అలరించిన ప్లాష్మాబ్
నెల్లూరు(అర్బన్): బ్రెస్ట్ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన(ప్లాష్మాబ్) ఆకట్టుకుంది. తొలిసారిగా శనివారం నెల్లూరులోని ఎంబీజీ మాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. అందరినీ ఆకర్షించేలా పింక్ టీషర్టులు ధరించిన యువతులు నృత్యాలు చేస్తూ అవగాహన కల్పించారు. నారాయణ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల సహకారంతో భార్గవ హెల్త్ప్లస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వ్యాధిపై అవగాహన ఏర్పరచుకోవడం ద్వారా తగు వైద్యం పొంది బ్రెస్ట్ క్యాన్సర్ను పూర్తిగా నివారించవచ్చని రెడ్క్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధికారి డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. తన సోదరి ఇదే వ్యాధితో బాధపడుతూ మృతిచెందిందని, మరొకరు అలాంటి బాధ పడకూడదనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని భార్గవ హెల్త్ప్లస్ సీఈఓ ఎ.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో నారాయణ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్సతీష్, కిమ్స్(బొల్లినేని) ఈడీ గిరినాయుడు, ఎంజీ బ్రదర్స్ ఎండీ గంగాధర్, డీజిఎం రవికుమార్, శాఖవరపు వేణుగోపాల్,దేవరకొండ శ్రీనివాసులు, భాస్కర్నాయుడు, మహావీర్జైన్ పాల్గొన్నారు.