ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్కు భారీగా వదర నీరు వచ్చి చేరుతోంది.
నిజాంసాగర్ (నిజామాబాద్ జిల్లా) : ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి సామర్ధ్యం 17 టీఎంసీలు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి పోచారం, ఎమ్మెల్యేలు షిండే, రవీందర్రెడ్డిలు ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లను ఎత్తి నీటికి కిందకు వదిలారు.