
'ఆ ఎయిర్ పోర్ట్ ప్లానింగ్ మోసపూరితం'
భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్లానింగ్ మోసపూరితమైందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు.
విజయనగరం : భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్లానింగ్ మోసపూరితమైందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. పార్టీకి చెందిన నేతలతో కలిసి విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలో మంగళవారం బృందా కారత్ పర్యటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధిచేకూర్చేలా ఎయిర్పోర్ట్ ప్లానింగ్ ఉందని ఆమె ఆరోపించారు.
సీపీఎం తరఫున పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి విమానాశ్రయ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆమె పేర్కొన్నారు. దేశంలోని చాలా ఎయిర్పోర్టులలో ఉద్యోగులను తొలగిస్తుంటే.. భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోందని బృందా కారత్ విమర్శించారు.