కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు | Give Craft exgratia | Sakshi
Sakshi News home page

కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

Published Thu, Aug 18 2016 7:10 PM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM

మాట్లాడుతున్న పర్వతాలు - Sakshi

మాట్లాడుతున్న పర్వతాలు

అచ్చంపేట రూరల్‌:   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ ఇండస్ట్రీయల్‌ జిల్లా కన్వీనర్‌ పర్వతాలు ఆరోపించారు. గురువారం పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక చట్టాలను సవరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గోపాల్, మల్లేష్, అల్వాల్‌రెడ్డి, గఫార్, శ్రీను, కలీం, మల్లయ్య, జైపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement