
అనంతలో మళ్లీ తమ్ముళ్ల మధ్య వర్గపోరు
అనంతపురం : అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా జేసీ ప్రభాకర్రెడ్డిపై ప్రభాకర్ చౌదరి ముఖ్య అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జేసీ ప్రభాకర్రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని.. ఆస్తుల విధ్వంసానికి పాల్పడతామని హెచ్చరిస్తున్నాడని డిప్యూటీ మేయర్ గంపన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ సోదరుల బెదిరింపులపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
కాగా టీడీపీ నేత ప్రభాకర్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన జేసీ బ్రదర్స్కి మధ్య అధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదికాక అనంతపురం ఎంపీ అయిన తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డికి విషయంలో ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య వర్గపోరు మళ్లీ తారాస్థాయికి వెళ్లిందని సమాచారం.