
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం మంగళవారం ఉదయం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనార్థం మూడు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీ వెంకటేశ్వరస్వామిని 74,308 మంది భక్తులు దర్శించుకున్నారని, 26,790 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.