Telangana News: ఆకట్టుకున్న ఎన్‌సీసీ విద్యార్థుల.. ఫ్లాష్‌ మాబ్‌..!
Sakshi News home page

ఆకట్టుకున్న ఎన్‌సీసీ విద్యార్థుల.. ఫ్లాష్‌ మాబ్‌..!

Sep 16 2023 1:36 AM | Updated on Sep 16 2023 9:20 AM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌లోని ఎంజీఎం, హనుమకొండలోని అంబేడ్కర్‌ జంక్షన్లలో శుక్రవారం నిర్వహించిన ఫ్లాష్‌మాబ్‌ ఆకట్టుకుంది. ఇండియన్‌ స్వచ్ఛతా లీగ్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా ‘జాయిన్‌ ది ఫైట్‌ ఫర్‌ గార్బేజ్‌ ఫ్రీ సిటీస్‌’ అంశంపై ఫ్లాష్‌మాబ్‌ కొనసాగింది. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి చైతన్య డీమ్డ్‌ యూనివర్సిటీ, ఎంజీఎం ఒకేషనల్‌, ఎల్బీ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి నృత్యాలు చేశారు.

ఈసందర్భంగా కార్పొరేషన్‌ సీఎంహెచ్‌ఓ రాజేశ్‌ మాట్లాడుతూ.. ఈనెల 17న మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఫ్లాష్‌ మాబ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌, ఈఈ సంజయ్‌, సూపరింటెండెంట్‌ దేవేందర్‌, ఎస్‌ఐలు శ్యాంరాజ్‌, వెంకన్న, గొల్కొండ శ్రీను, భీమయ్య, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement