు, సిటీ పరేడ్ను సీఎం దంపతలు ఆసాంతం ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. సముద్రంలో కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న లేజర్ షో విశాఖ ప్రజలకు గర్వకారణం ► వైజాగ్.. సిటీ ఆఫ్ డెస్టినీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతం సంప్రదాయానికి ప్రతీక. విశాఖ చరిత్రలో ఇది మైలురాయి. ఇది అరుదైన యుద్ధ నౌకల విన్యాసాల పండగ. ఈ మిలాన్లో 39 దేశాలు పాల్గొనడం గర్వకారణం. ► పూర్తి స్వదేశీయంగా యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ విశాఖ’ను రూపొందించడం ఎంతో సంతోషం. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక కొద్ది నెలల క్రితం నావికాదళంలో చేరింది. ఇది విశాఖ ప్రజలకు గర్వకారణం. పీ 15 బీ క్లాసెస్ గైడెడ్ మిసైల్ స్టెల్త్ డిస్ట్రాయర్ సాంకేతికతో పనిచేసే ఈ యుద్ధ నౌక తూర్పు నావికాదళంలోకి చేరడం ఎంతో గర్వకారణం. ► నౌక పై భాగంలో మన విశాఖపట్నంలో ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫిన్ నోస్ని.. రాష్ట్ర మృగం కృష్ణ జింకని ప్రత్యేకంగా ముద్రించారు. ధన్యవాదాలు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి కూడా తూర్పు నావికాదళంలో చేరడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైంది. యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు ఈ స్నేహ బంధం కొనసాగాలి ► మిలాన్–2022 విన్యాసాలతో విశాఖ ప్రజలకు ఉత్సాహంతో పాటు.. దేశ రక్షణకు నిరంతరం పాటు పడుతున్న సైన్యం మీద గౌరవం, అభిమానం, నమ్మకం మరింత పెరుగుతుంది. ► మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ నేవీ సంయుక్త నిర్వహణలో మిలాన్ వేడుకలకు విశాఖ కేంద్రం కావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ఆతిథ్యం మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ సంప్రదాయాన్ని కొనసాగిద్దాం. ► సిటీ పరేడ్లో పాల్గొన్న ఇండియన్ కోస్ట్గార్డ్, ఏపీ పోలీస్, ఫైర్ సర్వీస్ సీకేడెట్, ఎన్సీసీ, బ్యాండ్ ట్రూప్, కల్చరల్ ట్రూప్స్, స్నేహ పూర్వక దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు. ఇదే స్నేహ బంధం కొనసాగాలని కోరుకుంటున్నాను. ► భారత నౌకాదళానికి ప్రత్యేకంగా తూర్పు నావికాదళంతో పాటు అనేక దేశాల నుంచి వచ్చి ఈ విన్యాసాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్గుప్తా, ఈ వేడుకల్లో పాల్గొన్న అంబాసిడర్లు, అధికారులు, ఇతర దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు -
ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఆర్కే బీచ్ లో మిలాన్ విన్యాసాలు తిలకించనున్న సీఎం వైఎస్ జగన్
-
ఎటుచూసినా సంబరమే
సాక్షి నెట్వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ర్యాలీలు, క్షీరాభిషేకాలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్లో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ప్రజలు పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం ఇక సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచినందుకు కృతజ్ఞతగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ‘జగనన్న వరం.. సర్వేపల్లి జననీరాజనం’ పేరిట వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం మనుబోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్నమయ్య జిల్లాకు మద్దతుగా ర్యాలీ ప్రస్తుతమున్న చిత్తూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మద్దతుగా ‘థాంక్యూ సీఎం సార్’.. అంటూ కలికిరి పట్టణంలో బుధవారం ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం శుభపరిణామమన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
Famous Tourist Places Vizag: వహ్ వైజాగ్! ఒకటా రెండా.. ఎన్నెన్ని అందాలో
సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకంగా కూడా గత రెండు దశాబ్ధాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కొండ కోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాలు.. ఏ చోటకు వెళ్లినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తుంది. 2004 తరువాత నుంచి పర్యాటకంగా విశాఖ రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా నగరంలోనే కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా సరికొత్త పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓసారి చూసొద్దాం రండి... మదిదోచే కైలాసగిరి ఆర్కే బీచ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి ఉంది. పచ్చని పార్కులు, ఆహ్లాద వాతావరణం, బీచ్ వ్యూ ఇక్కడ మంచి అనుభూతినిస్తాయి. కొండ కింద నుంచి రోప్ వే, రోడ్డు, మెట్ల మార్గాల ద్వారా పైకి చేరుకోవచ్చు. విశాఖ వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరి వెళ్తుంటారు. చదవండి: Lambasingi: లంబసింగికి చలో చలో భీమిలి.. అందాల లోగిలి.. ఆర్కే బీచ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. తూర్పు తీరంలో పురాతన ఓడ రేవుల్లో ఒకటిగా పిలుస్తారు. గోస్తనీనది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. డచ్ పాలకుల సమాధులు, లైట్ హౌస్లు, బౌద్ధ మత ఆనవాళ్లు ఇక్కడ అనేకం. దీని ముందున్న రుషికొండ బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావడం విశేషం. జలజల జలపాతాలు.. విశాఖ మన్యంలోకి వెళ్తే.. అడుగడుగునా జలపాతాలు హొయలుపోతూ కనిపిస్తుంటాయి. కటిక, చాపరాయి, సరయు, డుడుమ, కొత్తపల్లి, సీలేరు ఐసుగెడ్డ, పిట్టలబొర్ర, బొంగుదారి జలపాతాలతో పాటు చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఆంధ్రా ఊటీ.. అరకు.. విశాఖ మన్యం పేరు చెబితే.. పర్యాటకులు పులకరించిపోతారు. సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు వ్యాలీని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇది జలపాతాలు, క్రిస్టల్ క్లియర్ స్ట్రీమ్స్ , పచ్చని తోటలతో కళకళలాడుతుంటుంది. మంచు మేఘాల వంజంగి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ టూరిస్టులు ఎంజాయ్ చేసే ప్రాంతం వంజంగి. పాడేరు మండలంలో ఉన్న వంజంగి కొండపైకి ఎక్కితే మేఘాలను తాకుతున్నట్లు అనుభూతిని పొందొచ్చు. బుద్ధం.. శరణం.. గచ్ఛామి... ఆర్కే బీచ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు తొట్లకొండ, బావికొండ ఉన్నాయి. తొట్లకొండ తదితర ప్రాంతాలు నిత్యం పర్యాటకులను అలరిస్తున్నాయి. జంతు ప్రపంచం పిలుస్తోంది... ఆర్కే బీచ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో జూపార్క్ ఉంది. ఎన్నో అరుదైన జంతువులు, వన్యప్రాణులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. జూ ఎదురుగా ఉండే కంబాలకొండలో వన్యప్రాణులతో పాటు సాహస క్రీడలు, బోటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భలే మంచు ఊరు డిసెంబర్..జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలకు పడిపోతూ.. ఆంధ్రా కాశ్మీరంగా పేరొందిన లంబసింగికి చలికాలంలో పర్యాటకులు క్యూ కడతారు. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 3600 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు వీడకుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వీఎంఆర్డీఏ పార్క్ ఆర్కే బీచ్ వ్యూను చూస్తూ పర్యాటకులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిక్నిక్లు జరుపుకునేందుకు, ఆహ్లాదాన్ని పొందేందుకు అనువైన ప్రదేశం. ఇటీవలే రూ.35 కోట్లతో పార్క్ను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. అటు కురుసుర.. ఇటు టీయూ 142 ఆర్కే బీచ్లో విహరించి కాస్తా ముందుకు వెళ్తే.. పర్యాటకులను ఆకట్టుకునే కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ఉంటుంది. దాని ఎదురుగానే టీయూ– 142 యుద్ధ విమాన మ్యూజియం. ఇప్పుడు వీటి సరసన... సీ హారియర్ మ్యూజియం సిద్ధమవుతోంది. ఇంకాస్త ముందకెళితే విక్టరీఎట్ సీ దర్శనమిస్తుంది. పురాతన బొర్రా గుహలు.. మీరు చరిత్ర ప్రేమికులైతే, బొర్రా గుహలు ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయి. అరకులోయలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న ఈ గుహలు వేల సంవత్సరాల పురాతనమైనవే కాదు.. దేశంలో కనిపించే అన్ని గుహలలో అతిపెద్దవి. పూర్తిగా సహజ సున్నపురాయితో తయారైన ఈ గుహలు ప్రకృతిలో కాలిడోస్కోపిక్, జలపాతాలతో పాటు రాళ్లపై పడే కాంతి చాలా రంగురంగులుగా దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏడాది సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తుంటారు. చరిత్ర చెప్పే మ్యూజియం వీటన్నింటినీ సందర్శించి.. ఇంకొంచెం ముందుకెళ్తే.. విశాఖ మ్యూజియం కనిపిస్తుంది. దాని ఎదురుగానే.. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి సబ్మెరైన్ కల్వరి çహాల్ కనిపిస్తుంది. విశాఖ మ్యూజియంలో భారత దేశ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ప్రదర్శిస్తుంటారు. అల ఆర్కే బీచ్లో.. వైజాగ్ వచ్చే ప్రతి ఒక్కరూ బీచ్కు వెళ్లి తీరాల్సిందే. అందుకే వీకెండ్స్ అయితే ఇసకేస్తే రాలనంత జనం బీచ్లో వాలిపోతారు. షాపింగ్ మొదలుకొని స్టే, డిన్నర్ వరకూ సకల సౌకర్యాలు పర్యాటకులకు ఇక్కడ లభిస్తాయి. -
Pudami Sakshiga: ‘సాక్షి’ పుడమి పరిరక్షణ వాక్
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి పరిరక్షణకు ‘సాక్షి’ యాజమాన్యం ముందుకు వచ్చింది. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలంటూ పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడలో పుడమి సాక్షిగా వాక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ర్యాలీ గుణదల పడవల రేవు సెంటర్ నుంచి మధురానగర్ సర్కిల్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర కమిషనర్ కాంతిరాణా టాటా పాల్గొని, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ వాక్లో వైఎస్సార్ పీపీ నేతలతో పాటు పెద్ద ఎత్తున యువతీ యువకులు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భావితరాలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే పర్యావరణ పరిరక్షణే అని సీపీ కాంతిరాణా టాటా అన్నారు. చదవండి: ఆ గ్రామం ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.. విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి పరిరక్షణకు ‘సాక్షి మీడియా’ నడుంబిగించింది. పుడమినీ పరిరక్షించుకునేందుకు యువతరం బాధ్యతగా వ్యవహరించాలని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కోరారు. విశాఖలోని ఆర్కే బీచ్ కాళీ మాత టెంపుల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు సాక్షి మీడియా ఆధ్వర్యంలో ‘పుడమి సాక్షి’గా వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ ఐజి కాళిదాసు వెంకటరంగారావు కూడా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు కూడా హాజరయ్యారు. -
మృత్యు కెరటాలు! నాలుగేళ్లలో 233 మంది పర్యాటకులు బలి..
Unimaginable death rate in Vizag beach These are reasons బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే సుందర సాగర తీరం... ఒక్కోసారి వారిపైనే ఉగ్రరూపం చూపిస్తోంది. అనూహ్యంగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడి కాటేస్తున్నాయి. మరోవైపు అత్యుత్సాహంతో కొందరు కెరటాలకు బలైపోతున్నారు. పోలీసులు, మెరైన్ పోలీసులు, లైఫ్గార్డ్స్ నిరంతరం పహారా కాస్తున్నప్పటికీ తీరంలో విషాద ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, ఒడిశా నుంచి నగరానికి వచ్చి తీరంలో సేద తీరుతున్న నలుగురిని రాకాసి కెరటాలు ఆదివారం కాటేసిన విషయం తెలిసిందే. 2018లో 55 మంది, 2019లో 51 మంది, 2020లో 64 మంది, 2021లో 63 మంది మృతిచెందారు. మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో 233 మంది కెరటాలకు బలైపోయారు. రిప్ కరెంట్తో భారీ కెరటాలు విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగరనగర్, రుషికొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో... అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు. విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం. యువకుడి మృతదేహాన్ని బయటకు తీసుకొస్తున్న సిబ్బంది చదవండి: ఆర్కే బీచ్లో ఇద్దరి మృతి లైఫ్గార్డ్స్తో కొంత రక్షణ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న బీచ్లలో ఎవరైనా ప్రమాదాలకు గురైతే రక్షించేందుకు 38 మంది లైఫ్ గార్డ్స్ను జీవీఎంసీ నియమించింది. తీరంలో ఎవరైనా అలలకు చిక్కినప్పుడు వీరు సకాలంలో స్పందించడం వల్లే సుమారు 95 శాతం మంది సురక్షితంగా బయటపడుతున్నారు. ఆర్కే బీచ్లో 20 మంది, యారాడ, రుషికొండలో ఆరుగురేసి, తెన్నేటిపార్కు బీచ్, సాగర్నగర్, ఐటీ హిల్స్ బీచ్లలో ఇద్దరేసి చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. అయితే తీరంలో ప్రమాదానికి గురై సముద్రంలో కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వారిని రక్షించగలుగుతున్నప్పటికీ... రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కే వారిని సరైన పరికరాలు లేకపోవడంతో రక్షించడం కష్టతరంగా మారుతోందని లైఫ్గార్డ్స్ అంటున్నారు. విదేశాల్లో లైఫ్గార్డ్స్కు తోడుగా స్పీడ్ బోట్లు అందుబాటులో ఉంటాయని... వాటి సాయంతో బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒడిశా యువతిని, హైదరాబాద్ అబ్బాయిని లైఫ్గార్డ్స్ పట్టుకున్నప్పటికీ... అప్పటికే కెరటంలో ఎక్కువ సేపు ఇరుక్కుపోవడం వల్ల మరణించారు. అదే స్పీడ్ బోట్లు అందుబాటులో ఉంటే వేగంగా వెళ్లి బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పండగల వేళ విషాదాలు సాధారణంగా బీచ్లో ఎక్కువగా అక్టోబర్ నుంచి జనవరి నెల మధ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. దసరా, దీపావళి, కార్తీకమాసం, నూతన సంవత్సర వేడుకలకు ఎక్కువగా పర్యాటకులు రావడంతో తీరంలో రద్దీ ఉంటుంది. ఆ సమయాల్లో దేశ, విదేశాల నుంచి సందర్శకులు కూడా నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్లో రోజూ సుమారు 20 మంది పోలీసులు, మరో 20 మంది లైఫ్గార్డ్స్ అందుబాటులో ఉంటూ పర్యాటకులను హెచ్చరిస్తుంటారు. మరోవైపు మెరైన్ పోలీసులు తీరం వెంబడి గాస్తీ కాస్తుంటారు. అయినప్పటికీ సందర్శకుల అత్యుత్సాహం, కొందరు యువకులు మద్యం మత్తులో స్నానాలకు దిగడంతో ప్రమాదాలకు గురవుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. నిరంతరం హెచ్చరిస్తుంటాం సముద్రంలోకి స్నానాలకు దిగవద్దని సందర్శకులను లైఫ్ గార్డ్స్, పోలీసులు నిరంతరం తీరంలో హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. చాలా ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడిగలిగాం. పర్యాటకులు సముద్రం లోపలకు వెళ్తుంటే లైఫ్గార్డులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తున్నాం. అయినప్పటికీ ప్రమాదాలు జరగడం బాధాకరం. – జి.మురళీ కృష్ణ, మెరైన్ ఎస్ఐ క్షణాల్లో స్పందిస్తున్నాం కెరటాలకు సందర్శకులు చిక్కుకున్నారని తెలిసిన క్షణాల్లోనే స్పందిస్తున్నాం. బాధితులను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. అయితే రిప్ కరెంట్ అలల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కష్టమవుతోంది. సరైన పరికరాలు సమకూరిస్తే బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అనేకసార్లు ఉన్నాతాధికారులకు చెప్పాం. మాకు 9 నెలలుగా జీతాలు చెల్లించకపోయినా పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. – దేవుడు, లైఫ్గార్డు చదవండి: కరకట్టపై పల్టీకొట్టిన ఆటో.. -
తీరంలో విషాదం! ముగ్గురి మృతదేహాలు లభ్యం, కొనసాగుతున్న గాలింపు
Update: విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభించాయి. మరొక మృతదేహం కోసం నేవీ హెలిక్యాప్టర్తో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే సముద్రపు అంతర్భాగంలో రాళ్ళ మధ్య చిక్కుకునే అవకాశాలు ఉండడంతో అక్కడ కూడా గాలింపు కొనసాగించారు. నిన్న సముద్రంలో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు. పెదవాల్తేరు/బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): ఆర్.కె.బీచ్లో ఘోరం జరిగింది. విశాఖలో సరదాగా గడుపుదామని వచ్చిన వారి కుటుంబాల్లో సముద్రస్నానం తీవ్ర విషాదం నింపింది. పెద్దగా వచ్చిన కెరటాలకు నలుగురు గల్లంతవగా.. ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారిలో ఓ యువతి ఉంది. రెండు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మూడవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివీ.. ►నూతన సంవత్సర వేడుకులు జరుపుకునేందుకు హైదరాబాద్ బేగంపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగి శివకుమార్ (24), డిగ్రీ విద్యార్థులు కోట శివ (20), ఎండీ అజిష్ (20) సహా ఎనిమిది మంది స్నేహితులు గత నెల 30న విశాఖ వచ్చారు. వీరు ఆదివారం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్.కె.బీచ్లో స్నానాలకు దిగారు. ఇంతలో పెద్ద కెరటం రావడంతో బ్యాంక్ ఉద్యోగి శివ కుమార్, శివ, అజిష్ గల్లంతయ్యారు. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. కొంతసేపటికి శివకుమార్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కోట శివ, అజిష్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు కోస్టుగార్డు, నేవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శివకుమార్ మృతదేహం వద్ద సహచరులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ►ఒడిశాలోని కటక్కు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు ఆదివారం మధ్యాహ్నం ఆర్.కె.బీచ్లోని పాండురంగాపురం వద్ద స్నానాలకు దిగారు. వీరిలో సుమిత్ర త్రిపాఠి (21) సముద్రంలో కొట్టుకుపోవడంతో కమ్యూనిటీ గార్డులు రక్షించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సంఘటన స్థలానికి ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర, త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు చేరుకుని.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సీఐ రామారావు పర్యవేక్షణలో ఎస్ఐ హరీష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే.. -
అలల్లో కరిగిన కలలు
సూల్పురా: నూతన సంవత్సర వేడుకల్లో సరదాగా గడిపేందుకు నగరానికి చెందిన 8 మంది మిత్రులు విశాఖపట్టణం వెళ్లారు. ఆర్కే బీచ్లో దిగి ఎంజాయ్ చేస్తుండగా ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. రసూల్పురాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, వైజాగ్ వెళ్లిన సిద్ధు అనే యువకుడు అందించిన వివరాల ప్రకారం.. రసూల్పురా 105 గల్లీకి చెందిన యువకులు శివకుమార్, అజీజ్, శివ, వినోద్, మధు, పవన్, సిద్ధు, కార్తీక్లు కలిసి డిసెంబరు 30న కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు బయలుదేరారు. ఆ రోజు రైలు టికెట్లు దొరక్కపోవడంతో 31న ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వీరంతా ఆర్కే బీచ్ వద్దకు బయలుదేరారు. వీరిలో అయిదుగురు ఒడ్డున ఉండగా శివకుమార్, అజీజ్, శివ సముద్రంలోకి దిగారు. ఈ క్రమంలో అలల «ఉద్ధృతికి ముగ్గురూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. శివ మృతదేహం లభించింది. అజీజ్, శివకుమార్లు గల్లంతయ్యారు. ఘటన సమాచారం అందగానే రసూల్పురా నుంచి యువకుల తల్లిదండ్రులు, స్నేహితులు విశాఖకు బయలుదేరారు. -
ఆర్కే బీచ్లో ఇద్దరి మృతి
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): కొత్త సంవత్సరం సందర్భంగా విశాఖ బీచ్లో సంతోషంగా గడుపుదామని వచ్చిన రెండు బృందాల్లో విషాదం నెలకొంది. ఆదివారం సముద్రంలో మునిగి ఇద్దరు మృతిచెందగా ఇద్దరు గల్లంతయ్యారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్ బేగంపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగి శివకుమార్ (24), డిగ్రీ విద్యార్థులు శివ (20), అజిష్ (20) సహా ఎనిమిదిమంది స్నేహితులు గతనెల 30న విశాఖ వచ్చారు. ఆదివారం హైదరాబాద్ బయలుదేరుతూ ముందుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్కే బీచ్లో స్నానాలకు దిగారు. వీరిలో బ్యాంకు ఉద్యోగి శివకుమార్ పెద్ద కెరటం రావడంతో కొట్టుకుపోయి మృతిచెందాడు. అతడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. శివ, అజిష్ సముద్రంలో గల్లంతయ్యారు. వారికోసం గాలిస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన ఒక కుటుంబలోని ఐదుగురు ఆర్కేబీచ్లో స్నానాలకు దిగారు. వీరిలో సుమిత్ర త్రిపాఠి (21) సముద్రంలో కొట్టుకుపోతుండగా కమ్యూనిటీగార్డులు రక్షించారు. ఆమెను కేజీహెచ్కి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. ఘటనాస్థలాన్ని ఈస్ట్ ఏసీపీ హర్షిత, త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు పరిశీలించారు. -
సాయంకాలం.. సాగరతీరం..
-
మాజీ సైనికులకు అండగా సీఎం జగన్: హోం మంత్రి సుచరిత
సాక్షి, విశాఖపట్టణం: మాజీ సైనికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి సుచరిత తెలిపారు. రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు రాయితీ ద్వారా పరిశ్రమలు.. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్పై భారత్ విజయానికి సూచికగా చేపట్టిన స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని శుక్రవారం ఆర్కే బీచ్లోని విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నౌకదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజెంద్ర బహుదుర్ హోంమంత్రికి అందజేశారు. నాటి విజయంలో భాగస్వాములైన నేవీ సిబ్బందిని మంత్రి సత్కరించారు. స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో నేవీ అవసరాలు తీర్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని తెఉలిపారు. భారత్ రక్షణలో విశాఖ తీరం కీలకమని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు నాటి యుద్ధ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? చదవండి: ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి -
సందర్శకులపై ఆంక్షలు: ఆర్కే బీచ్ నుంచి వుడా పార్క్ వరకు
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి వుడా పార్క్ వరకు సందర్శకులపై ఆంక్షలు విధించింది. శని, ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి ఉదయం వరకు సందర్శకుల నో ఎంట్రీ నిబంధనలను అమలు చేస్తోంది. ఆంక్షాల కారణంగా ఆర్కే బీచ్ ఖాళీగా దర్శనమిస్తోంది. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. -
Photo Story: ఆర్.కె.బీచ్.. ఉరకలెత్తిన ఉత్సాహం
సాక్షి, విశాఖపట్నం: ఆర్.కె.బీచ్.. చాలా రోజుల తర్వాత సందడిగా కనిపించింది. పోలీసులు కాస్త వెసులుబాటు ఇవ్వడంతో ఆదివారం నగరవాసులు సాగరతీరంలో సేదతీరారు. రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభనతో.. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేసింది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 2 వరకు సడలింపులు ఉన్నా.. బీచ్లోకి మాత్రం పోలీసులు అనుమతించలేదు. ఈ ఆదివారం కాస్త వెసులుబాటు ఇవ్వడంతో ప్రజలు సాగరతీరంలో సందడి చేశారు. యువత సముద్రంలో స్నానాలు చేస్తూ.. ఒడ్డున ఆటలు ఆడుతూ కేరింతలు కొట్టారు. కొంత మంది పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. విల్లులా వంచి.. పక్షిలా ఎగిరి.. ఆడేది సరదాకైనా.. గెలుపే ధ్యేయంగా సాగిపోతారనేందుకు సాగరతీరంలో కొందరు యువ్రక్రీడాకారుల చూపే ప్రతిభే దర్పణం. బీచ్లో ఆదివారం కొంత మంది యువకులు సరదాగా ఫుట్బాల్ ఆడుతున్నారు. ఓ క్రీడాకారుడు గోల్ కొట్టేందుకు బంతిని పంపాడు. గోల్ కీపర్ శరీరాన్ని విల్లులా వంచి.. పక్షిలా గాల్లోకి ఎగురుతూ గోల్పోస్టులోకి ఆ బంతిని చేరనీయకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. జలధి చెంత.. జన్మదిన వేడుకలు -ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఆర్కే బీచ్ లో భారీ ఎత్తున నిరసన
-
భక్త జన సంద్రం.. విశాఖ తీరం
-
'విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది'
-
'విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది'
సాక్షి, విశాఖ : అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జీవీఎంసీ ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో పాటు విశాఖ జిల్లా ఎంపీలు సత్యనారాయణ డాక్టర్ సత్యవతి మాధవితో పాటు ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కన్నబాబు రాజు సహా పెద్ద సంఖ్యలో నగర వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు . అందులో భాగంగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు రోడ్డు వాకింగ్, సైకిల్ ట్రాక్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని, అయితే ఓ పార్టీతో అనుబంధం ఉన్న పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. (వైఎస్సార్ చేయూత రెండో దశలో రూ. 510.01 కోట్లు జమ) -
విశాఖపట్నం ఆర్కేబీచ్లో జన సందడి
-
బీచ్ రోడ్డులో షూటింగ్ సందడి
సాక్షి, ద్వారకానగర్(విశాఖ దక్షిణ): లాక్డౌన్ తరువాత మొట్టమొదటిసారి నగరంలో సినిమా షూటింగ్ సందడి మొదలైంది. ఆర్కే బీచ్ రోడ్డులో సినిమా షూటింగ్ను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఐదు నెలలుగా విశాఖలో సినీ షూటింగ్లు ఆగిపోయాయి. ప్రభుత్వ నిబంధనల సడలింపుల అనంతరం శుక్రవారం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ‘ఐపీఎల్’ పేరుతో రూపొందిస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులు మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్ జరిపారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు నగర ప్రజలు బీచ్రోడ్డుకు తరలివచ్చారు. -
బీచ్ సుందరీకరణ
-
విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో 108,104 వాహానాల ప్రారంభం
-
ఆర్కే బీచ్ వద్ద ఆత్మహత్య యత్నం
సాక్షి, విశాఖపట్నం : ఆర్కే బీచ్ వద్ద ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నం చేశారు. అయితే ఇది గమనించిన పోలీసులు వారిని రక్షించారు. భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టుగా తేలింది. దీంతో ఆమెకి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. కంచరపాలెంలో నివాసముంటున్న సత్తిబాబు, శిరీష దంపతులకు ఆరేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. సత్తిబాబు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా.. ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను వెంట తీసుకుని ఆవేశంగా బీచ్ రోడ్డుకి వచ్చిన శిరీష.. ఆత్మహత్యకు యత్నించారు. బీచ్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శిరీష, ఆమె పిల్లల్ని పోలీసులు రక్షించారు. -
నిర్మానుష్యంగా విశాఖ ఆర్కే బీచ్
-
బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ రేసులో రుషికొండ బీచ్
సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ సాగరతీరం పర్యావరణహిత బీచ్గా సందర్శకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. మూడు దశాబ్దాల తర్వాత దేశంలో బ్లూఫ్లాగ్ ప్రాజెక్టుకు ఎంపికైన 13 బీచ్ల్లో రుషికొండ తీరం చోటు సాధించింది. (చదవండి: త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్) బ్లూఫ్లాగ్ బీచ్ అంటే...? బ్లూఫ్లాగ్ బీచ్లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. డెన్మార్క్కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) 1987 నుంచి బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్లు ఈ సర్టిఫికెట్ పొందాయి. తొలిసారిగా భారత్కు చెందిన 13 బీచ్లు ఇందుకు అర్హత సాధించాయి. బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టిఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్టిఫికెట్ ఇస్తారిలా.. బ్లూఫ్లాగ్ ధ్రువపత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు ఉండకూడదు. ప్రాజెక్టు పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టిఫికెట్ ఇస్తారు. బీచ్లో బ్లూఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. 80% పనులు పూర్తి బ్లూఫ్లాగ్ ప్రాజెక్టు కింద రుషికొండ బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7.35 కోట్లు కేటాయించింది. వీటితో పనులు ప్రారంభించారు.ఇటీవల విశాఖలో బ్లూఫ్లాగ్ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనుల్ని నిపుణుల బృందం పరిశీలించింది. 80 శాతం పనులు పూర్తైనట్లు ధృవీకరించారు. 600 చదరపు మీటర్ల మేర బ్లూ ఫ్లాగ్ బీచ్గా అభివృద్ధి చేస్తున్నారు. (బాబాయ్ ఇలా మాట్లాడతారా; సంచయిత భావోద్వేగం..) బ్లూఫ్లాగ్ ఎగరేస్తాం.. ‘రుషికొండ బీచ్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. బ్లూఫ్లాగ్ బీచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించాం. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతూ సముద్ర జలాల్లో ఎలాంటి రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకుంటున్నాం. తీరంలో ఇసుకని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. రెండు ఆధునిక యంత్రాల ద్వారా పనులు నిర్వహిస్తున్నాం. జూన్లో బ్లూఫ్లాగ్ బృందం బీచ్ను పరిశీలించే అవకాశం ఉంది. రుషికొండ బీచ్లో కచ్చితంగా బ్లూఫ్లాగ్ ఎగరేసేందుకు యంత్రాంగమంతా కలిసికట్టుగా పని చేస్తున్నాం’ – పూర్ణిమాదేవి, బ్లూఫ్లాగ్ నోడల్ అధికారి పర్యావరణహితంగా నిర్మితమైన టాయిలెట్లు సదుపాయాలివీ.. ► బీచ్లో మౌలిక సదుపాయాలన్నీ పర్యావరణ హితంగా వెదురుతో నిర్మిస్తున్నారు. త్రిపుర నుంచి తెచ్చిన వెదురు 10 ఏళ్ల పాటు పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖపర్యాటకులు ఇసుక తిన్నెల్లో కూర్చొని సేదతీరేలా బెంచ్లతో పాటు గడ్డి, వెదురు పుల్లలతో గొడుగులు ఏర్పాటు చేశారు. వీటి కింద కూర్చోవడం వల్ల చల్లటి వాతావరణంలో పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతారు. ► ఎక్కడా మలినాలు, చెత్త లేకుండా 25 మంది సిబ్బందితో బీచ్ మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ► విద్యుత్ కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 40 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి 35 కేవీ విద్యుత్ని ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నారు. బీచ్లో ఏర్పాటు చేసిన 70 ఎల్ఈడీ విద్యుత్ బల్బులకు సోలార్ పవర్నే వాడుతున్నారు. ► బీచ్ పరిరక్షణ కోసం 10 మంది రక్షణ సిబ్బందిని నియమించారు. బీచ్లో ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ముగ్గురు పర్యవేక్షకుల్ని ఏర్పాటు చేశారు. 55 సీసీ కెమేరాలతో నిరంతరం నిఘా పెట్టారు. ► బీచ్లో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి చేసే ఎరువుల్ని మొక్కల పెంపకానికి వినియోగించనున్నారు. ► మరుగుదొడ్లకి వినియోగించే నీటిని పునర్వినియోగించేలా గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. రుషికొండ బీచ్లో ఏర్పాటయ్యేవి ⇒ రెండు వైపులా పార్కింగ్ ⇒ 2 చోట్ల లైఫ్గార్డులు, వాచ్టవర్ ⇒ 8 ఓపెన్ షవర్లు, 6 దుస్తులు మార్చుకునే గదులు ⇒ పిల్లల పార్క్ ⇒ వ్యాయామ పరికరాలు ⇒ కూర్చునేందుకు 11 బెంచీలు ⇒ జాగింగ్ ట్రాక్ ⇒ బీచ్ సమగ్ర సమాచారం తెలిపే బోర్డు ⇒ 8 మరుగుదొడ్లు ⇒ మురుగు నీటి నిర్వహణ, గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ⇒ సౌర విద్యుత్తు ప్లాంట్ ⇒ సేఫ్ స్విమ్మింగ్ జోన్ ⇒ రాకీ ప్యాచ్ ⇒ 16 చోట్ల సిట్అవుట్ అంబ్రెల్లా విత్ రిక్లైనర్ ⇒ వాటర్ శాంప్లింగ్ పాయింట్ ⇒ ఏపీటీడీసీ ఫుడ్ కోర్టులు ⇒ ఏపీటీడీసీ బోటింగ్ కార్యాలయం ⇒ యాంఫిబియాస్ వీల్ చెయిర్లు ⇒ దేవాలయం ⇒ కమాండ్ కంట్రోల్ రూమ్ -
సాగరమంతా సంబరమే!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్ వేదికగా.. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విశిష్ట, ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆయనకు తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సతీసమేతంగా స్వాగతం పలికారు. తొలుత నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల నేవీ బ్యాండ్ ప్రదర్శనతో నావికాదళ వేడుకలకు శ్రీకారం చుట్టారు. మెరైన్ కమెండోలు 84 ఎంఎం రాకెట్ వాటర్ బాంబు పేల్చి సీఎంకు స్వాగతం పలికారు. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ యుద్ధ విమానాల బృందం చేసిన విన్యాసాలు గగుర్పొడిచాయి. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో పయనిస్తూ ఐఎస్వీ తరహా నౌకలు సుదూరం నుంచి ఎదురెదురుగా దూసుకువచ్చే సన్నివేశం అబ్బురపరచింది. ఆరువేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి పారా జంపింగ్ చేసిన స్కై డైవర్లు గాల్లో విన్యాసాలు చేస్తూ ప్యారాచూట్ల సహాయంతో వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా వాలారు. అనంతరం స్కై డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్ రాథోడ్ విశిష్ట అతిథి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, మిగ్ విమానాలు పల్టీలు కొడుతూ దూసుకుపోవడం, మార్కోస్ను సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా మరో చోటకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అద్భుతమైన రీతిలో విన్యాసాలు ప్రదర్శించారంటూ నౌకాదళ బృందాన్ని సీఎం ప్రశంసించారు. బుధవారం విశాఖ సాగర తీరంలో ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు చేస్తున్న నేవీ సిబ్బంది. (ఇన్సెట్లో) తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్కుమార్ జైన్తో కలిసి విన్యాసాలను వీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ తేనీటి విందులో సీఎం జగన్ విన్యాసాలు ముగిసిన అనంతరం నేవీ హౌస్లో ఎట్ హోం పేరుతో నిర్వహించిన తేనీటి విందులో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ సాగించిన వీరోచిత చరిత్రపై ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్ను తిలకించారు. సీఎం వెంట మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. -
సాగరతీరంలో ఆనందకెరటాలు
-
సరిలేరు.. మీకెవ్వరు.!
నేవీ డే ఉత్సవాలను పురస్కరించుకుని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో చేపట్టిన రిహార్సల్స్ అబ్బుర పరిచాయి. జెమినీ బోట్లలో దూసుకొచ్చిన నౌకాదళం విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సాక్షి, విశాఖపట్నం: సముద్రాన్ని చీల్చుకుంటూ సాగిపోతున్న హైస్పీడ్ బోట్లు.. వినీలాకాశంలో చక్కర్లు కొడుతూ భువి నుంచి సాగర జలాల్లోకి త్రివర్ణ పతాకంతో దిగివచ్చిన స్కై డైవర్లు.. శత్రు స్థావరాలపై మెరైన్ కమాండోల ఆకస్మిక దాడులు.. రివ్వున దూసుకొచ్చి.. శత్రు నౌకలపై దాడి చేసి మెరుపు వేగంతో వెళ్లిపోయిన సీ కింగ్ హెలికాఫ్టర్లు.. ఇలా.. ఒకటి కాదు రెండు కాదు.. కళ్లు చెదిరే విన్యాసాలతో కదన రంగాన్ని తలపించే వాతావరణంతో ఆర్కే బీచ్ వేడెక్కింది. నేవీ డే ఉత్సవాలు పురస్కరించుకుని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కె బీచ్లో చేపట్టిన మొదటి ప్రధాన రిహార్సల్స్ అబ్బుర పరిచాయి. జెమినీ బోట్లలో దూసుకొచ్చిన నౌకాదళం విన్యాసాలు బీచ్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా సాగర జలాల్లో నేవీ సిబ్బంది ఏటా విన్యాసాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వారం రోజుల ముందు నుంచే రిహార్సల్స్ చేస్తుంటారు. తొలి రోజు రిహార్సల్ అదరహో అనిపించాయి. డిసెంబర్ 2వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ భారీ రిహార్సల్స్ నిర్వహించనున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఆర్కె బీచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన నేవీ తాత్కాలిక కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు విన్యాసాలను పర్యవేక్షించారు. -
విశాఖ అందాలకు ఫిదా..
కొండకోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాల యాల్లో పూజ చేసినా... ఏ చోటకి వెళ్లినా.. ఏ గాలి పీల్చినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తోంది విహార విశాల విశాఖ. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలన్నీ ఓచోట చేరిస్తే.. బహుశా దాని పేరే విశాఖ అంటారేమోనన్నట్లుగా పరిఢవిల్లుతున్న అందాల జిల్లా.. పర్యాటక రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో ఏడాదికి కోటికి పైగా.. పర్యాటకులు వస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే అననడంలో ఎలాంటి సందేహం లేదు. –సాక్షి, విశాఖపట్నం, అరకులోయ మన్యం.. ప్రకృతి చెక్కిన శిల్పం ప్రకృతి కాన్వాస్పై రమణీయ అందాలు.. చక్కిలిగింతలు పెట్టే చలిలో కనిపించే.. సహజ సిద్ధమైన సోయగాలు, కాలుష్యాన్ని దరిచేరనివ్వని ప్రకృతి రమణీయత, కలకాలం గుర్తిండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను ముడుపుగా ఇచ్చే అరకు అందాలు, విశాఖ మన్యం సోయగాలను వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు. ఆంధ్రా ఊటీ అరకు నుంచి ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి వరకూ ఎటు చూసినా.. ప్రకృతి పలకరిస్తుంది. మది పులకరిస్తుంది. జిల్లాకు వచ్చే పర్యాటకుల్లో 80 శాతం మంది అరకు మొదలైన ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పర్యాటక స్థలాలను సందర్శిస్తుంటారు. అలాంటి మన్యం అందాలకు మెరుగులు దిద్దేలా.. రూ.156 కోట్లతో అరకు టూరిజం సర్క్యూట్ పేరుతో సమీకృత ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి పంపించింది. త్వరలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ రానుంది. ఇదే ఏర్పాటైతే మన్యంలోని 11 మండలాలు అందులో సహజ సిద్ధమైన అందాలకు నెలవైన 36 ప్రాంతాలను ఈ టూరిజం సర్క్యూట్లో భాగం కానున్నాయి. ఈ అందాలకు మరింత సొబగులద్దే నిర్మాణాలు చేపట్టనున్నారు. తొలి విడతగా 9 ఎకరాల్లోనూ, మలివిడతగా 18 ఎకరాల్లోనూ మన్యం ప్రాంతంలో పలు చోట్ల ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. జలపాతాల సవ్వడి మన్యంలో జలపాతాల అందాలు కట్టిపడేస్తుంటాయి. ముఖ్యంగా అనంతగిరిలోని కటిక జలపాతం, డుంబ్రిగుడలోని చాపరాయి, దేవరాపల్లిలోని సరయు జలపాతం, పెదబయలులోని పిట్టలబొర్ర వాటర్ఫాల్స్, బొంగదారి జలపాతం, ఒడిషా సరిహద్దుల్లోని ముంచంగిపుట్టులోని డుడుమ జలపాతం, చింతపల్లి మండలం దారకొండలోని జలపాతం, జిమాడుగులలో కొత్తపల్లి జలపాతం... ఇలా ఎన్నో జలపాతాలు సందర్శకుల్ని మైమరపిస్తున్నాయి. అయితే.. వాటర్ఫాల్స్ వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడతంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన జలపాతాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చెయ్యాలని భావిస్తున్నారు. కటిక, సరయు, పిట్టలబొర్ర జలపాతాల్ని తొలిదశలో ఎంపిక చేశారు. ఈ జలపాతాల వద్ద రూమ్లు, ఫుడ్కోర్టులు, వాష్రూమ్లు, రెస్ట్రూమ్లు నిర్మించాలని నిర్ణయించారు. సర్క్యూట్లతో సూపర్... జిల్లాలో మూడు టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్కి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతుల రావాల్సి ఉండగా.. మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్ జెట్టీ సర్క్యూట్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఈ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటంతో ఇటీవలే మంత్రి అవంతి శ్రీనివాసరావు సంబంధిత అధికారులు, కేంద్ర మంత్రులతో భేటీ అయి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అనుమతులు కోరారు. అదే విధంగా బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండని సందర్శించేలా రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మూడు ప్రాజెక్టులు సిద్ధమైతే.. విశాఖ పర్యాటకానికి మరింత సొబగులు చేకూరనున్నాయి. అభివృద్ధి పథంలో నడిపిస్తాం... రెస్టారెంట్లు.. రిసార్టులు.. పెరుగుతున్న పర్యాటకానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పర్యాటక శాఖ సిద్ధమవుతోంది. పలు రెస్టారెంట్లు, రిసార్టులు నిర్మిస్తోంది. ఎర్రమట్టిదిబ్బల సమీపంలో రూ.2 కోట్లతో కంటైనర్ రెస్టారెంట్ను నిర్మించింది. అదే విధంగా రూ.2 కోట్లతో అరకులో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్మించింది. ఇవి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు ఏజెన్సీలో రూ.5.5 కోట్లతో ట్రైబల్ హట్(సంత), రూ.2.2 కోట్లతో ఈట్ స్ట్రీట్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. ఇవే కాకుండా విభిన్న ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టు రూపకల్పనకు కసరత్తులు జరుగుతున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా పర్యాటక శాఖకు ఉన్న 550 ఏకరాలను లీజుకు ఇచ్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రకృతి అందాల కలబోత విశాఖపట్నం. ఈ జిల్లాను పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సర్క్యూట్లు, టూరిజం ప్యాకేజీలతో పాటు సరికొత్త ప్రాజెక్టులు అమలు చేసి పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి. –అవంతి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి విదేశీయుల తాకిడి పెరుగుతోంది... విశాఖపట్నం అంటే.. విదేశీయులు చాలా ఇష్టపడుతున్నారు. అందుకే.. ప్రతి నెలా విశాఖ సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారికి అనుగుణంగా పర్యాటక శాఖ కొత్త కొత్త ప్రాజెక్టులు పరిచయం చేస్తోంది. – పూర్ణిమ, జిల్లా పర్యాటక శాఖాధికారి విదేశీయులు ఫిదా... విశాఖ అందాలకు విదేశీ పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది వచ్చిన పర్యాటకుల సంఖ్య పెరిగిందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. 2018లో 2,49,20,169 మంది స్వదేశీ పర్యాటకులతో పాటు 95,759 మంది విదేశీయులు విశాఖకు వచ్చారు. మొత్తం 2,50,13,607 మంది వచ్చారు. 2019లో ఎనిమిది నెలల్లో 1,86,47,551 మంది స్వదేశీ, 69,091 మంది విదేశీయులతో కలిపి మొత్తం 1,87,16,642 మంది పర్యాటకులు విశాఖ జిల్లాను సందర్శించారు. విదేశీ క్రీడలకూ వెల్కమ్.... సరికొత్త సాహస క్రీడకు విశాఖనే వేదికగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇందుకోసం రుషికొండ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్లను పరిశీలించింది. రుషికొండలో పారాసెయిలింగ్ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు స్థానిక పర్యాటక శాఖ అధికారులు ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. త్వరలోనే రుషికొండలో విశాఖ పర్యాటకులకు పారాసెయిలింగ్ చేసే అవకాశం కలగనుంది. మరిన్ని సందర్శనీయ స్థలాలు... నగరాన్ని ఆనుకొని ఉన్న ప్రధానమైన రామకృష్ణ బీచ్(ఆర్కే బీచ్)కు రోజూ సుమారు లక్ష మంది వస్తుంటారు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటోంది. అదే విధంగా యారాడ, తొట్లకొండ, రుషికొండ బీచ్లలోనూ సందర్శకుల తాకిడి కొంత మేర ఉంటోంది. ఇలా.. కొన్ని ప్రాంతాలకే పర్యాటకం పరిమితం కాకుండా మరో 5 బీచ్లు అభివృద్ధి చెయ్యనుంది. భీమిలి బీచ్తో పాటు సాగర్నగర్, అప్పికొండ, పూడిమడక, తంతడి బీచ్లను తొలి దశలో గుర్తించింది. ఈ 5 బీచ్లు సందర్శకులకు అనుకూలమైన వాతావరణంతో ఉంటాయి. ఏపీటీడీసీ ప్యాకేజీలు ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పరుగులు పెడుతోంది. ఏపీటీడీసీ విశాఖ వ్యాప్తంగా పలు టూరిజం హోటల్స్తో పాటు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచి విషయం తెలిసిందే. అయితే ఇటీవల మరిన్ని కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తేవడం ద్వారా పర్యాటకానికి కొత్త హంగులు సంతరించుకున్నాయి. కొత్త ప్యాకేజీలు... ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు పలు ప్యాకేజీలను అందిస్తోంది. ఈ గతంలో ఉన్న ఫ్యాకేజీలకు పదును పెట్టడంతో పాటు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను కలుపుతూ కొత్త ఫ్యాకేజీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉండగా శుక్రవారం జరిగే పర్యాటక దినోత్సవం వేడుకల్లో ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖపట్నం– శ్రీకాకుళం కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నారు. విశాఖ– శ్రీకాకుళం ప్రఖ్యాత అరసవల్లి దేవాలయం, శ్రీకూర్మం, శ్రీకూర్మలింగం, సీతంపేట అడ్వెంచర్ పార్కు సందర్శన కోసం ఏపీటీడీసీ ఈ ప్యాకేజీని అందిస్తోంది. పెద్దలకు రూ.670 , పిల్లలకు రూ.535గా ధర నిర్ణయించారు. ప్రతి ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఉదయం 6.45 గంటలకు పర్యాటకులు విశాఖ ఆర్టీసీ కాంప్లక్స్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. బస్సు 7 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి సాయంత్రం 6 గంటలకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకుంటుంది. రైల్ కమ్ రోడ్డు ప్యాకేజీ గతంలో పర్యాటకులకు మంచి మజిలిని అందించిన ఈ ప్యాకేజీనిని ఏపీటీడీసీ తిరిగి ఈ నెలలో(సెప్టెంబర్) పునఃప్రారంభించింది. రూ.1500తో పెద్దలకు, రూ.1200 పిల్లలకు ఈ టికెట్ ధర నిర్ణయించారు. రైల్వేశాఖతో ఉన్న టూరిజం ఒప్పందంలో భాగంగా ఈ ప్యాకేజీని ఏపీటీడీసీ అందిస్తోంది. పద్మాపురం బొటానికల్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, ట్రైబల్ థింసా , అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా కేవ్స్, థైడా జంగిల్ బెల్కు తీసుకువెళతారు. ఉదయం 6.15కు రైల్వేస్టేషన్లోని ఏపీటీడీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాత్రి 9 గంటలకు తిరిగి విశాఖ చేరుకుంటారు. అరకు– లంబసింగి మధ్య.. అరకు – లంబసింగి– అరకు.. మన్యం ప్యాకేజీగా ఏపీటీడీసీ అందిస్తోంది. చాపరాయి వాటర్ స్ట్రీమ్స్, మత్స్యగుండం, కొత్తపల్లి వాటర్ పాల్స్, లంబసింగి, గాలికొండ వ్యూపాయింట్, యాపిల్, ఫైనాపిల్, స్టాబెర్రీ పంటల సందర్శన ఉంటుంది. పెద్దలకు రూ. 999, చిన్న పిల్లలకు రూ.799గా టికెట్ ధర. ఉదయం 6.45 గంటలకు అరకులోని హరిత వ్యాలీ రిసార్ట్స్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. విస్తృతమైన సేవలు పర్యటకులకు విస్తృత సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీటీడీసీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాం. కార్పొరేట్ హోట ల్స్కు దీటుగా టూరిజం హోటల్స్లో సౌకర్యాలు, రూమ్స్ను అందుబాటులో ఉంచుతున్నాం. విశాఖ– తిరుపతి, విశాఖ – అన్నవరం, అరకు –చిత్రకోట్ వాటర్ఫాల్స్, విశాఖ– భద్రాచలం ప్యాకేజీలను సైతం అందుబాటులో ఉంచాం. ఠీఠీఠీ.్చp్టఛీఛి.జీn వెబ్సైట్ నుంచి అన్ని రకాల సేవలను పొందవచ్చు. – ప్రసాదరెడ్డి, డీవీఎం, ఏపీటీడీసీ -
‘వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం విశాఖ’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో... ప్రగతి భారత్ ఫౌండేషన్ పేరుతో విజయసాయిరెడ్డి ఎన్జీవో కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలోని ప్రముఖులతో కలిసి సంఘసేవలో భాగంగా ఎన్జీవోను ప్రారంభిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కోటి రూపాయల నిధితో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను మొదటగా విశాఖలో ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రమంతటా వ్యాప్తి చేస్తామని వెల్లడించారు. అదే విధంగా విశాఖ తీర ప్రాంతాన్ని కొబ్బరి మొక్కలు నాటి అభివృద్ది చేస్తామని, ఇప్పటికే తమ ట్రస్టు తరపున ఆర్కె బీచ్ వద్ద యాభై లక్షలతో కొబ్బరి మొక్కలను నాటడం జరిగిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపట్టబోతున్నామని, దీని ద్వారా నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ నైపుణ్యంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శిబిరాల ద్వారా అందరికీ వైద్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తామని.. అదేవిధంగా కార్పోరేట్ సంస్థలు కూడా సమాజాభివృద్దిపై దృష్టి సారించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కాగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆయన చైర్మన్గా వ్యవహరించనున్నారు. -
ఆర్కే బీచ్లో సందడి చేశారుగా!
సాక్షి, విశాఖపట్నం : ఒలింపిక్ డే సందర్భంగా విశాఖ సాగరతీరంలో నిర్వహించిన రన్ ఉత్సాహంగా సాగింది. క్రీడల్లో పతకాలు సాధించిన వారితో పాటు ఔత్సాహిక క్రీడాకారులు, పలు పాఠశాలల విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. ది ఒలింపిక్ సంఘం విశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఐదు కిలోమీటర్ల పరుగును సంఘం ప్రతిని«ధి, ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు ప్రారంభించారు. సాగరతీరంలోని కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన పరుగు వైఎంసీఏ వద్ద ముగిసింది. వాస్తవానికి ఒలింపిక్ డే రన్ జూన్ 23న జరగనుంది. రాష్ట్ర స్థాయిలో ఆదివారం జరగనుండగా సంఘీభావంగా విశాఖలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరిచి పతకాలందుకున్న పలువురు క్రీడాకారుల్ని సంఘం ప్రతినిధులు సత్కరించారు. సాయిగణేష్, పి.బోనంగి, వై.హరికృష్ణ, ఆర్.స్వాతి, ఉత్తేజితరావు, నిషితా, శ్రీదేవి, ముత్యాలమ్మ, ఐశ్వర్యాదేవి, ఎస్.మహేష్, రామయ్య, ఉషా, ఎన్.సునీల్, కే.శ్రీను, కే.రాజేష్, జి.వెంకటేశ్వరరావు, ఎం.రాము, వి.తులసీ, వి.సత్యనారాయణ, వి.రమేష్, ఆర్.అరుణ సాయికుమార్, కే.యశ్వంత్, సాయి సంహిత, బి.అన్మిష, ఎస్.మేరీ, జి.వినయ్కుమార్, పూర్ణిమాలక్ష్మి, పవన్కుమార్, నారాయణమ్మ, నాగలక్ష్మి, అప్పలరాజు, సీహెచ్ దీపిక, ఎస్కెఎల్ బషీర్, జి.క్రాంతి, కె.భావన, సీహెచ్ దత్త అవినాష్, టి.ఆషిత, పీవీటీ కుమార్, జె.గణేష్, గుణష్నిత, పి.గాయత్రి, బి.కావ్య, జి.మేఘన, ఎ.కిషోర్, వీరుబాబు, నాగేంద్ర, అరుణ సాయికుమార్, యశ్వంత్ సత్కారం అందుకున్నారు. వీరిలో కొందరు జాతీయస్థాయిలో పతకాలు సాధించగా, మరికొందరు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. రన్ ముగింపు కార్యక్రమంలో ది ఒలింపిక్ సంఘం విశాఖ ప్రతినిధి పీవీజీఆర్ నాయుడు మాట్లాడుతూ విశాఖలో ప్రతి క్రీడకు సంఘం ఉందని, అవి చక్కగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. తొలుత జిల్లా సంయుక్త కలెక్టర్–2 వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒలింపిక్ రన్లో క్రీడాకారులు పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు. సంఘం అధ్యక్షుడు ప్రసన్నకుమార్ ఒలింపిక్ డే రన్ ప్రత్యేకతను వివరించారు. చక్కటి ప్రోత్సాహం అందించే కోచ్లను సత్కరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు టీఎస్ఆర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, మాణిక్యాలు, రామయ్య, కె.సూర్యనారాయణ, ఏయూ వ్యాయామ విద్యావిభాగ హెడ్ విజయ్మోహన్, పలు క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు వెనుక..
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాల తొలగింపు వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లు బీచ్ రోడ్లోని విగ్రహాలను సోమవారం అర్ధరాత్రి సమయంలో తొలగించారన్నారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా ఈ విధంగా చేయడం దారుణమన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున, దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను ఎన్నికల సమయంలో కలవడం, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు ఈ కుట్రకు పూనుకొన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కొడుకుల మీద కోపంతో వారి తండ్రుల విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. అలాగే రాజన్న రాజ్యం రాబోతోందని, వైఎస్సార్ ఉన్నప్పుడు తెలుగు భాషకు ప్రాధాన్యం పెరిగిందని.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను చెప్పానన్నారు. దీంతో చంద్రబాబు తనపైనా కోపం పెట్టుకొన్నాడని.. అందుకే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను కూల్చివేయించాడని మండిపడ్డారు. బీచ్ రోడ్లో సినారే, అల్లు రామలింగయ్య, జాలాది, నేదునూరి కృష్ణమూర్తి, తిరుపతి వేంకట కవులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ తదితర విగ్రహాలు ఉన్నాయన్నారు. వాటికి కూడా ఎలాంటి అనుమతుల్లేవన్నారు. వాటిలో ఐదు విగ్రహాలను తానే ఏర్పాటు చేశానని చెప్పారు. వాటిన్నిటినీ వదిలేసి ఈ మూడు విగ్రహాలపైనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు కోర్టులో కేసు వేయాల్సి వచ్చిందో చెప్పాలని యార్లగడ్డ ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు వాటిని తొలగించడానికి ఎందుకు ఆదేశించారో చెప్పాలన్నారు. కాగా, విగ్రహాల ఏర్పాటుపై న్యాయస్థానం ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చినట్లు యార్లగడ్డ తెలిపారు. -
వినండి.. తినండి
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు) : మండే ఎండాకాలంలో సాగరతీరంఓ అద్భుత ప్రాంతం. చల్లని గాలులతో సేద తీరేందుకు చక్కటి విడిది. అందమైన తీరం..మరో వైపు హోరెత్తించే పాటలు ఇలాంటి వాతావరణంలో సిటిజనులు గంటల తరబడి ఉండిపోతారు. మరి ఇలాంటి సమయంలో నచ్చిన ఫుడ్ ఉంటే వావ్.. భలే ఉంటుంది కదూ. ఇటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం సహకారంతో ఫుడ్ మానియా ఫెస్ట్ ఆర్కే బీచ్లో నిర్వహిస్తున్నారు. ఫుడ్తో పాటు ఆహ్లాదకరమైన మ్యూజిక్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లకు నగరవాసులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు వినోద్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించడం జరగుతుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫుడ్ ఐటమ్స్ నగర వాసులకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ ఫెస్ట్వల్ సోమవారం వరకూ కొనసాగుతుందన్నారు. -
రోజూ 18 పేపర్లు చదువుతా..
సాక్షి, విశాఖపట్నం: ‘అప్పట్లో మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు.. రాజకీయ నాయకులూ లేరు. వారసత్వం లేకున్నా జవసత్వంతో ఈ స్థాయికి (ఉపరాష్ట్రపతి) ఎదిగా. నా జీవితంలో అన్ని పదవులూ చేశా. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. కేంద్రంలో కీలక మంత్రి పదవులు చేపట్టాను. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి అధిరోహించాను. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పదవిలో ఉన్నాను. ఇలా అన్ని పదవులూ నిర్వహించాను.నేను నా ఈ జీవితాన్ని ఊహించలేదు.’ అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన మనసులో భావాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి బ్యాచ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘నేను యువకుడిగా ఉన్నప్పుడు వాజ్పేయి నెల్లూరు పర్యటనకు వచ్చారు. ఆయన బహిరంగ సభకు జనమంతా తరలి రావాలంటూ జట్కాబండిలో మైకులో ఊరంతా ప్రచారం చేశాను. కానీ వాజ్పేయి, అద్వానీల్లాంటి వారి మధ్య కూర్చుని ప్రసంగిస్తానని గాని, దేశంలో రెండో అత్యున్నత పదవి (ఉపరాష్ట్రపతి)కి ఎదుగుతానని నేనూహించలేదు.’ అని వివరించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతుల కష్టాలను ఎరుగుదునన్నారు. ‘నేను తాడిచెట్టు ఎక్కగలను. చెరువుల్లో ఈదగలను. చిన్నతనంలో పశువులను కడిగే వాడిని. నాగలిపట్టి పొలం దున్నేవాడిని. ఇవన్నీ నాకు మా తాత నేర్పారు. చేలో పంటను పక్షులు తినకుండా కొట్టేవాళ్లం. పంట ఇంటికొచ్చాక అవి తినడానికి వీలుగా వరి, జొన్న, సజ్జ కంకులను ఇళ్ల పంచలకు వేలాడదీసేవాళ్లం. ఇవన్నీ విద్యార్థులు తెలుసుకుంటే మన నాగరికత, సంస్కృతి ఎంత గొప్పదో అర్థం అవుతుంది.’ అని వివరించారు. నేను రోజూ 18 దినపత్రికలు చదువుతాను. మీరూ పత్రికలు చదవి వాటి ద్వారా జ్ఞానాన్ని అవగతం చేసుకోండి’ అని పిలుపునిచ్చారు. విశాఖలో తిరగని వీధి లేదు.. ‘విశాఖ వస్తే నాకు కొత్త ఉత్సాహం వస్తుంది. విశాఖలో నేను తిరగని వీధిలేదు. అప్పట్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గెలుపుకోసం ఎన్నికల్లో గట్టిగా పనిచేశా. ఆంధ్ర యూనివర్సిటీలో గోపీ బడ్డీ, ఎండు చేపలు, చావుల మదుం, జగదాంబ జంక్షన్.. ఆర్కే బీచ్.. ఇలా ఒకటేమిటి విశాఖలో ప్రకృతి అందాలన్నీ అన్నీ గుర్తుకొస్తాయి.’ అని విశాఖతో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విలాసాల వైపు వెళ్లొద్దని ఉద్బోధించారు. మావి హ్యాపీ డేస్.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో అంతా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. చదువుకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చేవాళ్లం. స్టూడెంట్స్ ఎన్నికలకు గట్టి పోటీ ఉండేది. జై ఆంధ్ర ఉద్యమంలో ఆరు నెలలు డుమ్మా కొట్టాను. మా క్లాస్మేట్స్ 12 మంది జడ్జీలయ్యారు. వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఒకరు. యూనివర్సిటీలో మావి హ్యాపీ డేస్!’ అంటూ స్టూడెంట్ జీవితాన్ని వివరించమని అడిగిన ఓ విద్యార్థికి వెంకయ్యనాయుడు సమాధానం ఇచ్చారు. -
హోవర్క్రాఫ్టస్ స్పీడ్కు బ్రేక్!
సాక్షి, విశాఖపట్నం : ఆర్కే బీచ్లో పర్యాటకులతో షికార్లు కొట్టేందుకు సిద్ధమైన హోవర్ క్రాఫ్ట్లు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఇలాంటి హోవర్ క్రాఫ్ట్లను ఇప్పటిదాకా అమెరికా, న్యూజిలాండ్, అస్ట్రేలియా, రష్యా, యూరప్ దేశాల్లో పర్యాటకుల కోసం నడుపుతున్నారు. వీటిని మన దేశంలోనే తొలిసారిగా విశాఖలో ప్రవేశపెట్టడానికి హోవర్ డాక్ అనే సంస్థ ముందుకొచ్చి పర్యాటకశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హోవర్ క్రాఫ్ట్లు నేలపైన, నీటిపైన కూడా సునాయాసంగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆర్కే బీచ్లో తీరం నుంచి కిలోమీటరు లోపల వరకు హోవర్ క్రాఫ్ట్లు నడపడానికి అనుమతి పొందింది. దీంతో నాలుగు స్పీడ్ బోట్ల (హోవర్ క్రాఫ్ట్ల)ను నడపడానికి హోవర్ డాక్ సంస్థ సన్నద్ధమయింది. వీటిలో ఐదుగురు కూర్చునే వీలున్న హోవర్ క్రాఫ్ట్ రూ.1.10 కోట్లు, ఏడుగురు ప్రయాణించే సామర్థ్యం ఉన్న బోటును రూ.1.70 కోట్లు వెచ్చించింది. వీటితో పాటు మరో రెండు హోవర్ క్రాఫ్ట్లకు వెరసి రూ.6 కోట్లు వెచ్చించి రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఈ హోవర్ క్రాఫ్ట్లను నడిపే టగ్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడానికి గత నెల మొదటి వారంలో రష్యా నుంచి శిక్షకుడిని తీసుకొచ్చారు. వారం రోజుల పాటు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని రెడ్డికంచేరు సముద్రతీరంలో ఈ ఆపరేటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన వ్యక్తిగత పనులపై స్వదేశానికి వెళ్లిపోవడంతో వీరికి శిక్షణ నిలిచిపోయింది. మళ్లీ రష్యా నుంచి మరొక శిక్షకుడు రావలసి ఉంది. ఇందుకు మరి కొన్నాళ్ల సమయం పట్టనుంది. అందువల్ల ఆయన వచ్చే దాకా శిక్షణ పూర్తికాదు. వేసవిలో విశాఖకు ఉత్తర భారతదేశం నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో వేసవికి ముందే ఈ నెలాఖరు నుంచి ఆర్కే బీచ్లో ఈ హోవర్ క్రాఫ్ట్లను ప్రారంభించాలని హోవర్ డాక్ సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేశారు. కానీ రష్యా శిక్షకుడు అర్థాంతరంగా వెళ్లిపోవడంతో హోవర్ క్రాఫ్ట్ల ప్రారంభానికి బ్రేకు పడింది. త్వరలోనే రష్యా నుంచి మరో శిక్షకుడు రానున్నారని, ఆయన రాగానే శిక్షణ కొనసాగుతుందని హోవర్ డాక్ అధినేత ఆర్.మెహర్ చైతన్యవర్మ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుత అంచనాలను బట్టి ఏప్రిల్ నెలాఖరు నాటికి హోవర్ క్రాఫ్ట్ల్లో షికారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
పుత్ర శోకం
విశాఖ క్రైం: హోలీ వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని రాకాసి అలలు అందని లోకానికి తీసుకుపోయాయి. కొడుకే సర్వస్వంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. హోలీ వేడుకల్లో భాగంగా స్నేహితులతో సరదాగా ఆర్కే బీచ్కు వెళ్లిన దొండపర్తికి చెందిన సాయికుమార్ అనే విద్యార్థి సముద్రంలో మునిగి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బెలగాం గ్రామానికి చెందిన పోలి అప్పలనాయుడు కుటుంబం నాలుగేళ్ల క్రితం కుమారుడి చదువు కోసం విశాఖ నగరానికి పొట్టచేత పట్టుకొని వచ్చింది. అప్పలనాయుడు కారు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబం పోషిస్తున్నాడు. ఈయనకు భార్య సత్యవతి, కుమారుడు సాయికుమార్(14) ఉన్నారు. దొండపర్తి కుమ్మరివీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి పక్కనే సమీప బంధువు కోలా నాగేశ్వరరావు, పొన్నాడ పుష్పవతి దంపతులు కూడా ఉంటున్నారు. సాయికుమార్ అక్కయ్యపాలెంలోని ఎన్టీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. హోలీ పండగకు పాఠశాల సెలవు కావడంతో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకే సాయికుమార్ స్నేహితులు ఇంటికి వచ్చి తలుపు తట్టారు. తల్లి సత్యవతి ఎక్కడికి వెళుతున్నావురా.. అంటే రైల్వే గ్రౌండ్కి అని చెప్పి స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్కు వెళ్లాడు. అక్కడ సరదాగా హోలీ సంబరాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకున్నారు. అనంతరం స్నానాల కోసం అందరూ సముద్రంలోకి దిగారు. అంతే ఒక్కసారిగా పెద్ద కెరటం వచ్చి సాయికుమార్ను లోపలికి లాక్కెళ్లిపోయింది. గమనించిన స్నేహితులు కేకలు వేసినా ఫలితం లేకపోయింది. వెంటనే సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలియడంతో సాయికుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆర్కే బీచ్ వద్దకు చేరుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడి మృతదేహం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్కు తరలించారు. సాయికుమార్తో వెళ్లిన నలుగురు విద్యార్థులను పోలీసులు విచారించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక తిన్నెలపై సంగీత లహరి
సాక్షి, విశాఖపట్నం: సాగరతీరంలోని ఇసుక తిన్నెలపై ఈ నెల 11, 12 తేదీల్లో సౌండ్స్ ఆన్ సాండ్ పేరిట సంగీత లహరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. విశాఖ పర్యాటక ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఆరు మెగా ఈవెంట్లను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులోభాగంగా మొదటి కార్యక్రమం సౌండ్స్ ఆన్ సాండ్ అని చెప్పారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి కళాకారులు పాల్గొంటారన్నారు. 11 ఉదయం 7 గంటలకు బైజు ధర్మజాన్, విజయ్ హెగ్డే, సాయంత్రం 4.30 గంటలకు సంగీతంపై అభిలాష ఉన్న వారికి వర్క్షాప్, 5 గంటలకు ఎకో అండ్ కైరోజ్ కార్యక్రమం, రాత్రి 7 నుంచి పాప్సింగర్ ఉషా ఊతప్ సంగీత విభావరి, 8.30కి ప్రముఖ కళాకారులు లెస్లీ లెవీస్ల సంగీత కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 12 ఉదయం 7 గంటలకు నడి వయసు వారు ఇష్టపడే డబ్లీ కార్యక్రమం, సాయంత్రం 4.30 గంటలకు సంగీత వర్క్షాప్, 5.30కి స్థానిక కళాకారులతో క్వాయర్ కళాబృందం సాంస్కృతిక ప్రదర్శన, రాత్రి 7 గంటలకు ఇండియన్ ఐడల్ రేవంత్ గీతాలాపన, 8.30నుంచి టాలీవుడ్ నేపథ్య గాయకులు మహ్మద్ ఇర్ఫాన్, ఆసీస్ కౌర్లతో సంగీత కార్యక్రమాలుంటాయని వివరించారు. ఫేస్బుక్లో లాగిన్ అయి ఎక్కడ నుంచైనా కార్యక్రమాన్ని వీక్షించవచ్చన్నారు. 14 నుంచి 18 వరకు పలు కార్యక్రమాలు ఈ నెల 14 నుంచి 16 వరకు అరకులో బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 10, 11 తేదీల్లో నగరంలో కలెక్టర్ల సదస్సు జరుగుతుందని, దీనికి దేశంలోని వంద జిల్లాల నుంచి 62 మంది కలెక్టర్లు, 40 మంది ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారన్నారు. అలాగే 15 నుంచి 17 వరకు అగ్రిహ్యాకథాన్, 17, 18 తేదీల్లో జాతీయ స్థాయి టూర్ ఆపరేటర్ల సమావేశం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఈడీ శ్రీరాములునాయుడు, డీటీవో పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్కే బీచ్లో దంపతుల ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం: నగరంలోని ఆర్కేబీచ్లో దూకి దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. గురువారం ఉదయం మద్యం మత్తులో బీచ్లో పడి ఉన్న మహిళను గుర్తించిన సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. రగంలోకి దిగిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మర్రిపాలేనికి చెందిన నారాయణరావు, రాజారమణి దంపతులు బుధవారం అర్ధరాత్రి మద్యం సేవించి సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. నారాయణరావు మృతిచెందాడు. రాజారమణి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నడిసంద్రంపై నడక!
నడిసంద్రంపై నడక! వినడానికి వింతగా ఉంది కదా! వింత కాదు.. విచిత్రం అంతకంటే కాదు. పొట్టకూటి కోసం ఎంచుకున్న వృత్తి ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. సుదూరం నుంచి చూసే వారికే కలవరానికి గురిచేస్తోంది. సముద్రంలో పేరుకుపోయిన ఇసుకను ఒడ్డుకు పంప్ చేసే డ్రెడ్జింగ్ ప్రక్రియ విశాఖ సాగరతీరం ఆర్కే బీచ్ సమీపంలో కొద్దిరోజులుగా సాగుతోంది. డ్రెడ్జింగ్ చేసే ఓడ నుంచి భారీ పైప్లైన్ను తీరానికి వేశారు. ఆ పైప్లైన్లో ఇసుక కూరుకుపోయి పనులకు అంతరాయం ఏర్పడింది. కూరుకుపోయిన ఇసుకను తొలగించి, పైప్లైన్కు మరమ్మతులు చేయడానికి అందులో నిష్ణాతులైన వారితో పాటు కొంతమంది మత్స్యకారులను ఓ చిన్న బోటుపై డ్రెడ్జింగ్ నౌక వద్దకు పంపారు. వారు ఉప్పొంగే అలల నడుమ ఉన్న పైప్లైన్పై పలుమార్లు వెనక్కి, ముందుకు నడుస్తూ, బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాణాలొడ్డి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా సముద్రం పాలవ్వాల్సిందే. ఈ సాహస ప్రక్రియ చూసే వారికి ఆశ్చర్యం గొలుపుతోంది. దూరం నుంచి వీక్షించే వారికి వారు సాగరంపై నడుస్తున్నారన్న భావన కలుగుతోంది. సహజ సౌందర్యంతో నిత్యం వేలాది మందిని ఆకర్షిస్తున్న ఆర్కే బీచ్ ఈ అద్భుత దృశ్యాన్ని కూడా అదనంగా అందజేస్తోంది. – సాక్షి, విశాఖపట్నం -
రన్వేపై నిర్బంధించడమేమిటి?
-
రన్వేపై నిర్బంధించడమేమిటి?
విమానాశ్రయంలో పోలీసులను నిలదీసిన జగన్ సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికులను ఇలా రన్వేపై అడ్డుకోవడమేమిటి? మీరసలు పోలీసులేనా? కేంద్ర బలగాల అధీనంలో ఉండే విమానాశ్రయప్రాంతంలోకి రాష్ట్రపోలీసులెలా వచ్చారు?.. విమానాశ్రయంలో తమను అడ్డుకున్న పోలీసులను వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఆ సందర్భంగా ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు నీళ్లు నమిలారు. ఖాకీలను జగన్ నిలదీశారిలా.... ‘‘ప్రయాణికుల ప్రయాణ మార్గంలో ఎందుకు పోనివ్వడం లేదు? మమ్మల్ని ఇక్కడ ఆపి ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇక్కడ ఆపారు? మేం ఏంచేయాలిక్కడ? రన్వేపైనే ఆపడమేమిటి? వీళ్లు పోలీసులా? ఐడీ కార్డు కూడా లేదు? ఎవరసలు వీళ్లంతా?’’ ‘‘ప్రయాణికుల మార్గం గుండా ఎప్పుడూ వీఐపీ లాంజ్లోకి వెళతాం. మమ్మల్ని వేరే మూలకు ఎందుకు తీసుకుపోతున్నారు. అది లాంజ్ కాదుకదా. నా వెంట వస్తున్నవారిలో ఇద్దరిని కిడ్నాప్ చేశారు మీరు. అందులో ఒకరు లోక్సభ సభ్యుడు కూడా. అసలు మీరు లోనికెందుకు వచ్చారు? రాష్ట్రపోలీసులు విమానాశ్రయంలోకి ఎలా వస్తారు? ఇది కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్ అధీనంలో ఉండే ప్రాంతం.’’ ‘‘ఎలా వ్యవహరించాలో తెలియకుండా పోలీసు డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నారు మీరంతా? డొమెస్టిక్ అరైవల్ అనే బోర్డు మీకు కనిపించడం లేదా? ప్రయాణికులను బైటకు పంపించరా? రన్వేపై మమ్మల్ని ఆపడమేమిటి? ఏం చేస్తున్నారో మీకు తెలుస్తున్నదా?’’‘‘రెండే రెండు సంవత్స రాలు. నేను ఎవరినీ మర్చిపోను. ఒక ప్రయాణికుడితో వ్యవహరించినట్లు కూడా వ్యవహరించరా? ఎందుకు ఆపుతున్నారు?’’ -
కలసికట్టుగా పోరాడదాం రండి
రాజకీయ పార్టీలకు వైఎస్ జగన్ పిలుపు ►ప్రత్యేకహోదాకు చంద్రబాబు వెన్నుపోటు ►నిరసనగా నేడు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన ►పోలీసులకు జీతాలిస్తున్నది ప్రభుత్వమే కాని చంద్ర బాబు కాదు ►సెల్యూట్ కొట్టాల్సింది సింహాలకు... గుంట నక్కలకు కాదు ►విద్యార్థులపై కేసులా... ప్రతి కేసునూ ఎత్తివేస్తాం ►చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే ►రానున్న ప్రజా ప్రభుత్వంలో అన్నిటిపైనా విచారణ సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, హైదరాబాద్ : ‘‘జల్లికట్టు అనేది ఆటే కావచ్చు... కానీ ఆ ఆటను కొనసాగించుకోవడానికి అందరూ కలిసికట్టుగా సాధించుకున్నా రు. దానిని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ఒక్క తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడదాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని అడ్డుకున్న తీరుకు నిరసనగా, ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన ఆందోళనలు నిర్వహిద్దాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఆర్కే బీచ్లో గురువారం జరిగే కొవ్వొత్తుల ర్యాలీ లో పాల్గొనడానికి అక్కడి ఎయిర్పోర్టులో విమానం దిగిన వెంట నే జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయి రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, నాయకులు అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు చుట్టుముట్టి బయటకు అడుగు కూడా వేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. విశాఖ నుంచి హైదరాబాద్ రాత్రి 8.30 గంటలకు చేరుకున్న జగన్ తన నివా సం వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు అడుగడు గునా అడ్డుతగులుతున్న చంద్రబాబును చూసి సిగ్గుతో తలదిం చుకోవాల్సి వస్తోందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే... ప్రత్యేక హోదాకు చంద్రబాబు వెన్నుపోటు... ప్రత్యేక హోదా కోసం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. రాష్ట్రంలో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు, చదువుతున్న విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు పుణ్యాన పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోని 1.06 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుండగా... వాటిలో 26 వేలు మూతపడ్డాయని కేపీఎంజీ, ఆర్బీఐ లాంటి సంస్థలు నివేదికలు ఇస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించడం మాట దేవుడెరుగు.. వరుసగా ఉద్యోగాలు పోతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా ఒక సంజీవని అని తెలిసినా చంద్రబాబు పట్టించుకోవడంలేదు. ప్రత్యేకహోదా కోసం ఎవరు నినదించినా, ఎవరు పోరాటం చేసినా ఉక్కుపాదంతో అణచివేయాలన్నట్లుగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా ప్రత్యేకహోదాకోసం పోరాడాల్సిన వ్యక్తే పార్లమెంటు సాక్షిగా విభజన నాడు ఇచ్చిన హామీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం బాధాకరం. చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. రాజ్యాంగం ప్రకారం రిపబ్లిక్ డేగా ప్రకటించుకుని 68 సంవత్సరాలు అయిన రోజున ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా, వైజాగ్లో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. ప్రత్యేకహోదా అన్న డిమాండ్ను కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి గుర్తుచేయడం కోసం గాంధేయ పద్ధతిలో సాగుతున్న యువకులను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. కాకినాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంలో విద్యార్థులను దారుణంగా కొట్టారు... కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులను హౌస్అరెస్ట్ చేశారు. సీపీఎం నేత మధును శ్రీకాకుళంలో అరెస్టు చేశారు. ఇవన్నీ చంద్రబాబు చేయాల్సిన పనులేనా అని అడుగుతున్నా. పోలీసులూ సెల్యూట్ చేయాల్సింది సింహాలకు... విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే రన్వే మీదనే మమ్మల్ని అడ్డుకున్నారు. మేమున్నది ఐదారుగురమే అయినా వందలకొద్దీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్షనాయకుడు, ఇద్దరు ఎంపీలు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారని కూడా చూడలేదు. సాధారణ ప్రయాణికుడికి కూడా దేశీయ మార్గం ద్వారా బైటకు వెళ్లే హక్కు ఉంటుంది. విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ అధీనంలో ఉంటుంది. పోలీసులకు సంబంధమే ఉండదు. కానీ పోలీసులు లోనికి ప్రవేశించి మమ్మల్ని అడ్డుకున్నారు. డొమెస్టిక్ టెర్మినల్ వద్దనే రెండు గంటలసేపు నిర్బంధించారు. అక్కడే మేం ధర్నాలు చేయాల్సి వచ్చింది. మీకు జీతాలిస్తున్నది ప్రభుత్వమే గానీ చంద్రబాబు కాదని పోలీసు అధికారులకు చెబుతున్నా. మీరు సెల్యూట్ కొట్టాల్సింది మీ నెత్తిపైనున్న మూడు సింహాలకే తప్ప, వాటి వెనుకనున్న గుంటనక్కలకు కాదు. చంద్రబాబే ఎల్లకాలం ఉంటాడని అనుకోవద్దు. దయచేసి ప్రజల పక్షాన నిలబడండి. ప్రజలకు అండగా నిలబడండి. పిల్లలు, నాయకులు రాష్ట్ర భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నారు. అందులో పోలీసుల పిల్లల భవిష్యత్ కూడా ఉంది. కొంతమంది పోలీసు అధికారులు చంద్రబాబు మనుషుల్లా వ్యవహరిస్తున్నారు. నిజంగా వీటన్నిటి మీద కచ్చితంగా విచారణ జరుగుతుంది. తగిన సమయం వచ్చినపుడు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రతి పిల్లాడికీ తోడుగా ఉంటా చదువుకుంటున్న పిల్లలపై కేసులు పెడుతున్నారు. కేసులకు ఎవ్వరూ భయపడవద్దు. ప్రతిపిల్లాడికి తోడుగా ఉంటాం. రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది... ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఈ కేసులన్నీ తీసేస్తాం. ప్రత్యేక హోదాను ఖూనీ చేసిన, ఇంకా చేస్తున్న చంద్రబాబు నాయుడ్ని దేవుడు, ప్రజలు క్షమించరు. ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే వస్తుంది. ప్రత్యేక హోదాకు అడ్డు తగులుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు నిరసన వ్యక్తం చేయాలని కోరుతున్నా. ప్రత్యేక హోదా మన శ్వాస... ప్రత్యేకహోదా అన్నది మన శ్వాస. మనకు రాజ్యాంగబద్ధంగా ఇస్తామన్న హామీ. దాన్ని నీరు గార్చడానికి మనం ఒప్పుకోకూడదు. అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా... అందరం ఒకటవుదాం... కలిసికట్టుగా పోరాడదాం... ప్రత్యేకహోదాను సాధించుకుందాం. చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలిపేద్దాం. తమిళనాడులో జల్లికట్టుకు, ఇక్కడి హోదా ఆందోళనకు సంబంధం లేదని చంద్రబాబు, ఆయన మంత్రులు వెటకారంగా మాట్లాడుతున్నారు. అది జల్లికట్టు కాదు... కలిసికట్టు. ముఖ్యమంత్రి నుంచి సామాన్యుడి వరకూ కలిసికట్టుగా ఉద్యమించి, పోరాడి సాధించుకున్నారు. సా«ధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అలాగే సాధించుకున్నారు. అదే స్ఫూర్తితో మనమూ ఉద్యమించి ప్రత్యేకహోదాను సాధించుకుందాం. చంద్రబాబులాంటి ముఖ్యమంత్రి ఉండి ఉంటే... మనకు స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదు. ఇలాంటి ముఖ్యమంత్రి పోతేనే మంచి జరిగేది. గతంలో జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం జాబు రావాలంటే బాబు పోవాలి. ఇందుకు అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. చంద్రబాబు, సుజనా చౌదరి... అసలు వీరంతా మనుషులేనా అనిపిస్తోంది. రాష్ట్రాన్ని విడగొట్టేప్పుడు ప్రత్యేక హోదా అయిదు కాదు 15 ఏళ్లు కావాలని అడగలేదా? పరిశ్రమలు కట్టడానికే రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. అయిదేళ్లు హోదా ఏం సరిపోతుందని వెంకయ్యనాయుడు లాంటి వారు మాట్లాడలేదా? పార్టీల మేనిఫెస్టోల్లో ఇవన్నీ చెప్పలేదా? ఎన్నికలు, ప్రజలతో పని అయిపోయిన తరువాత ఇన్ని మోసాలు, అబద్ధాలా? ఇలాంటి వారు నాయకులని చెప్పుకోవడానికే సిగ్గుపడాలి. -
భావ ప్రకటనకు సంకెళ్లా?
సాక్షి, అమరావతి: భారతదేశం గణతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకున్న జనవరి 26న ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్న పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా రాష్ట్రప్రభుత్వం ఆటంకాలు కల్పించడాన్ని బుధవారమిక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో పౌరుల హక్కుల్ని కాలరాస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై గవర్నర్కు వినతిపత్రం అందజేయాలని తీర్మానించింది. ‘ప్రజాస్వా మిక నిరసనలపై ప్రభుత్వ నిర్బంధాలు’ అనే అంశంపై మాకినేని బసవపున్నయ్య(ఎంబీ) విజ్ఞాన కేంద్రంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలతోపాటు జనసేన, అమ్ఆద్మీ, లోక్సత్తా పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రు ల హక్కు అని ఈ సందర్భంగా నినదించారు. ఆంధ్రప్రదేశ్ సత్వర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా అవసరమన్నారు. దీనికోసం యువత చేపట్టే ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు మానుకోవాలని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు చేపట్టే అన్ని ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉంటామని మద్దతు ప్రకటించారు. పౌరహక్కుల్ని కాలరాస్తోంది.. 26న విశాఖపట్నం రామకృష్ణా బీచ్లోను, రాష్ట్రవ్యాప్తంగానూ చేపట్టే మౌన ప్రదర్శన లను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల ను ప్రయోగించడాన్ని సమావేశం తప్పుబ ట్టింది. రాష్ట్రంలో పౌర హక్కులను చంద్రబా బు సర్కారు కాలరాస్తోందని సమావేశం మండిపడింది. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన శాంతియుత ఆందోళన కు ప్రభుత్వం అనుమతివ్వకుండా హౌస్ అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకచర్య అని విమర్శించింది. పార్లమెంటు ఆమోదం పొందిన 2013 భూసేకరణ పునరావాస చట్టాన్ని కాదని కొత్త చట్టంతో రైతులు, పేదల పొట్టకొట్టేలా రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేసింది. వంశధార, పోలవరం వంటిచోట్ల పునరావాసంకోసం నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలపై పోలీసుల దమనకాండను నిలుపుదల చేయాలంది. పరిశ్రమలు, ఆక్వా హబ్లు వెదజల్లుతున్న కాలుష్యానికి వ్యతిరే కంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదా వరి, కృష్ణా జిల్లా›ల్లో జరుగుతున్న ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదంది. -
‘హోదా’ గోదా.. విశాఖ
‘సాక్షి’ ప్రతినిధి, విశాఖపట్నం/అమరావతి: నాటి స్వాతంత్రోద్యమం మొదలు.. మొన్నటి విశాఖ ఉక్కు సంకల్పం, నిన్నటి జై ఆంధ్ర.. ఆ తర్వాత సమైక్యాంధ్ర పోరు వరకు ఉద్యమ కెరటమై పోటెత్తిన విశాఖ తీరం ఇప్పుడు ప్రత్యేక హోదా పోరాటానికి కేంద్ర బిందువుగా మారింది. చెన్నై మెరీనా బీచ్ను ముంచెత్తిన జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 26న(నేడు) విశాఖపట్నం ఆర్కే బీచ్లో హోదా పోరుకు యువజన, విద్యార్థి సంఘాలు, వైఎస్సార్సీపీ శ్రేణులు నడుం బిగించాయి. గణతంత్ర దినోత్సవం నాడు శాంతియుతంగా చేపట్టనున్న ఆందోళనపై పోలీసులు ముందుగానే ఉక్కుపాదం మోపడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను విశాఖ వెళ్తా.. అడ్డుకుంటారా.. దేనికైనా సిద్ధం’ అంటూ గర్జించారు. దీంతో ఉద్యమకారుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మరోవైపు హోదా పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోంది. ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు, సభలను అనుమతి ఇవ్వడం లేదని డీజీపీ నండూరి సాంబశివరావు పేర్కొన్నారు. రామకృష్ణ(ఆర్కే) బీచ్ను బుధవారం సాయంత్రం నుంచే పోలీసులు ముట్టడించారు. బీచ్లో అడుగడుగునా ఖాకీలే కనిపిస్తున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి బీచ్లో ఎవరూ తిరగడానికి వీల్లేదని, మార్నింగ్ వాకర్స్ కూడా రావొద్దని హెచ్చరించారు. బీచ్రోడ్లో నివాసం ఉంటున్నవారు పోలీసు శాఖ జారీ చేసిన వాహన పాసులను లేదా తమ గుర్తింపు, నివాస ధ్రువపత్రాలను చూపిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు నగరాలు, పట్టణాల్లో పోలీసులు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. రాష్ట్రమంతటా నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించకుండా సెక్షన్ 30ని కూడా అమల్లోకి తీసుకొచ్చినట్లు సమాచారం. అటు కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. కాగా, అర్ధరాత్రి నుంచి పలువురు వైఎస్సార్సీపీ నేతలు లక్ష్యంగా పోలీసులు అరెస్టుల పర్వానికి తెరతీశారు. -
ర్యాలీ అనుమతి కోసం దరఖాస్తు చేశాం
ఆధారమిదిగో.. ఆంగ్ల మీడియాతో జగన్ సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖపట్టణంలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ కోసం తమను ఎవరూ సంప్రదించలేదని పోలీసు అధికారులు చెప్పడంలో నిజం లేదని తాము ఈ నెల 23వ తేదీనే అనుమతి కోరుతూ దరఖాస్తు చేశామని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఆంగ్ల మీడియా ప్రతినిధులడిగిన ప్రశ్నలకు సమాధానంగా కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి కోరుతూ పోలీసులకు చేసుకున్న దరఖాస్తు ప్రతిని స్వయంగా చూపించారు. తాను విశాఖ ర్యాలీలో పాల్గొని తీరతానని ఆయన స్పష్టం చేశారు. అన్ని విధాలా గ్రోత్ ఇంజన్గా, ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్ కోల్పోతున్నందుకే ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటులో హామీ ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. 90 శాతానికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ హైదరాబాద్లోనే కేంద్రీకృతం అయి ఉన్నాయని అంతే కాక పారిశ్రామిక తయారీ రంగం, సేవారంగాలు కూడా 70 శాతానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఈ స్థాయిలో ఏపీ కూడా అభివృద్ధి చెందాలంటే అనివార్యంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫార్మారంగం కూడా హైదరాబాద్లోనే ఉందన్నారు. జల్లికట్టు కోసం తమిళనాడు ముఖ్యమంత్రి మొత్తం రాజకీయ పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లారని, హోదా కోసం చంద్రబాబు కూడా అలాగే చేయాలని ఆయన అన్నారు. -
ప్రజాస్వామ్యమా.. పోలీస్ రాజ్యమా?
-
ప్రజాస్వామ్యమా.. పోలీస్ రాజ్యమా?
ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి నిరాకరణపై బొత్స ధ్వజం సాక్షి, విశాఖపట్నం: ‘‘జల్లికట్టు కోసం తమిళనాట అన్ని పార్టీలతో పాటు ప్రభుత్వం కూడా కలిసి ఉద్య మించి ఆర్డినెన్స్ తెచ్చుకోగలిగారు. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేకహోదాకోసం ఆంధ్రులంతా గళమెత్తుతుంటే, ఉద్యమిస్తుం టే అనుమతులివ్వరా? మనం ప్రజా స్వామ్యం లో ఉన్నామా? పోలీసు రాజ్యంలో ఉన్నామా? మీ ఆలోచన ఏమిటి? రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? పక్క రాష్ట్రా లను చూసైనా బుద్ధి రాదా మీకు?’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై విరుచుకు పడ్డారు. ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్లో ఈ నెల 26న శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేసుకోవడానికి అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధించడంపై మండి పడ్డారు. ఎవరెన్ని ఆంక్షలు విధించినా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. కొవ్వొత్తుల ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లా డారు. ర్యాలీ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పూర్తి బాధ్యత వహిస్తా మని వైఎస్సార్సీపీ చెబుతున్నా ఎందుకు అనుమతివ్వడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీనే పణంగా పెట్టాం... ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ పార్టీని పణంగా పెట్టి పోరాడు తున్నారని అంతకుముందు బొత్స చెప్పారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ విశ్రమించ బోమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే అంశాన్ని పార్టీ ప్రధాన ఎజెండాగా చేరుస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న వారికే కేంద్రంలో తమ పార్టీ మద్దతునిస్తుందంటూ జగన్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. 26వ తేదీన విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీని శాంతి యుతంగా నిర్వహించాలని తమ అధినేత పిలుపునిచ్చారని చెప్పారు. కాగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై తొలిరోజే చర్చ జరపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. హోదా కావా లని అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, ఇప్పుడు ప్యాకేజీయే మిన్న అని ఎలా అంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. -
‘హోదా’ ఉద్యమానికి సీపీఎం మద్దతు
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం గురువారం జరిగే ఉద్యమానికి సీపీఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విశాఖ ఆర్కే బీచ్, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, విజయవాడ ప్రకాశం బ్యారేజీల వద్ద జరిగే ఆందోళనలో యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మంగళవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధనకు సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదో అర్థం కావట్లేదని ధ్వజమెత్తారు. -
జల్లికట్టుకు ‘మెరీనా’... హోదాకు ‘ఆర్కే’
విశాఖపట్నం: చెన్నై మెరీనా బీచ్ లో యువ‘తరంగం’ ఉవ్వెత్తున ఎగసిపడడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆగమేఘాల మీద జల్లికట్టు ఆర్డినెన్స్ కు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. తమ సంప్రదాయ క్రీడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని సముద్రతీరంలో తమిళ యువత సాగించిన పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది. జల్లికట్టుపై కట్టుబాట్లను తెంచేందుకు పాలకులు అంగీకరించినా విద్యార్థులు వెనక్కు తగ్గలేదు. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసే దాకా ఉద్యమం ఆపేదిలేదంటూ మెరీనా బీచ్ వదిలేందుకు యువత విముఖత వ్యక్తం చేసింది. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా పోరు ఊపందుకుంటోంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా పోరాటానికి ఏపీ ప్రజలు సిద్ధమవుతున్నారు. ‘మన రాష్ట్రం- మన హోదా’ అంటూ మహోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కేంద్రం నుంచి ప్రత్యేకహోదా సాధించే లక్ష్యంతో ముందుకు ఉరుకుతున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన విశాఖపట్నం బీచ్ ఒడ్డున వేలాదిమంది ప్రజలతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఏపీకి ప్రత్యేకహోదా హామీని నేర్చవేర్చాలన్న డిమాండ్ తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని కోరింది. తమిళులను ప్రేరణగా తీసుకుని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై సోషల్ మీడియాలోనూ స్వచ్ఛందంగా ప్రచారం ఊపందుకుంది. హోదా పోరుకు యువత కదిలివచ్చేందుకు సిద్ధమవుతోంది. -
ఆర్కే బీచ్లో ఇద్దరు బాలురు గల్లంతు
విశాఖపట్నం: స్నేహితులతో కలిసి బీచ్లో స్నానం చేస్తున్న ఇద్దరు బాలురు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కంచెరపాలెం గ్రామానికి చెందిన ఆదిత్య(14), సంతోష్(14)లు స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్లో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీట మునిగారు. ఇది గుర్తించిన స్థానికులు ఓ బాలుడిని కాపాడగా.. ఆదిత్య, సంతోష్ గల్లంతయ్యారు. వారికోసం స్థానికులు పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. -
కాటేయబోయిన అల
రక్షించిన లైఫ్ గార్డ్స్ బీచ్రోడ్ : రాకాసి అలలు ఇద్దరు యువకులను కాటేయబోయాయి. అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ ఎంతో శ్రమించి వారిని రక్షించారు. ఈ సంఘటన ఆదివారం ఆర్కే బీచ్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కవీధి, జాలారిపేటకు చెందిన జి.ఎల్లాజి (24), వి.పైడిరాజు (24) కార్పెంటర్లు. వారు ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్కే బీచ్కు వచ్చారు. స్నానం చేయడానికి ఎల్లాజి సముద్రంలోకి దిగగా ఉధృతంగా వచ్చిన కెరటం లోపలకు లాగేసింది. అతడిని కాపాడే క్రమంలో పైడిరాజు అలలకు చిక్కాడు. సందర్శకుల సమాచారంతో లైఫ్గార్డ్స్ వి.దేవుడు, టి.పోలారావు, వి.ఎల్లాజి రంగంలోనికి దిగారు. ప్రాణాలను పణంగా పెట్టి గంటసేపు శ్రమించి యువకులను రక్షించారు. వీరికి మెరైన్ పోలీసులు సహాయం చేశారు. అనంతరం వారికి ప్రథమ చిక్సిత చేయించి ఇంటికి పంపించారు. ఇదీ పునర్జన్మ సముద్రం అంచునే స్నానం చేస్తున్నా.. ఇంతలో పెద్ద కెరటం వచ్చి లోపలకు లాక్కుపోయింది. నన్ను రక్షించటానికి వచ్చిన నా స్నేహితుడు సముద్రంలో చిక్కుకున్నాడు. నేను అయితే ప్రాణాల మీద ఆశ వదిలేశాను. లైఫ్గార్డ్స్ మా ఇద్దరిని రక్షించి పునర్జన్మ ఇచ్చారు. –జి.ఎల్లాజి లోపలకు లాగేసింది.. నా స్నేహితుడు కెరటాలకు చిక్కుకోవటం చూసి ఆందోళనకు గురయ్యా. ఏమి చేయాలో తెలియక నేను లోనికి వెళ్లా. రాకాసి అల నన్ను లోపలకు లాగేసింది. సమయానికి లైఫ్గార్డ్స్ వచ్చి మమ్మల్ని కాపాడారు. జీవితాంతం వారిని గుర్తుంచుకుంటాం. –వి.పైడిరాజు -
శవమై తేలిన చిన్నారి జ్యోత్స్న
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని ఆర్కే బీచ్లో గల్లంతైన మూడేళ్ల చిన్నారి జ్యోత్స్న ఆదివారం శవమై తేలింది. చిన్నారి మృతదేహం వుడా పార్క్ వద్ద తీరానికి కొట్టుకొచ్చింది. పాండురంగాపురం జాస్తిస్క్వేర్ ఎదురుగా ఆర్కే బీచ్లో చిన్నారి జ్యోత్స్న శనివారం రాత్రి ఆడుకుంటుండగా ఒక్కసారిగా భారీ అల రావడంతో గల్లంతైన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం భీమిలి వరకు నేవీ సిబ్బంది సముద్రంలో జల్లెడపట్టారు. తమ గారాల పట్టి చిన్నారి జ్యోత్స్న ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమైయ్యారు. -
ఆర్కే బీచ్లో చిన్నారి గల్లంతు
తీరంలో ఆడుకుంటున్న చిన్నారిని సాగర అల మింగేసింది. విశాఖపట్నంలోని పాండురంగాపురం జాస్తిస్క్వేర్ ఎదురుగా ఆర్కే బీచ్లోశనివారం రాత్రి మూడేళ్ల జ్యోత్స్న ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా వచ్చిన భారీ అల ఆ చిన్నారిని సముద్రంలోకి లాగేసింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ కేకలు పెట్టారు. వెంటనే మెరైన్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ లభించలేదు. -
ఆర్కే బీచ్లో ఐదో మృతదేహం లభ్యం
ఆర్కేబీచ్(విశాఖపట్నం): విశాఖపట్నం ఆర్కేబీచ్ వద్ద సముద్రంలో మంగళవారం ఉదయం ఐదో మృతదేహం లభ్యమైంది. గల్లంతైన ఐదుగురిలో నిన్న ( సోమవారం) నాలుగు మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. తొలుత మూడు మృతదేహాలు లభ్యం కాగా, మరో మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. ఈ నెల 8న ఆర్కే బీచ్లో ఐదుగురు సందర్శకులు గల్లంతైన సంగతి తెలిసిందే. మృతదేహాల్లో ఇద్దరు బిహార్కు చెందిన బాబర్, ఒడిశాకు చెందిన చేతన్లుగా గుర్తించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలేనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గల్లంతైన ఒకరి కోసం నిన్నటి నుంచి నాలుగు మెరైన్ బోట్లు, నేవీ హెలికాఫ్టర్లతో గాలింపు చర్యలు చేపట్టగా చివరకు ఐదో మృతదేహాన్ని గుర్తించారు. -
తీరానికి కొట్టుకొచ్చిన మరో మృతదేహం
ఆర్కేబీచ్(విశాఖపట్నం): విశాఖపట్నం ఆర్కేబీచ్ వద్ద సముద్రంలో నిన్న(ఆదివారం) గల్లంతైన ఐదుగురిలో ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలు సోమవారం తీరానికి కొట్టుకొచ్చాయి. తొలుత మూడు మృతదేహాలు లభ్యం కాగా, మరో మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. మృతదేహాల్లో ఇద్దరు బిహార్కు చెందిన బాబర్, ఒడిశాకు చెందిన చేతన్లుగా గుర్తించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలేనికి చెందిన ఒకరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైన ఒకరి కోసం నాలుగు మెరైన్ బోట్లు, నేవీ హెలికాఫ్టర్లతో గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. -
విశాఖ బీచ్లో విషాదం
♦ సముద్రంలో ఐదుగురు గల్లంతు ♦ వారిలో ముగ్గురు విద్యార్థులు ♦ యారాడ బీచ్లో ఒకరి మృతి సాక్షి, విశాఖపట్నం: సరదాగా ఈతకు వెళ్లిన ఐదుగురు.. వేటకు వెళ్లిన ఒకరు వేరు వేరు చోట్ల సముద్రంలో మునిగిపోయారు. వీరిలో ఒకరి మృతదేహం ఒడ్డుకు చేరగా, ఐదుగురి ఆచూకీ లభ్యం కాలేదు. కంబాల ధనరాజ్(20) తన ముగ్గురు మిత్రులతో కలసి యారాడ బీచ్లో చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ చేపలు పట్టారు. భోజనం చేసిన తర్వాత 2గంటల సమయంలో మళ్లీ వేట ప్రారంభించారు. ఆ సమయంలో ఓ అల ధనరాజ్ను బలంగా తాకింది. దీంతో అతను సముద్రంలో పడిపోయాడు. అతనిని రక్షించేందుకు స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించి ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు విడిచాడు. మరోవైపు ఆర్కేబీచ్లో మధ్యాహ్నం 3.40 నుంచి కొద్ది నిమిషాల వ్యవధిలోనే మూడు బృందాలకు చెందిన ఐదుగురిని అలలు లాక్కెళ్లిపోయాయి. ఆర్కే బీచ్ కాళీమాతా ఆలయం ఎదురుగా ఉన్న పెద్దరాయి ప్రాంతంలో ఒకరు గల్లంతవుతుంటే గమనించిన లైఫ్గార్డులు అతనిని రక్షించారు. అంతలోనే మరో ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలేనికి చెందిన 19 మంది విద్యార్థులు పిక్నిక్ కోసం ఆర్కేబీచ్కు వచ్చారు. వీరంతా టెన్త్ ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ప్రసాద్(16), శ్రావణ్కుమార్(16), శేషు(16) అనే విద్యార్థులు గల్లంతయ్యారు. అదే ప్రాంతంలో బిహార్కు చెందిన బాబర్ఖాన్(25), ఒడిషా కోరాపుట్కు చెందిన సీతన్న(30) గల్లంతయ్యారు. వీరంతా విశాఖ పోర్టులో రోజు కూలీలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. గల్లంతైన వారి కోసం లైఫ్గార్డులు చీకటి పడేవరకు వెతికినా వారి జాడ కానరాలేదు. -
విశాఖలో ఘనంగా శివరాత్రి వేడుకలు
విశాఖ: మహా శివరాత్రిని పురస్కరించుకుని విశాఖ జిల్లాలోని ఆర్కే బీచ్లో సోమవారం టీఎస్ఆర్ సేవ పీఠం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి గంట శ్రీనివాసరావు, పెందుర్తి శారదాపీఠాధిపతి స్వరూపనానేంద్ర సరస్వతి, సినీ ప్రముఖులు కృష్ణంరాజు, సుమన్, రాజశేఖర్, జీవిత, పరుచూరి గోపాల కృష్ణ, సాలూరు వాసురాం బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత, సాహిత్య రంగాల్లో సేవలందించిన కళాకారులు, రచయితలు 10 మందిని శివ శక్తి అవార్డులతో టీఎస్ఆర్ సేవా పీఠం సత్కరించింది. ఇందులో నటుడు కృష్ణంరాజుకు విశ్వ విఖ్యాత నట వీర బిరుదుతో టీఎస్ఆర్ సేవా పీఠం ఘనంగా సత్కరించింది. -
ఆర్కే బీచ్లో సైకిల్థాన్ ప్రారంభించిన సీపీ
విశాఖపట్నం : నగరంలోని ఆర్కే బీచ్లో ఏపీరైజింగ్ సైకిల్థాన్ను నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ శనివారం ప్రారంభించారు. కాలుష్యంపై నగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్థాన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రత్యేక పోలీస్ దళం ఆధ్వర్యంలో ఈ సైకిల్థాన్ నిర్వహిస్తున్నారు. -
ఆర్కే బీచ్లో గల్లంతైన వారి కోసం గాలింపు
విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఆర్కే బీచ్లో గల్లంతైన యువకుల కోసం సోమవారం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే రెండు మృతదేహలు సోమవారం ఉదయం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం ఆర్కే బీచ్ వద్ద సముద్రంలో స్నానాలు చేస్తున్న నలుగురు యువకులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. మృతుల్లో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు కాగా. ఒకరు పర్యాటకుడు. గతేడాది సరిగ్గా ఇదే రోజున విశాఖపట్నం నగరాన్ని హుద్ హుద్ తుపాన్ అతలాకుతలం చేసిన విషయం విదితమే. -
'ప్రాజెక్ట్ అదితి'ని ప్రారంభించిన కుటుంబ సభ్యులు
-
'ప్రాజెక్ట్ అదితి'ని ప్రారంభించిన కుటుంబ సభ్యులు
విశాఖపట్నం: ప్రతి సామాన్యునికి 'ప్రాజెక్ట్ అదితి' ఓ శక్తిమంతమైన వేదిక కావాలన్నదే తమ లక్ష్యమని చిన్నారి అదితి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆర్కే బీచ్ వద్ద ప్రాజెక్ట్ అదితిని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రారంభించారు. నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించి... వాటిని సంబంధి ప్రభుత్వ శాఖకు తెలియపరచడం ద్వారా సదరు సమస్యలు త్వరితగతిన పరిష్కారం లభించేందుకు కృషి చేయడమే ప్రాజెక్ట్ అదితి లక్ష్యమని వారు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ప్రాజెక్ట్ అదితి కోసం నిర్వహించిన అవేర్నెస్ వాక్లో స్వచ్చంధ సంస్థలతోపాటు యువత, చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 24వ తేదీన విశాఖపట్నంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. అరేళ్ల చిన్నారి అదితి అప్పుడే ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలువ పడి పోయింది. ఆమె కోసం ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే గురువారం సాయంత్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సమీపంలోని సన్ రే బీచ్ ఒడ్డుకు అదితి మృతదేహం కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదితికి జరిగిన అన్యాయం మరోకరికి జరగకూడదని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. ఈ నేపథ్యంలో వారు ప్రాజెక్ట్ అదితిని ప్రారంభించారు. -
బీచ్లో మహిళ మృతదేహం లభ్యం
దాబాగార్డెన్స్(విశాఖ సిటీ): గుర్తుతెలియని మహిళ(35) మృతదేహం సముద్రంలో నుంచి ఆర్కే బీచ్కు కొట్టుకొచ్చింది. గురువారం బీచ్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మహిళ ఎవరు.. ఆత్మహత్యా?.. హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖలో పంద్రాగస్టు ఉత్సవాలు
హైదరాబాద్: ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను విశాఖపట్టణం ఆర్కే బీచ్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో పంద్రాగస్టు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ యువరాజ్ ఏర్పాట్ల విషయంలో సాధారణ పరిపాలనశాఖతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. పోలీసు పరేడ్ ఏర్పాట్లను రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఐజీ ఆర్కే మీనా పర్యవేక్షణ చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా సమాచార శాఖ కమిషనర్ తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. రూట్ మ్యాప్తో పాటు కార్లు పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను హోంశాఖ చూడాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. పాఠశాల విద్యా శాఖతో సమన్వయం చేసుకుని ఉత్సవాలకు తీసుకువచ్చే విద్యార్ధులకు బస్సులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్టీసీని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పురోగతిని వివరిస్తూ శకటాల ప్రదర్శనలకు అన్ని శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు. -
ఉగ్రదాడి నేపథ్యంలో విశాఖ బీచ్లో భద్రత కట్టుదిట్టం
విశాఖపట్నం : విశాఖపట్నంలోని బీచ్ రోడ్డును సోమవారం మధ్నాహ్నం నగర పోలీస్ కమీషనర్ అమిత్ గార్గ్ సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. పంజాబ్లో ఉగ్రవాదుల దాడి, ఆగస్టు 15 దగ్గర పడుతుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుండడంతో భద్రతను పటిష్టం చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమై వ్యవహరిస్తున్నారు. -
ఆ టెక్నాలజీ గురించి బాబుకు తెలియదా?: వైఎస్ జగన్
విశాఖపట్నం: పర్యావరణానికి హాని కలిగించే చర్యల కారణంగానే సముద్ర తీరం కోతకు గురవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆర్కే బీచ్ లో కోతకు గురైన ప్రాంతాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సముద్రతీరం కోత అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ఈ ముప్పును నివారించడానికి విదేశాల్లో హెడ్ గ్రాయిన్ బ్రేక్ వాటర్ టెక్నాలజీ వాడుతున్నారని తెలిపారు. విదేశీ పర్యటనలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఈ టెక్నాలజీ గురించి తెలియదా అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా మేలుకుని సముద్రతీరం కోతకు గురికాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
తీర ప్రాంతం కోత.. ప్రభుత్వ వైఫల్యమే..
-
ముంచు కొస్తుంది!
-
నేడు జగన్ రాక
విశాఖలో ఒకరోజు పర్యటన కోతకు గురవుతున్న బీచ్ పరిశీలన సింహాద్రి అప్పన్న దర్శనం, శారదా పీఠం సందర్శన విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఒక రోజు పర్యటన నిమిత్తం మంగళవారం విశాఖపట్నం వస్తున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఒక రోజు పర్యటనలో వైఎస్.జగన్మోహన్రెడ్డి కోతకు గురవుతున్న ఆర్కే బీచ్ను పరిశీలిస్తారు. అనంతరం సింహాచలం దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం శారదా పీఠంలో నిర్వహిస్తున్న వార్షిక హోమంలో పాల్గొంటారు. పర్యటన ఇలా.. మధ్యాహ్నం 12గంటలు: విశాఖపట్నం విమనాశ్రయం చేరుకుంటారు. 1 గంట: సర్క్యూట్ గెస్ట్కు చేరుకుంటారు. 2 గంటలు: కోతకు గురవుతున్న ఆర్కే బీచ్ను పరిశీలిస్తారు. 3గంటలు: సింహాచలం దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4గంటలు: చినముషిడివాడలో శారదాపీఠానికి వెళ్తారు. పీఠం ఆవిర్భావ మహోత్సవాల్లో పాల్గొంటారు. 5.30 గంటలు: విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. -
ఉప్పొంగిన ఉత్సవ్
వైభవంగా విశాఖ ఉత్సవ్ ఆరంభం నాలుగు ప్రాంతాల్లో సంబరాలు కళా ప్రదర్శనలతో కళకళలాడిన ఆర్కె బీచ్ పరిసరాలు వుడాపార్క్లో ఫల, పుష్ప ప్రదర్శన కైలాసగిరిలో లేజర్షో ప్రత్యేక ఆకర్షణ విశాఖపట్నం: కడలి కెరటాలతో పోటీపడుతూ ‘విశాఖ ఉత్సవ్’ ఉప్పొంగింది. సంస్కృతి, సంప్రదాయాల కలయికలో సంబరాలు తీసుకువచ్చింది. సంప్రదాయ నృత్యాలు, పౌరాణిక ఘట్టాలు, అభివృద్ధి, సంక్షేమ శకటాలు, యుద్ధ విన్యానాలు, వీనుల విందైన ప్రదర్శనలతో నగరమంతా పండుగ నింపింది. హుద్ హుద్ తుపాను చేసిన గాయాలను మరిపించేలా, ఉజ్వ ల భవిష్యత్పై ఆశలు రేకెత్తించేలా విశాఖ ఉత్సవం శుక్రవారం ప్రారంభమైం ది. మూడు రోజుల పాటు ఈ సంబరాలు విశాఖ వా సులను ఆనందడోలికల్లో ముంచెత్తనున్నాయి. కైలాసగిరి, వుడాపార్క్, గురజాడ కళాక్షేత్రం, శిల్పారామంలో ఉత్సవ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో భాగంగా బీచ్ రోడ్డులో భారీ కార్నివాల్ జరిగింది. పౌరాణిక వేషధారణలతో కళాకారులు ఈ కార్నివాల్లో పాల్గొన్నారు. కోలాటం భజనలు, శాస్త్రీయ నృత్యాలు, తప్పెటగూళ్లు, గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, థింసా, లంబాడీ గిరిజన నృత్యాలు కనువిందు చేశాయి. జిల్లా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, లు, నీటి యాజమాన్య సంస్థ, నేవీ, అన్నవరం సత్యదేవుడు రధం, సింహాచలం నర్శింహస్వామి రథం, హరేకృష్ణ మూమెంట్, విశాఖ మెట్రో నమూనా సెకటాలు ప్రదర్శించారు. కార్నివాల్లో వివిధ విద్యాసంస్థల విద్యార్ధులు, బ్రహ్మకుమారీలు, జిల్లా అధికారులు కార్నివాల్లో పాదయాత్ర చేశారు. విద్యార్ధులు మైమ్ వంటి కళారూపాలు ప్రదర్శించారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, సర్ఫింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ దేవాలయాల నమూనాలు తీరంలో నెలకొల్పారు. స్వైన్ఫ్లూ నివారణ మందులు అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నావికాదళం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అణు జలాం తార్గామి అరిహంత్ సముద్రంలో చక్కర్లు కొడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధ పరికరాలను నేవీ ప్రదర్శించింది. కైలాసగిరి మీద నిర్వహించిన లేజర్ షో అబ్బురపరిచింది. వుడాపార్క్లో ఫల, పూల ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన లక్షలాది రకాల పూలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. వైఎంసిఎ వద్ద గోకార్టింగ్,జోర్బింగ్(వాటర్ గేమ్), బుల్ గేమ్లలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వీటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. సగం ధరకే గోకార్టింగ్ను నిర్వాహకులు అందిస్తున్నారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను వివరిస్తూ, తెలుగు వారి పిండి వంటలను రుచి చూపించే దాదాపు 150 స్టాల్స్ను బీచ్లో ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల వస్తువులు కూడా ఈ ప్రదర్శనలో కొనుగోలుకు ఉంచారు. చిన్నారులు పతంగులు ఎగురవేశారు. తొలి రోజు వేడుకల్లో ఎంపీలు కె.హరిబాబు ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాస్, మంత్రులు గంటా శ్రీనివాసరావు కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్కుమార్, పంచకర్ల రమేష్బాబు, పి.విష్ణుకుమార్రాజు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్, గణబాబు, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, రాష్ట్ర హిందీ అకాడమీ చైర్మన్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, కలెక్టర్ ఎన్.యువరాజ్, వుడా విసీ టి. బాబూరావునాయుడు, జివిఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీచ్లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై కైలాసగిరి శివపార్వతుల సెట్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేదిక నుంచే వెంకయ్యనాయుడు ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నేవీ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణ కాగా పద్మశ్రీ శివమణి వాయించిన డ్రమ్స్ కుర్రకారును చిందులేయించాయి. -
బలవంతపు వసూళ్లకు పాల్పడటం లేదు:గంటా
విశాఖపట్నం: ఈ నెల 23, 24, 25వ తేదీల్లో విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఆర్కే బీచ్, మధురవాడ జాతర, ఉడా పార్కు, కైలాసగిరి, గురజాడ కళాక్షేత్రం తదితర వేదికల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయన ఆయన సోమవారం ఇక్కడ వెల్లడించారు. 23వ తేదీ మధ్యాహ్నం వెయ్యిమంది కళాకారులు, నేవీ బ్యాండుతో ప్రారంభమయ్యే కార్నివాల్ తో విశాఖ ఉత్సవ్ ప్రారంభమవుతుందని గంటా తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ 'ఉత్సవ్' కు సాంస్కృతిక కళాకారులు, సినీ నటులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్నివాల్ ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని గంటా తెలిపారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను వైజాగ్ మున్సిపల్ కౌన్సిల్, ఉడా సంయుక్తంగా నిర్వహిస్తాయన్నారు. కార్యక్రమ నిర్వహణకు ఎవరినుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడడం లేదని తెలిపారు. ఉత్సవ్ ప్రధాన వేదిక నిర్మాణం విషయంలో బీచ్కు ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా గంటా హామీ ఇచ్చారు. ఉత్సవాల కోసం బీచ్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కులో 100 అడుగుల కరెంటు ప్రభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ 300 మంది మహిళలతో ముగ్గుల పోటీలు, 22న ఉత్తరాది ప్రజలతో కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు. -
ఏమిటీ ఉపద్రవాలు?
* కడలి కల్లోలంతో విశాఖవాసుల ఆందోళన * అలల భీభత్సానికి దెబ్బతిన్న సాగరతీరం * కోతకు గురైన బీచ్రోడ్డు... సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఉపద్రవాలు వెంటాడుతున్నాయి. ఎనభై రోజుల క్రితం హుద్హుద్ తుపాను సృష్టించిన బీభత్సానికి కకావికలమైన విశాఖ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇంతలో కడలి మరో రూపంలో దండెత్తింది. ఈసారి బీచ్రోడ్డును లక్ష్యంగా చేసుకుంది. వారం రోజుల కిందట బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పట్నుంచి సముద్రం దూకుడు పెంచుకుంది. తొలుత ఎర్రని బురదతో నురగలు కక్కుతూ ముందుకు వచ్చింది. రానురాను అది బీచ్రోడ్డును కబళించడం మొదలెట్టింది. ఇలా నాలుగు రోజుల నుంచి రాకాసి కెరటాలు సుందర బీచ్ను తనలోకి లాగేసుకుంటున్నాయి. రోజు రోజుకూ సాగరతీరం రోడ్డుతో సహా కోసేస్తునే ఉన్నాయి. వైజాగ్ అంటే అందరికీ గుర్తొచ్చే.. అందరూ ఇష్టపడే ఆర్కే బీచ్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుసుర సబ్మెరైన్ మ్యూజియం వరకూ భారీగా తీరంతో పాటు రోడ్డూ కోతకు గురైంది. నిత్యం వేలాది మంది సందర్శకులు, పర్యాటకులతో సందడిగా ఉండే బీచ్ ఇప్పుడు రేయింబవళ్లు బారికేడ్లతో, పోలీసు పహరాతో ఉంది. సందర్శకులు అక్కడకు రాకుండా ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు వంద మంది పోలీసులు బీచ్కు కాపలా కాస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వన్వేలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. అలల బీభత్సానికి దెబ్బతిన్న అందాల సాగరతీరాన్ని చూసిన వారు ఇప్పుడు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఆగని పగ.. అల్పపీడనం బలహీనపడినా కెరటాల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో సునామీ, తుపాన్లు వచ్చినప్పుడు సముద్రం ముందుకొచ్చినా ఇంతలా బీచ్ను నాశనం చేయలేదు. తక్షణ చర్యల్లో భాగంగా అధికారులు నగర శివారులోని ఎండాడ కొండల నుంచి పెద్దపెద్ద నల్ల రాళ్లను తెచ్చి దెబ్బతిన్న తీరంలో వేస్తున్నారు. సుందర బీచ్ తిరిగి యథాస్థితికి రావడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఔటర్ హార్బర్ కారణమా? విశాఖ సాగరతీరం కోతకు గురవడానికి పోర్టు ఔటర్ హార్బర్ కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కోస్టల్ బ్యాటరీ సమీపం నుంచి సముద్రంలోకి పెద్దపెద్ద సిమెంట్ రాళ్లతో ఔటర్ హార్బర్ రోడ్డులా వేశారు. దానివల్ల సముద్ర కెరటాలు అటు వెళ్లకుండా నగరం వైపునకు మళ్లడంతో ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనాలు, తుపాన్లు వచ్చినప్పుడు మరింత ఒత్తిడితో తీరాన్ని తాకడం వల్ల బీచ్ కోతకు గురవుతోందని విశ్లేషిస్తున్నారు. ధ్వంసమైన బీచ్ను శుక్రవారం పరిశీలించిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజా విపత్తుకు ప్రథమ ముద్దాయి పోర్టేనని ఆరోపించారు. ఔటర్ హార్బర్ను తొలగించాలని, లేనిపక్షంలో శాశ్వత చర్యలకయ్యే ఖర్చును పోర్టు ట్రస్టు, కేంద్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ వేయాలి.. మరోవైపు పోర్టులో నిర్మాణాలు కూడా బీచ్ కోతకు కారణమవుతున్నాయని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ పేర్కొన్నారు. విశాఖ ఔటర్ హార్బర్ ప్రభావంపైన కూడా పరిశోధన చేయాలన్నారు. విశాఖ పోర్టు, పక్కనే ఉన్న గంగవరం పోర్టులు సీఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించడంపై స్టడీ చేయాలని, తీరం ఎక్కడెక్కడ కోతకు గురవుతుందో తెలుసుకోవడానికి మత్స్యకారులతో, పూణేలోని సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. బీచ్ కోత నివారణకు శాస్త్రీయంగా చర్యలు చేపట్టాలన్నారు. -
రాగాలజిస్ట్
ఆ చేతి వేళ్లు రోగుల నాడిని పరిశీలిస్తాయి. ఈ వీణను శ్రుతి చేస్తాయి. విశ్వవ్యాప్త రుగ్మతలకు దివ్యౌషధమైన అద్భుత సంగీతంతో సేదదీరుస్తాయి. విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రి రేడియాలజిస్టుగా చిరపరిచితుడైన ఈ రాగాలజిస్టు వీణ వాయిద్యకారునిగా దేశవ్యాప్త గుర్తింపు పొందారు. ఆయనే డాక్టర్ భమిడిపాటి కనక దుర్గాప్రసాద్. విశాఖపట్నం ఆర్కేబీచ్లో ఓ ఆదివారం. తూర్పు తలుపు తోసుకుని సూరీడు బయటికొస్తున్నాడు. కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం. వాకర్లు మౌనంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడే రాజీవ్ స్మృతి భవన్లో డాక్టర్ కనక దుర్గాప్రసాద్ వీణవాయిద్య కచేరీ మొదలైంది. సాగరతీరమంతా అమర్చిన మైకుల్లో మంద్రంగా వినిపిస్తోంది. సంగీత ప్రియుల హృదయం ఆనంద సాగరంలో తేలియాడుతోంది. సాగర ఘోషకు తోడుగా వీణ వాయిద్యం లయబద్ధంగా సాగుతోంది. అరవై నిమిషాల సమయం అర క్షణంలా కరిగిపోయింది. మధుర సంగీత వర్షం నిలిచిపోయింది. సాగర తీరంలో చిత్తరువుల్లా మారిపోయిన వాకర్లలో మళ్లీ చలనం మొదలైంది. బాల్యం నుంచే... చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతాన్ని కనక దుర్గాప్రసాద్ విపరీతంగా ఇష్టపడేవారు. అతని ఆసక్తిని గమనించిన తండ్రి డాక్టర్ బి.ఎస్.వి.శాస్త్రి సంగీత కళాప్రపూర్ణ పప్పు పద్మావతి దగ్గర వీణపై శిక్షణ ఇప్పించారు. ఆమె శిష్యరికంలో దుర్గాప్రసాద్ అతి తక్కువ సమయంలోనే వీణపై లాఘవంగా రాగాలు పలికించడంలో దిట్టయ్యారు. అప్పుడే కుటుంబ సన్నిహితుడైన విఖ్యాత వీణ విద్వాంసుడు, వైణిక సార్వభౌమ చల్లపల్లి చిట్టిబాబు దృష్టిలో పడ్డారు. దీంతో ప్రముఖ గ్రామ్ఫోన్ రికార్డింగ్ కంపెనీ హెచ్ఎంవీ వారి కోసం రూపొందిస్తున్న ‘టెంపుల్ బెల్స్’ సంగీత ఆల్బమ్ రికార్డింగ్ ఆర్కెస్ట్రాలోకి తీసుకున్నారు. 1985లో విడుదలైన ఈ ఆల్బమ్ రూపకల్పనలో వీణపై సహకరించిన కనక దుర్గాప్రసాద్ పద్నాలుగేళ్లకే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రపతి అవార్డు కనక దుర్గా ప్రసాద్ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు ఆలిండియా రేడియో నిర్వహించిన జాతీయస్థాయి సంగీత పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకుని అప్పటి రాష్ట్రపతి అవార్డు పొందారు. దీంతో ఆలిండియా రేడియో అధికారులు ఆడిషన్ టెస్ట్ కూడా నిర్వహించకుండానే కళాకారునిగా ఆయనను నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన నాద నీరాజనం కార్యక్రమంలో రెండుసార్లు, చెన్నైలో జరిగిన జాతీయ వీణ ఫెస్టివల్లో భాగంగా నారద గాన సభలో వీణ కచేరీలు ఇచ్చారు. ఎమ్డీ చదువు పూర్తయ్యాక విజయనగరంలోని మిమ్స్లో రేడియాలజీ విభాగం ప్రొఫెసర్గా పనిచేశారు. అదే సమయంలో ఆయన సంగీత ప్రతిభకు గుర్తింపుగా ముంబయ్కి చెందిన సుర్సింగార్ సంసద్ సంస్థ సుర్మణి, ఆంధ్ర వైద్య కళాశాల వైద్యులు, విద్యార్థులు నాద తపస్వి బిరుదులు ప్రదానం చేశారు. ‘‘వ్యాధులు తగ్గాలంటే కచ్చితంగా మందులు వాడాలి... ఆ మందులు చక్కగా పనిచేయాలంటే మంచి సంగీతం వినాలి’’ అంటారు డాక్టర్ కనక దుర్గా ప్రసాద్. - ఎ. సుబ్రహ్మణ్యశాస్త్రి (బాలు) సంగీతం దివ్యౌషధం ఒత్తిడి జీవితానికి మంచి ఔషధం సంగీతం. ప్రస్తుతం ఎటుచూసినా ఉరుకులు, పరుగుల జీవితమే. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని రంగాల వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఇలాంటి వారు సంగీతం వింటే వృత్తిలో రాణిస్తారు. పిల్లలకు గాత్రంలో శిక్షణ ఇవ్వడం మంచిది. అందువల్ల వారి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వాయుకాలుష్యం నుంచి విముక్తి పొందుతారు. - డాక్టర్ భమిడిపాటి కనక దుర్గా ప్రసాద్. ఎమ్డి, -
విశాఖలో నేవీ విన్యాసాలు
-
కార్తీక వెన్నెల
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆర్కే బీచ్ కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు. ఉదయం నుంచే పాదరసలింగేశ్వరునికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పెద్దసంఖ్యలో భక్తులు శివుని దర్శించుకొని అభిషేకాలు చేయించుకున్నారు. భవతారిణీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ ధర్మకర్త సుదీప్త బెనర్జీ భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సిరిపురం : కార్తీక పౌర్ణమి సందర్భంగా సాగరతీరం గురువారం ఆధ్యాత్మిక తరంగాలతో శోభిల్లింది. ఉదయం నుంచే తండోపతండాలుగా భక్తులు బీచ్కు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. అరటి డొప్పల్లో ఒత్తులతో దీపాలు వెలిగించి సముద్రంలో వదిలారు. సూర్య నమస్కారాలు చేసి సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. మరికొందరు ఇసుక తిన్నెలపై శివుని రూపాన్ని తయారు చేసి దానితోపాటు తులసిని నాటి, దాని చుట్టూ ఒత్తులతో కూడిన ప్రమిదలు వెలిగించి కోరిన కోరికలు తీర్చాలని శివుని ప్రార్ధించారు. అనంతరం పిల్లాపాపలతో కలిసి దగ్గర్లో ఉన్న కాళీమాత ఆలయంలో ఉన్న పాదరస శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజస్థానీ, గుజరాతీకి చెందిన భక్తులతోపాటు నగరానికి చెందిన పలువురు మహిళలు ఈ పూజల్లో పాల్గొన్నారు. డాబాగార్డెన్స్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ సత్యనారాయణస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. తెల్లవారుజాము రెండు గంటల నుంచి భక్తులు క్యూలో నిలుచున్నారు. గంటగంటకు భక్తుల సంఖ్య పెరుగుతూనే వచ్చిం ది. కనీస సదుపాయాల్లేక భక్తులు అవస్థలు పడ్డా రు. వాహనాలను అనుమతించకపోవడంతో కేజీ హెచ్ వైపు నుంచి వెళ్లే భక్తులకు మార్చురీ వద్దనే నిలిపి వేశారు. ఏవీఎన్ కళాశాల వైపు వచ్చే భక్తులకు ఆంధ్రా మెడికల్ కళాశాల గేట్ వద్దనే నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర నడచి వెళ్లాల్సివచ్చింది. మెట్ల మార్గం కూలడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో వేలాదిమంది దంపతులు పాల్గొన్నారు. -
వికాసపట్నం చేద్దాం
కడలి కల్లోలానికి ఆర్కేబీచ్ అందవిహీనం అయింది. సుడిగాలి తాకిడికి యారాడ కొండలు వణికిపోయాయి. ప్రకృతి కాంతను ఒడిలో దాచుకున్న విశాఖపట్నం.. అదే ప్రకృతి కన్నెర్ర చేయడంతో శోక సంద్రమైంది. హుదూద్ తుపాను తీవ్రత విశాఖను కకావికలం చేసింది. ఉప్పెనలా వచ్చిపడిన కష్టం నుంచి విశాఖను ఊరడించేందుకు మా తరం ముందుకురావాలంటోంది విద్యార్థిలోకం. దుండిగల్లోని మర్రిలక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు క్యాంపస్ కబుర్లలో.. వైజాగ్ వాసులకు ధైర్యంతో పాటు కర్తవ్యాన్ని నిర్దేశించారు. శ్రీకాంత్: హుదూద్ తుపాను విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసింది. వెరీ బ్యాడ్ న్యూస్. ఇందులో గుడ్ ఏంటంటే.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం లేకపోవడం. నరేష్: ముందుగానే ఇంటిమేషన్స్ అందాయి కదా! అది బతికించింది. అలేఖ్య: ఏం లాభం.. తుపాను తర్వాత శాటిలైట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈరోజుల్లో ఫోన్కాల్స్ కట్ అయితే దానికిమించిన నరకం ఇంకోటి ఉండదు కదా! ఫుడ్, ఎకామిడేషన్ లేక లక్షలమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టీవీల్లో చూసినపుడు చాలా బాధనిపించింది. గణేష్బాబు: ఓకే తుపాను, వరదలు వచ్చినపుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మళ్లీ కొన్నాళ్లకు మామూలు పరిస్థితులు వస్తాయి. కానీ వందల ఏళ్లనాటి చెట్లు వేళ్లతో సహా నేలకొరిగాయి. విశాఖ తీరాన తిరిగి పచ్చదనం రావాలంటే ఎన్ని ఏళ్లు పడుతుందో ! శ్రావ్య: నిజమే.. అసలు అంత పెద్ద చెట్లు ఎలా కూలిపోయాయో ఆశ్చర్యం వేస్తుంది. నేలసారం వల్ల అంటున్నారు చాలామంది. ఆకాశ్: డెఫినెట్లీ.. ఇసుక నేలలో చెట్లకు, జిగురు నేలలో చెట్లకు చాలా తేడా ఉంటుంది. మన హైదరాబాద్లో కూడా చెట్లు త్వరగా కూలిపోతాయి. చిన్న వర్షానికి కూడా చెట్లు రోడ్డుకి అడ్డంగా పడిపోతుంటాయి కదా! గణేష్బాబు: యా.. వైజాగ్ మ్యాగ్జిమమ్ ఇసుక నేలే. చెట్లు అంత పెద్ద ఎత్తున కూలిపోవడానికి అదీ ఒక కారణం కావొచ్చు. కృష్ణ: అవన్నీ పక్కన పెట్టండి.. రాత్రిపూట కరెంట్ ఓ గంట పోతేనే ఏదో ప్రళయం వచ్చినట్టు ఫీలైపోతాం. అలాంటిది అక్కడ ఇప్పటికీ చాలా చోట్ల కరెంటు లేదు. ఎలా ఉంటున్నారో ఏమో..? గణేష్బాబు: రాబోయే ప్రమాదాలను ముందుగానే కనిపెట్టగల్గుతున్నాం.. కానీ వాటి నుంచి బయటపడలేకపోతున్నాం. కృష్ణ: సముద్ర తీర ప్రాంతాల్లో కరెంటు మొత్తం అండర్గ్రౌండ్ సిస్టమ్లో ఉంటే బెటర్. ఈవెన్ మొబైల్ నెట్వర్క్ కూడా అలాగే ఏర్పాటు చేయాలి. శ్రావ్య: అన్నిటికంటే ముఖ్యమైంది ఆకలి. ఆ సమయంలో తిండిలేక చాలామంది ఇబ్బందిపడ్డారు. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సింది. అలేఖ్య: వైజాగ్ని రీబిల్డ్ చేయాలంటే చాలా కష్టం. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. శ్రావ్య: ముఖ్యంగా యూత్. గణేష్ బాబు: కాలేజీ విద్యార్థులంతా గ్రూపులుగా వెళ్లి రీబిల్డింగ్లో పాలుపంచుకోవాలి. ఫేస్బుక్లను, వాట్సాప్లను ఉపయోగించుకుని అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. శ్రీకాంత్: మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. చెట్ల వరకూ బాధ్యత తీసుకుంటే భవిష్యత్తులో కొత్త కష్టాలు రాకుండా ఉంటాయి. నరేష్: చెట్లు లేని వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. వేడి పెరిగిపోతుంది. వడదెబ్బకు జరిగే నష్టాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. భాగ్యశ్రీ: వైజాగ్ పున ర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఉంది. కాలేజీ యాజమాన్యాలు ప్రోత్సహిస్తే విద్యార్థులు అక్కడికి వెళ్లి చేతనైనంత సాయం చేసి వస్తే బాగుంటుంది. అలేఖ్య: కాలేజీల తరఫునే అవసరం లేదు. ఇండివిడ్యువల్గా కూడా వెళ్లొచ్చు. అరకులోయ.. వైజాగ్ బీచ్ అంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు కదా! ఇప్పుడు కూడా అలాగనుకునే వెళ్లి అక్కడ మనిషికి పది మొక్కలు చొప్పున నాటి వస్తే అదే చాలు. ప్రిస్క్యూ: ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు వెళ్లడం ఇప్పుడు చాలా అవసరం. దాంతోపాటు వైజాగ్లోని విద్యార్థులు కూడా అక్కడి గ్రామాలకు వెళ్లి ఒక్కో ఊరిలో వెయ్యి మొక్కలు నాటాలి. భాగ్యశ్రీ: ఈ సందర్భంగా నాతోటి వారికి నేనొకటి చెప్పగలను.. వచ్చేది దీపావళి పండుగ. అబ్బాయిలు బోలెడంత డబ్బు ఖర్చు పెడతారు. ఈ ఏడాదికి క్రాకర్స్ ఖర్చు తగ్గించుకుని సగం డబ్బుని విశాఖ రీబిల్డింగ్కు పంపిస్తే మంచిదనుకుంటున్నాను. అలేఖ్య: యస్.. ఇప్పుడుకాకపోతే స్టూడెంట్స్ పవర్ ఇంకెప్పుడు చూపించుకుంటాం. - భువనేశ్వరి -
భీమిలి తీరంలో లాలస కోసం వెదికా..
విశాఖపట్నం: భక్తికి, అనురక్తికి పెద్దగా లేదంటున్నారు ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి. ప్రపంచంలో ప్రేమించని హృదయం లేదంటూ... కురుపాం టూంబ్ ను మరో తాజ్ మహల్ గా వర్ణించారు. ‘న్యూస్లైన్’ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి కలబోసుకున్న ఊసులు మీకోసం... ప్రణయ గీతికలను ప్యాసాగా రాయడానికి గల కారణం? భారతీయ తత్వచింతనలో ప్రణయం ఒక భాగం. భక్తికి ప్రేమకు పెద్దగా తేడా లేదు. ప్రేమ అనేది యూనివర్శల్. వ్యక్తం చేసే విధానంలో తేడా ఉన్నా భావజాలం ఒకటే. శ్రీశ్రీ తరువాత కవిత్వంలో ప్రేమ అనే దానికి స్థానం లేదు, ఒక్క సినిమాలో తప్ప. కవిత్వంలో ప్రేమ నశించినా.. జీవితంలో ప్రేమ లేకుండా ఉందా.. అంటే ఉందనే చెప్పాలి. ప్యాసా అంటే దాహం. ప్రేమ పిపాసి మధురానుభావాలను పేపర్ మీద పెడితే ఎలాఉంటుందో చెప్పే ప్రయత్నమే ప్యాసా.. ప్యాసాలో ‘బాల్యమున నీ పేరు జపించినాను..’ అనే వాక్యం ఉంది. అలాంటి అనుభవం మీ జీవితంలో...? ఆ అనుభవాలు ప్రతి వ్యక్తికీ ఉన్నట్లే నా జీవితంలోనూ ఉన్నాయి. అలాంటి అనుభూతులను ఈ వయస్సులో చెప్పడం కరెక్టు కాదు కదా (నవ్వుతూ)... విశాఖతో మీ జ్ఞాపకాలు... ఈ నగరంతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. సముద్రం సినిమా సమయంలో విశాఖలో ఎక్కువ రోజులు షూటింగ్ జరిగింది. మీరు తప్పుగా అనుకోనంటే నాకు రెండో ఇల్లులాంటిది విశాఖ (నవ్వుతూ). మొదటిసారి అనుకుంటా 25 సంవత్సరాల వయస్సులో విశాఖ వచ్చాను, ఆ తరువాత ఓసారి విశాఖ మీదుగా అరకు వెళ్లాను. ఆ తరువాత రెగ్యులర్గా వస్తునే ఉన్నాను. మిథునం సినిమా ప్రొడ్యూసర్ విశాఖవాసి కావడంతో ఆ షూటింగ్ శ్రీకాకుళంలో జరిగినా విశాఖలోనే ఎక్కువ రోజులు ఉన్నాను. భక్తిని, ప్యాసాతో రక్తిని మీ రచనల్లో చూపించారు. విరక్తిని కూడా కలిగిస్తారా? దేని కోసమైనా వెయిట్ చేసేటపుడు భక్తి పుడుతుంది. దేనిపైన అయినా గాఢంగా ఇష్టం పెంచుకుంటే రక్తి కలుగుతుంది. జీవితంలో కోరుకున్నది దక్కదనిపిస్తే విరక్తి పుడుతుంది. విరక్తి నుంచి కవిత్వం పుట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం విరక్తి అనే దానికి నేను విముఖుడిని. కానీ భవిష్యత్తులో కలిగే అవకాశం ఉందేమో ఇప్పుడే చెప్పలేను. విశాఖ తీరంలో మీ జర్నీ స్టార్ట్ చేసి ఎక్కడ ఆపాలనుకుంటారు? తీరంలో నా జర్నీ ప్రారంభిస్తే మళ్లీ తీరంలోనే ముగిస్తాను. ఎందుకంటే సముద్రం నిరంతర చైతన్యం. మన జీవితంలో ఏ విషయం అయినా బోర్ కొట్టొచ్చు, కానీ సముద్రం వైపు చూస్తుంటే ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. ఏదో ఒక విషయం నేర్పుతూనే ఉంటుంది. అందుకే తీరంలో స్టార్ట్ అయిన ప్రయాణం తీరంలోనే ముగుస్తుంది. సముద్రాన్ని చూస్తే బోర్కే బోర్ కొడుతుంది. మీకు ఇండస్ట్రీలో ఆడు మగాడ్రా బుజ్జీ అనిపించిన వ్యక్తి ఎవరు? నాకు అలా అనిపించిన వ్యక్తి మా గురువు రాళ్లపల్లి... ఆయన నాకు లైఫ్ ఇచ్చారు. అతనే నాతో ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకోగలిగే వ్యక్తి.. వైజాగ్ నుంచి మీరు తీసుకెళ్లాలనుకుంటే.. దేన్ని తీసుకెళతారు? నేను తీసుకెళ్లాలనుకునేది సముద్రం.. నాకు నచ్చేది, నేను మెచ్చేది కూడా అదే.. దాని తర్వాత నన్ను బాగా ఇన్స్పై ర్ చేసిన స్పాట్ మాత్రం కురుపాం టూంబ్.. ఎప్పుడో ఒకసారి చరిత్ర చదివి దాని గురించి తెలుసుకున్నాను. 20 ఏళ్ల క్రితం చూశాను. కురుపాం రాజు తన భార్య లక్ష్మీ నర్సాయ్యమ్మ స్మృతి చిహ్నంగా ఆ సమాధి నిర్మించాడని విన్నాం. దాని మీద ఆంగ్లంలో ఒక వాక్యం ఉంది. ‘ఇక్కడ నీ శరీరంతోపాటు నా మనస్సు కూడా సమాధి చేయబడింది’. ఈ ఒక్క వాక్యంతో దానికి తాజ్మహలంత విలువ వచ్చింది. లేకపోతే అది ఒక సమాధిగా మిగిలిపోయేది. సముద్రం మూవీ సమయంలో భీమిలి బీచ్ చూడటానికి ప్రత్యేకంగా వెళ్లానని చెప్పారు. ఎందుకు? యుక్త వయస్సులో చలం సాహిత్యం ఎక్కువగా చదివేవాడిని. అలా ఓసారి జీవితాదర్శం అనే నవల చదివి అందులో లాలస పాత్రకు ప్రభావితం అయ్యాను, షూటింగ్ జరుగుతుండగా ఆ విషయం గుర్తుకొచ్చి... ఒక వ్యక్తిని తీసుకొని భీమిలి బీచ్కు వెళ్లి అక్కడున్న లైట్హౌస్ దగ్గర నిలబడి అలా చూస్తూ ఉండిపోయాను. విషయం ఏంటో అర్ధం కాక, అసలు ఎందుకు వచ్చానని అడిగాడతను. ‘జీవితాదర్శం నవలలో లాలస ఇక్కడికే వచ్చి స్నానం చేసేదట’ అని చెప్పాను. దానికి అతను నన్ను విచిత్రంగా చూడటంతోపాటు, ఇలా కూడా ఉంటారా సార్ అని అడిగాడు (నవ్వుతూ). -
సముద్రంలో దిగి ఇద్దరు మృతి
విశాఖపట్నం: విశాఖ బీచ్లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సముద్ర స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. స్థానిక కొబ్బరితోట ప్రాంతానికి చెందిన కాకర మహేష్ (19), కాకర చంద్రమౌళి (18), రాజు (16), సాయి (15), చందు (14), రమేష్ (19), ఆటోడ్రైవర్ పైడిరాజు, మెడికల్ రిప్రజంటేటివ్ అప్పలరాజు (24) ఆదివారం ఆర్కే బీచ్కు వెళ్లి స్నానానికి దిగారు. పెద్ద కెరటం రావడంతో అప్పలరాజు, రమేష్, అన్నదమ్ములు కాకర చంద్రమౌళి, కాకర మహేష్ లోపలికి వె ళ్లిపోయారు. సమీపంలో ఉన్న లైఫ్గార్డులు చంద్రమౌళిని, రమేష్ను రక్షించారు. కొద్ది నిమిషాలకే అప్పలరాజు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గల్లంతైన మహేష్ కోసం గాలిస్తున్నారు. విశాఖలోని ఆరిలోవ ప్రాంతం గాంధీనగర్కు చెందిన ఏడుగురు యువకులు రుషికొండ బీచ్లో స్నానాలకు దిగారు. ఒక్కసారిగా ఉవ్వెత్తిన పెద్ద అల రావడంతో కాకి రాజేష్ (20) సముద్రం లోపలకు కొట్టుకుపోయాడు. సుమారు 20 నిమిషాల తర్వాత మత్స్యకారులు చేపల కోసం వేసిన ఓ వలలో రాజేష్ మృతదేహం లభించింది. -
విశాఖ ఆర్కే బీచ్లో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
విశాఖపట్నం: విశాఖపట్నం ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది. -
జగన్ రాకతో జన సంద్రమైన సాగర తీరం