sirisilla
-
నాపై కోపంతో కార్మికుల పొట్టకొట్టొద్దు
-
పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. సకాలంలో వరకట్నం డబ్బులు సమకూరలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనమిది. తంగళ్లపల్లికి చెందిన అత్తారి లక్ష్మి–గిరి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు శైలజ(19) సంతానం. ఏడేళ్ల క్రితమే భర్త గిరి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇటీవల కూతురు శైలజకు కొడిమ్యాల మండలం దమ్మాయిపేటకు చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. రూ.4 లక్షలు వరకట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో తల్లి పడుతున్న కష్టాలను చూడలేక శైలజ మనోవేదనకు గురైంది. ఈక్రమంలోనే బుధవారం ఉదయం ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ విసిరారు. నేను నల్గొండలో రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలి. నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తా. ఇక కారు షెడ్డు మూసుకోవాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానంటూ కేసీఆర్ ప్రకటన చేస్తారా?. నేను సిరిసిల్ల లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కేటీఆర్కు టెక్నికల్ పరిజ్ఞానం లేదు. ఆయనొక పిల్లగాడు. స్థాయి కేటీఆర్ది కాదు. కేటీఆర్కు క్యారెక్టర్ లేదు. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. నాకు క్యారెక్టర్ ఉంది. నా దగ్గర డబ్బులు లేవ’’ అంటూ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. లోక్ సభ పోటీలో మాకు ప్రత్యర్థి బీజేపీనేని, బీఆర్ఎస్ కాదని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించాం. నల్గొండ, భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరుతున్నాం. నాలుగు లక్షలకు పైగా మెజారిటి వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అరవింద్ను ప్రజలు మర్చిపోయారు. 2 వేల కోట్లు నాకు ఉన్నాయని అంటే భయం కలిగింది. రాజకీయాల వల్ల ఆస్తులు పోగుట్టుకున్నాం. నాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్తులు కూడా తగ్గాయి. నా పేరు మీద ఎక్కడైనా ఆస్తులు ఉంటే అరవింద్కు ఇస్తా. బీఆర్ఎస్ ఎలాగూ లేదు... బీజేపీకి రెండు, మూడు వస్తాయేమో మాకైతే తెలియదు’’ అని ఉత్తమ్, కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
సిరిసిల్లకు ఇప్పట్లో రైలు కూత లేనట్టే
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లకు ఇప్పట్లో రైలుకూత వినిపించే పరిస్థితి లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగింది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ వరకు రైలు సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్చి నాటికి సిరిసిల్ల స్టేషన్ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీలునుబట్టి రైలు సర్వీసులను సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పొడిగించాలని అనుకుంది. డిమాండ్ సర్వేలో, ప్రయాణికుల సంఖ్య ఉంటుందని తేలితే సిరిసిల్ల నుంచి రైలు సర్విసులు నడిపే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు సిద్దిపేట–సిరిసిల్ల మధ్య కీలక ప్రాంతంలో పనులే జరగటం లేదు. ఫలితంగా రైలు సర్విసు కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ సంగతి..: భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ రైల్వే అధికా రులు పనులు చేస్తూ వెళ్లారు. ఇలా సిద్దిపేట వరకు వేగంగా పూర్తి చేసి అనుకున్న సమయంలో రైలు సర్విసులు ప్రారంభించా రు. ఆ తర్వాత సిద్దిపేట –సిరిసిల్ల సెక్షన్ల మధ్య పనులు ప్రారంభించారు. కానీ, మధ్యలో 80 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులొచ్చాయి. ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో రైతు ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడివరకు వదిలి ఆపై భాగంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగించారు. తర్వా త సిద్దిపేట సమీపంలోని భూముల వివాదం పరిష్కారమైంది. భూయజమానులకు పరిహారం కింద రూ.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే సమ యంలో ఎన్ని కల కోడ్ రావడంతో ఆ చెల్లింపులు నిలిచిపోయా యి. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభు త్వం ఏర్పడ గానే ఆ డబ్బులు చెల్లింపు కోసం రైల్వే అధికారు లు ఒత్తిడి ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వర కు చెల్లింపు జాడే లేదు. దీంతో పెద్ద కోడూరు, మాచాపూర్, గంగాపూర్, విఠలాపూర్ గ్రామాల పరిధిలో రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. రైతులకు పరిహారం చెల్లిస్తే తప్ప ఆ భూములను రైల్వే స్వాదీనం చేసుకునే వీలు లేదు. సిరిసిల్ల సమీపంలో మాత్రం పనులు కొనసాగుతున్నా యి. అక్కడ పూర్తయినా, సిద్దిపేట సమీపంలో పెండింగ్లో ఉంటే రైల్వేలైన్ వేసే వీలుండదు. రాష్ట్రప్రభుత్వం పరిహారం చెల్లిస్తేనే పనులు మొదలవుతాయి. దీంతో పనులు కనీసం 4నెలలు వెనక బడ్డట్టు అయ్యిందని ఓ రైల్వే అధికారి వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే అన్నిరకాల పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం. పరిహారం చెల్లింపే కాకుండా ప్రాజెక్టు వ్యయంలోనూ మూడో వంతు ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పుడు ఆ మొత్తానికి సంబంధించి కూడా కొంత పేరుకుపోయిందని తెలుస్తోంది. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య 30 కిలోమీటర్ల మేర పనులకు రూ.480 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆ మార్గంలో కొంత గుట్టభూమి కూడా ఉండటంతో దాన్ని కట్ చేసి పనులు చేయాల్సి ఉంది. ఇది స్వతహాగానే ఆలస్యమయ్యే పని. భూపరిహారం పంపిణీలో జాప్యం, ఇతర పనులూ నెమ్మదించటం వెరసి.. ఈ 30 కిలోమీటర్ల పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం తప్పేలా కనిపించటం లేదు. -
కండువా కథ చాలానే!
‘కండువా మార్చాడు’.. పార్టీ మారితే సాధారణంగా వినిపించే మాటిది. ఒక లీడర్ పార్టీ మారితే అతని వెంట పదులు, వందల సంఖ్యలో వెళ్తారు. వాళ్లంతా కండువాలు మార్చుకోవాల్సిందే. పైకి కనిపించకపోయినా ఈ ఖర్చు ఎక్కువే అంటున్నారు నేతలు. ఆ పార్టీ..ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికలప్పుడు వీటి అవసరం భారీగానే ఉంటోంది. నియోజకవర్గానికి ఈ ఖర్చు రూ.లక్షల్లోనే ఉంటుంది. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వరకూ.. కండువాల తయారీకి ప్రసిద్ధి సిరిసిల్ల. ఈ ప్రాంతంలో 25 కుటుంబాలు ఇదే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు మించి హైదరాబాద్లో ఎక్కువగా తయారీ అవుతున్నాయని సిరిసిల్ల నేత కార్మికులు చెబుతున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో నేత కార్మికులు హైదరాబాద్లో ప్రింటింగ్ చేయాల్సి వస్తోంది. నేతలు కూడా అనేక రకాలను కోరుకుంటున్నారు. కండువాపై పార్టీ నేతలు, లేదా తన కేడర్తో పార్టీ మారాలనుకునే వారి ఫొటోలతో కండువాలు ముద్రించాలని కోరుతున్నారు. ఇందుకు కొంత నాణ్యత అవసరమని, దీనికోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని సిరిసిల్లకు చెందిన భూపాల్ తెలిపారు. ఒక్కో కండువా తయారీకి రూ.3 ఖర్చు అవుతోందని, తాము రూ. 3.50కు అమ్ముతున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు లక్ష కండువాలు అవసరమయ్యే వీలుందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు ముందుగా ఏ పార్టీ గుర్తు లేకుండా తయారు చేస్తున్నట్టు నేత కార్మికుడు నీరజ్ తెలిపారు. కండువాకూ కోడ్ కష్టాలు.. కండువాకూ ఎన్నికల కోడ్ ఇబ్బందులు తప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించే క్రమంలో కండువాలకు బిల్లులు అడుగుతున్నారని చెప్పారు. బిల్లులు లేకుండా తీసుకెళ్లడం కష్టమని రాజకీయ నేతలంటుంటే... ఈ మొత్తం అక్కౌంట్స్లో జమ చేస్తే ఎన్నికల సమయంలో ఇతరత్రా కష్టాలు వస్తాయని నేత కార్మికులు అంటున్నారు. ఇక కండువాలకు అవసరమైన సిల్క్, పాలిస్టర్ వ్రస్తాన్ని తీసుకురావడానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయని తయారీదారులు తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లకుండా, అనేక మార్గాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని హైదరాబాద్కు చెందిన కండువాల తయారీదారు సంజయ్గుప్తా తెలిపారు. ఆర్డర్లే కాదు... ఇబ్బందులూ ఉన్నాయి తెలంగాణ నుంచే కాదు... ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. దీనికోసం కార్మికులను ఎక్కువ సంఖ్యలో నియమించుకోవాల్సి వస్తోంది. ఇదే తరుణంలో ఎన్నికల సమయం కావడంతో కార్మికులు ఎక్కువ అడుగుతున్నారు. కొన్నిసార్లు వారు దొరికే పరిస్థితీ లేదు. నేతలు బిల్లులు కోరడం కూడా వ్యాపారానికి ఇబ్బందిగానే ఉంది. నగదు బదిలీ కష్టమవుతోంది. అయితే కండువాల వల్ల చాలామందికి ఉపాధి మాత్రం లభిస్తోంది. – ద్యావనపల్లి మురళి (కండువాల వ్యాపారి, సిరిసిల్ల) -
కోహ్లి సెంచరీ కొట్టిండు.. నేను కూడా కొట్టాలె: కేటీఆర్
సిరిసిల్ల: కేసీఆర్కు రెండు సార్లు అవకాశం ఇచ్చినందుకు.. దేశంలో వడ్లు పండించడంలో తెలంగాణ నంబర్ వన్గా తయారైందని మంత్రి కేటీఆర్ అన్నారు. మళ్ళీ కాంగ్రెస్కు అవకాశం ఇస్తే బస్మాసుర హస్తమేనని విమర్శించారు. 55 ఎండ్లు పరిపాలించిన కాంగ్రెస్కు మళ్ళీ అవకాశం ఇద్దమా..? అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.. నేను కూడా సెంచరీ కొట్టడానికి తిరగాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మళ్ళీ అవకాశం ఇస్తే భారత దేశంలోనే సిరిసిల్లను నంబర్ వన్ గా చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని ప్రకటించారు. సిరిసిల్లలో ఏం మార్పు వచ్చిందో చూడాలని ప్రజలను కోరారు. బ్రిడ్జి కింద 24 గంటల నీళ్లు సముద్రంలాగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవ్వాళ మనకు పోటీగా ఒక దిక్కు కాంగ్రెస్ మరో దిక్కు బీజేపీ ఉన్నాయని పేర్కొన్న కేసీఆర్.. సిద్దిపేటకు రైల్ వచ్చింది.. త్వరలో సిరిసిల్లకు రైలు కుతా వినిపిస్తదని చెప్పారు. ఇదీ చదవండి: కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: రేవంత్ రెడ్డి -
కేసీఆర్ గొంతు నొక్కే కుట్ర
సిరిసిల్ల/ కొడంగల్: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ గొంతు నొక్కేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నేతలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కొడంగల్లో నిర్వహించిన రోడ్షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కులమతాలకు అతీతంగా, అవినీతి రహితంగా అందించాం. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో ఏం చేసింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? నిరంతర కరెంట్, సాగునీరు, తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, నేతన్నబంధు వంటి పథకాలపై ఆలోచన కూడా చేయని ఆ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి? అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతాం, గోసపడతాం. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు లొంగిపోవద్దు. ఢిల్లీకి దాసులైన నేతల మాటలు నమ్మొద్దు. కేసీఆర్ సీఎం కావడం ఖాయం సీఎం కేసీఆర్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన ముచ్చటగా మూడో సారి సీఎం కావడం ఖాయం. బీఆర్ఎస్ ఏనాడూ కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు పెట్టలేదు. మోసం చేసే దొంగలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ను గెలిపిస్తే అమ్మేసుకుంటారు టీపీసీసీ చీఫ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి భూముల వ్యాపారం చేసే బ్రోకర్ అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కొడంగల్ను ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటారని ఆరోపించారు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పారు. ‘‘ఓటుకు నోటు దొంగ జైలుకు పోవడం ఖాయం. కొడంగల్ను ఏనాడూ పట్టించుకోని రేవంత్రెడ్డి కావాలా?.. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే నరేందర్రెడ్డి కావాలా మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కారు గుర్తుకు ఓటేయండి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ దంపతుల ఆస్తి రూ.51.26 కోట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. దాని ప్రకారం.. కేటీఆర్ మొత్తం ఆస్తులు రూ.17.34 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.6.92 కోట్లు, స్థిరాస్తులు రూ.10.41 కోట్లు. అప్పులు రూ.67.20 లక్షల మేర ఉన్నాయి. కేటీఆర్ భార్య శైలిమ పేరిట రూ.26.49 కోట్ల చరాస్తులు, రూ.7.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.27 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. కేటీఆర్ దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.51.26 కోట్లు. -
నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్ సభలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. ఇది సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం మొదటి బైపాస్రోడ్డులో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు. -
దుబాయి నుంచి వచ్చి.. భార్య ప్రియుడిపై.. పక్కా ప్లాన్తో రాత్రికి రాత్రే..
కరీంనగర్: భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలుసుకున్న భర్త దుబాయి నుంచి వచ్చి యువకుడిని హత్య చేశాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో సంచలనం సృష్టించింది. గ్రామస్తులు, చందుర్తి సీఐ కిరణ్కుమార్ తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన పడిగెల నరేశ్(27) అదే గ్రామానికి చెందిన వివాహిత(32)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వివాహిత బావ కుమారుడు లక్ష్మణ్ దుబాయ్లో ఉంటున్న ఆమె భర్త మల్లేశంకు తెలిపాడు. ఈనెల 3వ తేదీన గల్ఫ్ నుంచి వచ్చిన మల్లేశం ఇంటికిరాకుండా ఎక్కడో తలదాచుకున్నాడు. నరేశ్ను చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం రాత్రి నరేశ్ సదరు వివాహిత ఇంట్లోకి వెళ్లడం గమనించిన బావ కొడుకు లక్ష్మణ్ ఆమె భర్త మల్లేశంకు సమాచారం అందించాడు. మల్లేశం మాస్కులు ధరించి బైక్పై ఇంటికి చేరుకుని.. భార్యతో ఇంట్లో ఉన్న యువకుడిపై కత్తితో దాడి చేశాడు. మంచం పై నుంచి కింద పడ్డ నరేశ్పై పదే..పదే కత్తితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే హత్యకు పాల్పడ్డ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ కిరణ్కుమార, పలువురు ఎస్సైలు బుధవారం అర్ధరాత్రి ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మల్లేశం కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. హత్య జరిగేందుకు మరో నలుగురు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ కిరణ్కుమార్ వివరించారు. సాయంత్రం విందు.. అర్ధరాత్రి హత్య.. పడిగెల నరేశ్కు అదే గ్రామానికి చెందిన వివాహితతో ఐదేళ్ల క్రితమే వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే సమయంలో వివాహిత కుటుంబ సభ్యులకు, యువకుడి మధ్య గొడవలు జరుగడంతో నరేశ్ దుబాయి వెళ్లాడు. అక్కడే ఐదేళ్లపాటు ఉన్నాడు. గత ఆగస్టు 29న ఇంటికొచ్చిన నరేశ్ తిరిగి సదరు వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇది గమనించిన వివాహిత భర్త అన్నలతోపాటు వారి కుమారుడు ఈ విషయాన్ని గల్ఫ్లో ఉంటున్న మల్లేశంకు తెలిపారు. ఈనెల 3న దుబాయి నుంచి ఇండియా వచ్చిన మల్లేశం బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం వివాహిత కుటుంబ సభ్యులు బుధవారం యువకుడి ఇంట్లోనే విందు చేసుకున్నారు. తర్వాత యథావిధిగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. బంధువుల ఇంట్లో తలదాచుకున్న మల్లేశంను అదే సమయంలో స్వగ్రామానికి పిలిపించుకున్నారు. ఇది తెలియని యువకుడు రాత్రి అందరూ పడుకున్న సమయంలో వివాహిత వద్దకు వెళ్లాడు. గమనించిన లక్ష్మణ్ తన చిన్నాన్న మల్లేశంకు ఫోన్ చేయడంతో బైక్పై వచ్చి యువకుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు.. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లేశం పరారీకాగా.. అనుమానం ఉన్న ముగ్గురితోపాటు వివాహితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు సహకరించిన వారి వివరాలను కాల్డాటా ఆధారంగా సేకరిస్తున్నట్లు సమాచారం. వారం క్రితమే హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. పోలీసుల లుక్ఔట్ నోటీసు.. యువకుని హత్యలో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మల్లేశ దుబాయి నుంచి ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. హత్య చేసేందుకు ముందుగానే తిరిగి దుబాయి వెళ్లేందుకు సిద్ధమై.. రాత్రి 11 గంటల ప్రాంతంలో హత్యచేసి ఎయిర్పోర్టుకు అదే రాత్రి వెళ్లిపోయాడన్న ప్రచారంతో పోలీసులు లుక్ఔట్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. -
సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస.. కుర్చీలతో పరస్పర దాడులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మీటింగ్ కంటే ముందే నాయకులు బాహాబాహీకి దిగారు. ముస్తాబాద్ మండలం నుంచి ఉమేష్ రావు వర్గం కొంతమందిని జాయిన్ చేసుకునేందుకు తీసుకువచ్చింది. తాను మండలాధ్యక్షుడిగా ఉండగా తమకే తెలియకుండా ఎలా జాయిన్ చేసుకుంటారంటూ బాల్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ చీటి ఉమేశ్ రావు, సంగీతం శ్రీనివాస్ వర్గాల పేరిట రెండు వర్గాలుగా వీడిపోయిన కాంగ్రెస్ నాయకులు.. కుర్చీలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గందరగోళంగా మారింది. ఇదీ చదవండి: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా? -
సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఆధిపత్యం ఎవరిది?
సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు, మంత్రిగా ఉన్న కెటిఆర్ నాలుగోసారి ఘన విజయం సాదించారు. ఆయన భారీగా తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మహేందర్ రెడ్డిపై 89,009 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కెటిఆర్ ఎన్నికల తర్వాత మంత్రి పదవిని పొందలేదు. అయితే టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడుగా నియమితులవడం విశేషం. ఆ తర్వాత కొద్దికాలానికి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. తండ్రి కెసిఆర్ ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించగా, కెటిఆర్ నాలుగుసార్లు ఇంతవరకు ఎన్నికయ్యారు. వీరిద్దరూ కలిసి పన్నెండుసార్లు గెలిచారన్నమాట. కెటిఆర్కు 125213 ఓట్లు పొందగా, మహేందర్ రెడ్డికి కేవలం 36204 ఓట్లు మాత్రమే పొందారు. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నర్సాగౌడ్కు కేవలం మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. కెటిఆర్ వెలమ సామాజికవర్గానికి చెందినవారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యదిక సార్లు ఇదే సామాజికవర్గం నేతలు గెలుపొందారు. ఏపీ, తెలంగాణలలో ఒక ముఖ్యమంత్రి కుమారుడు అదే క్యాబినెట్లో ఉండడం కెటిఆర్తోనే ఆరంభం అయిందని చెప్పాలి. తారక రామారావు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, తండ్రి తెలంగాణ ఉద్యమం ఆరంభించాక, కొద్ది సంవత్సరాల క్రితం ఉద్యోగం మానుకుని క్రియాశీల రాజకీయాలోకి వచ్చారు. 2009లో టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ధి మహేంద్రరెడ్డితో పోటీని ఎదుర్కొని స్వల్ప ఆధిక్యతతో గెలిచిన కెటిఆర్ ఆ తర్వాత తెలంగాణ సాధనలో భాగంగా పదవికి రాజీనామా చేసి బారీ ఆధిక్యతతో గెలుపొందారు. తిరిగి 2014 సాధారణ ఎన్నికలలో 53004 ఓట్ల మెజార్టీతో విజయ డంఖా మోగించారు. 2018లో ఈ మెజార్టీ ఇంకా పెరిగింది. కెటిఆర్తో పాటు ఆయన తండ్రి కెసిఆర్ 2014లో మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి శాసనసభకు, మెదక్ నుంచి లోక్సభకు పోటీచేసి గెలుపొందగా, కెటిఆర్ సోదరి కవిత నిజామాబాద్ నుంచి లోక్సభకు పోటీచేసి విజయం సాధించడం విశేషం. కాని ఒకప్పుడు హైదరాబాద్కు చెందిన సలావుద్దీన్ ఒవైసీ కుటుంబంలోని ముగ్గురికి ఇలాంటి గౌరవం దక్కింది. సలావుద్దీన్ 1999లో లోక్సభకు ఎన్నిక కాగా, ఆయన పెద్ద కుమారుడు అసద్, మరో కుమారుడు అక్బర్లు ఇద్దరూ శాసనసభకు ఎన్నియ్యారు, పలు విధాలుగా కెసిఆర్ రికార్డులు సృష్టించిన కెసిఆర్ ఈ రకంగా కూడా రికార్డు సొంతం చేసుకున్నారు. 2018లో మాత్రం కవిత ఓటమి చెందారు. సీనియర్ నేత, ఏబై ఏళ్ళకాలంలో ఆరుసార్లు గెలుపొంది, 1957లోను, అలాగే 2007లోను అంటే ఏభై ఏళ్ళ తరువాత రాష్ట్ర శాసనసభలో ఉన్న ఏకైక నేతగా గుర్తింపు పొందిన చెన్నమనేని రాజేశ్వరరావు సిరిసిల్ల నుంచి నాలుగుసార్లు సిపిఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన గెలిచారు. ఈయన చొప్పదండిలో ఒకసారి పిడిఎఫ్ పక్షాన గెలిచారు. రాజేశ్వరరావు కుమారుడు రమేష్ వేములవాడలో పోటీచేసి నాలుగో సారి గెలుపొందారు. రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని విద్యా సాగరరావు మెట్పల్లి నుంచి మూడుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు కరీంనగర్నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి క్యాబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు. 1952లో ఇక్కడ గెలిచిన జోగినపల్లి ఆనందరావు 1957లో మెట్పల్లిలో గెలిచారు. 1989లోజనశక్తి నక్సల్గ్రూపు తరుఫున ఎస్.వి.కృష్ణయ్య గెలిచారు.సిరిసిల్ల 1952,57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్. ఎస్.టి.ఎఫ్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి మూడుసార్లు, కమ్యూనిస్టు పార్టీ నాలుగుసార్లు, టిడిపి ఒకసారి, టిఆర్ఎస్ నాలుగుసార్లు, మరోసారి ఇండిపెండెంటు గెలిచారు. సిరిసిల్ల నుంచి పదమూడు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందగా, ఒకసారి రెడ్డి,రెండుసార్లు ఎస్.సి, ఒకసారి బ్రాహ్మణ వర్గం నేత ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎంబీబీఎస్ ప్రవేశాలు
సిరిసిల్ల: జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ భవనం సిద్ధమైంది. సిరిసిల్ల, వేములవాడ పాత తాలూకా ప్రాంతాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భవించడం.. రాష్ట్రంలోనే భౌగోళికంగా, జనాభా పరంగా చిన్న జిల్లాగా ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తూ మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతుంది. పట్టణ శివారులోని పెద్దూరు బైపాస్ రోడ్డులో పది ఎకరాల స్థలంలో రూ.40 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, విద్యార్థుల హాస్టళ్ల భవనాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. ఆగస్ట్ మొదటి వారంలోగా పనులు పూర్తి కానున్నాయి. రెండో వారంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వైద్య విద్య తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్ఎంసీ అనుమతులు జిల్లా కేంద్రంలో వైద్య విద్యను బోధించే మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) న్యూఢిల్లీ లెటర్ ఆఫ్ ఇన్టెంట్(ఎల్వోటీ) నం.ఎన్ఎంసీ/యూజీ/2023– 2024/000033/ 021 475 తేదీ: 21.0.4.2023ను జారీ చేసింది. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. ఈ ఏడాది ఆగస్ట్ మొదటి వారంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారికంగా మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. ఎంబీబీఎస్ తరగతులకు శ్రీకారం సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది వంద సీట్లు కేటాయించగా, ఇందులో 15 సీట్లు ఆలిండియా కోటాలో కేటాయిస్తారు. మరో 85 మన రాష్ట్ర అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 40 శాతం బాలురు, 60 శాతం సీట్లు బాలికలకు ఉంటాయి. ఆగస్ట్ మొదటి వారంలో కౌన్సెలింగ్ ఉంటుంది. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో మొత్తం 340 బెడ్స్ సిద్ధం చేశారు. పెద్దూరు వద్ద నిర్మించిన సొంత భవనంలోనే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తారు. హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉండగా, అబ్బాయిలు, అమ్మాయిల కోసం వేర్వేరు ప్రైవేటు భవనాలు సిద్ధం చేశారు. సిరిసిల్లకు వచ్చిన ప్రొఫెసర్లు సిరిసిల్ల మెడికల్ కాలేజీకి ప్రభుత్వం సిబ్బందిని కేటాయించింది. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే 55 మంది సిబ్బందిని కేటాయించారు. మెడికల్ కాలేజీ ప్రారంభమైతే సుమారు వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మొత్తంగా మెడికల్ కాలేజీలో సుమారు 700 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన బోధన సిబ్బంది, ఇతర డాక్టర్లు జిల్లా ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. సీఎంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిరిసిల్ల మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9లో నిర్మించిన జలాశయం, జిల్లా పోలీస్ ఆఫీస్ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. పట్టణంలోని జిల్లా ఆస్పత్రి పూర్తి స్థాయిలో మాతాశిశు సంరక్షణ, నవజాత శిశువుల కేంద్రంగా మారుతుంది. జనరల్ ఆస్పత్రి మొత్తంగా మెడికల్ కాలేజీకి మార్చడంతో పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీ బోధన ఆస్పత్రిగా ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, ఆధునిక పరికరాలతో అందుబాటులోకి వస్తుంది. ఆగస్టులో తరగతులు.. రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఆగస్ట్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. భవన నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. మొదటి ఏడాది వైద్యపాఠాలు బోధించేందుకు మౌలిక వసతులు సమకూరాయి. – డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ న్యూస్రీల్ -
ఇది కేవలం ట్రైలరే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పర్యటించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సెస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతు కృతజ్ఞత సభలో మాట్లాడారు. కిషన్రెడ్డి, బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 8 ఏళ్లలో కేంద్రానికి రూ.3 లక్షల 68 వేల కోట్లు ఇచ్చామని, తిరిగి తెలంగాణకు ఇచ్చింది రూ.లక్షా 68 వేల కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. మిగతా 2 లక్షల కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు. లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. సెస్లో గెలవని వాళ్లు, రాష్ట్రంలో గెలుస్తారా? అంటూ బీజేపీ నాయకులపై మంత్రి విమర్శలు గుప్పించారు. సెస్ ఎన్నికల్లో మీరు చూసింది ట్రైలర్ మాత్రమేనన్నారు. అసలు సినిమా త్వరలో చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. చదవండి: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు -
తెలంగాణ: 20 మంది బాధితుల్లో నలుగురికి సీరియస్!
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మందికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా నిర్ధారణ అవగా అందులో నలుగురు విదేశీయులు మినహా మిగిలిన వారికి లక్షణాలు పెద్దగా లేవని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ వారిని ప్రత్యేక వార్డులకు తరలించి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. సొమాలియా, కెన్యాకు చెందిన నలుగురు కేన్సర్ బా«ధితులు మెరుగైన చికిత్సకై హైదరాబాద్ చేరుకొనే క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా బారినపడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికితోడు ధైర్యం చెప్పేందుకు పక్కన కుటుంబ సభ్యులు ఉండే వీల్లేకపోవడం, భాషా సమస్య కారణంగా వైద్యులు చెబుతున్న విషయాలు వారికి అర్థం కావట్లేదు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతోనూ ఆ విదేశీయులు బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరోవైపు ఒమిక్రాన్ అనుమానిత బాధితుల నమూనాల జీనోమ్ సీక్వెనింగ్ పరీక్షలు సోమవారం గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు 48 నమూనాలను పరీక్షించారు. వాటి నివేదికలు మరో మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ పరీక్షలను పుణే వైరాలజీ ల్యాబ్ లేదా సీసీఎంబీకి పంపేవారు. 156 మందికి కరోనా సాక్షి, హైదరాబాద్/ముస్తాబాద్ (సిరిసిల్ల): రాష్ట్రంలో సోమవారం 33,140 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 6,79,720కి చేరింది. తాజాగా 207 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,72,063కి పెరిగింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 4,015కు చేరుకుంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బులెటిన్ విడుదల చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న రిస్క్ దేశాల నుంచి సోమవారం 658 మంది విమాన ప్రయాణికులు హైదరాబాద్ చేరుకోగా వారికి నిర్వహించిన పరీక్షల్లో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే వారికి ఒమిక్రాన్ వేరియంట్ ఉందో లేదో తెలుసుకొనేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్కు అధికారులు పంపారు. ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న సంఖ్య మొత్తం 8,396 చేరిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, ఈ నెల 16న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామవాసి పిట్ల చంద్రానికి సోమవారం ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో స్వగ్రామంలో ఉన్న అతన్ని జిల్లా అధికారులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచారు. -
2 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ప్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న హెల్త్ ప్రొఫైల్ వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందుకోసం అవసరమైన నిర్ధారణ పరీక్షల పరికరాలను, ఇతర వస్తువులను కొనడానికి తొలి దశలో రూ. 9.15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గడువు నాటికి అవసరమైన పరికరాల కొనుగోలుపై అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా వైద్య ఆరోగ్యశాఖ రూపొందిస్తున్నది. పల్లెల్లో ప్రతీ ఇంటికీ తిరుగుతూ 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. జ్వరం, రక్తపోటు, షుగర్ తదితర పరీక్షలన్నింటినీ ఇంటి వద్ద, ఈసీజీ వంటి పరీక్షలను ప్రాథమిక కేంద్రాల వద్ద నిర్వహిస్తారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక యూనిక్ ఐడీని అందజేస్తారు. ఈ ఐడీ ప్రాతిపదికన ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చుతారు. యూనిక్ ఐడీ అందుబాటులో ఉండడం వల్ల వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందడానికి అవకాశం ఉంటుందని వైద్య వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఎవరికైనా, ఏదైనా జబ్బు చేస్తే వారి ఆరోగ్య చరిత్రను ఆన్లైన్లో డాక్టర్లు చూడడానికి వీలుపడుతుంది. -
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు ఇవ్వాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సిరిసిల్ల: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాల్సిందేనని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు, ఇందుకోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాలు ప్రారంభిస్తామని చెప్పారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర గురువారం 27వ రోజు సిరిసిల్ల జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా గంభీరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉఫ్మని ఊదితే కొట్టుకుపోయే ప్రభుత్వమిదని ఎద్దేవా చేశారు. బీజేపీకి భయపడి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసులకు తాము భయపడబోమని, ఇకపై కేసులు పెడితే తానే నేరుగా పోలీస్స్టేషన్లకు వస్తానని అన్నారు. అప్పుడు అక్కడికి ఏకంగా సీఎం రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక సర్పంచులు ఆత్మహత్య లకు పాల్పడే పరిస్థితి తలెత్తిందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఏడున్నరేళ్లలో మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు ఏం చేశారని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో పైసలు కేంద్రానివి.. ప్రచారం మాత్రం కేసీఆర్ చేసుకుంటారన్నారు. మాట్లాడితే పెట్రోలు చార్జీలు పెంచామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.40 వివిధ పన్నుల కింద తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఇదే అదనుగా ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు పెంచాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
మానేరు వాగులో 25 గంటల నిరీక్షణ
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు వాగు వరదలో గొర్రెలకాపరి చిక్కుకుని 25 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చుట్టూ వరద రావడంతో ఎటూ వెళ్లలేక రాత్రంతా గొర్రెలతోపాటు ఉన్నాడు. ఇతని కోసం వెళ్లిన మరో ఐదుగురు కూడా వరదలో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారులు వీరిని బోటుసాయంతో ఒడ్డుకు చేర్చారు. వివరాలు... సిరిసిల్లలోని సాయినగర్కు చెందిన మొగిలి చంద్రమౌళి(58) గొర్రెలకాపరి. తనకున్న గొర్రెలు, మేకలను మేపేందుకు సోమవారం ఉదయం మానేరు మధ్యలో ద్వీపంలా ఉండే ప్రాం తానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వాగులో వరద ఉధృతి పెరగడంతో రెండు గొర్రెలు కొట్టుకుపోయాయి. దీంతో తెల్లవార్లు అతను వాగు మధ్యలో ఉండిపోయాడు. ఈ విషయాన్ని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. సిరిసిల్ల పట్టణం సాయినగర్కే చెందిన కె.రాజు(26), కె.అప్పారావు(22), ఎస్.విజయ్ (21), కె.రాజు(22), విజయ్(26) మంగళవారం ఉదయం చంద్రమౌళిని కాపాడేందుకు మానేరువాగు దాటి వెళ్లారు. తిరిగి వస్తుండగా వరద ఎక్కువకావడంతో వారూ వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని, గొర్రెలను ఒడ్డుకు చేర్చారు. మానేరులో కొట్టుకుపోయిన బస్సు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట వెళ్లే దారిలో మానేరు వాగు వరదలో సోమవారం చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం కొట్టుకుపోయింది. ప్రయాణికులం తా సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. కాగా, మానేరు నది వరద పరిస్థితి, గేట్లు ఎత్తే విష యం పశువుల కాపర్లు, జాలర్లకు తెలిసిపోయేలా, వారిని అప్రమత్తం చేసేలా సిరిసిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఇందులో పశువుల కాపర్లు, జాలర్లతో పాటు వీపీవోలు, వీఆర్ఏ, వీఆర్వోలు ఉంటారు. -
సిరిసిల్ల: స్కూటీ డిక్కీలో నాగుపాము కలకలం
-
రైతుల ఆత్మహత్యలు తగ్గాయి
సిరిసిల్ల: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని.. ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్లో శుక్రవారం మంత్రి, గోకుల్దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అపెరల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. జౌళి రంగం అభివృద్ధికి తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అపెరల్ పాలసీ(టీ–టాప్) తెచ్చామని తెలిపారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో 12 వేల మందికి ఉపాధి కల్పించేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అలాగే సిరిసిల్లలో 60 ఎకరాల్లో నెలకొల్పిన అపెరల్ పార్క్ ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. బీడీలు చేస్తూ రె క్కలు ముక్కలు చేసుకునే మహిళలకు సులభంగా నెలకు రూ.10 వేలనుంచి రూ.12 వేలు సంపాదించుకునేందుకు గార్మెంట్ పరిశ్రమలు దోహదపడతాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్రాలు ప్రపంచ విపణిలో పోటీ పడతాయని, నాణ్యమైన, నవ్యమైన వస్త్రాలకు సిరిసిల్ల కేంద్ర బిందువు అవుతుందని పేర్కొన్నారు. మన పత్తి ఎంతో నాణ్యమైంది దేశంలోనే తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైందని, ఈ విషయాన్ని దక్షిణ భారత స్పిన్నింగ్ మిల్లుల సంఘమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం నేతన్నల బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. రైతుల తరహాలో నేతకార్మికులు ఏ కారణాలతో చనిపోయినా.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా బీమా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలోనూ నేతన్నకు చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 26 వేల మంది కార్మికులకు రూ.110 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. కాగా, సిరిసిల్లలో రూ.400 కోట్లతో చేపట్టిన వర్కర్ టు ఓనర్ పథకం కొద్ది రోజుల్లో కార్యరూపం దాలుస్తుందన్నారు. మహిళల ఉపాధికి ప్రాధాన్యం: శైలజారామయ్యర్ అపెరల్ పార్క్లో మహిళల ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్లో రూ.20 కోట్లతో రోడ్లు, షెడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఇన్నర్వేర్ గార్మెంట్ పరిశ్రమకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ఈ ఫ్యాక్టరీలో వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గోకుల్దాస్ కంపెనీ ఎండీ సుమీర్ హిందుజా మాట్లాడుతూ మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సిరిసిల్లలో ఆపరెల్ పార్కు ఉండాలనేది ఈ ప్రాంత ప్రజల కల : కేటీఆర్
-
చూసి చూసి.. రిబ్బన్ తీసిపడేసిన సీఎం కేసీఆర్
-
నా ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్
-
మా జిల్లా వాసులందరు పరవశించి పోతున్నారు : కేటీఆర్
-
కేటీఆర్ భరోసా: ‘గూడు చెదిరిన గువ్వల’ ‘సాక్షి’ కథనం
సిరిసిల్ల: కరోనా కాటుకు అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన అన్నాచెల్లెళ్ల భవిష్యత్కు తాను భరోసా ఇస్తున్నానని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్కు చెందిన ఆటో డ్రైవర్షేక్ ఖలీమ్ (40), అతడి భార్య నికత్ తబుసమ్ (38) ఐదు రోజుల వ్యవధిలో కరోనాతో మృతి చెందారు. దీంతో ఆ దంపతుల పిల్లలు అమాన్ (15), రుమాన (13) అనాథలయ్యారు. పిల్లలు కూడా కరోనాతో బాధపడుతున్నారు. పిల్లల పరిస్థితిపై ‘గూడు చెదిరిన గువ్వలు’శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కలెక్టర్ కృష్ణభాస్కర్తో మాట్లాడారు. ఆ పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారి చదువులు, భవిష్యత్కు తాను అండగా ఉంటానని మంత్రి వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి ఎల్లయ్య, చైల్డ్లైన్ సిబ్బంది విద్యానగర్లోని చిన్నారుల ఇంటికి వెళ్లి నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. పిల్లలను మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు వారి వైద్య చికిత్సలను పర్యవేక్షించారు. చదవండి: కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు -
కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు
సాక్షి, సిరిసిల్ల: ఆటో నడుపుతూ నాన్న.. బీడీలు చుడుతూ అమ్మ.. అరకొర ఆదాయమే అయినా.. ఆనందానికి ఎన్నడూ కొదవలేని కుటుంబం వారిది. సాఫీగా సాగిపోతున్న జీవితంలో కరోనా కల్లోలం రేపింది. ఇద్దరు పిల్లలతో కూడిన ఆ పొదరింట్లో పెను విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులు ప్రాణాలు కోల్పోగా.. అనాథలైన ఆ ఇద్దరు చిన్నారులు కూడా మహమ్మారితో పోరాడుతుండటంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన షేక్ ఖలీమ్(40) ఆటోడ్రైవర్. అతడి భార్య నికత్ తబుసమ్(38) బీడీ కార్మికురాలు. వారికి ఇద్దరు పిల్లలు పదిహేనేళ్ల అమాన్, పదమూడేళ్ల రుమానా ఉన్నారు. గతంలో మూడేళ్లపాటు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఖలీమ్.. కాలం కలిసి రాక అప్పులు మరిన్ని మూటగట్టుకుని ఇల్లు చేరాడు. అప్పటికే వీసాకు చేసిన మరో రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు తీర్చేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు ఖలీమ్ సిరిసిల్లలో ఆటో నడుపుతూ కష్టపడేవాడు. తబుసమ్ కూడా బీడీలు చుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. అయితే 15 రోజుల క్రితం ఖలీమ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. తర్వాత పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో చేరాడు. తెలిసిన వారివద్ద రూ.2 లక్షల వరకు అప్పు చేసి ఆస్పత్రిలో చెల్లించాడు. కానీ ఫలితం దక్కలేదు. ఐదు రోజుల కిందట ఖలీమ్ మృత్యువాత పడ్డాడు. శవాన్ని సిరిసిల్లకు తెచ్చి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. తల్లినీ కనికరించని కరోనా భర్త మరణంతో తబుసమ్ గుండెలవిసేలా రోదించింది. పిల్లలు బెంబేలు పడిపోవడం చూసి చివరకు ధైర్యం తెచ్చుకుంది. కానీ భర్త ఖలీమ్ ద్వారా అప్పటికే సోకిన కరోనా వైరస్తో తబుసమ్ ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆమెను కూడా కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సమీప బంధువులు మళ్లీ రూ.2 లక్షల వరకు అప్పు తెచ్చి ఆస్పత్రి ఖర్చులకు చెల్లించారు. కోలుకుంటుందని, పిల్లల బాగోగులు చూసుకుంటుందని భావిస్తుండగా.. కరోనాతో చేసిన పోరాటంలో ఆమె కూడా ఓడిపోయింది. శనివారం రాత్రి తబుసమ్ కన్నుమూసింది. చందాలతో అంత్యక్రియలు ఐదురోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోవడంతో చేతిలో డబ్బులేని ఖలీమ్ బంధువులు.. పలువురి నుంచి చందాలు పోగు చేశారు. అలా పోగుచేసిన రూ.27 వేలతో వారి సంప్రదాయం ప్రకారం ఆదివారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. పాపం పసివాళ్లు ఊహ తెలిసిన పిల్లలు కావడంతో వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ఐదు రోజుల వ్యవధిలో అమ్మానాన్నలు చనిపోవడం వారు తట్టుకోలేక పోతున్నారు. చిన్న ఇల్లు.. పుట్టెడు అప్పులే ఇప్పుడు వారికి మిగిలింది. వాటితో పాటు అమ్మానాన్నల ద్వారా సోకిన వైరస్. ఇద్దరు పిల్లలూ పాజిటివ్ కావడంతో అదే ఇంట్లో దిక్కులేని పక్షుల్లా ఉంటున్నారు. సరైన వైద్యం లేక.. ఆదుకునే నాథుడు లేక బేల చూపులు చూస్తున్నారు. కనీసం అమ్మమ్మ, తాత కానీ, నానమ్మ, తాత కానీ లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమనెవరైనా ఆదుకుంటారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. చదవండి: విషాదం: ప్రసవానికి వచ్చి కరోనాకు బలి -
వాళ్లు సమాజానికి మూలస్తంభాలు
సిరిసిల్ల: ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మీ అరుదెంచిందని భావిస్తారు. స్త్రీలు పూజించబడిన చోట దేవతలు నివసిస్తారంటారు. నవీన మానవ సమాజంలో మాత్రం ఇంకా ఆడపిల్లలకు సముచిత స్థానం లేదనడం అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతీ 1,000 మంది పురుషులకు 943 మంది మహిళలు మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. సభ్య సమాజానికి మూల బిందువైన ఆడపిల్లలను గర్భంలో ఉన్నప్పుడు తుంచేయడం, భ్రూణ హత్యలకు పాశవికంగా పాల్పడడం వంటి చర్యలు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయేందుకు కారణమవుతున్నాయి. ప్రతీ వ్యవస్థలోనూ పురుషుడికే అగ్రపీఠం ఇవ్వడం వల్ల మహిళలు నిరాదరణకు గురవుతున్నారు. లింగ నిష్పత్తి ప్రకారం దేశంలో ప్రతీ 1,000 మంది బాలురకు 1981లో 962 మంది, 1991లో 945 మంది 2011లో 919 మంది బాలికలు ఉన్నారు. ప్రతీ పదేళ్లకు ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉండడం ప్రమాదస్థితికి దర్పణం పడుతోంది. ఈ లెక్కల ప్రకారం స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి సమతూకంలో ఉండడంలో దేశం 41వ స్థానంలో ఉంది. బాలిక దినోత్సవం వెనుక.. సనాతన దేశంలో బాలికల పట్ల వివక్షను నిర్మూలించేందుకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏటా జనవరి 24న బాలికా దినోత్సవం జరుపుతోంది. ఆడపిల్లలను చదవనిద్దాం.. ఎదగనిద్దాం అనే నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, వారి సామాజిక పురోగతికి అవసరమైన ప్రోత్సాహం, సమానావకాశాలను అందించేలా కృషి చేస్తోంది. స్త్రీలకు ఉన్నత విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటివి అందించే దిశగా పలు ప్రయత్నాలు జరుపుతోంది. పలు పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. ప్రత్యేకంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో పలు పథకాలను రూపొందించింది. బేటీ బచావో..బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన పథకాలను అమలు చేస్తోంది. పదేళ్ల లోపు బాలికల పేరిట పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించిన వారికి 9.1శాతం వడ్డీని అందిస్తోంది. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తోంది. దేశంలో ప్రస్తుతం 440జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉంది. కొనసాగుతున్న వివక్ష.. ఆడపిల్లను లక్ష్మీదేవితో సమానంగా చూసే సభ్య సమాజంలో ఇంకా లింగ వివక్ష కొనసాగుతూ ఉండడం విషాదం. చదువుకొని ఉద్యోగాలు చేయాలా.. ఊళ్లు ఏలాలా అనే ప్రశ్నలతో ఉన్నత విద్యను ఆడపిల్లలకు అందకుండా చేస్తున్నారు. రెండేళ్ల తేడాతో ఉన్న అబ్బాయి, అమ్మాయి ఉన్న ఇంట్లో ఆడపిల్లలను బడి మాన్పించి, అబ్బాయిని చదివించే నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యకు చేరేసరికి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతూ కనిపించడమే ఇందుకు నిదర్శనం. భ్రూణహత్యలు.. పెంచి పెద్ద చేయడంతో పాటు కట్నాలిచ్చి పెళ్లి చేయడం భారంగా భావించే కొంత మంది తల్లిదండ్రులు పుట్టబోయేది ఆడ శిశువు అని తెలుసుకుని గర్భంలోనే తుంచేస్తున్నారు. కడుపులో ఉండగానే శిశువు ఆడ, మగ అని నిర్ధారించే స్కానింగ్ పరీక్షలను చట్ట పరిధిలో నేరంగా పరిగణిస్తున్నా ఇంకా భ్రూణ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. బాల్య వివాహాలు.. యుక్త వయసు రాకముందే ఆడపిల్లలకు వివాహాలు చేస్తే భారం తగ్గుతోంది, బాధ్యత తీరుతుంది అని తల్లిదండ్రులు భావించడం కారణంగా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో అమ్మాయిలకు భద్రత కరువైందన్న భావనతో ఉన్నత చదువులకు దూరంగా ఉంచుతున్నారు. పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలు కూడా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రుల వివక్షకు కారణమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. జిల్లా ఆవిర్భావం నుంచి సమగ్ర శిశు రక్షణ పథకం ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఒక శిశు సంరక్షణ కేంద్రం నిర్వహించబడుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 30 బాల్య వివాహాలను నిలువరించగలిగారు. యుక్త వయసుకు ముందే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా దాదాపు 60 మంది బడి బయటి పిల్లలను గుర్తించారు. మరో 65 మందిని ఆపరేషన్ ముస్కాన్లో గుర్తించారు. 22 మంది అట్రాసిటీ బాధితులకు నష్ట పరిహారం ఇచ్చారు. 14 మంది అనాథ హెచ్ఐవీ బాధితులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఉన్నతంగా చదివించాలి లింగ వివక్షను నిర్మూలించే ప్రక్రియ కుటుంబంతోనే ప్రారంభం కావాలి. ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా చూడాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా ఉన్నతంగా చదివించాలి. ప్రతీ రంగంలోనూ అమ్మాయిలు ప్రతిభ చాటుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అందుతున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని అమ్మాయిలు ఎదిగేలా సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. – సుచరిత, బాల రక్షాభవన్ కోఆర్డినేటర్ సమాజానికి మూలస్తంభాలు మానవ సమాజానికి మూలస్తంభాలైన ఆడపిల్లలను చదవనివ్వడం, ఎదగనివ్వడం సమాజం కనీస బాధ్యత. ప్రతీ ఆడపిల్ల స్వయంపోషిత స్థితికి ఎదిగే వరకు వివాహాన్ని వాయిదా వేసుకోగలగాలి. పరాధీన మనస్తత్వంతో పెంచడం మంచిది కాదు. తన కాళ్లమీద తాను నిలబడేంత వరకు అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. – రౌతు అలేఖ్యపటేల్, సీడీపీవో, సిరిసిల్ల -
భూ వివాదం..రైతు దారుణ హత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): భూ వివాదం ఓ రైతుని బలితీసుకుంది. సిరిసిల్ల రూరల్ సీఐ సర్వర్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్కు చెందిన కస్తూరి కరుణాకర్ రెడ్డి (40)కి వరుసకు బావ అయిన చిన్నరాములు మధ్య పదిహేనేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఇద్దిరి పొలాల మధ్య దారి విషయంలో పంచాయితీలు జరిగాయి. ఇదిలా ఉండగా ఏడాది కాలంగా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలో ఆదివారం కరుణాకర్రెడ్డి తన పొలంలో పనిచేస్తుండగా చిన్నరాములు, అతని తనయులు వెంకటేశ్రెడ్డి, మహేశ్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పొలం ఒడ్డు చెక్కవద్దని కరుణాకర్రెడ్డితో గొడవ పడ్డారు. గొడ్డలి, పారలతో దాడి చేసి అతన్ని హతమార్చారు. ఇది గమనించిన మృతుడి సోదరి పద్మ కేకలు వేస్తూ అక్కడికి చేరుకోగా ఆమెను చంపుతామని బెదిరించి, పారిపోయారు. సంఘటన స్థలాన్ని సీఐ సర్వర్, ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించారు. కరుణాకర్రెడ్డికి కుమారుడు పవన్రెడ్డి ఉన్నాడు. తన భర్తను హత్య చేసిన చిన్నరాములు, అతని కుమారులను కఠినంగా శిక్షించాలని మృతుడి రేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ హత్యలో తండ్రీకుమారులతోపాటు మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. -
సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ
సాక్షి,సిరిసిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డిపేటలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించి, కార్యకర్త వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ను అడ్డుకునేందుకు బిజెపి కార్యకర్తలు యత్నించారు. డిగ్రీ కళాశాల కావాలని మంత్రి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు బిజెపి కార్యకర్తలను అడ్డుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బిజేపి నేతల తీరుపై నిరసన వ్యక్తం చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలు.. నలుగురు బీజేపీ కార్యకర్తలపై దాడిచేసి, ఓ బైకును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సాయికుమార్ అనే బీజేపీ కార్యకర్త గాయపడగా, ఇరువర్గాల ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బిజేపి కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి దాడికి పాల్పడ్డ టిఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ గుండాలు దాడి చేశారని ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని మైనార్టీ యువకుడిపై మంత్రి సమక్షంలోనే టిఆర్ఎస్ గుండాలు దాడి చేశారని, దాడికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని సముదాయించి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆందోళనను విరమింపజేశారు. -
భర్తను హతమార్చిన భార్య
ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లలు లేని తనకుకాకుండా.. రెండో భార్యకు ఆస్తి దక్కుతుందని భావించిన మొదటి భార్య బంధువులతో కలిసి భర్తను హతమార్చింది. సిరిసిల్ల టౌన్ సీఐ వెంకటనర్సయ్య, మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా..ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాకు చెందిన ధరమ్సోత్ శంకర్నాయక్(49)పై అతడి మొదటి భార్య సరోజన, మరో ఇద్దరు బంధువులు కలిసి శనివారం రాత్రి దాడి చేశారు. తీవ్రగాయాలకు గురైన శంకర్నాయక్ను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. శంకర్నాయక్ పరిస్థితి విషమంగా ఉండడంతో ముస్తాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిచెందిన శంకర్నాయక్ కాగా శంకర్నాయక్కు గతంలో సరోజనతో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దీంతో సేవాలాల్ తండాకే చెందిన రాజవ్వను శంకర్నాయక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు జన్మించింది. అయితే వ్యవసాయ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని శంకర్నాయక్పై మొదటి భార్య సరోజన కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. ఇద్దరి మధ్య ఆస్తిపై గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు లేని తనను ఎవరూ పట్టించుకోరని ఆస్తి రాసివ్వాలని పంచాయితీలు పెట్టింది.(చదవండి: పథకం ప్రకారమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య) అయితే అందుకు అతడు నిరాకరించడంతో తన బంధువులైన లక్ష్మీ, శ్రీనివాస్, సరోజన కలిసి శంకర్నాయక్కు శనివారం రాత్రి ఫుల్గా మందు తాగించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న శంకర్నాయక్పై ముగ్గురు కలిసి దాడి చేసి కొట్టారు. శంకర్ను చంపిన ముగ్గురిని శిక్షించాలని రెండో భార్య రాజవ్వ, ఆమె బంధువులు ముస్తాబాద్లో ఆందోళన చేపట్టారు. హత్యకు కారణమైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటనర్సయ్య, ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. -
నేను కూడా ప్లాస్మా దానం చేస్తా: కేటీఆర్
సాక్షి, కరీంనగర్, సిరిసిల్లా: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తాను సైతం ప్లాస్మా డోనేషన్ చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్, సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ వార్డును, ఐదు ప్రత్యేక అంబులెన్స్లను ప్రారంభించారు. పంచాయతీ రాజ్ శాఖ ఈఈ, డీఈఈ భవనాలకు శంఖుస్థాపన చేశారు. అనంతరం సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఐసోలేషన్ వార్డును ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా టెస్టులు పెంచుతామని.. పాజిటివ్ వస్తే భయాందోళనకు గురై ఆగమాగం కావద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99 శాతం ఉందని.. ఇది 100 శాతం ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మంత్రులుగా ఉన్న వాళ్లు ప్రజల్లో తిరగాలని.. జనాలకు అవగాహన కల్పించే బాధ్యత తమపైనే ఉందన్నారు. కొందరు చిల్లరమల్లరగా మాట్లాడుతూ రాజకీయం చేయడం మంచిది కాదని కేటీఆర్ హితవు పలికారు. (ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై కేటీఆర్ ఫైర్) కరోనాకు ఎవరూ అతీతం కాదు కష్టకాలంలో కరోనా బాధితులను ఏ విధంగా ఆదుకోవాలనే దాని గురించి ఆలోచించాలని కేటీఆర్ కోరారు. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 2 కోట్ల 28 లక్షల రూపాయలు సీఎస్ఆర్ నిధుల రూపంలో హాస్పిటల్కు రేపు అందిస్తామని తెలిపారు. తన వంతుగా 20 లక్షల రూపాయలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రోజుకు వెయ్యి పరీక్షలు పెంచాలని వైద్యాధికారులుకు సూచించానన్నారు. 32 పడకలతో అగ్రి కల్చర్ కళాశాలలో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మండేపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా వియోగిస్తామని తెలిపారు. కరోనా వస్తే ప్రజలంతా సహకరించాలి, వారిని వేలేసినట్లు చూడొద్దని కోరారు. అమిత్ షా, కర్ణాటక, మధ్య ప్రదేశ్ సీఎంలకు కూడా పాజిటివ్ వచ్చింది.. కరోనాకు ఎవరూ అతీతం కాదన్నారు. వెంటిలేటర్లు అవసరాన్ని బట్టి పెంచుతామన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు పెంచుతామని.. అయితే ఈ నిర్ణయం కేవలం జిల్లా వరకు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. (వ్యాక్సిన్ వచ్చే వరకు అదొక్కటే మార్గం) లాక్డౌన్ వల్ల సమస్య పరిష్కారం కాదు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి వస్తే వేతనం ఎక్కువ ఇచ్చి అయినా తీసుకుంటామన్నారు కేటీఆర్. హోమ్ మినిష్టర్ మహమ్మద్ అలీ, పెద్దలు హనుమంతరావు కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. హైదరాబాద్లో కుటుంబ సభ్యులకు కరోనా వస్తుందని వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందన్నారు. కరోనా కట్టడికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామని, అనవసర విమర్శలకు పోవద్దని కోరారు. మీడియాలో లోటు పాట్లు చూపాలని.. పాజిటివ్ కథనాలను హై లెట్ చేయాలని కోరారు. ప్రతిపక్షాల సహకరించాలని కోరారు. కరోనా వైరస్కు చికిత్స లేదు...నివారణ ఒక్కటే మార్గమన్నారు. లాక్ డౌన్ వల్ల సమస్య పరిష్కారం కాదని కేటీఆర్ తెలిపారు. -
సిరిసిల్లలో కేటీఆర్ సుడిగాలి పర్యటన
-
ఆ హామీ ఏమైంది: పొన్నం ప్రభాకర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రతి ఏడాది వంద కోట్ల రూపాయలు ఇస్తామని గత ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరిట ఉన్న గుడి చెరువు పూడ్చడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదని విమర్శించారు. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిలో దూసుకుపోతుందని, వేములవాడలో మాత్రం ఒక పని కూడా చేయలేదని మండిపడ్డారు. వీటీడీఏ హైదరాబాద్ కార్యాలయానికి కూడా దేవస్థానమే డబ్బులు చెల్లిస్తుండగా, యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోందని తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికై ఏడాది గడుస్తున్నా.. వేములవాడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రికి ఒక్క లేఖ కూడా రాయలేదని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఆయన వెంటనే సీఎం కేసీఆర్ను కలవాలని డిమాండ్ చేశారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్బాబు జర్మనీకే అంకితం అయ్యారని ధ్వజమెత్తారు. వచ్చేనెల లోపు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే గాడిదకు వినతపత్రం ఇస్తామని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. -
ఉసురు తీసిన ఆపరేషన్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోయాయని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. సిరిసిల్లలోని గణేష్నగర్కు చెందిన గాజుల కల్పన (24) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం చేరింది. డాక్టర్ ఆపరేషన్ చేయగా.. శుక్రవారం జ్వరం వచ్చి మతిస్థిమితం కోల్పోయింది. డాక్టర్ మళ్లీ వైద్యం చేస్తుండగానే అర్ధరాత్రి మరణించింది. కల్పనకు రెండేళ్ల బాబు శివాజీ, ఆరు నెలల పాప హిమశ్రీ ఉన్నారు. అలాగే.. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన మాలోతు శీల (34) పైల్స్ సమస్యతో బాధపడుతూ గురువారం అదే ఆసుపత్రిలో చేరింది. ఆమెకూ ఆపరేషన్ చేశారు. శీల కూడా అస్వస్థతకు గురవడంతో డాక్టర్ ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి శుక్రవారం అర్ధరాత్రి పంపించారు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే సరికి శీల మరణించింది. శీలకు ఇద్దరు కూతుళ్లు వాణీ (14), లావణ్య (10), కొడుకు లక్పతి (7) ఉన్నారు. ఒకే ఆసుపత్రిలో ఇద్దరు మరణించడం సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయని మృతుల బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు. -
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. సోమవారం ఆయన సిరిసిల్లా జిల్లా పర్యటన సందర్భంగా కొంత ఇబ్బందికరంగా కనిపించారని కొంతమంది ఆయన అభిమానులు ట్విటర్లో పోస్టులు పెట్టారు.‘కరోనాపై యుద్ధం చేస్తున్న కేటీఆర్ కొంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచో తాను స్పల్ప కోల్డ్ అలర్జీతో బాధపడుతున్నానని, అదేమీ తనకు సమస్య కాలేదని చెప్పారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరంలేదని కేటీఆర్ తన అభిమానులకు తెలిపారు. ఇక సిరిసిల్ల పర్యటన సందర్భంగా ఎవరినైనా ఇబ్బందులకు గురిచేసి ఉంటే క్షమించాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కులో రూ.14.50 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, శిక్షణ కేంద్రం, పరిపాలనా భవనం, క్యాంటీన్ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించిన విషయం తెలిసిందే. (బ్రాండ్ సిరిసిల్ల కావాలి) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1401284236.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మూగబోయిన మగ్గంపై కన్నీళ్ల నేత
సాంచాల చప్పుళ్లతో కళకళలాడే నేతన్నల ఇళ్లలో మూగ రోదనలు వినిపిస్తున్నాయి. రంగు రంగుల పట్టుచీరలు నేసే ఆ మగ్గాలు.. పూట గడవక కన్నీళ్లను నేస్తున్నాయి. ధగధగ మెరిసే పట్టు చీరలను చూసి మురిసిపోయే ఆ కళ్లు.. వంటగదిలో నిండుకున్న కుండలను చూసి కన్నీళ్లు పెడుతున్నాయి. రాట్నాలు ఒడికే చేతులు.. అన్నార్థుల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న నేతన్నల దుస్థితి. యాదాద్రి, మహబూబ్నగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో లాక్డౌన్తో పనుల్లేక ఇక్కట్లు పడుతున్న వేలాది మంది నేతన్నల బతుకు చిత్రంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. సాక్షి యాదాద్రి/గద్వాల/సిరిసిల్ల/సిద్దిపేట: కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మగ్గం చప్పుళ్లు ఆగిపోయాయి. పూటగడవని నేతన్న అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నాడు. ఒకపూట తిండికోసం, వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం చేనేత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా నేతన్నల జీవితాలు తారుమారయ్యాయి. చేనేతకు అవసరమైన ముడి పట్టు, కాటన్, నూలు రవాణా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, గద్వాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా చేనేత వృత్తిపై ఆధారపడి వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరికీ చేతిలో పనిలేక, డబ్బుల్లేక పోవడంతో నిత్యావసరాలు కొనుక్కోలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. మందులకు డబ్బులు లేవు.. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికురాలు వడ్డెపల్లి గీతావాణి. లాక్డౌన్తో పని లేక నానా అవస్థలు పడుతోంది. ఈమె భర్త గోపాల్ 7 సంవత్సరాల కింద అనారోగ్యంతో మృతిచెందాడు. ఏకైక కుమారుడు శ్రీధర్ (10) మానసిక వికలాంగుడు. శ్రీధర్ వైద్యఖర్చులు, మందులకే నెలకు నాలుగైదు వేలు ఖర్చవుతోంది. గీతావాణి మస్రస్ చీరలను మగ్గంపై నేస్తుంది. నెలకు 5 నుంచి 6 చీరలు నేయడం ద్వారా సరాసరి నాలుగున్నర వేలు సంపాదిస్తుంది. నెలరోజులుగా మగ్గం నడవట్లేదు. చేనేత అనుబంధ పనులు ఏమైనా చేద్దామంటే అవి కూడా మూతపడ్డాయి. మందులు కొనడానికి డబ్బులు లేవని, ప్రభుత్వం ఇచ్చిన రేషన్బియ్యం, రూ.1,500 నిత్యావసర సరుకులు కొనడానికే సరిపోతున్నాయని చెబుతోంది. చేతిలో డబ్బుల్లేక ఇక్కట్లు పోచంపల్లికి చెందిన ఈమె పేరు కాముని పద్మ. భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంటి బాధ్యతను భుజాలకు ఎత్తుకుని 22 ఏళ్లుగా మగ్గం నేస్తోంది. అద్దె ఇంట్లో ఉంటోంది. కూలీ మగ్గం నేసి ముగ్గురు కుమార్తెల వివాహం చేసింది. ఇంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత రోజూ 8 గంటలు కూలీకి మగ్గం నేస్తుంది. నెలంతా పనిచేస్తే రూ.5 వేలు సంపాదిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మహిళా సంఘం ద్వారా బ్యాంకులో తీసుకున్న లోన్, పొదుపు డబ్బులు కట్టలేకపోతోంది. పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో రూ.70కోట్లకు పైగా పట్టు చీరల నిల్వలు, రామన్నపేట, మిగతా ప్రాంతాల్లో రూ.60కోట్ల కాటన్ వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ షాపింగ్ కాంప్లెక్స్లో 100కు పైగా దుకాణాలు ఉన్నాయి. మాస్టర్ వీవర్స్ వద్ద రూ.10 కోట్లు, చేనేత సహకార సంఘంలో రూ.1.5 కోట్లు, వస్త్ర దుకాణాల్లో మరో రూ.50 కోట్లకు పైగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. స్టాక్ అమ్మాకే కార్మికులకు ఉపాధి ఇవ్వగలుగుతామని మాస్టర్ వీవర్స్ అంటున్నారు. ‘ఇక్కత్’కు కష్టాలు పోచంపల్లి మగ్గాల కేంద్రానికి తాళం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్పత్తి అయిన పట్టు చీరలు, కాటన్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోవడంతో రూ.130 కోట్ల విలువ చేసే చేనేత ఉత్పత్తులు పేరుకుపోయాయి. సహకార, సహకారేతర రంగంలో భూదాన్పోచంపల్లి, రామన్నపేట, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, భువనగిరి, రాజపేట, ఆలేరు, గుండాల, ఆత్మకూర్ (ఎం) యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల్లో చేనేత రంగంలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో 1,300 పైచిలుకు మగ్గాలు ఉండగా, 3 వేలకు పైగా చేనేత కార్మికులు చేనేత పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,500 మంది జియో ట్యాగింగ్లో నమోదు కాగా, మరో 15 వేల మందికి పైగా ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. నిలిచిన ముడి సరుకు రవాణా ప్రభుత్వం లాక్డౌన్ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇస్తూ చేనేత కార్మికులు పని చేసుకోవచ్చని తెలిపింది. కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చేనేత కార్మికులకు పని కల్పించే సానుకూల పరిస్థితులు లేవు. చైనా దేశం నుంచి దిగుమతి అయ్యే పట్టు ముడిసరుకు, రంగులు, రసాయనాలు 3 నెలల కిందటే నిలిచిపోయాయి. బెంగళూరులో ఉత్పత్తి అయ్యే పట్టు దేశంలోని కార్మికుల అవసరాలకు సరిపోవట్లేదు. చీరల జరీ సూరత్ నుంచి వస్తుంది. కాటన్ వస్త్రాలS తయారీకి అవసరమైన కాటన్ నూలు తమిళనాడులోని ఈరోడ్, సేలం, ఆదిలాబాద్ నుంచి జిల్లాకు వస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ముడిసరుకు దిగుమతి ఆగిపోయింది. చాలా చోట్ల ముడి నూలు లేక వస్త్రాల తయారీ నిలిచిపోయింది. ఉమ్మడి మహబూబ్నగర్లో నేతన్నల దుస్థితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 10,550 మంది చేనేత కార్మికులు వివిధ రకాల డిజైన్లతో జరీ చీరలు, దుప్పట్లు, తువాళ్లను తయారు చేస్తున్నారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబం నెలకు సగటున నాలుగు జరీ చీరలు నేస్తారు. లాక్డౌన్ రోజుల్లో సుమారు 10 వేల వరకు జరీ చీరలు తయారయ్యాయి. కార్మికులు నేసిన ఈ చీరలను మాస్టర్ వీవర్స్ లాక్డౌన్ కారణంగా కొనుగోలు చేయట్లేదు. దీంతో కార్మికులు తయారు చేసిన చీరలను ఇళ్లలోనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పని నిలిచిపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో కొంతమంది నేత కార్మికులు ఉన్నారు. ప్రధానంగా గద్వాల, రాజోలి, అమరచింత, నారాయణపేట, కొత్తకోట, అయిజ, ధన్వాడ, గట్టు, మాచర్ల, గోర్లఖాన్దొడ్డి తదితర ప్రాంతాల్లో నేత కార్మికుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. నూలు ధరలపై నియంత్రణేది చైనా నుంచి నూలు ముడి సరుకు నిలిచిపోయింది. దీంతో సిల్క్ ఉత్పత్తి తగ్గి బెంగళూరు కేంద్రంగా సరఫరా అయ్యే నూలుకు డిమాండ్ పెరిగి ధరలు రెట్టింపయ్యాయి. లాక్డౌన్కు ముందు 3 నెలల కింద కిలో పట్టు వార్పు రూ.3,200ల నుంచి రూ.4,500లకు, వెప్ట్ కిలో రూ.3,500ల నుంచి రూ.4,800లకు పెరిగింది. మొత్తానికి వార్పు (7చీరలు)పైన రూ.15 వేల వరకు ధర పెరిగిందని వాపోతున్నారు. పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా చీరల ధరలు పెంచితే మార్కెట్లో కొనుగోలుదారులు వస్త్రాలను కొనలేని పరిస్థితి నెలకొంది. గతంలో జరిపిన విక్రయాలకు డబ్బులు రాకపోవడంతో మాస్టర్ వీవర్స్ తమ వద్ద పనిచేసే కార్మికులకు పని నిలిపేశారు. దీంతో పనులు లేక కార్మికులు అర్ధాకలితో గడుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, రూ.1,500 మాత్రమే వారికి జీవనాధారం అయ్యాయి. మూగబోయిన సిరిసిల్ల.. సిరిసిల్లలో కరోనా ప్రభావంతో కార్ఖానాలు బంద్ అయ్యాయి. బట్ట ఉత్పత్తి చేస్తేనే నేత కార్మికుల పొట్ట గడుస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్లోనూ ఆధునిక మరమగ్గాలు బంద్ అయ్యాయి. దీంతో మొత్తంగా సిరిసిల్లలో 25 వేల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా సిరిసిల్లలో వేలాది మంది కార్మికుల ఉపాధికి విఘాతం ఏర్పడింది. కాగా, సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. 6.2 కోట్ల మీటర్లు బతుకమ్మ చీరల బట్టను ఉత్పత్తి చేయాలని సిరిసిల్లలో వస్త్రోత్పత్తిదారులకు గత ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చారు. చీరల డిజైన్ను మార్చడంతో బతుకమ్మ చీరలకు అవసరమైన నూలును దిగుమతి చేసుకుంటున్న దశలో కరోనా లాక్డౌన్ అయింది. దీంతో సిరిసిల్లకు పూర్తి స్థాయిలో నూలు ఇంకా రాలేదు. వచ్చిన నూలుతో వస్త్రోత్పత్తికి లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. దీంతో సిరిసిల్లలో అటు పాలిస్టర్ బట్ట, ఇటు బతుకమ్మ చీరల బట్ట ఏదీ ఉత్పత్తి కావట్లేదు. దీంతో నేత కార్మికుల బతుకు దయనీయంగా మారింది. నిత్యం పని చేసే కార్మికులకు నెల రోజులుగా పని లేకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక.. దిక్కుతోచక..! ఈ చిత్రంలో దీనంగా కనిపిస్తున్న శంకర్, పద్మ దంపతులిద్దరూ చేనేత కార్మికులు. వీరికి ఆరేళ్లపాప ఉంది. చేనేత వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ కష్టపడి మగ్గం ద్వారా జరీ చీరలను తయారు చేస్తారు. నెలకు 3 చీరలు నేయడమే గగనం. వీటి ద్వారా సంపాదన నెలకు రూ.10 వేలకు మించదు. లాక్డౌన్ విధించడం, రాజోలి రెడ్జోన్లోకి వెళ్లడంతో మగ్గాలు నిలిచిపోయాయి. దీంతో వారు ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఘొల్లుమంటున్న ‘గొల్లభామ’ గత 40 రోజులుగా సిద్దిపేట జిల్లాలో నేతన్నల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత నాలుగు రోజుల నుంచే చేనేత కార్మికులు పని ప్రారంభించారు. జిల్లాలో 13 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 5,450 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా గొల్లభామచీరలు, లివర్ టవల్స్, జర్నరీ టవల్స్ అధికంగా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన వస్త్రాలను టెస్కో ఖరీదు చేస్తుంది. గత 4 నెలల నుంచి వస్త్రాలను ఖరీదు చేయడంలో టెస్కో ఆలస్యం చేయడంతో కార్మికులకు కూలీ చెల్లించలేకపోతున్నారు. సహకార సంఘాల వద్ద వస్త్రాలు పేరుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా 2.5 కోట్ల విలువైన వస్త్రాలు సహకార సంఘాల వద్ద ఉన్నాయి. వీటిని విక్రయిస్తేనే కార్మికులకు వేతనాలు అందుతాయి. ప్రభుత్వం ఈ వస్త్రాలను త్వరగా ఖరీదు చేసి అదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. పొట్ట నిండటమే కష్టమవుతోంది.. ఇతడి పేరు చాప శ్రీనివాస్ (38). నిత్యం సాంచాలు నడుపుతూ రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించే వాడు. లాక్డౌన్ నేపథ్యంలో శ్రీనివాస్కు ఉపాధి కరువైంది. అద్దె ఇంట్లో ఉండే శ్రీనివాస్కు ఇద్దరు ల్లలు. భార్య బీడీ కార్మికురాలు. పొట్ట నింపుకోవడం కష్టమైతుందని వాపోతున్నాడు. చాప శ్రీనివాస్, పవర్లూమ్ కార్మికుడు, సిరిసిల్ల -
కలెక్టర్ ఆగ్రహం
-
ఇది సంస్కరణల తెలంగాణ
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో అనేక సంస్కరణలకు వేదిక అయిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన పల్లె ప్రగతిపై పంచాయతీరాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పది జిల్లాలు ఉన్న తెలంగాణ పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలుగా మారిందన్నారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలతో ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. పల్లె ముఖచిత్రం మార్చేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారని, ఆ మార్పును కొనసాగించే దిశగా ఇప్పుడు గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంచి పల్లెలను తీర్చిదిద్దాలని కోరారు. పంచాయతీలకు ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయిస్తున్నామని, ప్రతి ఊరిలో ట్రాక్టర్ ఉండాలన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పనిచేయకుంటే పదవులు కోల్పోతారని, ఈ విషయంలో కఠినంగా ఉంటామని మంత్రి హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్లనే ముందు తొలగిస్తామని స్పష్టం చేశారు. పల్లె ముఖచిత్రం మారాలి ప్రతి ఊరిలో నర్సరీ ఉండాలని, చెత్త లేకుండా వీధి శుభ్రంగా ఉండాలని, డంపుయార్డులు, శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు ఉండాలని కేటీఆర్ సూచించారు. పల్లెల్లో సేకరించే తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తామని చెప్పారు. ఏ ఊరికి ఆ ఊరి ప్రజాప్రతినిధులే కథానాయకులై పల్లెల్లో మార్పు తేవాలన్నారు. అందరూ మిషన్ భగీరథ నీళ్లనే తాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆకస్మిక తనిఖీలు ఉంటాయి పల్లెల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా అందరూ క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తారని, పల్లెల్లో మార్పు కనిపించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటిన మొక్కల్లో 85% బతకాలన్నారు. జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్లకు ప్రభుత్వం త్వరలో నిధులు మంజూరు చేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాల కొండ అరుణ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపుతాం ఆడపిల్లలకు ఆత్మరక్షణకు శిక్షణ ఇస్తామని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో బాలికల హాస్టల్లో లైంగిక వేధింపుల ఘటనపై ఆయన గురువారం హాస్టల్ను సందర్శించి బాలికలతో మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని, ఎవరూ చేసినా తప్పేనని కేటీఆర్ అన్నారు. ఈ విషయం తెలియగానే దేవయ్యను టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించామని, చట్టప్రకారం అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ -
బడుగు జీవులపై అటవీ అధికారుల ప్రతాపం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్లో ఉపాధి కోల్పోయి తిరిగి వచ్చిన బాధితుడు గూడు లేక గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో గుడిసె ఏర్పాటు చేసుకుని జీవిస్తుండగా అటవీ శాఖ అధికారులు తమ ప్రతాపం చూపారు. గుడిసె తీసివేయాలని ఆ కుటుంబాన్ని హెచ్చరించడంతో దానిని తొలగిస్తున్న క్రమంలో కర్రలు మీద పడి గృహిణి తీవ్రగాయాలకు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్సింగ్ తండా గ్రామపంచాయతీకి చెందిన వేముల దేవయ్య స్వగ్రామంలో పనులు లేక ఉపాధి కోసం రూ.5 లక్షలు అప్పు చేసి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాడు. అక్కడ కూడా సరిగా పని దొరక్క ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో రిజర్వ్ అటవీ ప్రాంతంలో తాత్కాలికంగా గుడిసె వేసుకున్నాడు. అటవీ సిబ్బంది సెక్షన్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం గుడిసె తొలగించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో దేవయ్య భార్య లక్ష్మిపై కర్రలు పడి గాయాలకు గురైంది. ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల): ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్గా మారింది. దాదాపు పదినెలలుగా జంటకోసం వారు పడరాని పాట్లు పడ్డారు. మసీదులో ముస్లిం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఓ గురువు.. సమీపంలోని యువతిని ప్రేమించాడు. వివాహం చేసుకునేందుకు మూడు రాష్ట్రాలు దాటించి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాపురం పెట్టాడు. ‘సెల్ఫోన్’ ఆధారంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సాజీద్ ఉత్తరప్రదేశ్లోని ఆస్రాత్ జిల్లా కేంద్రంలోని మసీదులో పిల్లలకు ఖురాన్ పఠించడం, ఉర్దూ బోధించడం చేస్తున్నాడు. ఈక్రమంలో మసీదు సమీపంలో ఉండే యువతి రబియాను ప్రేమించాడు. ఆమె తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో గతేడాది డిసెంబర్ 21న రబీయాను తీసుకుని సాజీద్ పరారయ్యాడు. తర్వాత రబీయాను వివాహం చేసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మజీద్కు వచ్చాడు. ఇక్కడ ఎనిమిది నెలలుగా ఖురాన్, ఉర్దూ బోధిస్తున్నాడు. తన కూతురును కిడ్నాప్ చేశాడని సాజీద్పై రబియా తండ్రి ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అస్రాత్శాకసాని పోలీస్స్టేషన్లో ఎస్సై శాంతిచరణ్ యాదవ్.. సాజీద్పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పదినెలలుగా గాలిస్తున్నారు. గత ఫిబ్రవరి నుంచి సాజిద్ నామాపూర్లోనే ఇక్కడే ఉంటున్నాడు. సాజీద్, రబియా ఆచూకీ కోసం తీవ్రం గా శ్రమిస్తున్న అక్కడి పోలీసులకు రబియా వినియోగిస్తున్న సెల్ఫోన్ ఆధారంగా ఆచూకీ లభించింది. తల్లిదండ్రులతో రబియా ఫోన్లో మాట్లాడుతుండగా.. ఎస్సై శాంతిచరణ్యాదవ్ ట్రాప్ చేశారు. దీనిద్వారా రబియా, సాజీద్ తెలంగాణలోని నామాపూర్లో ఉన్నట్లు గుర్తించారు. ముస్తాబాద్ ఎస్సై రాజశేఖర్ సహకారంతో శుక్రవారం నామాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో రబియా, సాజీద్ ముస్తాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నారు. ఫోన్ ద్వారా ఆ సమాచారం తెలుసుకున్న ఎస్సైలు.. అక్కడికి చేరుకున్నారు. అక్కడే రబి యా, సాజీద్కు కౌన్సెలింగ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శాంతిచరణ్, రబియా తండ్రి ఆ జంటను తమ వెంట ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లారు. -
పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
-
ఐదేళ్ల ప్రేమాయణం.. ఆస్పత్రిలో పెళ్లి!
-
ఐదేళ్ల ప్రేమాయణం.. ఆస్పత్రిలో పెళ్లి!
సాక్షి, సిరిసిల్లా: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు... చివరికి తన తప్పుదిద్దుకున్నాడు. గ్రామస్తులంతా బాధితురాలి పక్కన నిలబడడంతో... ఆస్పత్రిలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. నుదుటిపై బొట్టుపెట్టి జీవినభాగస్వామిని చేసుకున్నాడు. ఈ అరుదైన పెళ్లి... రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. చిన్నబోనాలకు చెందిన ముత్యాల రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దేవలక్ష్మి అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమాయణం ఐదేళ్లు సాగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి... ఆమెను గర్భవతిని కూడా చేశాడు ముత్యాలరాజు. ఆ తర్వాత మొహం చాటేశాడు. యువతి మృతశిశువుకు జన్మనిచ్చి... జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు జరిగిన అన్యాయం తెలుసుకుని గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. మోసం చేసిన ముత్యాలరాజుతో మాట్లాడి.. బాధితురాలిని న్యాయం జరిగేలా చేశారు. ఈ మేరకు గ్రామస్తులు తమ మధ్యవర్తిత్వంతో ఆస్పత్రి ఆవరణలోనే ముత్యాలరాజు-దేవలక్ష్మిల పెళ్లి జరిపించారు. దీంతో వారి కథ సుఖాంతమైంది. -
సూత్రధారి డీఎఫ్వో.. పాత్రధారి ఎఫ్ఆర్వో
విధుల్లో సిబ్బందిని సరైన పద్ధతుల్లో నడిపించాల్సిన వారే.. కిందిస్థాయి ఉద్యోగిని కంచే చేను మేసిన చందంగా లంచం కోసం పీడించారు. జిల్లా బాస్ సూత్రధారిగా ఉండి... మరో అధికారిని పాత్రధారిగా మార్చి అవినీతికి పాల్పడుతూ.. ఏసీబీకి అడ్డంగా దొరికారు. అటవీశాఖలో కలకలం సృష్టించిన ఈ ఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా రూ.4లక్షల ముడుపుల కోసం వేధించడంతో పట్టించాడు. – సిరిసిల్లక్రైం సిరిసిల్లక్రైం: విధుల్లో సిబ్బందిని సరైన పద్ధతుల్లో నడిపించాల్సిన వారే.. కిందిస్థాయి ఉద్యోగిని కంచే చేను మేసిన చందంగా లంచం కోసం పీడించారు. జిల్లా బాస్ సూత్రధారిగా ఉండి... మరో అధికారిని పాత్రధారిగా మార్చి అవినీతికి పాల్పడుతూ.. ఏసీబీకి అడ్డంగా దొరికారు. అటవీ శాఖ లో కలకలం సృష్టించిన ఈ ఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. అటవీశాఖలో అవినీతి అధికారుల తీరును అదేశాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసే ఉద్యోగి బట్టబయలు చేశాడు. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా రూ.4లక్షల ముడుపుల కోసం వేధించడంతో ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టించాడు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఫారెస్ట్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్రావుతోపాటు సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.అనిత అదే శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ వద్ద రూ.4లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 15శాతం వాటా ఇవ్వాలని వేధింపులు... కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్టేషన్ పనులను జిల్లా అటవీశాఖ అధికారి.. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్కు అప్పగించారు. పనులు ముగిసిన అనంతరం సుమారు రూ.45లక్షలు పనుల కింద శ్రీనివాస్కు బిల్లులు వచ్చాయి. దీంట్లో 15శాతం డీఎఫ్వోతోపాటు ఎఫ్ఆర్వోకు చెల్లించాలని సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ను కొద్దినెలలుగా డిమాండ్ చేస్తున్నారు. తాను చేసిన పనుల్లో ఆశించిన మేర లాభాలు రావడం లేదని, అడిగినంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా వినకపోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్రణాళిక ప్రకారం గురువారం రూ.4 లక్షలు ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ సిరిసిల్ల అటవీశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఎఫ్ఆర్వో అనిత చాంబర్లో రూ.4లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారిగా ఉన్న డీఎఫ్వో శ్రీనివాస్రావుకు ఫోన్లో అనిత ద్వారా సమాచారం అందిస్తూ.. ‘రూ.4 లక్షలు వచ్చాయి’.. అనగానే అవతలి నుంచి డీఎఫ్వో.. ‘మీ వద్ద ఉంచండి తీసుకుంటాను.’ అనే మాటను వెల్లడించినట్లు ఏసీబీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. దీంతో డీఎఫ్వో జగిత్యాలలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సిరిసిల్లకు తీసుకువచ్చారు. డీఎఫ్వో శ్రీనివాస్రావు, ఎఫ్ఆర్వో అనితలపై కేసు నమోదు చేశారు. దాడుల్లో సీఐలు వేణుగోపాల్, రాములు, ప్రశాంత్ పాల్గొన్నారు. వేధింపులు తాళలేక.. అన్నం పెట్టిన శాఖలోనే వేధింపులు తాళలేకే ఏసీబీని ఆశ్రయించాను. చేసిన పనిలో లాభం రావడం లేదని, నెలల తరబడి బ్రతిమిలాడాను. అయినా అధికారులు కనికరం చూపలేదు. పట్టుబడిన అధికారులే కాదు వీరి పైన ఉన్న అధికారులు కూడా వేధించారు. – బాధిత సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ -
ఆకలి తీర్చడంలో వింధ్య పర్వతం
అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు.. అలాంటి అన్నం, కూరలను వృథాగా పారవేసే వారి వద్దకు వెళ్లి.. ఆ ఆహారపదార్థాలను సేకరించి, ఆకలితో అలమటించే అభాగ్యులకు అందిస్తూ.. వారి ఆకలి తీర్చుతోంది సిరిసిల్లకు చెందిన ధరణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు వింధ్యారాణి. చేసేది చిరుద్యోగమైనా, మంచి మనసున్న మారాణి వింధ్యారాణి సిరిసిల్లలోని పేదవర్గాలకు విందు భోజనాన్ని వడ్డించే అక్షయపాత్ర అయింది.. బట్టల సేకరణతో శ్రీకారం... సిరిసిల్లలో 2004లో ‘ధరణి’ స్వచ్ఛంద సంస్థను వింధ్యారాణి మరి కొందరితో కలిసి ప్రారంభించారు. సామాజికంగా సేవ చేసేందుకు ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల గాంధీచౌక్లో పెద్ద బాక్స్(అట్టపెట్టె)ను ఏర్పాటు చేసి మీ పిల్లలకు సరిపోని(పట్టని) డ్రెస్లను ఈ డబ్బాలో వేయండి.. ఆ దుస్తులను పేద పిల్లలకు మేం అందిస్తామని బోర్డు ఏర్పాటు చేశారు. ధరణి సంస్థ ఏర్పాటు చేసిన ఈ డబ్బాలో చాలామంది కొత్త కొత్త డ్రెస్లను వేశారు. మంచి మంచి చీరలను మహిళలు స్వచ్ఛందంగా వేశారు. ఇలా వచ్చిన బట్టలను సిరిసిల్ల కార్మికవాడల్లో నిరుపేదలకు పంపిణీ చేశారు. 300 మంది పిల్లలకు డ్రెస్లు, మరో 120 మంది మహిళలకు చీరలు అందించారు. బట్టలు పాతవే కావచ్చు. కానీ ఎంతోమందికి అవి కొత్తబట్టలయ్యాయి. అలా ఒక చిన్న ఐడియాతో పేదలకు బట్టలు అందించింది ధరణి సంస్థ. రైస్ బకెట్ పేరుతో సిరిసిల్ల పట్టణంలోని భావనారుషి నగర్లోని ఇళ్ల నుంచి బియ్యం సేకరించారు. పది కిలోల చొప్పున 50 కుటుంబాలకు బియ్యం అందించి పేదల ఆకలి తీర్చారు. ఇలా అట్టడుగున ఉన్న నిరుపేదలకు ఉచితంగా సేవలు అందిస్తూ.. ధరణి సంస్థ ముందుకు సాగుతోంది. 15ఏళ్లుగా సిరిసిల్లలో ధరణి సంస్థ మానవీయ కోణంలో సాయం అందింది. భోజనం మిగులు.. లేదు దిగులు... ఊరిలో ఏ ఫంక్షన్లో ఆహారం మిగిలినా ‘ధరణి’ సంస్థకు ఫోన్ వస్తుంది. సమాచారం అందగానే పరుగున వెళ్లి ప్రత్యేక పాత్రల్లో సేకరించడం.. ఆటోలో తీసుకెళ్లి కార్మికవాడల్లోని పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. శుభకార్యాల్లో మిగిలిన ఆ అన్నం, ఆ కూరలను తీసుకెళ్లి కార్మికవాడల్లో పంపిణీ చేయడం పెద్ద శ్రమతో కూడిన పని అయినా నాలుగేళ్లుగా 30 వేల మందికి విందుభోజనాలు అందించిన ఘనత ధరణి సంస్థది. ఇటీవల విందుభోజనాన్ని అడవుల్లో ఆకలితో అలమటించే వన్యప్రాణులకు సైతం అందించారు. గంభీరావుపేట మండలం గోరింటాల అడవుల్లో కోతులకు ఆహారాన్ని అందించడం విశేషం. ఆర్డీవో భిక్షానాయక్ ప్రేరణ... 2015లో సిరిసిల్ల ఆర్డీవోగా పని చేసిన భిక్షానాయక్ ఆలోచనకు ధరణి సంస్థ ఆచరణ రూపమిచ్చింది. సిరిసిల్లలోని ఫంక్షన్ హాల్స్లో ధరణి సంస్థ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఏ ఫంక్షన్లో ఆహారం మిగిలినా అది పేదల కడుపు నింపేందుకు ఈ సంస్థ శ్రమిస్తుంది. అయిన వారి ఆదరణకు దూరమైన వృద్ధులకు దుస్తులు అందిస్తూ.. స్వీట్లు పంపిణీ చేస్తూ.. ఆసరాగా ఉంటుంది ధరణి సంస్థ. మహిళా దినోత్సవం, హరితహారం, ఎయిడ్స్ బాధిత పిల్లలకు సాయం చేయడంలోనూ ముందుంది. ఓ మహిళ నాయకత్వంలో ధరణి సంస్థ పేదల సేవలో ముందుకెళ్లడం విశేషం. సిరిసిల్లలో అంగన్వాడీ టీచర్గా పనిచేసే వింధ్యారాణి ధరణి సంస్థ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2018 జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అప్పటి రాష్ట్రమంత్రి కేటీఆర్, అప్పటి జిల్లాకలెక్టర్ కృష్ణభాస్కర్ చేతుల మీదుగా రూ.51,000 నగదు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వింధ్యారాణిని అభినందించారు. నగదు పురస్కారంగా వచ్చిన ఆ మొత్తంతో ఆటోను కొనుగోలు చేసి ధరణి సంస్థ సేవలను విస్తరించేందుకు వినియోగించడం విశేషం. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో నిరుపేదల సేవలో ముందుకు సాగుతున్న ‘ధరణి’ సంస్థ మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని ఆశిద్దాం. – వూరడి మల్లికార్జున్, సాక్షి, సిరిసిల్ల పేదల కళ్లలో ఆనందం చూస్తున్న.. మా సంస్థ అందిస్తున్న సేవలు చిన్నవే అయినా.. పేదల కళ్లలో ఆనందం చూస్తున్న. అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాం. ధరణి సంస్థ నిర్వహణలో నా భర్త జయసింహారెడ్డి సహకరిస్తున్నారు. సంస్థలోని ఇతర సభ్యులు సమయం కేటాయిస్తున్నారు. దీంతో బాగా పని చేయగలుగుతున్నాం. – కె. వింధ్యారాణి, సంస్థ అధ్యక్షురాలు -
దిగిపోయే ముందు దిక్కులేకే కొత్త పథకాలు
సిరిసిల్ల: రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం తీసుకొస్తే ప్రధాని మోదీ, పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు కాపీ కొట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు. దిగిపోయే ముందు దిక్కులేక రైతులకు మేలు చేసినట్లు నటిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరి సంతోషంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సంక్షోభంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని, ప్రాంతీయ పార్టీలపైనే ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్, మాయావతి, ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఇలా దేశమంతా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోందని తెలిపారు. మనం గెలిస్తేనే మన గడ్డకు లాభం... రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటే ఢిల్లీని శాసించి నిధులు సాధిస్తామని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కేసీఆర్ ఇప్పుడు దేశంలో నంబర్ వన్ సీఎంగా ఉన్నారన్నారు. ఢిల్లీకి గులాంగిరి చేయకుండా గులాబీ జెండాతో మన గల్లీ సత్తాను ఢిల్లీలో చాటిచెప్పాలన్నారు. కేసీఆర్ మొనగాడని.. రెండు ఎంపీ సీట్లతో తెలంగాణ సాధించిన ఆయన 16 మంది ఎంపీలతో ఏం చేస్తాడో ఎన్నికల తరువాత తెలుస్తుందన్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ అన్నీ కలిసొస్తే కేంద్ర మంత్రిగా సేవలందిస్తారన్నారు. సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చేందుకు ఓట్ల సద్ది కట్టాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సిరిసిల్ల నేతన్నలకు మరింత మేలు జరిగేలా రైల్వేలైన్ లాంటి పనులు పరుగులు తీస్తాయన్నారు. తెలంగాణ బీడు భూములకు నీళ్లు వస్తాయన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు... గత ఐదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఎంతో ప్రయత్నించామని, కానీ దీనిపై ఎన్నిసార్లు ప్రధానిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం చేపట్టిన పోలవరానికి జాతీయ హోదా రావడంతో రూ. 50 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి తెచ్చుకొని ప్రాజెక్టు కట్టుకుంటున్నారన్నారు. 16 ఎంపీ సీట్లలో గెలిపిస్తే కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పుతారన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసే సత్తా ఉన్న నాయకుడు కేసీఆరే అన్నారు. రాష్ట్రంలో మే నుంచి ఆసరా పింఛన్ను రూ. 2 వేలు ఇస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తాయని, ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎవరు ఎగరేయాలో నిర్ణయించే ఎన్నికలు ఇవని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికలను ప్రజలు ఆషామాషీగా తీసుకోకుండా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. సిరిసిల్ల ప్రాంతం నుంచి లక్ష మెజారిటీ ఇవ్వాలని, వినోద్ కుమార్ కంటే మంచి వ్యక్తి మనకు దొరకడని కేటీఆర్ అన్నారు. రూ. 1,250 కోట్లతో నేతన్నలను ఆదుకుంటున్నాం: మంత్రి ఈటల సిరిసిల్ల ప్రజల బాధలు పోవాలని, కష్టాలు తీరాలని కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా రూ. 50 లక్షలు చందాలు సేకరించి ఇచ్చారని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు కేవలం రూ. 70 కోట్లు ఉన్న చేనేత బడ్జెట్ ఇప్పుడు రూ. 1,250 కోట్లతో సిరిసిల్ల నేతన్నలను ఆదుకుంటున్నామన్నారు. అన్ని కులాలకు భరోసానిస్తూ బ్యాంకు రుణం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఈటెల చెప్పారు. సంకీర్ణ యుగంలో దేశ రాజకీయాలను టీఆర్ఎస్ ప్రభావితం చేస్తుందని, కేసీఆర్ దేశానికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తారని ఈటల పేర్కొన్నారు. పెద్ద మనసుతో దీవించండి: వినోద్ కుమార్ సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్ కోసం ఎంతో కష్టపడ్డా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాకు జాతీయ రహదారులను సాధించేందుకు కృషి చేశానని, సిరిసిల్లకు నవోదయ విద్యాలయం మంజూరైందన్నారు. సిరిసిల్ల ప్రజలు పెద్ద మనసుతో తనను దీవించాలని కోరారు. బహిరంగ సభలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ నాయకులు బసవరాజు సారయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావనితోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈద శంకర్రెడ్డి, ఆరేపల్లి మోహన్, ఆకునూరి శంకరయ్య, గగులోతు రేణ, దోర్నాల లక్ష్మారెడ్డి, దార్నం లక్ష్మీనారాయణ, గడ్డం నర్సయ్య, గూడూరి ప్రవీణ్, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, చిక్కాల రామారావు పాల్గొన్నారు. -
కారును చూసి.. మురిసిన సారు
సాక్షి, సిరిసిల్ల: పట్టణ శివారులోని సర్ధాపూర్లో ఓ కారును చూసి కరీంనగర్ పార్లమెం ట్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వినోద్కుమార్ మురిసిపోయారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్రావు తన సొంత పాతకారు గులాబీ రంగు వేసి రోడ్డు పక్కన గద్దె నిర్మించి ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కారుగుర్తు ఓటర్ల మదిలో ఉండిపోయేలా శ్రీనివాస్రావు ఏకంగా కారును అందరికీ కనిపించేలా ఏర్పాటుచేశారు. ఎంపీ వినోద్కుమార్ ఎల్లారెడ్డిపేట వైపు వెళ్తూ రోడ్డుపక్కనే ఉన్న కారును చూసి ఆగి సందర్శించారు. ఎన్నికల్లో అందరికీ కారుగుర్తు గుర్తుండిపోయేలా సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారి పక్కనే కారును ఏర్పాటుచేయడాన్ని వినోద్కుమార్ అభినందించారు. ఆయన వెంట టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
మార్టిగేజ్ ల్యాండ్ మాయం?
సాక్షి, సిరిసిల్లటౌన్:మున్సిపల్ ఆస్తులకు రక్షణ కరువైంది. కొందరు మధ్యవర్థుల అడ్డగోలు వ్యవహారం.. అధికారుల గుడ్డినమ్మకం ఇందుకు కారణమైంది. రూ.25 లక్షల విలువ చేసే మార్టిగేట్ స్థలం వివాదంలో చిక్కింది. టౌన్ ప్లానింగ్ వైఫల్యంతో.. మున్సిపల్కు చెందిన ఆస్తుల రక్షణలో టౌన్ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలకు ఈసంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. సాయినగర్లో 729/ఏ, 729/బి తదితర సర్వే నంబర్లలో 2000, 2001 ప్రాంతంలో పలువురు తమ స్థలాలను ప్లాట్లుగా మార్చుతూ అనుమతులు పొందారు. ఈప్రాంతం అభివృద్ధి కోసం మున్సిపల్కు 31 గుంటలు కేటాయించినట్లు సమాచారం. మున్సిపల్ స్థలాలకు రక్షించే చర్యలో భాగంగా సదరు సర్వే నంబర్లలోని లేఅవుట్ భూమి 31 గుంటలు ఉండగా మున్సిపల్ కేవలం 16 గుంటలకే ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం నర్సరీ నిర్వహిస్తున్నారు. ఇదే స్థలాన్ని ఆనుకుని మిగతా 15 గుంటలకు ప్రహరీ నిర్మించకపోవడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నలోటు.. పెద్దతప్పు.. సాయినగర్ ప్రాంతంలోని రెండు వేర్వేరు వెంచర్ల ద్వారా మున్సిపల్కు 31 గుంటల స్థలం సంక్రమించింది. ఇందులో ఒక వెంచర్ను ముగ్గురి తరఫున ప్లాట్ నంబరు 21 పేరుతో మున్సిపల్ ఫీజు కింద కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేశారు. ప్లాటింగ్ అనుమతిలో డీటీసీపీ నుంచి అనుమతి వచ్చినపుడు సదరు ప్లాటు నంబరు 25గా మారిం ది. హద్దులు మాత్రం వెనకాల మున్సిపల్ నర్సరీ, ముందు భాగంలో రోడ్డు వంటివి ప్లాన్లో నిర్ధారణ చేసినట్లు మిగతా ఇద్దరు బాధితులు తెలిపారు. అయినా మూడోవ్యక్తి కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేసిన స్థలాన్ని విక్రయించడం..ఇటీవలే ఆ ప్లాటులో టౌన్ప్లానింగ్ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి రావడం వివాదానికి తెరలేపింది. అడ్డదారులు పట్టిస్తున్న గుడ్డినమ్మకం.. మధ్యవర్థులపై అధికారులకు ఉన్న గుడ్డినమ్మకం అడ్డదారులకు తావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఇంటి నిర్మాణ అనుమతి మంజూరులో స్థానిక మున్సిపల్ ప్లానర్స్తోపాటు మరికొందరు మధ్యవర్థిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. ఈవిషయంలో ఓ ప్లానర్ అ«ధికారులు, ప్లాటు విక్రయదారులకు మధ్యవర్థిత్వం నెరిపి విచారణ లేకుండా ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయించినట్లు చర్చసాగుతోంది. సాయినగర్లోని మున్సిపల్ మార్టిగేజ్ ల్యాండ్ను ఇతరులకు అమ్మిన వ్యక్తి ప్రముఖుడు కావడంతో ఎలాంటి వి చారణ లేకుండానే ఇంటిపర్మిషన్ ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ప్రస్తుతం సదరు మార్టిగేజ్ ల్యాండ్ విడుదల కోసం ఇద్దరు బాధితులు దరఖాస్తు చేసుకుని న్యాయం కావాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం మార్టిగేజ్ ల్యాండ్ విక్రయంపై మాకు ఫిర్యాదు రాలేదు. ఈవిషయంలో విచారణ చేపట్టి చర్యలు చేపడతాం. మున్సిపల్కు సంబం««ధించిన స్థలాలను ఆక్రమించినా..దుర్వినియోగం చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
సిరిసిల్లను మరో తిరుపూర్ చేస్తా
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్లను మరో తిరుపూర్గా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం పద్మశాలీల ఆరాధ్య దైవం మార్కండేయ జయంతి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లకు కన్నతల్లిలాగే రుణపడి ఉంటానని చెప్పారు. ఏటా రూ.36 వేల కోట్ల వస్త్రోత్పత్తి చేస్తున్న తమిళనాడులోని తిరుపూర్ స్థాయికి సిరిసిల్లను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే అపరెల్ పార్కును ప్రారంభిస్తామని, 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు, ఆర్వీఎం ఆర్డర్లతో కొంతవరకు నేతన్నలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. చేసింది కొంతేనని, చేయాల్సింది ఇంకెంతో ఉందన్నారు. నేతన్నల నైపుణ్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వస్త్రపరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు రూ.4.30 కోట్లతో ఎనిమిది అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పేదలకు రూ.5 భోజనం అందించే అన్నపూర్ణ, వైకుంఠధామం, ఇందిరాపార్క్, ఏకలవ్య కమ్యూనిటీ భవనం, ఓపెన్ జిమ్, తడి, పొడి చెత్తను సేకరించేందుకు బ్యాటరీతో నడిచే వాహనాలు, స్త్రీనిధి మహిళలకు ట్యాబ్లు, బతుకమ్మ ఘాట్ వద్ద మ్యూజికల్ ఫౌంటేన్ను ప్రారంభించారు. -
వివాహేతర సంబంధం: మహిళపై మరో మహిళ దాడి
సిరిసిల్ల : తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఓ మహిళను మరో మహిళ చితకబాదింది. ఈ సంఘటన సిరిసిల్లా జిల్లాలోని రుద్రంగిలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దరావతు రాజుకు అదే ప్రాంతానికి చెందిన పుర్భన్ వివాహమైంది. అయితే కొంతకాలం కిందట కలికోట గ్రామానికి చెందిన మరో మహిళతో రాజుకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలియడంతో తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయవ్వపై పుర్బన్ ఆమె కుమారుడు దాడికి దిగారు. కిందపడేశి కొట్టి, నడిరోడ్డుపై మెడకు తాడుతో ఉరి వేసే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకుని వారిని పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డ కలికోటకు చెందిన సాయవ్వను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వివాహేతర సంబంధం : మహిళపై మరో మహిళ దాడి
-
కాంగ్రెస్ పవర్ పోతేనే కరెంటొచ్చింది
సాక్షి, సిరిసిల్ల: కాంగ్రెస్ పవర్ కట్ అయితేనే తెలంగాణకు కరెంటు వచ్చిందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. నాటి చీకటి రోజులను గుర్తుకు తెచ్చుకుని.. ఆలోచించి ఓటెయ్యాలని ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభలో, గంభీరావుపేటలో రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గంటలు కూడా కరెంటు ఇవ్వలేదన్నారు. అప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అవుతోందని చెప్పారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణకు కరెంటు వచ్చిందని కాంగ్రెసోళ్లు నీతిలేని కూతలు కూస్తున్నారని, అదే నిజమైతే వాళ్లు అధికారంలో ఉన్న కర్నాటక, పంజాబ్ రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ది కుటుంబ పాలన అంటూ రాహుల్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ‘కాంగ్రెస్లో మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్గాంధీ దాకా అందరూ ఉంటే తప్పులేదు కానీ కేసీఆర్ కుటుంబం ఉండొద్దా? ఎన్టీఆర్ మనమలు, మనమరాళ్లు, చంద్రబాబు కొడుకు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి కావొచ్చు.. కానీ మేం రాజకీయాల్లో ఉండొద్దా?’అని ప్రశ్నించారు. ప్రజలు గెలిపిస్తేనే తాము రాజకీయాల్లో ఉన్నామని, పనిచేయకపోతే ఎందుకు గెలిపిస్తరని కేటీఆర్ ప్రశ్నించారు. సింహం సింగిల్గానే.. ‘ఒక్క సీఎం కేసీఆర్ను ఎదుర్కొనేందుకు అందరూ ఒక్కటవుతున్నరు. కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం, సీపీఐ ఒక్కటై ఐదారు కండువాలు కప్పుకొని వస్తున్నరు. వాళ్లను చూసిన జనం సంక్రాంతికి గదరా గంగిరెద్దులు వచ్చేది గిప్పుడెందుకు అని ముచ్చట్లు పెడున్నారు’ అని కె.తారకరామారావు ఎద్దేవా చేశా>రు. నలుగురైదురుగు కలసి ఒక్కటవుతున్నారంటే అది మన బలమా? కాదా? రాహుల్గాంధీ, చంద్రబాబు, మోదీ, మాయావతి ఇట్లా ఢిల్లీ, యూపీ, అమరావతి నుంచి వచ్చేవాళ్లు అందరూ టూరిస్టులే. ఎన్నికలప్పుడు వచ్చి పోయేవాళ్లే.. మిగిలేది పక్కా లోకల్ మనిషి కేసీఆర్ మాత్రమే’అని వ్యాఖ్యానించారు. సింహం సింగిల్గానే వస్తుందన్నారు. గుంపులుగా వచ్చేవారెవరో మీకే తెలుసని చెప్పారు. మోదీ చుట్టపు చూపోడే .. ‘తెలంగాణకు చుట్టపుచూపుగా వచ్చిన ప్రధాని నరేం ద్ర మోదీ.. తెలంగాణలో కరెంటు వస్తలేదు. కనబడుతలేదు అని నిజామాబాద్లో అన్నారు.. హెలికాప్టర్లో తిరిగితే కనబడదు. ముట్టుకొని చూడు నీకే కనబడుతది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పని బాగుంటే లక్ష మెజార్టీ ఇవ్వండి ‘కేసీఆర్ను గద్దె దించేదాక సిపాయి ఉత్తరకుమార్రెడ్డి గడ్డం తీసుకోడట. దాంతో మనకు పోయేదేముంది? గడ్డం పెంచేటోడు గబ్బర్సింగ్ అయితడా. కాంగ్రెసోళ్లు ఇంటి కిరాయి కడుతాం, బాసన్లు తోముతాం, డైపర్లు మార్చుతాం అంటూ వస్తున్నరు. వాళ్లు మామూలోళ్లు కాదు’అని కేటీఆర్ అన్నారు. బడిపిల్లలకు ఏడాదికోసారి పరీక్షలు వచ్చినట్లు, తమకు ఐదేళ్లకోసారి పరీక్ష వస్తుందని, ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఓటర్లను కోరారు. సొల్లు మాటలను నమ్మి ఆగం అయితే 50 ఏళ్లు వెనక్కి వెళతారని చెప్పారు. ‘కాంగ్రెస్కు 60 ఏళ్లు అధికారం ఇచ్చారు. నాలుగేళ్లు మాకు అవకాశం ఇచ్చారు. మా పనితీరు బాగుంటే లక్ష మెజార్టీతో గెలిపించండి. అభివృద్ధి చేయకపోతే డిపాజిట్ గల్లంతయ్యేలా తీర్పునివ్వండి’ అని కేటీఆర్ కోరారు. నాది లోకలే.. ‘సిరిసిల్లలో పోటీ చేయడానికి నేను లోకల్ కాదట.. సోనియా ఈదేశానికి లోకలా? ఆమెను నెత్తిమీద పెట్టుకుని ఊరేగించాలా?’ అని కేటీఆర్ అన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాక కూడా అవే మాటలా అని ప్రశ్నించారు. తన తాతది ముస్తాబాద్ మండలం మోహినికుంట అని, నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు భూములు కోల్పోయిన నిర్వాసితులమేనని కేటీఆర్ అన్నారు. నాన్లోకల్ అని మాట్లాడుతున్న వాళ్లు బతుకుదెరువు కోసం ఎలా హైదరాబాద్లో ఉంటున్నారో.. తాము కూడా హైదరాబాద్ వెళ్లామన్నారు. కూటమిని బొందపెట్టండి కాంగ్రెస్ సొల్లు కబుర్లు నమ్మొద్దు సీల్డ్ కవర్ సీఎంలు మనకొద్దు మోమిన్పేట రోడ్ షోలో కేటీఆర్ మోమిన్పేట: తెలంగాణ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ భుజాలపై మోస్తోందని, కూటమి పేరుతో ఓట్లడుగుతున్న ఆ పార్టీలను బొంద పెట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో శుక్రవారం రాత్రి రోడ్షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనని శపథం చేసిన ఉత్తమ్కుమార్రెడ్డి మాటలు నమ్మొద్దన్నారు. గడ్డం పెంచుకున్న ప్రతిఒక్కరూ గబ్బర్సింగ్ కాలేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్సోళ్ల సొల్లు మాటలకు జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు 30 లేఖలు రాశారు వికారాబాద్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకువస్తే..దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారన్నారు. ఎవరాపినా జిల్లాకు సాగునీరు తెచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఉత్తరాలు రాసి నీళ్లను అడ్డుకున్న బాబును ఆయనతో జతకట్టిన కాంగ్రెస్ను ఓటు ద్వారా తరిమికొట్టాలని సూచించారు. రాష్ట్రంలో నేడు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంటే.. ప్రధాని నరేంద్రమోదీ కరెంటు లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా..ఎప్పుడైనా విద్యుత్ తీగలను పట్టుకొని చూడాలని..అప్పుడే సరఫరా ఉందా లేదా అనేది తెలుస్తుందని చెప్పారు. ఒక్క కేసీఆర్ను ఎదిరించడానికి దేశంలోని పహిల్వాన్లందరూ వస్తున్నారని, ఎంతమంది వచ్చినా..అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. సీల్డు కవర్ సీఎంలు మనకొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న వారు చేతులు ఎత్తాలని కేటీఆర్ పేర్కొనగా.. అక్కడున్న వారంతా చేతులు ఎత్తారు. మొండి చేతులు కాదు పిడికిలి బిగించి చెప్పాలని..ఇప్పటికే మొండి చేతులతో మోసపోయామని చమత్కరిస్తూ ప్రజలను ఉత్తేజపరిచారు. మోమిన్పేట రోడ్షోలో మాట్లాడుతున్న కేటీఆర్ -
వీహెచ్కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రచార రథం చక్రాలు ఊడిపోయాయి. నేరెల్ల మూలమలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రచార రథంలో ఉన్న హనుమంతరావుకు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. -
చంద్రబాబు వస్తే ఇంట్లో ఉడుం జొచ్చినట్టే!
సాక్షి, సిరిసిల్ల: చంద్రబాబు వచ్చిండంటే ఇంట్లో ఉడుం జొచ్చినట్లేనని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో కరువు కాటకాలు, ఎన్కౌంటర్లు, ఆకలి చావులు, ఆత్మహత్యలు తప్ప ఏం ఉన్నాయని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం మల్యాలలో గురువారం టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ అర్ధరాత్రి కరెంటే వస్తుందన్నారు. తాము వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామంటే అది ఉత్తదే అని విమర్శించారని, కానీ సీఎం కేసీఆర్ అమలు చేసి చూపించారని గుర్తు చేశారు. నాలుగేళ్లలో చేసింది మేం చెబుతాం.. మీకు దమ్ముంటే మీ పాలనలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు రాసిన ఉత్తరాలు ఉపసంహరించుకొమ్మని అడిగే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ల కోసం, అటువంటి నీళ్లను అడ్డుకున్న చంద్రబాబుతో జత కట్టిన కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని ఆయన కోరారు. కూటమి గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, యాదా ద్రి పవర్ ప్లాంటు రద్దు అంటున్న కాంగ్రెస్ను జనం మాకొద్దంటున్నారని చెప్పారు. కూటమి నాయకులంతా కలసి కౌరవుల్లా వంద మంది వచ్చినా టీఆర్ఎస్ సింగిల్గానే గెలుస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు పంపే నోట్ల కట్టల కోసమే కాంగ్రెస్.. టీడీపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. బతుకమ్మ చీరల పంపిణీ అడ్డుకున్నది కాంగ్రెసోళ్లేన న్నారు. రైతుబంధు పథకం అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని కితాబిచ్చారు. కొబ్బరికాయలు మనకు, నీళ్లు ఆంధ్రకు.. గత ప్రభుత్వాలు రైతులకు కన్నీళ్లు తప్ప ఏం మిగల్చలేదని హరీశ్రావు విమర్శించారు. వారికి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదన్నారు. కొబ్బరికాయలు మనకు, నీళ్లేమో ఆంధ్రకు తరలించుకుపోయారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టు అనే పేరు కాంగ్రెస్తోనే వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటేస్తే అది ఢిల్లీ, అమరావతిలకు పోతుంది.. టీజేఎస్కు వేస్తే ఎటూ కాకుండా పోతుందన్నారు. టీఆర్ఎస్కు వేస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్కు అండగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు. రాజకీయాల్లో సానుభూతి ఉండదని, పనితీరే ప్రామాణికమని ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మండలానికి రూ.లక్ష వస్తే గొప్ప అని, తమ ప్రభుత్వ పాలనలో ఒక్కో గ్రామానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల నిధులు వచ్చాయని వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్బాబు అన్నారు. -
కేటీఆర్ వ్యాఖ్యలపై వివరణ కోరిన ఈసీ
సాక్షి, హైదరాబాద్ : సిరిసిల్లలో ఇటీవల జరిగిన ఓ సభలో ఆర్ఎంపీలు, పీఎంపీలకు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వరాలపై ఎన్నికల కమీషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల సభలో కేటీఆర్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం లేఖ రాసింది. సిరిసిల్లలో జరిగిన సభలో ఆర్ఎంపీలు, పీఎంపీలు ఫుల్గా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రస్తుతం ఉన్న జీఓను సవరిస్తామని వారికి తెలంగాణ సర్కారు పూర్తి సహకారం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. కేటీఆర్, హరీశ్ రావు, పలువురు టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, ఏఐసీసీ నేత మధుయాష్కీ, నిరంజన్లు రజత్ కుమార్ను కోరారు. -
‘కలిసి కూర్చుని సీట్లు పంచుకునే తెలివిలేదు’
సాక్షి, సిరిసిల్ల : ‘శాసనసభ రద్దయి రెండు నెలలైంది. వీళ్ల ముఖాలకు కలిసి కూర్చుని సీట్లు పంచుకునే తెలివిలేదు. కలసి ప్రభుత్వాన్ని నడుపుతారా? గూట్లో రాయి తీయనోళ్లు.. ఏట్లో రాయి తీస్తరట’అని మహాకూటమిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శనివారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కూటమి సీట్లు పంచుకునేలోపే మనం స్వీట్లు పంచుకుంటామని చెప్పారు. ‘రాహుల్ సీట్లిస్తే, చంద్రబాబు నోట్లు ఇస్తున్నడు..రాహుల్ సీట్లకు, చంద్రబాబు ఓట్లకు తెలంగాణ ప్రజలు ఓట్లతో బుద్ధిచెప్పాలె’అని పిలుపునిచ్చారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలని సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే.. ప్రాజెక్టులను అడ్డుకోడానికి ఉత్తరాలు రాసిన చంద్రబాబుతో జతకట్టిన మాయాకూటమిని నమ్మి మోసపో వద్దని చెప్పారు. చంద్రబాబుకు జుట్టు చేతికిస్తే తెలంగాణ ప్రాజెక్టులను కట్టనిస్తాడా? అని ప్రశ్నించారు. పాపం కోదండరాం సార్ను ఇరికిచ్చిండ్రు ‘కోదండరాం సార్ అమాయకుడు. ఆయన్ను పట్టుకు ని కాంగ్రెసోళ్ల చేతిలో కూర్చోబెట్టిన్రు. పాపం సారును ఇరికిచ్చిండ్రు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ది మామూలు హస్తం కాదని, భస్మాసుర హస్తమని పేర్కొన్నారు. ఎవరు పట్టుకుంటే వాళ్లు భస్మం అయితరు.. పాపం కోదండరాం సార్ ఆ చెయ్యి పట్టిండు..ఆయన పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. గతంలో తాను సోనియాను అ మ్మా బొమ్మా అంటే ఐదు ఫీట్లు ఉన్నోడు కూడా ఆరు ఫీట్లు ఎగిరిండ్రు.. చంద్రబాబు మీ సోనియమ్మ ను ఎన్ని తిట్లు తిట్టిండు.. సోనియా ఈ దేశం పాలిట దెయ్యం.. అవినీతి అనకొండ.. కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన శని..ఇటాలియన్ మాఫియా.. అంటూ తిట్టిన చంద్రబాబుతో సిగ్గులేకుండా కలసి తిరుగుతారా? అని దుయ్యబట్టారు. కూటమికి అధికారమిస్తే రైతు ల నోట్లో మట్టికొడతారని కేటీఆర్ హెచ్చరించారు. రైతును రాజుగా చేయడమే తమ ధ్యేయమని కేటీఆర్ తెలిపారు. గతంలో అర్ధరాత్రుల్లో కరెంటు కోసం కావలి కాసే పరిస్థితి ఉండేదని, విత్తనాలు, ఎరువు లు, పురుగు మందుల కోసం రైతులు బారులు తీరే వారని గుర్తు చేశారు. అలాంటి స్థితి నుంచి సీఎం కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసేందు కు కృషి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం మరో 4 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి కాబోతోందని తెలిపారు. రైతుల దగ్గరికి వెళ్లాలంటేనే భయమేసేది: పోచారం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి కృతజ్ఙతతో పెట్టుకున్న మొట్టమొదటి రైతు ఆశీర్వాదసభ ఇదేనని చెప్పారు. ‘నేను టీడీపీలో మంత్రిగా పనిచేసిన.. అప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే భయమేసేది.. ఇప్పుడు తలెత్తుకుని మాట్లాడుకుంటున్నం. వందకుపైగా సీట్లలో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్ కూడా రాకుండా చేయాలి’అని ఆయన కోరారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
‘రాహుల్ సీట్లు.. చంద్రబాబు నోట్లు’
సాక్షి, సిరిసిల్ల : కరెంట్ అడిగితే తెలంగాణ రైతులను కాల్చి చంపిన చంద్రబాబు నాయుడుకి ఓట్లు ఎందుకు వెయ్యాలని ఆపధర్మ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్కటై మీ వేలితోనే మీ కళ్ళు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో శనివారం జరిగిన రైతు కృతజ్ఞత సభలో కేటీఆర్, పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న కేసీఆర్కు ఓటు వేస్తారో.. రైతులను చంపిన చంద్రబాబుకు ఓటు వేస్తారో ఒక్కసారి ఆలోచించండని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రాహుల్ గాంధీ సీట్లు, చంద్రబాబు నోట్లు ఇస్తున్నారని వారికి సరైన బుద్ది చెప్పాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వాల హయాంలో ఎరువులను పోలీస్ స్టేషన్కు పోయి తీసుకునే పరిస్థితి ఉందేది. దయలేని ప్రభుత్వంలో రైతుల్ని గంజిలో ఈగలా చూసేవారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతుల స్థితిని మార్చలేక పోయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెనుకబడిని 80 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేశాం. దాని కోసం కాళేశ్వరం నిర్మాణం చేపట్టాం. కేసీఆర్ రైతులకు చేసిన విధంగా 16 మంది ప్రధాన మంత్రులు కూడా చేయలేకపోయ్యారు. జిల్లాలోని మానేరు డ్యాంను నింపితే సిరిసిల్ల కోనసీమగా మారుతుంది. గోదావరి నీళ్లు తెచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ప్రాజెక్టులను ఆపడానికి చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారు. -
రైతులను చంపిన బాబుకు ఓట్లు ఎందుకు వెయ్యాలి
-
స్వతంత్ర వీరులు
సిరిసిల్ల: జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి కరింనగర్ జిల్లాది ప్రత్యేక స్థానం. దేశం యావత్తు గర్వించదగిన నేతలను కరీంనగర్ జిల్లా అందించింది. 1952 నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా, ఇపుడు మరోసారి 2018 ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ప్రధాన పార్టీల పక్షాన టికెట్లు ఆశించి భంగ పడిన నేతలు... టక్కెట్ రాని అభ్యర్థులు రెబల్గా పోటీ చేయడం పరిపాటి. ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించడమూ విశేషం.ప్రజాక్షేత్రంలో జనబలంతో అత్యధిక ఓట్లు సాధించిన వారూ ఉన్నారు. రాజకీయంగా చైతన్యమున్న ఉమ్మడి కరీంగర్ జిల్లా లో 66 ఏళ్లలో 18 మంది స్వతంత్ర అభ్వర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తిరుగుబాటు..గెలుపు బాట.. ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఆశించే నేతలు చివరకి టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు ప్రకటించి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ప్రస్తుత తరుణంలో ఎన్నికలు ఎంతో ఖరీదయ్యాయి. కానీ పార్టీల టికెట్తో సంబంధం లేకుండా అనేక మంది స్యతంత్రులుగా విజయకేతంఎగురవేశారు. రెబల్గా పోటీ చేసిన సందర్బాల్లో ఆ పార్టీ నుంచి అభ్యర్థులను సస్పెండ్ చేయడం పరిపాటి. పోటీ చేసిన వారు విజయం సాధించిన వారు తర్వాత ఏదో ఒక పార్టీ పంచన చేరడం సహజం. తిరుగుబాటు అభ్యర్థులు విజేతలు అయిన సందర్బాల్లోనూ ఆయా పార్టీలు మళ్లీ పార్టీలోకి తిసుకున్నాయి. సత్తా చాటిన స్వతంత్రులు.. 1952లో మేడారం నుంచి ఎం. రాంగోపాల్రరెడ్డి, మేట్పల్లి నుంచి గంగుల భూమయ్య ఇండిపెండెంట్లుగా విజయం సాధించారు. 1957లో హుజూరాబాద్ నుంచి పి. నర్సింగరావు, జి.రాములు, బుగ్గారం నుంచి మోహన్రెడ్డి గెలుపొందారు. 1962లో కమలాపూర్ నుంచి కేవి నారాయణరెడ్డి, జగిత్యాల నుంచి ఎం. ధర్మారావు. విజయం సాధించారు. 1967లో జగిత్యాల నుంచి కాసుగంటి లక్ష్మీనర్సింహవు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదే ఏడాది నేరేళ్ల నుంచి గొట్టె భూపతి, 1972లో రెండోసారి గొట్టె భూపతి ఇండిపెండెంట్గానే గెలిచారు. 1972లో మేట్పల్లి నుంచి సీహెచ్ ఎ. నారాయణరెడ్డి, కమలాపూర్ నుంచి పి.జనార్థన్రెడ్డి, పెద్దపల్లి నుంచి మల్లారెడ్డి ఎన్నికయ్యారు 1989లో కరీంనగర్ నుంచి వి.జగపతిరావు, హుజూరాబాద్ నుంచి కేతిరి సాయిరెడ్డి. బుగ్గారం నుంచి జె.రత్నాకర్రావు ఇండిపెండెంట్గా విజయ కేతనం ఎగురవేశారు. 1989లో సిరిసిల్లలో ఇండిపెండెంట్ ఆభ్యర్థిగా బరిలో దిగిన నెల్లూరుకు చెందిన ఎన్వీ కృష్ణయ్య విజయం సాధించారు. ఆయనకు జనశక్తి నక్సలైట్లు అండగా ఉన్నారు. జనశక్తి బ్యానర్పై పోటీచేసే అవకాశం లేకపోవడంతో జనశక్తి బలపరిచిన వ్యక్తిగా ఎన్.వి.కృష్ణయ్య సిరిసిల్లలో గెలిచారు. 1994లో టీడీపీ టికెట్ రాకపోవడంతో మేడారం నుంచి ఇండిపెండెంట్గా బరిలొ దిగిన మాలంమల్లేశం ఎన్నికయ్యి విజయం సాధించారు.2009లో రామగుండం నిమోజకవర్గం ఏర్పడిన తరువాత సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.తరువాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరి 2014 తరువాత కేబినేట్లో చోటు సంపాందించారు. ఉమ్మడి జిల్లాలో స్వతంత్రలుగా సత్తా చాటినవారు ఏదో పార్టీలో చేరి తరువాత రాజకీయాల్లో రాణించారు.1952 ఎన్నికల్లో తొలిసారిగా మేడారం నియోజకవర్గంలో ఎం. రాంగోపాల్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించగా.. చివరిసారిగా 2009లో రామగుండం నియోజకవర్గంలో సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్గా విజయం సాధించడం విశేషం. 1994 తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో ఇక ఇండిపెండెంట్లు ఎవరూ ఎన్నికల్లో విజయం సాధించలేదు. 1967,1972లోనూ రెండు సార్లు గొట్టె భూపతి నేరేళ్లలో ఇండిపెండెంట్గా విజయం సాధించడం విశేషం. ఉమ్మడి కరీంనర్ జిల్లా చరిత్రలో రెండు సార్లు స్వతంత్రుడిగా విజయం సాధించిన వ్వక్తి గొట్టె భూపతి ఒక్కరే ఉన్నారు. బుగ్గారం నియోజకవర్గంలో మూడు పర్వాయాలు స్వతంత్ర అభ్యర్థులు గేలిచారు. జిల్లాలో 18మంది స్వతంత్రులు ఎమ్మేల్యే ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. మంథని: 1983లో జరిగిన ఆసెంబ్లి ఎన్నికల ప్రచారంలో మంథని జూనియర్ కళాశాల మైదానంలో సంజయ్ విచార్ మంచ్ అభ్యర్ధి చందుపట్ల రాజిరెడ్డి మద్దతుగా టీడీపీ వ్వవస్తాపకుడు నందమూరి తారకరామారావు ప్రచారం నిర్వహించారు. వేదికపై విచార్మంచ్ జాతీయ పార్టీ అధ్యక్షురాలు మేనక గాంధీ, అభ్యర్థి చందుపట్ల రాజిరెడ్డి,దిగవంత మాజీ ఎమ్మెల్యే గీట్ల జనార్థన్ రెడ్డి ఉన్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులే
సాక్షి, సిరిసిల్ల: కరెంటు అడిగితే కాల్చివేసిన పార్టీలకు అధికారం అప్పగిస్తే తెలంగాణకు మళ్లీ చీకటి రోజులే దిక్కవుతాయని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం డలం సముద్రలింగాపూర్, దమ్మన్నపేట గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పార్టీలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించేందుకే ఒక్కటయ్యా యని పేర్కొన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలనుకున్నందుకు కేసీఆర్ను ఓడించాలా? అని ఆయన ప్రశ్నించారు. మాయ కూటమికి ఓటేస్తే మన వేలితో మన కన్నునే పొడుచుకున్నట్లవుతుందని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యానని, సీఎం ఆశీర్వాదంతో మంత్రినయ్యానని మళ్లీ గెలిపిస్తే ఇం తకు నాలుగింతలు అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ‘ఇవి నా ఎమ్మెల్యే ఎన్నికలు మాత్రమే కాదు.. మీ తలరాతను మార్చుకునే ఎన్నికలు.. ఆలోచనతో ఓటెయ్యండి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో ఎవరైనా చనిపోతే దహన సం స్కారాల కోసం ఒక అరగంట పాటు కరెంటు ఇవ్వాలని ప్రాథేయపడేవారని, ఇప్పుడు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. మళ్లీ ఆశీర్వదిస్తే ఇప్పుడున్న పింఛన్లు పెంచడంతోపాటు మరోసారి రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. పేదలకు మేలు చేస్తున్న కేసీఆర్ను మనమందరం కాపాడుకోవాలన్నారు. దీనికంతటికీ కారణం కాంగ్రెసోళ్లే.. నేతన్నలకు ఉపాధితోపాటు మహిళలకు పండగ చీర లు అందే రెండు ఉపయోగాలున్న బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకున్నది కాంగ్రెస్సే అని కేటీఆర్ విమ ర్శించారు. ‘గతంలోనే చేపట్టిన రైతుబంధు చెక్కులు పంపకుండా కాంగ్రెస్ అడ్డుపడింది.. ఇప్పుడు నేరుగా పెట్టుబడి సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చింది.. బ్యాంకర్లు ఆ సొమ్మును లోన్ కింద కట్ చేసుకుంటున్నరు. దీనికంతటికీ కారణం కాంగ్రెస్, టీడీపీలే.. మంచి చేసే ఆలోచన లేని ఆ పార్టీలకు బుద్ధి చెప్పండి’ అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. -
‘వారికి డిపాజిట్ దక్కకుండా తరిమి కొట్టాలి’
సాక్షి, రాజన్న సిరిసిల్ల : ‘జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు ఉంది కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి’ అంటూ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ వాళ్లు మాత్రం చనిపోయిన వాళ్ల వేలి ముద్రలు వేసి కోర్టుకు వెళ్లారని విమర్శించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఇసుక ద్వారా రాష్ట్రానికి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరిస్తే.. కాంగ్రెస్ హయాంలో 40 కోట్ల ఆదాయం కూడా రాలేదని విమర్శించారు. మూడేళ్ల కాలంలో సిరిసిల్ల రూపురేఖలు మార్చామని, ఎవరూ ఊహించని విధంగా జిల్లాను అభివృద్ధి చేశామన్నారు. తాను చెప్పినవి అబద్ధమైతే వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాలన్న కేటీఆర్.. నిజమని నమ్మితే కాంగ్రెస్కు డిపాజిట్ కూడా దక్కకుండా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. మీ రుణం తీర్చుకుంటా.. ‘నాకు జన్మనిచ్చింది నా తల్లి అయితే రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్లా ప్రజలే కాబట్టి మీ రుణం తీర్చుకుంటా. కేసీఆర్ను గద్దె దించాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎవరూ కలగనని విధంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతున్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు ఆయనను గద్దె దింపాలా’ అంటూ కేటీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. -
సిరిసిల్ల బీజేపీ టికెట్ కోసం పోటాపోటీ
సిరిసిల్ల: బీజేపీలో టిక్కెట్ల పోరు మొదలైంది. సిరిసిల్ల బీజేపీ టికెట్ కోసం ఆరుగురు ఆశావహులు పోటీ పడుతున్నారు. దీంతో ఆ పార్టీ అధిష్టానం వినూత్నంగా శుక్రవారం హైదరాబాద్లో ఆశావహుల మధ్య ఎన్నికలు నిర్వహించింది. టికెట్ ఆశిస్తున్న వారిలో తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్కు చెందిన సరిదెన రాహుల్రావు, ముస్తాబాద్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్రెడ్డి, హన్మంతుగౌడ్ (ముస్తాబాద్), రెడ్డబోయిన గోపి (సిరిసిల్ల), జయశ్రీ (కరీంనగర్), సుజాతారెడ్డి (కరీంనగర్) ఉన్నారు. ఈ ఆరుగురి మధ్య పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించినట్లు సమాచారం. అయితే.. ఓటింగ్కు ముందే టిక్కెట్ ఆశిస్తున్నవారు పార్టీ మండల అధ్యక్షులతో క్యాంపులు నిర్వహించడం గమనార్హం. రాష్ట్ర నేతల సమక్షంలో ఎన్నికలు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీలో లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి, రామచందర్రావు, బద్దం బాల్రెడ్డి, మురళీధర్రావు, యెన్నం లక్ష్మీనారాయణ ఉన్నారు. హైదరాబాద్లో ముఖ్య నేతల సమక్షంలో ఎన్నికలు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా టికెట్ను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదిఏమైనా ముఖ్య నాయకుల సమక్షంలో సిరిసిల్ల సీటు కోసం బీజేపీ నేతల మధ్య అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
ఐరిష్తో రేషన్
సిరిసిల్ల : ప్రజాపంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రేషన్ బియ్యం పొందే లబ్ధిదారులకు ఐరిష్ (కంటిపాపల) పరీక్షలను నిర్వహిస్తున్నారు. రేషన్ బియ్యం పొందే వారు ఇప్పటి వరకు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంలో సరకులు తీసుకునే వారు. ఇప్పటి నుంచి బయోమెట్రిక్తో పాటు ఐరిష్ విధానాన్ని పయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. తొలి విడతగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఐరిష్ విధానం అమలులోకి వచ్చింది. జిల్లాలో కొత్తగా ఆవిర్భవించిన గ్రామపంచాయతీల్లోనూ రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాపంపిణీలో ఐరిష్తో మరో సంస్కరణలకు సిరిసిల్ల జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా సిరిసిల్లలో.. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, యాదాద్రి, మంచిర్యాల జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఐరిష్ విధానం అమలు చేయనున్నారు. ఈనెల 15వ తేదీనుంచి రేషన్ బియ్యం పంపిణీలో ఈపద్ధతి పాటిస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా బయోమెట్రిక్ విధానం అమలులో ఉండగా.. ఇటీవల ఫోర్టబులిటీ ద్వారా రేషన్ సరుకులను ఏ దుకాణంలోనైనా పొందే వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈవిధానంలో వేలిముద్రలు పడక ఇబ్బందులు పడే వృద్ధులు, ఇతరులకు మరో వెసులుబాటు కల్పిస్తూ.. ఐరిష్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. జిల్లాలో ఈ పద్ధతిని పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నారు. రెండోవిడతలో.. సెప్టెంబరు 1వ తేదీనుంచి సిద్దిపేట, జగిత్యాల, మహబూబ్నగర్ జిల్లాలో అమలు చేస్తారు. సెప్టెంబరు 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఐరిష్ విధానం అమలు చేయనున్నట్లు పౌరసరఫరా అధికారులు ప్రకటించారు. బయోమెట్రిక్తో 2619.80 క్వింటాళ్ల మిగులు.. బయోమెట్రిక్ విధానం అమలులోకి రావడంతో జిల్లావ్యాప్తంగా 2,619.80 క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నాయి. 344 రేషన్ దుకాణాల ద్వారా నెలనెలా సరఫరా అయ్యే బియ్యం.. బోగస్ లబ్ధిదారుల పేరుతో స్వాహా అయ్యేవి. ప్రతీ లబ్ధిదారు విధిగా వేలిముద్ర వేసి రేషన్ బియ్యం పొందాలనే నిబంధనలు విధించడంతో బియ్యం మిగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈవిధానంతో ప్రజాధనం భారీగా ఆదా కావడంతో ప్రభుత్వం ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఉన్న బయోమెట్రిక్ మిషన్లకు కొత్త సాఫ్ట్వేర్ జతచేసి ఐరిష్ను నమోదు చేస్తారు. దీంతో బయోమెట్రిక్కు తోడుగా.. ఐరిష్ నమోదుతో రేషన్ పంపిణీలో అక్రమాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త గ్రామపంచాయతీల్లో రేషన్ దుకాణాలు.. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 61 గ్రామపంచాయతీల్లో కొత్తగా రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 2వ తేదీ నుంచి శివారు గ్రామాలుగా, గిరిజన తండాలుగా ఉన్న పల్లెల్లో కొత్త గ్రామపంచాయతీ పాలన మొదలైంది. దీంతో ఆయా గ్రామాల్లోనూ ఈనెల 15వ తేదీనుంచి రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న దుకాణాలను విభజిస్తూ.. కొత్త గ్రామాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తద్వారా నూతన గ్రామపంచాయతీలకూ రేషన్ సరకులు దరి చేరుతాయి. ఇన్నాళ్లూ దూరభారంతో ఇబ్బందులు పడిన ప్రజలకు ప్రజాపంపిణీ చేరువ కానుంది. -
ఊరికో నర్సరీ
సాక్షి, సిరిసిల్ల : హరితహారం కార్యక్రమం నిరాటంకంగా సాగేందుకు ఊరూరా నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈమేరకు స్థలాలు ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. కొత్త పంచాయతీరాజ్ జట్టంలో నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంప కం, రక్షణ తదితర అంశాలను చేర్చింది. ఈ నెల 2 నుంచి కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రావడంతో ఈమేరకు గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, భూములు, రైతుల నివాస, పరిసర ప్రాంతాల్లో నాటేం దుకు అవసరమైన మొక్కలు గ్రామ నర్సరీలోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని మొత్తం 261 గ్రామ పంచాయతీల్లో 220 గ్రామ పం చాయతీల్లో నర్సరీల ద్వారా మొక్కలు పెం చాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. స్థానికంగా ఉపయోగపడే మొక్కలతో..స్థానికంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా పండ్ల జాతుల మొక్కలను నర్సరీల్లో పెంచనున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండే మొక్కలు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులకు అనువుగా పెరిగే మొక్కలనే ఈ నర్సరీల్లో పెంపకానికి ఎంచుకుంటారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న నర్సరీలకు అదనంగా మరిన్ని నర్సరీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో నర్సరీలో 20వేల నుంచి లక్ష వరకు మొక్కలు.. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీల్లో స్థానికంగా ఉన్న స్థలం, నాటడానికి అవసరమయ్యే మొక్కలను బట్టి కనీసం 20 వేల నుంచి లక్ష వరకు వివిధ జాతుల మొక్కలను పెంచనున్నారు. ఈ నర్సరీలకు గ్రామాల్లో స్థల సేకరణే కీలకంగా మారనుంది. ఈనెల 15 లోగా గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉన్న స్థలాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నర్సరీలకు అవసరమైన స్థలం, ఫెన్సింగ్, బోరు మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని అక్టోబర్ నాటికి నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోగా మొక్కల పెంచేందుకు అవసరమైన విత్తన బ్యాగులను ఏర్పాటు చేసేందుకు బెడ్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పాలిథిన్ బ్యాగుల్లో మట్టిని నింపి వాటిలో పండ్ల విత్తనాలు, టేక్ స్టంప్స్ నాటి అక్టోబర్ ఆఖరుకల్లా సిద్ధం చేయాల్సి ఉంది. స్థల సేకరణే ప్రధానం.. గ్రామాల్లో ఏర్పాటు చేసే నర్సరీలను ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ సమన్వయంతో నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు స్థల సేకరణయే ప్రధాన సవాల్గా మారింది. ప్రభుత్వ భూముల్లో కాకుండా ఎవరైనా జాబ్కార్డు ఉన్న ప్రైవేటు వ్యక్తులు స్థలం సమకూర్చితే వారికే నర్సరీ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. నర్సరీల నిర్వహణకు ఉపాధిహామీ కూలీలను వినియోగించుకునేందుకు ప్రభుత్వ వీలు కల్పించింది. నర్సరీల నిర్వహణ, నాటిన మొక్కల సంరక్షణకు గ్రామాల్లో ప్రత్యేకంగా గ్రామ కమిటీతో కూడిన హరితసైన్యాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచుతోపాటు ఔత్సాహికులైన రైతులు, యువకులు ఇందులో భాగస్వామ్యం కల్పించనున్నారు. నర్సరీలు, మొక్కల సంరక్షణ బాధ్యతలు వీరు చూసుకోవాల్సి ఉంటుంది. నిర్వహణకయ్యే ఖర్చు ప్రభుత్వమే చూసుకుంటుంది. -
మత్స్యకారుల సంక్షేమానికి రూ.12కోట్లు
సిరిసిల్ల: జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా రూ.12 కోట్లు కేటాయించామని కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. స్థానిక పొదుపు భవన్లో శుక్రవారం వివిధ కేటగిరీల్లో లబ్ధిదారులను డ్రా పద్ధతిన కలెక్టర్ ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులను డ్రా పద్ధతిన కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకార్మికులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. 47 సంఘాలకు చెందిన 133 మంది అభ్యర్థులు వివిధ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకోగా 57 మందిని ఎంపిక చేశారు. చేపల రవాణాకు సంబంధించి 12 మంది దరఖాస్తు చేసుకోగా 11 మందిని ఎంపిక చేశారు. చేపలు పట్టే సామగ్రి, ద్విచక్రవాహనాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి బి.అంజయ్య, పశుసంవర్థక శాఖ అధికారి రమణమూర్తి, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు పోలు లక్ష్మణ్, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
వినూత్నంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ముస్తాబాద్(సిరిసిల్ల) : రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలను కేటీఆర్ యువసేన సోమవారం వినూత్నంగా నిర్వహించింది. ముస్తాబాద్ మండలం ఆవునూర్లోని మానేరు వాగులో కేటీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించి అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ యువసేన అధ్యక్షుడు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో యువకులు మూడు గంటలు శ్రమించి ఇసుకలో శిల్పాన్ని తయారు చేశారు. అనంతరం అక్కడే కేక్ కట్చేసి మిఠాయిలు పంచారు.విశ్వనాథ్, అక్షయ్, చందు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు
గంభీరావుపేట(సిరిసిల్ల) : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్)ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఏటా ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చే స్తున్నా.. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లోనే టీచర్లు, చిన్నారులు, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరత కారణంగా పలు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉ ంటున్నాయి. వాటిని పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించడం లేదు. 54 అంగన్వాడీ కేంద్రాలు.. ఒక్కరే సూపర్వైజర్ గంభీరావుపేట మండలంలో 53 అంగన్వాడీ కేంద్రాలు, ఒక మినీ అంగన్వాడీ కేంద్రం ఉంది. గంభీరావుపేట, లింగన్నపేట సెక్టార్ల పరి«ధిలో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలను ఒక్కరే సూపర్వైజర్ పర్యవేక్షిస్తున్నారు. అద్దె ఇళ్లలో 13 కేంద్రాలు మండలంలోని 15 అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 13 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అదే విధంగా అద్దె లేకుండా వివిధ పాఠశాల భవనాల్లో 26 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అసంపూర్తిగా ఏడు భవనాలు.. మండలంలోని కొత్తపల్లి, గజసింగవరం, ముస్తఫానగర్, సముద్రలింగాపూర్, దమ్మన్నపేట, నర్మాల క్యాంపు, గోరింటాల గ్రామాల్లో పక్కా భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటి నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే, అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటన్నింటికీ పక్కా భవనాలు మంజూరు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు, లబ్ధిదారులు కోరుతున్నారు. కాగా, అద్దె రూపంలో నెలనెలా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్న ఐసీడీఎస్ అధికారులు సొంత భవనాల నిర్మాణాలను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. తప్పని ఇబ్బందులు ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో పిల్లల ఆటవస్తువులు, వంట సామగ్రి, బియ్యం అన్నీ ఒకే చోట ఉంచలేక నిర్వహకులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, కిశోరబాలికలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలును ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించింది. పథకాలు అమలు చేయడానికి పక్కా భవనాలు లేకు, అద్దె భవనాల్లో సౌకర్యాలు లేక అంగన్వాడీ టీచర్లు తీవక్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ అద్దె కారణంగా.. ప్రభుత్వం ఒక్కో కేంద్రానికి రూ.750 చొప్పున అద్దె చెల్లిస్తోంది. గత మార్చి వరకు అద్దె నిధులను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి బిల్లులు రావాల్సి ఉంది. తక్కువ అద్దెతో సౌకర్యవంతమైన గదులు కూడా దొరకడం లేదని, అద్దె ఇళ్లు సక్రమంగా దొరకడం లేదని టీచర్లు వాపోతున్నారు. ఏప్రిల్ నుంచి అద్దెను రూ.వెయ్యికి పెంచే అవకాశం ఉన్నట్లు ఐసీడీఎస్ అధికారులు భావిస్తున్నారు. అద్దె రూపంలో ఏటా గంభీరావుపేట మండలంలో రూ.1.17 లక్షల చొప్పున నిధులు ఖర్చు అ వుతున్నాయి. నిధులు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు త ప్ప పక్కా భవనాల విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. -
గ్రామీణ ఆర్థికాభివృద్ధికి బాటలు
సిరిసిల్ల : తెలంగాణ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం బాటలు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నాలుగు విప్లవాలతో ఆర్థికాభివృద్ధి సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించి హరిత విప్లవం సాధిస్తామని, చేపల పెంపకంతో నీటి విప్లవం, పాడిపరిశ్రమ అభివృద్ధితో శ్వేత విప్లవం, మాంసం ఉత్పత్తులను ఎగుమతి చేసి గులాబీ విప్లవాన్ని సాధిస్తామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖలేజా ఉన్న నాయకుడని ఆయన ఏం చేసినా.. మొదట ఇది అయితదా..? అనే అనుమానం వస్తుందన్నారు. పట్టుదల చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా అవుతుందనే నమ్మే వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ సాధన నుంచి రైతుల బీమా.. గొర్రెల పంపిణీ వరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు కేసీఆర్ అన్నారు. కులవృత్తులకు చేయూతనిచ్చి ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కట్టని సాగునీటి ప్రాజెక్టును నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. గొర్రెల పంపిణీ గొప్ప పథకమని, దుర్వినియోగం చేయొద్దని కేటీఆర్ కోరారు. త్వరలో గేదెల పంపిణీ: తలసాని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. త్వరలో రూ.900 కోట్లతో గేదెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. రాష్ట్రంలో గతేడాది 60 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని, మరో 25 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయని వివరించారు. రూ.వెయ్యి కోట్ల సంపద గొల్లకుర్మల దరి చేరిందని తెలిపారు. 65 వేల గొర్రెలు చనిపోయాయని, వాటికి బీమా వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 50 శాతం సబ్సిడీతో పాడిపరిశ్రమలను అభివృద్ధి చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న 24 గంటలు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతులకు బీమా వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదన్నారు. సిరిసిల్ల ప్రజలు రాష్ట్రానికి ఆణిముత్యం లాంటి మంత్రి కేటీఆర్ను అందించారన్నారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పశుసంవర్ధకశాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా, ఎంపీ వినోద్కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్తో కలసి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
బరిలో ఎవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తమ నేతలపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం జిల్లాలో చర్చకు దారి తీసింది. రానున్న సార్వత్రిక ఎన్ని కల్లో వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఆ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సస్పెన్షన్ అమలులో ఉన్న ఆరుగురు నేతలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ఇటీవల ప్రకటించింది. ఇందులో జిల్లా నుంచి కాంగ్రెస్ నేత, మాజీ వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. రెండున్నరేళ్లుగా సస్పెన్షన్ అమలులో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తాజా నిర్ణయంతో రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు రాజయ్య ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వరంగల్ పార్లమెంట్ స్థానం జనరల్ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయ్యింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అనంతరం 2015లో వచ్చిన ఉప ఎన్నికల్లో మూడోసారి రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. నామినేషన్ వేసే రోజు న ఆయన ఇంట్లో చోటుచేసుకున్న దుర్ఘటనతో కోడలు సారిక, ముగ్గురు మనుమళ్లు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజయ్య కు టుంబంపై ఆయన కోడలు తీవ్ర ఆరో పణలు చేసింది. దీంతో కాంగ్రెస్ అధి ష్టానం ఆయన టికెట్ను రద్దు చేయడంతోపాటు సస్పెండ్ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వే సత్యనారాయణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే అంశంపై అనేక పేర్లు వినిపించాయి. అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి గుండెబోయిన విజయరామారావుతో పాటు బక్క జడ్సన్, నమిండ్ల శ్రీనివాస్, దొమ్మాటి సాంబయ్య తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో రాజయ్యపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో మరోసారి చర్చ మొదలైంది. మరోవైపు ఆనవాయితీ ప్రకారం తటస్తుల వైపు కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ నేపథ్యం లేని తటస్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉండేందుకు ఆసక్తిగా ఉన్నారు. తటస్థులు.. కాకతీయ యూనివర్సిటీలో పని చేస్తు న్న ఓ అధ్యాపకుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టిం గ్ ఎంపీగా పసునూరి దయాకర్ ఉన్నారు. అంతేకాకుండా ఈ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మరో నేత రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ సంఘం నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టికెట్లు సాధించుకునేందుకు పార్టీలో ఉన్న పెద్దలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రముఖ విద్యాసంస్థల అధినేత పేరు తెరపైకి వచ్చింది. చివరి నిమిషం వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయవచ్చంటూ ప్రచారం జరిగింది. అయితే.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందున్నా విద్యాసంస్థల అ«ధినేత ఆసక్తిగా ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు ఈయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
రాష్ట్రంలో ‘సోలార్’ వెలుగులు
సిరిసిల్ల: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం సోలార్(సౌర) విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడంతో గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా నాలుగు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో మూడు ప్లాంట్లు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)తో ఒప్పందం చేసుకోగా, మరో ప్లాంటు దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)తో ఒప్పందం చేసుకుని విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రంలో 3,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3,100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇందులో ఎస్పీడీసీఎల్ 2,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగా.. 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని ఎన్పీడీసీఎల్ ఇటీవలే సాధించింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఎన్పీడీసీఎల్ పరిధిలో కేవలం 10 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు ఈ సంస్థ పరిధిలో 1,000 మెగావాట్ల విద్యుత్ను సోలార్ ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. పూర్వపు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో కొత్తగా 40 సోలార్ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ప్రైవేటు కంపెనీలు వీటి ని స్థాపించి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రామోజీపేట, పెద్దలింగాపూర్, ముస్తాబాద్ మండలం నామాపూర్, వేములవాడ మండలం నూకలమర్రిలో సౌర ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెద్దఎత్తున సాగుతోంది. రామోజీపేటలో 150 ఎకరాల్లో ఉన్న ప్లాంటు ద్వారా నిత్యం 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా సిరిసిల్ల శివారులోని పెద్దూరులోని 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు అనుసంధానం చేశారు. పెద్దలింగాపూర్లో 120 ఎకరాల్లోని ప్లాంటు నిత్యం 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడి విద్యుత్ను స్థానికంగా ఉన్న 33/11 కేవీ సబ్స్టేషన్కు, వేములవాడ మండలం నూకలమర్రిలో 100 ఎకరాల్లో ప్లాంటు ద్వారా రోజుకు 15 మెగావాట్ల విద్యుత్ను మల్లారంలోని 132 కేవీ సబ్స్టేషన్కు అనుసంధానం చేశారు. -
వేములవాడ టీ కాంగ్రెస్లో అంతర్గత విబేధాలు
సాక్షి, సిరిసిల్లా : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విబేధాలు మరో సారి భగ్గుమన్నాయి. తాజాగా సిరిసిల్లా జిల్లాలో కొనగాల మహేశ్, ఆది శ్రీనివాస్ వర్గాలుగా విడిపోయ్యాయి. దీంతో వేములవాడ పట్టణంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మృత్యుంజయం పాల్గొన్న సమావేశాన్ని మహేశ్ వర్గం వారు పూర్తిగా బహిష్కరించడంతో సొంత నియోజకవర్గంలోనే పొన్నంకు చుక్కెదురైంది. మాజీ ఎంపీ ప్రభాకర్ ఒంటెద్దు పోకడలకు విసిగిపోయి.. ఆయన నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్తో సహా, మనోహర్ రెడ్డి, చంద్రశేఖర్, గంగాధర్, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు దూరంగా ఉన్నారు. వీరంతా కలసి కోరుట్లలో క్యాంప్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వేములవాడలో పార్టీని కాపాడుకునే విషయమై ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్ హైదరాబాద్ నుంచి చక్రం తిప్పుతున్నారు. -
మోదీకి తొమ్మిది పైసల చెక్కును పంపిన సామాన్యుడు
సిరిసిల్లటౌన్ : పెట్రో ధరల అమలులో కేంద్ర సర్కారు తల.. తోక లేకుండా వ్యçవహరించండంపై సామాన్యుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. రూపాయల్లో పెంచుతూ.. పైసల్లో తగ్గిస్తే..ప్రజలకు ఒనగూరేదేమి లేదంటూ ఓ సామాన్యుడు తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశాడు. నిన్న తగ్గించిన 0.09 పైసలను చెక్కు రూపంలో పీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తూ.. వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు. సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేటకు చెందిన వీరగోని చందు సోమవారం తన బైక్లో సిరిసిల్లలోని భారత్ పెట్రోలియంకు చెందిన బంక్ కే. శ్రీనివాస్ అండ్ కంపెనీలో పెట్రోల్ పోయించుకున్నాడు. దీనికిగాను బంక్నుంచి రశీదు తీసుకోగా.. అతడికి 0.09 తగ్గించి, రూ.82.87 పైసలకు లీటర్గా రశీదు ఇచ్చారు. చందు తన జేబునుంచి రూ.100 నోటు బంక్లో ఇవ్వగా రూ. 13 రూపాయలు మాత్రమే చెల్లించారు. మిగతా చిల్లర ఇవ్వాలని కోరగా..0.87 పైసలు ఇస్తే రూ.1 ఇస్తామని బంక్ సిబ్బంది ఎదురు ప్రశ్నించారని చందు పేర్కొన్నాడు. ప్రభుత్వం తగ్గించిన 0.09 పైసలతో పాటు అదనంగా 13పైసలు కూడా బంక్ సిబ్బంది ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి చెందాడు. కేంద్ర సర్కారు తీరుపై నిరసన తెలుపుతూ..0.09 పైసలను చెక్కు రూపలో ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా పంపించాలంటూ కలెక్టర్కు అందించాడు. -
వైఎస్సార్ హయాంలోనే పేదలకు న్యాయం
సిరిసిల్లటౌన్ : వైఎస్సార్ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని పేదలకు న్యాయం దక్కిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కెమిస్టు భవన్లో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో 200 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా టీఆర్ఎస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాట నిలుపుకోలేదన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో సర్కారు ఏ ఒక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమయం ఆసన్నమైందని, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు సమాయత్తం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కోరారు. స్థానిక సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శి బెంబెడ శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, రాష్ట్ర నాయకులు జక్కుల యాదగిరి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గడ్డం జలజారెడ్డి, గుంటుకు సంపత్, జిల్లా చీఫ్ సెక్రటరీ వంగరి అనిల్, ప్ర«ధాన కార్యదర్శి గుండేటి శేఖర్, టౌన్ ప్రెసిడెంట్ బూర నాగరాజు, జిల్లా కార్యదర్శులు కొత్వాల రవి, బొడ్డు శ్రీనివాస్, పల్లె రవి, తీగల శ్రీనివాస్రెడ్డి, అనుములు శ్రీకాంత్రెడ్డి, కడుగుల నాగరాజు, ఎండి. యూనుస్, ఎల్లయ్య, తిరుపతిరెడ్డి, తిరుపతి, హైదర్, నవీన్ పాల్గొన్నారు. ప్రజాసమస్యలపైనే బస్సుయాత్ర సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జూన్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా 54 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్కుమార్ తెలిపారు. యాత్ర రూట్మ్యాప్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలపై అధిష్టానానికి నివేదించి, సర్కారును నిలదీస్తామన్నారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి పార్టీలో చేరిన యువకులను అభినందించారు. -
పన్నెండేళ్లుగాజైలులోనే..
