జిల్లాతోనే సిరిసిల్ల సమగ్ర అభివృద్ధి
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని మససీద్ కమిటీ ప్రతినిధులు అన్నారు. పట్టణంలో శుక్రవారం ముస్లింలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. అంతకు ముందు వైపని కార్మికులు అంబేద్కర్ చౌరస్తాలో రిలే దీక్షలు చేశారు. కోర్టు ఎదుట న్యాయవాదులు జిల్లా సాధన కోసం దీక్షలు కొనసాగించారు. ఈకార్యక్రమాల్లో ముస్లిం పెద్దలు ఎస్కేయూసుఫ్, ఎండీ సలీం, రాయల్ బాబా, ఎండీ సత్తార్, రియాజ్, ఇంతియాజ్, నాయకులు కట్ల గణేశ్, అన్నల్దాస్ శ్రీనివాస్, వి.వెంకటేశం, ఒగ్గు గణేశ్, సామల నరేశ్, బోగ సురేశ్, నాయకులు చెక్కిళ్ల మహేశ్గౌడ్, ఆడెపు రవీందర్, బూట్ల సుదర్శన్, దార్ల సందీప్, పంతం రవి, కాముని వనిత, అన్నల్దాస్ వేణు, నీలి రవీందర్, పిస్క మధు, జగ్గాని మల్లేశం యాదవ్, నంది రమేశ్, ఎలిగేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.