యువకుడి మృతదేహం లభ్యం | deadbody found | Sakshi
Sakshi News home page

యువకుడి మృతదేహం లభ్యం

Published Wed, Aug 31 2016 9:37 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

deadbody found

కోసిగి :  తుంగభద్ర నదిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. శ్రావణ మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని కోసిగి మండలం కందుకూరు గ్రామ ఒడ్డున జరిగిన శ్రీలక్ష్మి నరసింహ (ఉరుకుంద ఈరన్న) స్వామి పల్లకోత్సవ ఉత్సవాలను తిలకించేందుకు∙కర్ణాటక రాష్ట్రం మాన్వి తాలుకా పొన్నూరు గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు పుట్టిలో వస్తున్నారు. మార్గమధ్యలో పుట్టి మునిగిపోగా ఆరుగురు యువకులు ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.  యల్లమ్మ, హనుమయ్య దంపతుల కుమారుడు రాము(22) నదిలో కొట్టుకుపోయాడు. ఆ రోజు ఎంత గాలించినా ఆ యువకుడి ఆచూకీ లభించలేదు. మూడవ రోజు బుధవారం కందుకూరు సమీపంలో కర్ణాటక ప్రాంతం ఒడ్డున మతదేహం బయటపడింది.  పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాన్వి ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement