తిరుమల: తిరుమల కనుమ రహదారిలో శనివారం ప్రమాదం తృటీలో తప్పింది. మొదటి కనుమ రహదారిలోని 35వ మలుపు వద్ద వ్యాన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ విషయాన్ని గమనించిన భక్తులు వాహనంలో నుంచి కిందకి దూకేశారు. ఆ వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు మంటల ధాటికి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే భక్తులంతా సురక్షితంగా ఉన్నారు. వారు మరో వాహనంలో తిరుపతి చేరుకున్నారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.