‘పన్నెండేడ్లాయే కొడుకులు కనిపియ్యక. ఎప్పుడస్తరా అని చూస్తున్నం. మన దేశం కాదు.. మన రాజ్యం కాదు. వాళ్లక్కడ దుబాయి జైల్లో ఉన్నారు. ఎట్ల ఇడిపియ్యాలో తెల్వదు. నెల రోజులుగా నాకు జెరమత్తుంది. కొడుకులెప్పు డత్తరా అని సిరిసిల్ల తొవ్వదిక్కు సూత్తున్న. కొడుకులిద్దరు కండ్లళ్ల కనిపిత్తుండ్రు బాంచెన్. వాళ్లను కంటినిండా చూస్కోని సచ్చిపోవాలని పిస్తోంది’ అంటూ కన్నీరు పెడుతోంది శివరాత్రి గంగవ్వ. పన్నెండు సంవత్సరాలుగా కన్నకొడుకులిద్దరూ దుబాయ్లో ఓ హత్య కేసులో ఇరుక్కొని జైలుశిక్ష అనుభవిస్తున్నారు. బండలు కొట్టి బతికే ఆ గరీబోళ్లకు గల్ఫ్ మానని గాయం చేసింది. అక్షరజ్ఞానం లేని ఆ నిరుపేదలకు తమ వాళ్లను ఎలా విడిపించుకోవాలో తెలియడం లేదు. దౌత్యపరమైన సహాయం లభించక నిత్యం కన్నీళ్లతో వెళ్లదీస్తున్నారు ఆ అభాగ్యులు. మా వాళ్లను విడిపియ్యుండ్రి బాంచెన్ అంటూ బంధీల భార్యలు రేణ, రాజవ్వలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఏం జరిగిందంటే... రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం(45), శివరాత్రి రవి(42) అన్నదమ్ములు. 2004లో దుబాయికి బతుకుదెరువుకు వెళ్లారు. వీరితో పాటు కోనరావుపేట చెందిన దండుగుల లక్ష్మణ్(45), చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి(40), జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు(48) కూడా దుబాయికి వెళ్లారు. కంపెనీలో పని బాగా లేదని బయటకు వచ్చి (ఖల్లివెల్లి అయి)వేరేచోట పనిచేసుకుంటున్నారు. జబల్అలీ ప్రాంతంలో నలుగురు పాకిస్తానీయులతో పాటు గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీం, వీరు కలిసి పనిచేస్తున్నారు. కాగా, 2005లో వీరు పనిచేస్తున్న ప్రాంతంలో నేపాల్కు చెందిన దిల్ బహదూర్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. ఈ హత్యను వీరే చేశారని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి 2006లో జైలులో పెట్టారు. పరిహారమిచ్చినా దక్కని క్షమాభిక్ష దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి బ్లడ్ మనీ(పరిహారం) చెల్లించి వారిచేత క్షమాభిక్ష అంగీకారం తీసుకుంటే కోర్టు శిక్షను రద్దు చేస్తుంది. ఈ పరిహారాన్ని అరబిక్ భాషలో ‘దియా’ అంటారు. బహదూర్ హత్య కేసులో నేపాల్లోని అతని భార్య రూ.15 లక్షలు చెల్లిస్తే క్షమాభిక్ష పెడతానని అంగీకరించింది. అంత డబ్బు చెల్లించే స్థోమత లేక బాధితులు 2012 నవంబరులో రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కిడ్నీలు అమ్ముకొని నేపాల్లోని బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని, అందుకు అనుమతించాలని కోరుతూ బాధితులు హెచ్ఆర్సీని కలిశారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో రావడంతో బాధితులకు ఆర్థికసాయం అందించేందుకు అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు. ఆయన స్వయంగా నేపాల్ వెళ్లి ఐదేళ్ల కిందటే హత్యకు గురైన బహదూర్ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలుఅందించారు. క్షమాభిక్ష పత్రంపై మృతుడి భార్య సంతకం చేసింది. ఈ మేరకు సంబంధిత పత్రాలను దుబాయి కోర్టుకు సమర్పించారు. అయితే వీరిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు హత్య, కాపర్వైరు చోరీ, దేశం విడిచి పారిపోవడం అనే మూడు నేరా రోపణలను మోపారు. హత్య కేసులో క్షమాభిక్ష లభించినప్పటికీ మరో రెండు కేసుల్లో దుబాయి కోర్టు క్షమాభిక్షకు నిరాకరించింది. ఇదే కేసులో పాకిస్తాన్కు చెందిన మరో నలుగురిని, గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీంలను నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. కానీ ఈ ఐదుగురు మాత్రం ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. దక్కని దౌత్యపరమైన సాయం.. భారత దేశానికి చెందిన ఐదుగురిని విడిపించేందుకు దౌత్యపరమైన సాయం దక్కలేదు. రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఈ విషయమై విదేశీ వ్యవహరాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్తోనూ చర్చించారు. దుబాయి రాజు క్షమాభిక్ష పెడితేనే ఐదుగురు బంధీలు విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ మన రాయబార కార్యాలయం నుంచి దుబాయిలోని ముఖ్య అధికారులతో దౌత్యపరమైన చర్చలు జరగకపోవడంతో బాధితులు బంధీలుగానే ఉన్నారు. దుబాయ్ కోర్టులో బందీల తరఫున వాదిస్తున్న న్యాయవాది అనురాధ ఇటీవల పెద్దూరుకు వచ్చి బంధీల తల్లి, భార్య, బిడ్డలతో మాట్లాడి వెళ్లారు. దుబాయి రాజు మాత్రమే క్షమాభిక్షను ప్రసాదించాల్సి ఉందని అనురాధ తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఖైదీలకు లభించే క్షమాభిక్షలో వీరి పేర్లుకూడా చేరుస్తారని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్పై ఆశలు.. సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ప్రవాసీ తెలంగాణ మంత్రి కె.తారక రామారావుపైనే బాధితులు ఆశలు పెట్టుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ స్థాయిలో కల్పించుకుని దౌత్యపరమైన జోక్యం చేసుకుంటే బంధీల విడుదలకు మార్గం ఉంటుందని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సైతం న్యాయవాది అనురాధతో చర్చించారు. -
కేక... ఈ కోక
సిరిసిల్ల: సూది రంధ్రంలో దూరే చీరను తయారు చేసి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటి చెప్పా డు మరమగ్గాల కార్మికుడు వెల్ది హరిప్రసాద్(34). స్థానిక నెహ్రూనగర్కు చెందిన హరిప్రసాద్ పవర్లూమ్పై మూడు నెలల పాటు శ్రమించి అతి సూక్ష్మమైన దారం పోగులతో సూదిలో దూరిపోయే సన్నని చీరను తయారు చేశాడు. 6.50 మీటర్ల పొడవున్న సిల్క్చీరను 50 గ్రాముల బరువుతో నేశాడు. సునాయాసంగా చీరసూదిలో నుంచి దూరిపోతుంది. గతంలో ఉంగరంలో దూరేచీరను 6.50 మీటర్ల పొడవు, 450 గ్రాముల బరువుతో పట్టు చీరను పవర్లూమ్పై నేసి రికార్డు సృష్టించాడు. మరో ప్రయత్నంగా సిల్క్, మోనోబ్రైట్ పోగులతో చీరను మరమగ్గంపై నేశాడు. తొలి ప్రయత్నం విఫలమైనా.. రెండో ప్రయత్నంలో సఫలమయ్యాడు. వెంట్రుక అంతటి సూక్ష్మదనంతో ఉండే పోగులను జాగ్రత్తగా పొందుపరిచి 6.50 మీటర్ల పొడవైన చీరను తయారు చేశారు. పదోతరగతి వరకు చదువుకున్న హరిప్రసాద్.. మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2014లో బుల్లిమగ్గం, వార్పిన్, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. వీఐపీలకు గిఫ్ట్లను సైతం హరిప్రసాద్ తయారు చేసి ఇస్తారు. హరిప్రసాద్ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు. -
ఆధార్ లింకేజీతో అగచాట్లు
సిరిసిల్లకల్చరల్ : ఆన్లైన్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దోస్త్ వెబ్సైట్ ఈ సారి మరింత çకఠినతరంగా మారింది. పకడ్బందీగా రూపొందించిన వెబ్సైట్లో డిగ్రీలో ప్రవేశం కోరే విద్యార్థికి నిర్దిష్ట మొబైల్ నంబర్ ఉండాలి. అది కచ్చితంగా అదే విద్యార్థి ఆధార్కార్డు నంబర్తో లింకు అయి ఉండాలి. ఈ నిబంధనే ప్రధాన సమస్యగా పరిణమించింది. అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. అవగాహన లేమితో చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ మొబైల్ నంబర్తో ఆధార్ నంబర్తో సీడింగ్ చేయించుకోలేదు. ఈ విషయం అంత సీరియస్గా పట్టించుకోక పోవడంతో అడ్మిషన్ల ప్రక్రియకు ప్రధాన ఆటంకంగా మారింది. ఈ కారణాలతో అడ్మిషన్ల ప్రక్రియ మందగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల దరఖాస్తుల కన్నా మించలేదని సమాచారం. ఆధార్ కేంద్రంలోనూ అవస్థలే.. ప్రతి విద్యార్థి మొబైల్ నంబర్కు ఆధార్ నంబర్ను సీడ్ చేయించుకునే నిమిత్తం ఆధార్ సేవా కేంద్రాలతో పాటు ఈ సేవ, మీసేవ కేంద్రాలకు అవకాశం కల్పించారు. అయితే వీటిలోనూ సేవాలోపాలున్నాయి. ఆధార్ సేవా కేంద్రాల్లో రోజుకు 50 మంది కార్డుల సవరణకే వీలు కల్పిస్తున్నారు. మిగిలిన ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో చాలా వరకు సర్వర్ సమస్యలు, సిగ్నల్ సమస్యలతో సతమతమవుతున్నాయి. ఒకవేళ అవకాశం దొరికినా సంబంధిత ప్రక్రియ ముగిసేందుకు కనీసం 72 గంటల సమయం పడుతోంది. ఒక్కోసారి ఈ సమయం వారం దాకా కొనసాగుతోంది. ముగియనున్న గడువు డిగ్రీ అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఒకే రిజిస్ట్రేషన్తో రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల పరి«ధిలోని ఏ కళాశాలలోనైనా ప్రవేశం పొందేలా వెసులుబాటు కల్పించింది. ఆధార్ నంబర్తో లింక్ అయిన మొబైల్ నంబర్తో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడంతో పాటు కావాలనుకున్న కళాశాలలో సీటుకోసం ఆప్షన్లు ఇచ్చుకునేలా సైట్ను రూపొందించింది. రిజిస్ట్రేషన్ రుసుము రూ. 200గా నిర్ణయించింది. తొలి దశ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 26తో ముగియనుంది. రూ. 400 మరో మూడురోజులపాటు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. దీంతో చాలా మంది అడ్మిషన్లు గడువు లోగా ముగిసేలా కనిపించడం లేదు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకోసం.. ఈసారి డిగ్రీ ప్రవేశ దరఖాస్తుతో పాటు స్కాలర్షిప్ దరఖాస్తును కూడా ముడి పెట్టారు. ఫీజు రి యింబర్స్మెంట్, స్కాలర్షిప్ను ఆశించే ప్రతి వి ద్యార్థి వి«ధిగా మీ సేవ కేంద్రాలనుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొంది ఉండాలి. కాగా అంతకుముందు ప్రతి దరఖాస్తును సంబం«ధిత వీఆ ర్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రాల జారీ కోసం సిఫారస్ చేయాల్సి ఉంటుం ది. డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై న రోజునే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు ప థకం కూడా ప్రారంభమైంది. ఈ కారణంగా రె వెన్యూ అధికారులంతా ఆ దిశగా బిజీగా ఉండిపోయారు. వీఆర్వో స్థాయి నుంచి డీఆర్వో స్థాయి అ« దికారులంతా చెక్కుల పంపిణీలో తల మునకలై ఉండడంతో విద్యార్థులను పట్టించుకునే వారు క రువయ్యారు. దీంతో సమీప గ్రామాల విద్యార్థులు దరఖాస్తులు పట్టుకుని తహసీల్దార్ కార్యాల యం పరిసరాల్లో ఎదురు చూపులు చూస్తున్నారు. గడువు పెంచడమే శరణ్యం వివిధ కారణాలతో డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మందగించిన మేరకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచడమే శరణ్యంగా పలు విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఆన్లైన్ ప్రక్రియ కోసం అనుసరించాల్సిన వి«ధివిధానాలపై జూనియర్ కాలేజ్ స్థాయిలో విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తకపోయేది. ఆధార్ కార్డు లింకేజ్తో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంచడమే అనివార్యంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే కామన్ అకడమిక్ కేలండర్లో కూడా మార్పులు జరిగే పరిస్థితులూ ఏర్పడవచ్చు. -
వీడిన సర్పంచ్ హత్య మిస్టరీ
సాక్షి, సిరిసిల్ల : రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్ హత్యకేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసింది. ఇందుకు కారణమైన ఎనిమిది మందిలో నలుగురు లొంగిపోయినట్లు ఎస్పీ రాహుల్హెగ్డే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం అరెస్ట్ చూపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మూడపల్లికి చెందిన గోలి తిరుపతితో అదే గ్రామానికి చెందిన కడారి తిరుపతి చెల్లెలికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే గోలి తిరుపతి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. సర్పంచ్ గోలి శంకర్.. గోలి తిరుపతికి వరుసకు అన్న అవుతాడు. అదే చొరవతో తిరుపతి భార్యతో చనువు గా ఉంటున్నాడు. కడారి తిరుపతి, కడారి మహేందర్ సోదరులు. కొద్ది రోజుగా గోలి శంకర్పై అనుమానం పెంచుకొని గొడవ పడుతున్నారు. పక్కా పథకంతోనే.. ఎలాగైనా శంకర్ను హతమార్చాలని కడారి సోదరులు పథకం పన్నారు. ఆ బాధ్యతను మహేందర్కు అప్పగించాడు తిరుపతి. ఆరోగ్యం బాగోలేదని చికిత్సకు కేరళ వెళ్తున్నట్లు వేములవాడ పీఎస్లో లెటర్ ఇచ్చాడు. అనంతరం మహేందర్ ఆన్లైన్లో పెప్పర్ స్ప్రే కొనుగోలు చేశాడు. తన అను చరులైన శివ, రాజేష్ సాయంతో హైదరాబాద్లో మూడు వేటకొడవళ్లు కొన్నారు. శంకర్ను చంపడానికి రెక్కీ నిర్వహించారు. మే11న మూడపల్లి ఎల్లమ్మ టెంపుల్ వద్ద మాటేసినా సాధ్యపడలేదు. మాటేసి... ఈ నెల 13న నూకలమర్రిలో కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి శంకర్ వస్తునట్లు తెలుసుకుని అనుచరులు శివ, రాజేశ్లతో కలసి మ హేందర్ హన్మక్కపల్లి శివారులో మాటేశాడు. కోళ్ల ఫారం వరకు శంకర్ కారులో రాగానే శివ కారుతో వెంబడించి ఢీకొట్టాడు. శంకర్కారు రోడ్డుకు అడ్డంగా తిరగ్గా శివ కారు పక్కన దిగబడిపోయింది. శంకర్కారు దిగగానే శివ అతడి మొహంపై పెప్ప ర్ స్ప్రే చేశాడు. రాజేష్, మహేందర్ వేటకొడవళ్లతో దాడి చేశారు. ఆ వెంటనే బైక్పై కరీం నగర్ మీదుగా హన్మకొండ వెళ్లి అక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్ల్లో తల దాచుకున్నారు. ఒకరికి బదులుగా... తిరుపతి తన ప్రధాన అనుచరుడు చొప్పరి శివను కేసు నుంచి తప్పించడానికి మహేశ్, గంగరాజుల సహాయంతో బైరెడ్డి వినయ్కి నేరం ఒప్పుకుంటే రూ. లక్ష ఇస్తామని తెలిపాడు. వేములవాడ పోలీస్స్టేషన్లో కడారి మహేందర్, నేదురి రాజేష్, బైరెడ్డి వినయ్, ఎడపల్లి విష్ణు లొంగిపోయారు. మరోనలుగురు కడారి తిరుపతి, చొప్పరి శివ, గంగరాజు, మహేష్లు పరారీలో ఉన్నారు. సమావేశంలో ఏఎస్పీ రవీందర్, డీఎస్పీ వెంకటరమణ, వేములవాడ సీఐ వెంకటస్వామి పాల్గొన్నారు. -
ఎంపీ కవిత రైతుబంధు చెక్కు సరెండర్
ముస్తాబాద్(సిరిసిల్ల): నిజామాబాద్ ఎంపీ కవిత రైతుబంధు పథకం ద్వారా వచ్చిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వానికే అప్పగించారు. తెర్లుమద్దిలో ఎంపీ కవిత పేరిట 9.14 ఎకరాలు ఉంది. రైతుబంధు ద్వారా ఆమె కుటుంబానికి చెక్కు, పట్టాదారుపాసు పుస్తకాన్ని వీఆర్వో హరికిశోర్ అందించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎంపీ కవిత భర్త అనిల్ తెర్లుమద్దిలో వచ్చిన రూ.37,400 విలువైన చెక్కును టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వెన్నమనేని శ్రీనివాస్రావు ద్వారా వీఆర్వో హరికిశోర్కు సోమవారం అందించారు. -
కార్మికుల ఆకలి తీర్చిన ‘ధరణి’
సిరిసిల్ల : కార్మిక వాడల్లో ‘ధరణి’ స్వచ్ఛంద సంస్థ కార్మికుల ఆకలి తీర్చింది. పట్టణంలోని గోపాల్నగర్కు చెందిన ఐన రవి ఇంట్లో శుభకార్యం సోమవారం జరిగింది. విందు భోజనం మిగిలిపోవడంతో నిర్వాహకులు ‘ధరణి’ సంస్థకు సమాచారం అందించారు. వెంటనే ఆటోలో గిన్నెలు తీసుకెళ్లి మిగిలిన విందు భోజనాన్ని సేకరించారు. పట్టణంలో పేదలు అధికంగా ఉండే గణేశ్నగర్ కార్మిక వాడకు తీసుకెళ్లి పంపిణీ చేశారు. వేడి వేడి విందు భోజనాన్ని కార్మికులు ఇష్టంగా తీసుకెళ్లారు. 70 మందికి సరిపడా ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధరణి సంస్థ అధ్యక్షురాలు కె.విం ధ్యారాణి, జయసింహారెడ్డి, గుజ్జె తార, అయ్యప్ప రాము, ఠాగూర్ రాజు, ఠాగూర్, వినీత్, చందర్, గడ్డం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బాలిక చెయ్యి కొరికి పారిపోయిన సైకో
సిరిసిల్లక్రైం/ బోయినపల్లి : ‘జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి లోటు లేదు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా జిల్లాకు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలు నిరాధారమైనవి. ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదు. అనవసరమైన పోస్టింగ్ చేసినవారిపై చర్యలకు వెళ్తాం’ సిరిసిల్ల డీఎస్పీ వెంకటరమణ రెండ్రోజుల క్రితం చెప్పిన మాటలివి. కానీ ప్రజల్లో ధైర్యం నూరిపోసే విధానంలో పోలీసులు వెల్లడించిన ప్రకటన రెండ్రోజులైనా కాకముందే జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజవర్గాల్లోని పలు గ్రామాల్లో వాస్తవంగానే పలువరు వీరంగం సృష్టించారు. సిరిసిల్ల అర్బన్ మండలం సర్ధాపూర్లో ఓ సైకో ఓ బాలిక చెయ్యి కొరికి సమీపంలోని బోర్గుట్టకు పరిగెత్తాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే బోయినిపల్లితో పాటు కొదురుపాకలో మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానితంగా తిరుగుతున్నారని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. సామాజిక మాద్యమాల్లో ప్రచారం చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్ జిల్లాలో తిరుగుతోందని పిల్లలెవరు ఒంటరిగా ఆడుకోవడానికి పంపవద్దని సామాజిక మాద్యమాల్లో ఆదివారం ప్రచారం జోరందుకుంది. దీనితో చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఆందోళనలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ వేసవిలో దొంగలు పడుతారన్న ప్రచారం సర్వసాధారణం. కానీ పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న వదంతులే భయాందోళనకు గురి చేస్తుందని ఓ తల్లిదండ్రులు అభిప్రాయ పడ్డారు. మతిస్థిమితం లేని వారని.. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో స్థానికులు గుర్తించిన వారు మతిస్థిమితం లేని వారిగానే కనిపిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. దొరిగిన వారి సంచుల్లో కొబ్బరి కాయాలు, తాయెత్తులు, కొన్ని పాడైన వస్తువులున్నాయని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి జరుగుతున్న ఘటనలకు సమీప్యత ఉన్న కారణంగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. అవాస్తవం: సీఐ శ్రీనివాస్ గుర్తుతెలియని వ్యక్తులు పిల్లలను ఎత్తుకెళ్తున్నారని దానిలో భాగంగానే సిరిసిల్ల అర్బన్ మండలం సర్ధాపూర్లో ఓ పాప చేతిని కొరికి వ్యక్తి పారిపో యినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సిరిసిల్ల పట్టణ సీఐ ఎం.శ్రీనివాస్ ఆది వారం వెల్లడించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పరారవుతున్న వ్యక్తిని పట్టుకుని ఠాణాకు తీసుకువచ్చి అనేక ప్రశ్నలు వేసి సమాధానం రాలేదన్నారు. అతను కేరళవాసీగా గుర్తించిన తాము అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో సంభాషణ చేయించామని తెలిపారు. దీంతో కేరళ రాష్ట్రంలోని మణిపురం నివాసిగా తేలిందన్నారు. భయపడాల్సిన పని లేదు.. పిల్లలను ఎత్తుకెళ్లే గ్యాం గ్లు వచ్చాయన్న దాని లో వాస్తవం లేదు. జరు గుతున్న ప్రచార నేపథ్యంలో ఒక ప్రాంతంలో అనుమానిత వ్యక్తులు కనబడగానే సామాజిక మాద్యమాల ప్రచారం తో అధికంగా అందరూ అందోళన చెందు తున్నారు. జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు, అనుమానిత కదలికలున్నా సమాచారం అందితే సంబంధిత ఠాణాకు తెలిపితే చర్యలకు వెళ్తాం. – వెంకటరమణ, డీఎస్పీ, సిరిసిల్ల -
‘రైతు బంధు’ దేశానికే ఆదర్శం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం, పాస్ పుస్తకాల పంపిణిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నంబర్వన్ స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి రైతు ముఖంలో ఆనందాన్ని చూసి ప్రతిపక్షాలు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ను, రెవెన్యూ, వ్యవసాయ అధికారులను అభినందించారు. వచ్చే వేసంగి పంటకు సాగు భుములకు గోదావరి జలాలు అందేలా చూస్తామన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకం ద్వారా ఇస్తున్నపంట సాయం, ప్రతి పైసా రైతుకు చేరేలా చుస్తామని, మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులను నింపేందుకు కృషి చేస్తున్నమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం వరకు రైతులను ఎవరు పట్టించుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబిడ్డ కాబట్టే రైతుల గురించి ఆలోచన చేస్తున్నారని అన్నారు. రైతుల కోసం రుణమాఫీ చేసిన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏడాది క్రితమే కేసీఆర్ పెట్టుబడి సాయం కోసం ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. ఇది ఎన్నికల కోసం ఏమాత్రం కాదని పేర్కొన్నారు. 86 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాలు, పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రూ. 200 పింఛను ఇచ్చేందుకు కోసం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం రూ. వెయ్యి ఇస్తుందన్నారు. రైతు బంధు ద్వారా కేసీఆర్ రైతులకు ఆత్మ బంధవుగా మారారన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు.