80 లీటర్ల నాటుసారా స్వాధీనం
Published Thu, Jul 28 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
విజయనగరం రూరల్: కురుపాం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మిపురం మండలాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించి 80 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ వై.భీమ్రెడ్డి పర్యవేక్షణలో గుమ్మలక్ష్మీపురం మండలం చోడివలస, కురుపాం మండలం రావివలస గ్రామాల్లో దాడులు నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్, కురుపాం ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement