
వర్షంలోనూ ఉత్సాహంగా..
సాక్షి, సిటీబ్యూరో :నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణేశ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. హుస్సేన్ సాగర్తో పాటు నెక్లెస్ రోడ్డు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో నిమజ్జనం చేశారు. ప్రధాన చెరువుల్లోనూ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నిమజ్జనం కోసం ట్యాంక్బండ్పై భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.