రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు | four injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

Feb 12 2017 11:46 PM | Updated on Aug 30 2018 4:10 PM

స్థానిక కూలూరు రస్తాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

చాగలమర్రి: స్థానిక కూలూరు రస్తాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని గొడిగెనూరు గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, జయ్యన్న, వీరభద్రుడు, నరసింహాలు ద్విచక్ర వాహనంలో వైఎస్‌ఆర్‌ జిల్లా రాజుపాలెం మండలం గాజగూడురుకు పనికి  వెళ్లి తిరిగి వస్తూ ట్రాక్టర్‌ను ఢీ కొన్నారు.దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక కేరళా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ మోహన్‌రెడ్డి సంఘటనా స్థాలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడ్డ గోపాల్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement