పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ | in homes daylight robbery | Sakshi
Sakshi News home page

పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ

Published Mon, Aug 1 2016 10:45 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

in homes  daylight robbery

నల్లగొండ క్రైం : పట్టణంలోని పానగల్‌ రోడ్డులోని నందీశ్వర కాలనీలో సోమవారం రెండు ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన శ్రీనివాస్, బి.అంజయ్య ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. దీనిని గమనించిన దుండగులు ఇంటి తాళాలలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాస్‌ ఇంట్లో 20 తులాల వెండి, 2 తులాల బంగారం, రూ. 2 వేల నగదు, బి.అంజయ్య ఇంట్లో రూ.50 వేలు నగదు, 2 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఇంటి తాళాలలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి స్థానికులు బాధితులకు సమాచారం ఇచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement