homes
-
హైదరాబాద్లో టూరిస్ట్ ఇళ్లు.. సకల వసతులు
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవుల్లో సేద తీరడానికి పలు కుటుంబాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటాయి. కానీ, అక్కడి వసతి ఎలా? హోటళ్లలో ఉండాలంటే.. కాస్త ఖర్చు ఎక్కువే. నచ్చిన వంట వండుకోలేం. సరైన ఆతిథ్యాన్ని స్వీకరించలేం. వాళ్లు పెట్టినవాటిలో నుంచి ఎంపిక చేసుకొని తినాలి. దీనికి పరిష్కారం చూపించేవే పర్యాటక విడిదులు. స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆధునిక వసతులు అందించడమే ఈ టూరిస్ట్ ఇళ్ల ప్రత్యేకత.ఇళ్లు.. హోం స్టేలుగా! భాగ్యనగరం అంటేనే చక్కని ఆతిథ్యానికి చిరునామా. అందుకే విదేశీ పర్యాటకులు ఇక్కడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముగ్ధులవుతుంటారు. ఈ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు పర్యాటక శాఖ హోం స్టే పథకం ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పలు ప్రైవేట్ సంస్థలూ సేవలందిస్తున్నాయి. నగరంలోని గృహ యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే బదులుగా ఇలా హోంస్టే సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆకట్టుకునేలా గృహాలను తీర్చిదిద్ది, అన్ని సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు తాత్కాలికంగా కిరాయికి ఇస్తున్నారు.అన్ని రకాల వసతులు.. ఎయిర్ బీఎన్బీ, వీఆర్బో, బుకింగ్.కామ్, మేక్ మై ట్రిప్, ట్రావెల్ స్టేషన్, హోమ్ టుగో వంటి సంస్థలు హోం స్టే సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు పర్యాటక ప్రాంతాలు, బీచ్లు, తీర్థయాత్రలు అన్నిచోట్లా టూరిస్ట్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కిచెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులు ఈ హోం స్టేలలో ఉంటాయి. సౌకర్యాలను బట్టి అద్దె ఒక రాత్రికి రూ.5 వేల నుంచి ఉంటాయి.ఆయా పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న హోం స్టేల వివరాలను సంస్థలు తమ వెబ్సైట్లలో పొందుపరుస్తున్నాయి. వారికి అనువైన వసతిని వెతుక్కోవచ్చు. ఇందులోనే ధరలను కూడా నిర్ణయిస్తారు. వండి వడ్డించే భోజనం వివరాలు కూడా ఉంటాయి. విమానాశ్రయం నుంచి నేరుగా బస చేసే ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని అందుకోవచ్చు. -
లగ్జరీ ఇళ్లల్లో కొత్త ట్రెండ్..
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్లు హైదరాబాద్లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమారియట్, తాజ్, లీలా, ఇంటర్కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే? స్టార్ హోటల్ సేవలు, అపార్ట్మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్మెంట్కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు. హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్ఎన్ఐలు(హై నెట్వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.ఎక్కడ వస్తున్నాయంటే.. దేశంలోని విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్సిటీ, రాయదుర్గం, నానక్రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.ప్రైవసీ, భద్రత.. కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్మెంట్కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి. -
కనీవినీ ఎరగని కార్చిచ్చుతో అల్లాడిపోతోంటే... మారువేషాల్లో దారుణం!
లాస్ ఏంజిల్స్లో రగిలిన కార్చిచ్చు అమెరికాను అతలాకుతలం చేసింది. కనీవినీ ఎరుగని ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది కనిపించకుండాపోయారు. సుమారు 50వేల ఎకరాలు నాశనమైపోయాయి. 12వేల నిర్మాణాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు బాధితులను ఆదుకునేందుకు సోషల్ మీడియా యూజర్లు,ఇతర దాతలు విరాళాలకోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంత జరుగుతుంటే..ఘోర విపత్తు మధ్య జనం అల్లాడి పోతుంటే.. కనీస మానవత్వం మరిచిన కేటుగాళ్లు తన వక్రబుద్ధి చూపించిన దారుణ ఘటనలు వార్తల్లో నిలిచాయి.ఘోరమైన మంటల మధ్య అగ్నిమాపక సిబ్బందిలా మారువేషంలో దోపీడీలకు తెగబడ్డారు కొంతమంది కేటుగాళ్లు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడగా, మరి కొంతమందిని అరెస్ట్ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఆదివారం (జనవరి 12) కనీసం 29 మంది అరెస్టులు జరిగాయని లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా ధృవీకరించారు. ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఒకరిని పట్టుకున్నట్టు చెప్పారు. 25 అరెస్టులు ఈటన్ ఫైర్ ప్రాంతంలో జరగగా, మరో నాలుగు పాలిసాడ్స్ ఫైర్ ప్రాంతానికి సమీపంలో జరిగాయి.20250112 LOS ANGELES COUNTY CAWildfiresLA County District Attorney Nathan Hochman- Looting, Arson and Use of Drones- Scams: Internet Fundraising, Price Gouging, Bogus Government Benefits pic.twitter.com/qabZDXLaHN— Robert Waloven (@comlabman) January 12, 2025ఇదీ చదవండి: లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!ఈ నేపథ్యంలో భద్రతరీత్యా దోపిడీని అరికట్టడానికి ప్రభావిత ప్రాంతాలకు 400 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. సోమవారం సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ వరకు అమలులో ఉంటుందని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ జిమ్ మెక్డొనాల్డ్ వెల్లడించారు. మరోవైపు మంటల్లో చిక్కుకున్న బ్రెంట్వుడ్లోని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం సమీపంలో కర్ఫ్యూ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం మరిన్ని అరెస్టులు జరిగాయని కూడా అధికారులు వెల్లడించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఇల్లు.. ఇదే కొత్త ట్రెండు!
సొంతిల్లు ప్రతి ఒక్కరి స్వప్నం.. దానికి తగ్గట్టుగానే ఇంటిని (homes) అభిరుచికి తగ్గట్లు నిర్మించుకోవడంతో పాటు సరికొత్త ఇంటీరియర్ (interior) ఏర్పాటు చేసుకుంటున్నారు. విల్లా, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్ ఇలా ఏదైనా సరే.. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపించేలా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వావ్ అనిపించేలా హాల్, మోడ్రన్ కిచెన్, బెడ్రూమ్స్తో పాటు బాల్కనీని (balcony) ముస్తాబు చేసుకుంటున్నారు. కాఫీ కప్పుతో అలా బాల్కనీలోకి వెళ్తే మనసుకు హాయినిచ్చేలా మలుచుకుంటున్నారు. చాలామంది గ్రీనరీ ఫీల్ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ లాన్ ఏర్పాటు చేసుకొని అందమైన మొక్కలతో అలంకరిస్తున్నారు. బాల్కనీ, పెంట్హౌస్ సైజును దృష్టిలో ఉంచుకొని కొన్ని సంస్థలు ప్రత్యేక డిజైన్లతో మైమరపిస్తున్నాయి.కరోనా కాలం తర్వాత నగరవాసులు ఎన్నో నూతన ఒరవడుల వైపు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు (software employees) ఇలాంటి వాటికి అధికంగా మొగ్గుచూపారు. దీనికి ఓ కారణం ఉంది.. లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) కారణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లలో ఉండటం, వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇంట్లో ఇంటీరియర్తో పాటు బాల్కనీ ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వర్క్ మధ్యలో ఫ్యామిలీతో అలా బాల్కనీ, పెంట్హౌస్లో కూర్చొని సరదాగా కాసేపు గడిపి మళ్లీ పని చేసుకుంటున్నారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారంతో సమానంగా ఇంటీరియర్, పలు థీమ్స్తో కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఒకలా.. ఇప్పటి నుంచి మరోలా అనే విధంగా ముస్తాబు చేస్తున్నాయి. అపార్ట్మెంట్స్ బాల్కనీ.. అపార్ట్మెంట్ బాల్కనీ కొద్ది స్పేస్ అయినా వాటిని మరింత సుందరీకరణకు మొగ్గు చూపుతున్నారు. కొందరు వారికి నచ్చిన థీమ్స్తో డిజైన్ చేయించుకుంటారు. థీమ్ నేమ్స్, లైటింగ్ కొటేషన్స్, సేఫ్టీ కోసం ఇన్విజిబుల్ గ్రిల్స్, వాల్ ఆర్ట్ను ఎంచుకుంటున్నారు. వర్క్ఫ్రమ్ హోమ్ ఉన్న వారు బాల్కానీని ఆఫీస్ థీమ్స్తో పాటు పలు విభిన్న థీమ్స్తో సిటీ వ్యూ చూస్తూ డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ ఇంట్రెస్ట్ రావడానికి సరికొత్త డిజైన్స్ ఎంచుకుంటున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. త్రీ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్లో కొత్త థీమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విల్లాస్ కల్చర్ పెరిగింది. పెంట్హౌస్లో ఉన్న స్పేస్కి చాలా ఖర్చు పెడుతున్నారు. సిటీ వ్యూ కనబడేలా అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, జెకూజీ, బార్ కౌంటర్, హోమ్ థియేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ పెరుగుతుంది విల్లాస్, అపార్ట్మెంట్స్లో ఇంటీరియర్కి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే బాల్కనీని చేరుస్తున్నారు. ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ రెట్టింపు అవుతుంది. గ్రీనరీ, ఇంట్లోనే వెజిటబుల్స్ పెంచుకొనేలా ఉన్న స్పేస్తో కాకుండా కొత్త స్పేస్ ఇచ్చే ఆలోచన అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో వస్తోంది. వచ్చిన అతిథులు బాల్కనీ, పెంట్హౌస్ చూసి వావ్ అనేలా ఉండాలని కోరుకుంటున్నారు. వారు బాల్కనీ, పెంట్హౌస్లనే ఇష్టపడేలా డిజైన్ చేసుకుంటున్నారు. వర్క్ఫ్రమ్ హోమ్ ఉన్న వారు ఆఫీస్ థీమ్స్తో పాటు పలు విభిన్న థీమ్స్తో సిటీ వ్యూ ఉండేలా డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ రావడానికి వారికి నచ్చినట్లు డిజైన్ చేస్తున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. – హేమలత రామా, స్వర్గ బాల్కనీ మేకోవర్స్, సీఈఓ -
Sambhal: సొంత ఇళ్లను కూలగొట్టుకుంటున్న మైనారిటీలు
బరేలీ: ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఇటీవల పురాతన శివాలయం బయటపడింది. ఈ వార్త సంచలనంగా మారడంతో ఈ పురాతన ఆలయం చుట్టుపక్కలగల మైనారిటీ వర్గాల వారు తమ ఇళ్లను కూల్చివేసుకుంటున్నారు.పురాతన శివాలయం ఆనవాళ్లు వెలుగు చూసిన దరిమిలా జిల్లా యంత్రాంగం ఆ చుట్టుపక్కల గల ఆక్రమణను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ఇంతలోనే అప్రమత్తమైన స్థానిక మైనారిటీ వర్గాలవారు తమ ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. ఆక్రమణల పేరుతో జిల్లా అధికారులు తమ ఇళ్లను కూల్చివేసేలోగానే, ఇంటిలోని విలువైన వస్తువులను మరో చోటుకు తరలించి, తమ ఇళ్లను మైనారిటీ వర్గాలవారు కూల్చివేసుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ సంభాల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడున్న వారిపై దాడులకు ఉపక్రమించింది. ఇటీవలే అక్రమ నిర్మాణం ఆరోపణలపై నోటీసు అందుకున్న సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ ఇంటిపై విద్యుత్ అధికారులు దాడులు చేశారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఇళ్లలో జరుగుతున్న విద్యుత్ చౌర్యాన్ని గుర్తించి రూ.1.3 కోట్ల జరిమానా విధించారు. విద్యుత్ అధికారుల దాడుల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.నవంబర్లో సంభాల్లోని జుమా మసీదు వద్ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నిర్వహించిన సమయంలో జరిగిన హింస, కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. 20 మందికి పైగా జనం గాయపడ్డారు. మొఘల్ పాలనలో హిందూ దేవాలయ అవశేషాలపై మసీదు నిర్మించారనే వాదనల నేపధ్యంలో ఏఎన్ఐ సర్వే జరిగింది. అయితే ఇంతలో జిల్లా అధికారులు మసీదుకు కిలోమీటరు దూరంలో ఒక పురాతన ఆలయ ఆనవాళ్లను కనుగొన్నారు. అక్కడ కొన్ని విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో 1978 అల్లర్ల తర్వాత మూతపడిన ఈ ఆలయాన్ని అధికారులు తెరిచాయి. కాగా ఆలయ ప్రాచీనతను నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ చేసే బాధ్యతను సంబంధిత అధికారులు ఏఎస్ఐకి అప్పగించారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్
సాక్షి, సిటీబ్యూరో: మార్పు అనివార్యం.. జీవనశైలిలోనైనా, నిర్మాణ శైలిలోనైనా.. కాలానుగుణంగా అభిరుచులను, అవసరాలను తీర్చే వాటికి ఎవరైనా జై కొడతారు. వినూత్న నిర్మాణ శైలి, విలాసవంతం, ఆధునికత నగర గృహ నిర్మాణ రంగంలో ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. లగ్జరీ వసతులు, ఇంటీరియర్ మాత్రమే కాదు డిజైనింగ్, ఆర్కిటెక్చర్ నుంచే ప్రత్యేకత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే థీమ్ బేస్డ్ హోమ్స్ ట్రెండ్గా మారిపోయాయి.థీమ్ ఆధారిత నిర్మాణాలు కొత్తదేమీ కాదు. పురాతన కాలంలో రాజ భవనాలు, రాజ ప్రాసాదాలు, కోటలు, గోపురాలను దైవం, వాస్తు, శిల్పం వంటి ఇతివృత్తంగా ఆయా నిర్మాణాలు ఉండేవి. వాటికే డెవలపర్లు ఆధునికతను జోడించి గృహ సముదాయాల స్థాయికి తీసుకొచ్చేశారు. సాధారణంగా థీమ్ బేస్డ్ రిసార్ట్లు, హోటళ్లు, పార్క్లు ఉంటాయి. కానీ, ఇప్పుడు మెట్రో నగరాల్లో లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్లను ఈ తరహాలో నిర్మిస్తున్నారు.థీమ్ బేస్డ్ అంటే? స్పోర్ట్స్, డిస్నీ, హెల్త్ అండ్ వెల్నెస్, గోల్ఫ్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్ వంటి ఏదైనా ఇతివృతం ఆధారంగా నిర్మించే నివాస సముదాయాలనే థీమ్ బేస్డ్ హోమ్స్ అంటారు. ఒకే రకమైన అభిరుచులు, ఆసక్తులు ఉన్న నివాసితులు ఒకే గృహ సముదాయంలో ఉండటమే వీటి ప్రత్యేకత. దీంతో నివాసితుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అద్భుతమైన శిల్పా లు, విశాలమైన ద్వారాలు, కిటికీలు, అందమైన మంటపాలు, గ్రాండ్ గ్యాలరీ, ఆహ్లాదకరమైన పచ్చదనంతో ఉంటాయి.అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే.. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా థీమ్ ఆధారిత గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నారు. అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్లను కూడా థీమ్ ఆధారంగానే నిర్మిస్తున్నారు. పౌలోమి ఎస్టేట్స్, సుచిరిండియా, రాంకీ, గిరిధారి హోమ్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు ఈ తరహా ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, మాదాపూర్ వంటి అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా నిర్మిస్తున్నారు.మౌలిక వసతులూ మెరుగ్గానే.. గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారిపోయాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలను విలాసవంతమైన వసతులుగా పరిగణించడం లేదు. అంతకుమించి ఆధునికతను కావాలంటున్నారు. ఒక వసతుల విషయంలోనే కాదు ప్రాజెక్ట్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. ప్రత్యేకత లేదో ప్రాజెక్ట్ను ఎంపిక చేయడం లేదు. మెరుగైన మౌలిక వసతులు, అన్ని రకాల రవాణా సదుపాయాలు, విస్తీర్ణమైన స్థలం ఉన్న ప్రాంతాల థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్ల నిర్మాణానికి సరైనవి.థీమ్ బేస్ట్ ప్రాజెక్ట్లను ఆర్కిటెక్చర్, కల్చర్, లైఫ్ స్టయిల్ మూడు రకాలుగా వర్గీకరిస్తారు.1. ఆర్కిటెక్చర్: ఈ భవన నిర్మాణాల శైలి వినూత్నంగా ఉంటాయి. ఈ తరహా నిర్మాణ శైలిని ప్రపంచ దేశాల్లోని చరిత్రలో వివిధ కాల వ్యవధుల్లో వచ్చిన నిర్మాణాలను ప్రేరణగా తీసుకొని ఆర్కిటెక్చర్ డిజైనింగ్ను రూపొందిస్తారు. ఈ తరహా భవన నిర్మాణాలు సమగ్రత్తను నిర్ధారించడంతో పాటు ఫ్యాషన్ సింబల్గా మారాయి. ఉదాహరణ: ఇండో సార్సెనిక్, గోతిక్ అండ్ విక్టోరియన్, మొగల్స్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్, మొరాకన్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలు.2. కల్చర్: ప్రపంచంలోని వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ నివాస సముదాయాలు ఉంటాయి. ఉదాహరణకు: డెన్మార్క్, నార్వే, స్వీడన్ వంటి స్కాండినేవియన్ దేశాల్లో గృహాల డిజైన్లు ప్రకృతిని పెంపొందించేలా, జపనీయుల హోమ్స్ మినిమలిస్టిక్ డిజైన్లను అవలంభిస్తుంటారు. భారతీయులు చైతన్యపరిచే గృహాలను ఇష్టపడుతుంటారు.3. లైఫ్ స్టయిల్: కొనుగోలుదారుల జీవనశైలి, అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించే కస్టమైజ్డ్ గృహాలివీ. ఈ ప్రాజెక్ట్లలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ధారాళమైన గాలి, వెలుతురుతో ఇట్టే ఆకట్టుకుంటాయి.ఉదాహరణకు: స్పోర్ట్స్ టౌన్షిప్లు, డిస్నీ, చిల్డ్రన్ సెంట్రిక్ హోమ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు వంటివి. -
ఒక డాలరుకే ఇల్లు.. ట్రంప్ నచ్చని వాళ్లు వచ్చేయండి!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండో పర్యాయం పదవీకాలాన్ని వచ్చే జనవరి 20న ప్రారంభించబోతున్నారు.అమెరికన్లు ఎన్నికల ఫలితాలపై మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నారు. ఈసారి ట్రంప్ పరిపాలన ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన కొంత మందిలో ఉంది. చాలా మంది డెమొక్రాట్ మద్దతుదారులు ఇప్పుడిప్పుడే ఎన్నికల షాక్ నుండి బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని ఇటాలియన్ ద్వీపం సార్డినియాలోని ఒక గ్రామం జనాభాను పెంచుకోవడానికి వినూత్న ఆఫర్తో ముందుకొచ్చింది.వార్తా సంస్థ సీఎన్ఎన్ ప్రకారం.. యూఎస్ ఎన్నికల ఫలితాలతో కలత చెందిన అమెరికన్లకు ఒక డాలర్కే గృహాలను అందిస్తోంది. గ్రామీణ ఇటలీలోని అనేక ఇతర ప్రదేశాల మాదిరిగానే ‘ఒల్లోలై’ గ్రామం కూడా తీవ్రమైన జనాభా కొరతను ఎదుర్కొంటోంది. పునరుద్ధరణ కోసం బయటి వ్యక్తులను ఆకర్షించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను కేవలం ఒక డాలర్ ధరకే విక్రయిస్తోంది.రాజకీయాలతో అలసిపోయారా?ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికన్ నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని వెబ్సైట్ను ప్రారంభించింది. కొత్త పాలనతో ఆందోళన ఉన్నవారిని తమ గ్రామానికి ఆకర్షిస్తూ చౌకగా గృహాలను అందిస్తోంది. "మీరు ప్రపంచ రాజకీయాల వల్ల అలసిపోయారా? కొత్త అవకాశాలను పొందుతూ మరింత సమతుల్య జీవనశైలిని స్వీకరించాలని చూస్తున్నారా?" అంటూ వెబ్సైట్ అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ వెబ్సైట్ను ప్రత్యేకంగా రూపొందించినట్లు మేయర్ ఫ్రాన్సిస్కో కొలంబు సీఎన్ఎన్తో చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చేవారిని కూడా తాము వద్దనమని, అయితే అమెరికన్లకు ఫాస్ట్-ట్రాక్ విధానం ఉంటుందని పేర్కొన్నారు.క్రూయిజ్ కూడా..ఈ ఇటాలియన్ గ్రామంతో పాటు అమెరికా ఎన్నికల ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న అమెరికన్లు ట్రంప్ కొత్త పాలన నుంచి దూరంగా వెళ్లేందుకు క్రూయిజ్ లైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. "స్కిప్ ఫార్వర్డ్" పేరుతో సర్వీస్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ట్రంప్ పాలన ముగిసే వరకు 140 దేశాలలో 425 పోర్టులు తిరిగి రావచ్చు. -
లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
అజ్మీర్: రాజస్థాన్లోని అజ్మీర్లో గత మూడు నెలలుగా వింత చోరీలు జరుగుతున్నాయి. రాత్రి వేళ్లలో ఇళ్లలోకి చొరబడిన దొంగలు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారు. మూడు నెలలుగా ఇదే తంతు జరుగుతుండటంతో విసుగెత్తిన స్థానికులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.అజ్మీర్లోని విజయనగర్ ప్రాంతానికి చెందిన మహిళలు గత మూడు నెలలుగా తమ లోదుస్తులు మాయయవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో దీనిపై మౌనం వహించిన వారు పలు ఇళ్లలో ఇదే తరహా దొంగతనాలు తరచూ జరుగుతుండటంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. విజయనగర్ నివాసి లక్ష్మీకాంత్ చిపా మాట్లాడుతూ లోదుస్తుల దొంగ కారణంగా ఈ ప్రాంతంలోని మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలోని పలు ఇళ్లలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయని అన్నారు. ఇళ్లలోకి చొరబడుతున్న దొంగలు పలు విలువైన వస్తువులతోపాటు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారని అన్నారు. ఈ ఉదంతంపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలించారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ చోరీల ఘటనపై స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ మహిళల లోదుస్తుల చోరీ కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఆ దొంగల ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని, ఈ తరహా దొంగలు తమపై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడుతున్నామన్నారు. ఇది కూడా చదవండి: బీరూట్పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 12 మంది మృతి -
Deloitte: గృహ వినియోగ మార్కెట్ 19.67 లక్షల కోట్లు
ముంబై: భారత్లో ఇళ్లు, గృహ వినియోగ మార్కెట్ (హోమ్, హౌస్హోల్డ్) 2030 నాటికి 237 బిలియన్ డాలర్లకు (రూ.19.67 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ అంచనా వేసింది. ఏటా 10 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు కొనసాగుతుందంటూ.. ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, వివిధ ఉత్పత్తుల పరంగా సౌకర్యం, సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని సానుకూలతలుగా తన నివేదికలో ప్రస్తావించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. ఓమ్నిచానల్ రిటైల్, ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానానికి సాయపడుతున్నాయని, పట్టణాలకు వెలుపలి ప్రాంతాలకు ఇవి చేరుకుంటున్నాయని పేర్కొంది. గృహస్థుల ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, అదే సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్లు అందుబాటులోకి వస్తుండడం, సులభంగా రుణాలు లభిస్తుండడం, యువ కస్టమర్లు ఆధునిక డిజైన్లు, గృహ నవీకరణ, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ మార్కెట్ వృద్ధికి చోదకాలుగా తెలిపింది. హౌస్హోల్డ్ (ఇంట్లో వినియోగించే ఉపకరణాలు) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. విక్రయానంతర సేవలు, వారంటీపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ వినియోగదారులు ప్రీమియం, బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, కంపెనీలు ఈ–చానళ్ల రూపంలో కస్టమర్లకు ముందుగా చేరువ అవుతున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. వినియోగదారులకు మెరుగైన అనుభవం, డిజైన్ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణపై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్టు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. సోషల్ మీడియా, అత్యాధునిక సాంకేతికతల సాయంతో కంపెనీలు తమ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నట్టు డెలాయిట్ నివేదిక వివరించింది. ఇంధన ఆదా గృహోపకరణాలకు, పర్యావరణ అనుకూల కిచెన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు నీటిని ఆదా చేసే బాత్రూమ్ ఫిట్టింగ్లు, ఇంధన ఆధా టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్నాయని వెల్లడించింది. పీఎల్ఐ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజాల, ఎస్ఎంసీ, పీఎం మిత్ర పథకాల మద్దతుతో డిమాండ్ పెరుగుతుండడం, హౌస్హోల్డ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది. -
‘రియల్’ రికార్డ్!! ఒక్క రోజులోనే 2,000 ఇళ్లు సేల్..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇళ్ల అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. బెంగళూరులో ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదటి రోజే 2,000 పైగా ఇళ్లను విక్రయించింది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ షేర్లు రికార్డు లాభాలను అందుకున్నాయి.ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బెంగళూరులోని వైట్ఫీల్డ్-బుడిగెరె క్రాస్లోని గోద్రేజ్ వుడ్స్కేప్స్లో రూ. 3,150 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. గోద్రెజ్ వుడ్స్కేప్స్ అనేది విలువ, అమ్మకాల వాల్యూమ్ల పరంగా తమ "అత్యంత విజయవంతమైన" లాంచ్ అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఫైలింగ్ తెలిపింది. గత నాలుగు త్రైమాసికాలలో ప్రారంభంలోనే రూ. 2,000 కోట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసిన కంపెనీ ఆరో ప్రాజెక్ట్ ఇది.బెంగళూరులో గోద్రెజ్ వుడ్స్కేప్స్ విజయంతో విక్రయాలలో ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలో 500% పైగా వృద్ధిని సాధించింది. సుమారు రూ. 3,000 కోట్ల ఆదాయ అంచనాతో పుణె, బెంగళూరులో ల్యాండ్ పార్సెల్లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ చేసిన ప్రకటన తర్వాత సోమవారం గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్స్ కొత్త గరిష్టాలకు ఎగిశాయి. 3.23% లాభాన్ని నమోదు చేశాయి. -
‘మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ బయటికెళ్లొద్దు’
ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశం అంతటా వేడిగాలులుల వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మే 28 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్లలో వేడిగాలుల ప్రభావం కనిపిస్తుంది. అలాగే జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన శనివారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 46.9 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీల అధికం. రానున్న నాలుగు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల వీయనున్న కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.మే 28 వరకు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్లలో రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీయనున్న దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆ సమయంలో వేడిగాలులు ఉధృతంగా ఉంటాయని, వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండడం ఉత్తమమని సలహా ఇచ్చింది. -
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా.. పరిస్థితిని గట్టెక్కించడానికి కీలక ఆలోచన చేస్తోంది. దేశంలోని స్థానిక ప్రభుత్వాలతో కలిసి లక్షల కొద్దీ అమ్ముడుపోని ఇళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోందని బ్లూమ్బర్గ్ నివేదించింది.ప్రాథమిక ప్రణాళికపై స్టేట్ కౌన్సిల్ పలు ప్రావిన్సులు, ప్రభుత్వ సంస్థల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది. రాష్ట్ర నిధుల సహాయంతో అదనపు హౌసింగ్ ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి చైనా ఇప్పటికే అనేక పైలట్ ప్రోగ్రామ్లతో ప్రయోగాలు చేసింది. అమ్ముడుపోని ఇళ్లను ప్రభుత్వాలు కొనుగోలు చేసే తాజా ప్రణాళికను అతిపెద్ద ప్రయత్నంగా భావిస్తున్నారు.ప్రణాళికలో భాగంగా కష్టాల్లో ఉన్న డెవలపర్ల నుంచి అమ్ముడుపోని ఇళ్లను అమ్మించేందుకు ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తాయి. బ్యాంకుల రుణాల ద్వారా భారీ తగ్గింపులతో ఆ ఇళ్లను కొనుగోలుదారులకు అందిస్తాయి. ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల వివరాలను అధికారులు ఇంకా చర్చిస్తున్నారు. చైనా ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయంపై ముందుకు వెళ్లాలనుకుంటే అది ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై చైనా గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు.ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనాలో గృహాల విక్రయాలు దాదాపు 47 శాతం క్షీణించాయి. అమ్ముడుపోని ఇళ్ల జాబితా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఈ రంగంలోని దాదాపు అర కోటి మంది నిరుద్యోగం బారినపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని తగ్గించడానికి కొత్త విధానాలను అన్వేషిస్తామని ఏప్రిల్ 30న పాలక కమ్యూనిస్ట్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ప్రభుత్వ తదుపరి కదలికల కోసం ఎదురుచూస్తున్నారు. -
ఐదు అత్యంత విలాసవంతమైన భవనాలు.. ఎవరుంటారక్కడ?
భారతదేశం అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలగలిసిన దేశం. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన ఐకానిక్ హౌస్ ‘యాంటిలియా’ నుంచి హీరో షారుక్ ఖాన్కు చెందిన విలాసవంతమైన ‘మన్నత్’ వరకు.. అన్నీ విలాసవంతమైన, ఆధునిక భవన నిర్మాణాలకు ఉదాహరణగా నిలిచాయి. భారతదేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఇవి కొన్ని.. 1. యాంటిలియా: ముఖేష్ అంబానీ దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో నంబర్ వన్ ప్లేస్లో ఉంది. దక్షిణ ముంబైలోని ఈ భవనం మొత్తం 27 అంతస్తులను కలిగి ఉంది. 15వ శతాబ్దపు స్పానిష్ ద్వీపం పేరు ఈ భవనానికి పెట్టారు. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ ఒకటి నుండి రెండు బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది బకింగ్హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు. యాంటిలియాలో హెల్త్ స్పా, బహుళ స్విమ్మింగ్ పూల్స్, థియేటర్, యోగా, డ్యాన్స్ స్టూడియో, బాల్రూమ్, ఐస్క్రీమ్ పార్లర్, మూడు హెలిప్యాడ్లు, హ్యాంగింగ్ గార్డెన్లు, పార్కింగ్ స్థలం మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. 2. మన్నత్: షారుక్ ఖాన్ అరేబియా సముద్రపు అలల సుందర దృశ్యాలను చూపే ‘మన్నత్’ బాలీవుడ్ రారాజు షారుక్ ఖాన్ నివాసం. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ బంగ్లా ఖరీదు రూ.200 కోట్లకు పైమాటే. అతని భార్య గౌరీ ఖాన్ ఈ ఆరు అంతస్తుల భవనాన్ని తన ఆలోచనల మేరకు తీర్చిదిద్దారు. ఇంటీరియర్ను అద్భుతంగా రూపొందించారు. ఈ భవనంలో జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ సినిమా, అందమైన టెర్రస్ ఉన్నాయి. 3. గులిత: ఆనంద్ పిరమల్ ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీని ఆనంద్ పిరమల్ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ తన కుమారుడు ఆనంద్ పిరమల్కు ఈ విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. ముంబైలోని ఈ ఐదు అంతస్తుల డైమండ్ ఆకారపు భవనం అద్భుతానికి ఉదాహరణగా నిలిచింది. దీని రీగల్ డిజైన్ కారణంగా బయట నుండి ఎంతో అందంగా కనిపిస్తుంది. జీక్యూ ఇండియా అంచనా ప్రకారం ఈ బంగ్లా విలువ సుమారు రూ.450 కోట్లు. ఈ గ్రాండ్ డైమండ్ ఆకారపు భవనంలో ప్రైవేట్ పూల్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, స్పేస్ డైనింగ్ ఏరియా, డైమండ్ రూమ్ తదితర లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. 4. జతియ హౌస్: కుమార్ మంగళం బిర్లా ముంబైలోని మలబార్ హిల్లోని జతియ హౌస్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా నివాసం. ఈ బంగ్లా 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ బంగ్లా ఖరీదు రూ. 425 కోట్లు. విలాసవంతమైన ఇంటీరియర్ ఈ భవనం సొంతం. అందమైన సముద్ర దృశ్యం భవనానికి ప్లస్ పాయింట్. ఈ భవనంలో 20 పెద్ద బెడ్రూమ్లు, ఓపెన్ యార్డ్, గార్డెన్ మొదలైనవి ఉన్నాయి. 5. జేకే హౌస్: గౌతమ్ సింఘానియా ముంబైలోని బ్రీచ్ కాండీ ప్రాంతంలో ఉన్న జేకే హౌస్ వ్యాపార దిగ్గజం గౌతమ్ సింఘానియా నివాసం. గౌతమ్ సింఘానియా రేమండ్ గ్రూప్ చైర్మన్. ఈ 30 అంతస్తుల భవనం ఆధునిక డిజైన్తో రూపొందింది.అరేబియా సముద్ర దృశ్యాలు భవనంలోని వారిని అలరిస్తాయి. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ సుమారు రూ. ఆరు వేల కోట్లు. ఇందులో రెండు స్విమ్మింగ్ పూల్స్, ఐదు పార్కింగ్ అంతస్తులు, హెలిప్యాడ్, స్పా, జిమ్, హోమ్ థియేటర్ మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. -
Tesla Homes: చవగ్గా డబుల్ బెడ్రూం ఇల్లు! వీడియో వైరల్
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా సంస్థ తక్కువ ధరకే డబుల్ బెడ్రూం ఇళ్లు అమ్ముతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే ఈ కంపెనీ పూర్తీగా ఫర్నిష్ చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను కస్టమర్లకు అందిస్తోంది. 10,000 డాలర్లకే అన్ని సౌకర్యాలు ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను టెస్లా అందిస్తోందంటూ సోషల్ మీడయాలో ఓ వీడియో వైరల్గా మారింది. ఈ ఇంటిలో నివసించేందుకే ఎలాన్ మస్క్ తన 50,000 డాలర్ల ఇంటిని కూడా అమ్మేసినట్లు ఈ వీడియోలో ఉంది. బాక్స్ లాగా ఉండే ఈ ఇళ్లకు అవసరమైన విడిభాగాలను ఫ్యాక్టరీలో తయారు చేసి ట్రక్లలో కావాల్సిన చోటుకు తీసుకొచ్చి అమర్చుతారు. ఇందులో రెండు బెడ్రూంలు, లివింగ్ ఏరియాతోపాటు కిచెన్, బాత్రూం ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణం కోసం తయారు చేసిన గోడలు చాలా దృఢంగా ఉంటాయి. భూకంపాలు, అగ్ని ప్రమాదాల నుంచి తట్టుకుంటాయి. పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు అమర్చారు. దీంతో ఇంటి అవసరమైన విద్యుత్ వీటి నుంచే లభిస్తుంది. అలాగే వర్షపు నీటిని సేకరించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. Elon Musk is at it again... A two bedroom Tesla home for $10,000. This man is a good Wizard. They come once in a generation. 👌🏼👌🏼 pic.twitter.com/w71Hcg0oFp — Aviator Anil Chopra (@Chopsyturvey) March 19, 2024 -
2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా..
సొంతిళ్లు అనేది సామాన్యుడి కళ. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏ పని చేస్తున్నా ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతారు. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల అవసరాలు హెచ్చవుతున్నాయి. అందుకు అనువుగా రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి నిర్మాణాన్ని పెంచుతున్నాయి. మారుతున్న జీవనప్రమాణాల వల్ల అధికశాతం జనాభా ఇప్పటికే ఇళ్లు ఉన్నా అన్ని సౌకర్యాలు కలిగిన మరో ఇంటికి మారాలని చూస్తున్నారు. దాంతో ఇళ్ల నిర్మాణానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. 2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని క్రెడాయ్-లియాసెస్ ఫోరాస్ నివేదిక అంచనా వేసింది. మంగళవారం వారణాసిలో జరిగిన న్యూ ఇండియా సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం..2018 నాటికే జనాభా అవసరాలకు తగిన ఇళ్ల నిర్మాణం జరగలేదు. అప్పటికే 2.9 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల గృహాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. స్థిరాస్తి రంగంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి అధికంగా ఉండనుంది. 2023లో ఇళ్లకు అధిక గిరాకీ ఏర్పడిందని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా రెరా వద్ద 19,050కి పైగా ప్రాజెక్టులు నమోదయ్యాయని, ఇందులో 45 శాతానికి పైగా నివాస ప్రాజెక్టులున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లకు గిరాకీ, సరఫరా వృద్ధి చెందుతోందన్నారు. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పెద్ద గృహాలకు డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: 2030 నాటికి రూ.8 లక్షలకోట్ల ఎగుమతులు..? క్రెడాయ్ ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. గత ఏడాది స్థిరాస్తి రంగానికి సానుకూలంగా ఉందని చెప్పారు. 2024లోనూ ఈ రంగంలో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లియాసెస్ ఫోరాస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరే క్రమంలో స్థిరాస్తి రంగం పాత్ర ఎంతో కీలకమని వివరించారు. -
కలల సౌధాన్ని డిజైన్ చేస్తాను!
‘ప్రతి ఇంటికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది.ఇంటి యజమానిప్రాధాన్యతలకు అనుగుణంగా ఆ ఇంటి డిజైనింగ్ ఉండాలి. వారి కలల సౌధాన్ని కళ్ల ముందు నిలపడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని తన గురించి, తన ప్రాజెక్ట్స్ గురించి వివరించారు ఇటీవల ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రోఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ షబ్నమ్ గుప్త. 48 ఏళ్ల షబ్నమ్ గుప్త 16 ఏళ్ల వయసు నుంచే ఈ రంగంలోకి వచ్చానని వివరించింది. ఆమె డిజైన్స్ సెలబ్రిటీల ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అపార్ట్మెంట్లు, ఫామ్హౌజ్లు, హాస్పిటల్స్ నుంచి మట్టితో కట్టిన చిన్న రూమ్లను కూడా తన విలక్షణమైన శైలితో ఆవిష్కరిస్తుంటారు. తనే ఇన్నేళ్ల ప్రయాణం గురించి షబ్నమ్ వివరిస్తూ.. ‘‘నా జీవితంలో అత్యంత ప్రభావాన్ని కలిగించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మానాన్నలు, మా వారు. వాళ్లతో చేసే చర్చలు నాలో ఇంకా స్థిరత్వానికీ, ఎదుగుదలకూ తోడ్పడుతుంటాయి. ఎందుకంటే వాళ్లే నా వర్క్లో మొదటి అతిపెద్ద విమర్శకులు. దేనినీ త్వరగా మెచ్చుకోరు. వాళ్లను మెప్పించడం అంటే నేను సూపర్ సక్సెస్ అయినట్టు అనుకుంటాను. అంతగా నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతాను. మొదటిసారి మా నాన్న ఇల్లు కట్టించినప్పుడు నేను చాలా ఆసక్తి కనబరిచాను. చాలా మార్పులు, చేర్పులు చేశాను. నాన్నగారు కూడా నా సూచనలను చాలా బాగా తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో ఇంటీరియర్ డిజైనింగ్లో డిప్లోమా పూర్తి చేశాను. ముంబయ్ ర హేజా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి కోర్స్ పూర్తి చేసుకున్నాక సొంతంగాప్రాక్టీస్ మొదలు పెట్టాను. దీనికి ముందు ప్రముఖ ఆర్కిటెక్ట్ తుషార్ దేశాయ్తో కలిసి పనిచేయడం ద్వారా డిజైనింగ్లో చాలా నైపుణ్యాలను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫిల్మ్ప్రోడక్షన్ హౌజ్లో ఒక చిన్న పనితో నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి నా సొంత లేబుల్ పెరుగుతూ వచ్చింది. నా ఖాతాలో ఆదిత్యా చోప్రా, రాణీ ముఖర్జీ, పరిణీతి చోప్రా.. వంటి చాలా మంది బాలీవుడ్ తారల ఇళ్లు, మీడియా హోజ్లు, హాస్పిటల్స్ డిజైన్ చేసినవి ఉన్నాయి. టీమ్ వర్క్.. డిజైనింగ్లో ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలకు స్పేస్ ఉంటుంది. ఇందులో ప్రకృతి, మన సంప్రదాయం, కళలు అన్నింటినుంచి ప్రేరణ పొందవచ్చు. ఈ డిజైనింగ్లో ప్రకృతితో మనకు ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఏ ఒక్కరి జీవిత ప్రయాణం మరొకరితో పోల్చలేం. చాలామంది విజయాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. మనం చేసే పనిలో సంతృప్తి పొందితే చాలు. మిగతా ట్యాగ్లు ఏవీ అక్కర్లేదు. వాటిని నేను సీరియస్గా తీసుకోను కూడా. ఇప్పటివరకు నా ప్రయాణం ప్రశాంతతను నేర్పింది. చాలా మందితో కలిసి టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మానవ సంబంధాలను తెలుసుకునే వీలుంటుంది. మా టీమ్తో పనిచేసే సమయంలో చాలా జోవియల్గా ఉంటాను. ఎలా అంటే ఒక మానసిక వైద్యుడిలా. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటంతో పనిప్రదేశంలో ఉల్లాసంగా ఉంటాం. పట్టణ, నగర వాసాల నుంచి, గ్రామీణ ఇండ్ల వరకు డిజైన్ చేసినవన్నీ నా జాబితాలో ఉన్నాయి. ఈ రంగంలో మన చేత వర్క్ చేయించుకునేవారితో నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం ముఖ్యం. అలాగే, వ్యాపారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇదే ఇన్నేళ్ల నా ప్రయాణంలో సాధించిన విజయం అనుకుంటాను. ప్రతిదీ సాధనే.. ఆర్కిటెక్చర్లో భాగంగా దేశమంతా తిరిగాను. ప్రముఖ ఆర్కిటెక్చురల్ప్రాధాన్యమున్న స్థలాలన్నీ సందర్శించాను. అవగాహన చేసుకున్నాను. విదేశాల్లోని కట్టడాలు, ఇంటీరియర్ వర్క్ చూస్తూ ప్రయాణించడంతో ప్రతిదానినీ అర్ధం చేసుకుంటూ, ఇంకాస్త మెరుగైన పనితనాన్ని నా వర్క్లో చూపించడం ఎప్పటికప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క రోజు ఇంకో రోజుతో పోల్చలేం. చేయాలనుకున్న పనుల జాబితాను టిక్ చేసుకుంటూ వెళ్లడమే. మొదట్లో గందరగోళంగా ఉండేది. తర్వాత ఏ రోజు పనులు ఆ రోజు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. నా జీవనశైలిలో నా మైండ్ స్పేస్ను అర్థం చేసుకోవడం చాలా సవాల్గా ఉండేది. జీవితంలో ఏదైనా రూపొందించాలనుకున్నప్పుడు అదొకప్రాక్టీస్గా ఉండాలి. క్లయింట్స్ ఇళ్లను డిజైన్ చేయడంలో నా స్కిల్ని మాత్రమే చూపించాలి. ఇదీ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమే. ఇంటీరియర్ డిజైనర్గా, ఆర్కిటెక్ట్గా ఎక్కువ సమయం సిమెంట్, దుమ్ము కొట్టుకుపోయి పనిలో గడిచిపోతుంటుంది. అయినా నాకంటూ కొంత స్పేస్ ఉంచుకుంటాను. ప్రయాణాలు నాకు ఎప్పుడూ ఇష్టం. ఇది ఎల్లప్పుడూ నన్ను పునరుజ్జీవింపజేస్తుంది. చాలాసార్లు పని నుంచి రిలాక్స్ అవడానికి టూర్స్ని ఎంచుకుంటుంటాను. వందల ఇళ్లు డిజైన్ చేసి ఉంటాను. ఎన్నో అవార్డులు ఈ రంగంలో అందుకున్నాను. కానీ, నా ఇంట్లో ఏది ఎలా ఉండాలనే నియమం లేదు. అక్కడంతా నా పిల్లల ఇష్టమే. ఎందుకంటే వారి దగ్గర నేను తల్లిని మాత్రమే. భవిష్యత్తు తరాలకు.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ది ఆరెంజ్ లేన్ ఆ తర్వాత పీకాక్ లైఫ్ పేరుతో ఇంటీరియర్ స్పేస్లను క్రియేట్ చేశాను. హైదరాబాద్లో కోషా పేరుతో వింటేజ్ స్టైల్ ఫర్నీచర్ను లాంచ్ చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్లో వింటేజ్ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. దేశంలోని ఇతరప్రాంతాల నుంచి ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్లలోని అతిప్రాచీన కళా ఖండాలను సేకరించడం, వాటిని రీ మోడలింగ్ చేసి, నేటి తరానికి అందించడంలో నాటి కళను భవిష్యత్తు తరాలకు తీసుకెళుతున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో వ్యక్తిగత అలంకరణ కూడా అంతే ఇష్టం. నా వ్యక్తిగత అలంకరణ కొంచెం బోహో స్టైల్లో ఉంటుంది. ఇది స్వేచ్ఛా, స్ఫూర్తిలకు ప్రతీకగా ఉంటుంది. ఎదుటివారు మనల్ని పరిశీలనగా గమనించేంత ప్రత్యేకంగా ఉంటాయి’ అని నవ్వుతూ వివరించారు షబ్నమ్. – నిర్మలారెడ్డి, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
‘న్యూస్క్లిక్’లో పోలీసుల సోదాలు
న్యూఢిల్లీ: చైనా అనుకూల సమాచారాన్ని భారత్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్న ఆరోపణలపై ఆన్లైన్ న్యూస్పోర్టల్ ‘న్యూస్క్లిక్’పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సంస్థకు సంబంధించిన ఆఫీసులతోపాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లలోనూ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. న్యూస్క్లిక్ వ్యవస్థాపకులు, ఎడిటర్–ఇన్–చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థా, హెచ్ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మొదట ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్చేశారు. 100 ప్రాంతాల్లో ఏకంగా 500 మంది ఢిల్లీ పోలీసులు ఒకేసమయంలో దాడిచేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైలలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చెందిన ఢిల్లీలోని నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయనకు సహాయకునిగా ఉండే శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ ఇదే న్యూస్క్లిక్లో పనిచేస్తుండటంతో ఏచూరీ ఇంట్లోనూ పోలీసు తనిఖీలు కొనసాగాయి. దీంతో ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని సంస్థ ముఖ్య కార్యాలయంలోని వారిని ప్రశ్నించాక ఆ ఆఫీస్కు పోలీసులు సీలువేశారు. విదేశీ ప్రయాణాలు, పౌరసత్వ(సవరణ) చట్టంపై షాహీన్బాగ్ వద్ద చెలరేగిన ఆందోళనలు, రైతుల ఉద్యమాలు తదితరాలపై జర్నలిస్టులను 25 అంశాలపై ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు. న్యూస్క్లిక్కు నిధులు ఎలా వస్తున్నాయనే కోణంలో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యూస్క్లిక్ కార్యాలయాల్లో సోదాలు చేయడం తెల్సిందే. ఈ విషయంలో ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారంతోనే మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, నేరమయ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా కేసు నమోదుచేసి దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, హార్డ్ డిస్్కలు, ఫ్లాష్ డ్రైవ్లను స్వాదీనం చేసుకున్నారు. ఆగస్ట్ 17న అత్యంత కఠిన ఉగ్రవ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక )చట్టంకింద నమోదైన కేసు ఆధారంగానే కొత్తను నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. చైనాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల నుంచి గత మూడేళ్లకాలంలో రూ.38.05 కోట్ల నగదు న్యూస్క్లిక్ పోర్టల్కు ముట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నగదులో కొంత మొత్తం పాత్రికేయులు గౌతమ్ నవ్లఖా, తీస్తా సీతల్వాడ్లకు చేరినట్లు ఆరోపిస్తోంది. విపక్షాల తీవ్ర విమర్శలు మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ సహా పలు విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తూర్పారబట్టాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాసహా పలు మీడియా సంఘాలు పోలీసు దాడులను ఖండించాయి. మోదీ సర్కార్ను విమర్శించే పాత్రికేయులపై ప్రభుత్వం కత్తిగట్టిందని ఆక్షేపించాయి. -
ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..
UK Flats: భూమి మీద అత్యంత విలువైనది.. కాలంతోపాటు విలువ పెరిగేది ఏదైనా ఉందంటే అది భూమి (ఇళ్లు) మాత్రమే. అన్ని దేశాల్లోనూ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుతున్నాయి. అయితే యూకేలోని ఓ నగరంలో మాత్రం రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లను రూ.100కే విక్రయిస్తున్నారు. లూయీ నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్లో నివాసితులకు చౌకగా ఇళ్లు అందించేందుకు 6,40,000 పౌండ్ల (రూ.6.6 కోట్లు) విలువైన గ్రేడ్ 2 లిస్టెడ్ ఫ్లాట్లను 1 పౌండ్ (రూ.103)కే విక్రయించడానికి కౌన్సిల్ అంగీకరించింది. 11 కోస్ట్గార్డ్ ఫ్లాట్లను త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్కు విడుదల చేయాలన్న సిఫార్సును కార్న్వాల్ కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా గ్రాంట్ ఫండింగ్ ద్వారా 1 మిలియన్ పౌండ్లతో పునరుద్ధరణ పనులను చేపట్టడానికి ముందుకొచ్చింది. డిప్యూటీ కౌన్సిల్ లీడర్ డేవిడ్ హారిస్ ప్రకారం.. ‘ఈ ఫ్లాట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడంలేదు. దీని వల్ల ఇప్పటికే రెండో ఇంటి యాజమాన్యం, హాలిడే హోంలు అధిక స్థాయిలో ఉన్న లూయీ పట్టణంలో చౌక గృహ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కమ్యూనిటీ-నేతృత్వంలోని పునరాభివృద్ధి పథకం ఈ ఫ్లాట్లను పేదలకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తుంది. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!) అధిక సంఖ్యలో హాలిడే హోమ్లు ఉండే ఇంగ్లాండ్లో సెకండ్ హోమ్లు, హాలిడే హోమ్ల సమస్య కార్న్వాల్లో మరీ ఎక్కువగా ఉంది. 2021లో ఈ ప్రాంతంలో 13,000 సెకండ్ హోమ్లు ఉన్నట్లుగా కార్న్వాల్ లైవ్ నివేదించింది. కౌన్సిల్ 2021లో చేపట్టిన నార్త్ రోడ్ భవనం పునర్నిర్మాణాన్ని ఆర్థికంగా పనికిరానిదిగా, అవసరానికి మించినదిగా ప్రకటించారు. అధిక నిర్వహణ ఖర్చులను నివారించేందుకు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. లూయి కౌన్సిలర్లు ఎడ్వినా హన్నాఫోర్డ్, అర్మాండ్ టామ్స్ మద్దతుతో త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ 1 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ఖర్చుతో ఆస్తుల పూర్తి పునరుద్ధరణను చేపట్టడానికి ముందుకొచ్చింది. అర్హతలు ఇవే.. ఇదే విధమైన పథకాన్ని 2015లో స్టోక్-ఆన్-ట్రెంట్ కౌన్సిల్ అమలు చేసింది. వీటిపై ఆసక్తి ఉన్నవారు కనీసం ఐదేళ్ల పాటు కొత్త ప్రాపర్టీలలో ఉండటానికి అంగీకరించాలి. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. కుటుంబ ఆదాయం 18,000 నుంచి 25,000 పౌండ్ల మధ్య ఉండాలి. కొత్త పథకం పోర్ట్ల్యాండ్ స్ట్రీట్ ప్రాంతంలో ఉంటుందా లేదా నగరంలోని మరొక వెనుకబడిన ప్రాంతంలో ఉంటుందా అన్నది ఇంకా నిర్ణయించలేదని హౌసింగ్ క్యాబినెట్ సభ్యుడు, కౌన్సిలర్ రాండీ కాంటే పేర్కొన్నారు. -
ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం?
వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి చెందుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అద్దె ఇళ్ల భావన ఎక్కువైంది. దేశంలో చాలామంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. అద్దె ఇళ్లతో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి. ఇంటి యజమానులతో పోలిస్తే అద్దెకు ఉండే వారికి బాధ్యతలు తక్కువగా ఉన్నప్పటికీ.. వారితో అద్దెకు ఉంటున్నవారికీ ఓ బాధ్యత ఉంది. అదే హోమ్ ఇన్సూరెన్స్. అదేంటి హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి ఓనర్కు సంబంధించింది కదా.. దీంతో అద్దెకు ఉంటున్నవారికి పనేంటి అనుకోవద్దు.. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి యజమానికి ఎంత అవసరమో.. అద్దెకుంటున్నవారికీ అంతే అవసరం. అది ఎందుకు.. ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వస్తువుల రక్షణ ఇళ్లలో అద్దెకుండేవారు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముఖ్యమైన కారణం ఇది. ఈ హోమ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వస్తువులు అంటే టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నీచర్, దుస్తులతోపాటు ఇతర విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెబ్బతిన్న లేదా చోరీకి గురైన వస్తువులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొత్తవాటిని కొనుగోలు లేదా మరమ్మతుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఆస్తుల డ్యామేజీ కవరేజ్ వస్తువుల రక్షణతోపాటు ఇంటి ఆస్తుల రక్షణను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అద్దెదారు అనుకోకుండా ఇంటి ఆస్తిని పాడు చేసినట్లయితే, అంటే కిచెన్లో మంటలు ఏర్పడి ఇంటికి సంబంధించిన వస్తువులు దెబ్బతింటే ఆ నష్టాన్ని ఓనర్కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి ప్రమాదాల్లో గాయపడిన ఇంట్లోకి వారికి బీమా వర్తిస్తుంది. తాత్కాలిక జీవన వ్యయాలు అగ్నిప్రమాదం లేదా వరదలు వంటివి సంభవించినప్పుడు ఇళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా వేరొక చోట ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో హోటళ్లలో ఉండటానికి, భోజనం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను ఈ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది చాలా తోడ్పాటు అందిస్తుంది. అందుబాటులోనే ప్రీమియం హోమ్ ఇన్సూరెన్స్పై భారతదేశంలో చాలా అపోహలు ఉన్నాయి. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అందుబాటు ప్రీమియంతోనే ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలెత్తే ఆర్థిక నష్టాలతో పోల్చినప్పుడు అది సహేతుకంగానే ఉంటుంది. అద్దెదారుల నిర్దిష్ట అవసరాలు, ఆర్థిక పరిమితుల ప్రకారం దేశంలో అనేక కంపెనీలు ఈ రెంటర్స్ హోమ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. -
ఛీ.. ఛీ ..ఇదేం అలవాటు.. నిద్రిస్తున్న మహిళల పాదాలు తాకుతూ..
అమెరికాలో నెవాడోలో వికృతమైన స్వభావం కలిగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిద్రిస్తున్న మహిళల ఇంట్లోకి చొరబడి వారి పాదాలను నిమరే అలవాటుకు ఓ వ్యక్తి బానిసయ్యాడు. ఈ వికృత చేష్టలకు విసిగిపోయిన మహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తిని పసిగట్టారు. నిందితున్ని ఆంథోనీ గొంజాలెస్(26)గా గుర్తించి అరెస్టు చేశారు. జులై 1న నిందితుడు ఇద్దరు మహిళలు ఉండే ఫ్లాట్లోకి దొంగచాటుగా వెళ్లాడు. నిద్రిస్తున్న మహిళ పాదాలు నిమిరాడు. ఒక్కసారిగా మహిళలు లేచి ప్రతిదాడి చేసేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే వరుస. జులై 1 నుంచి జులై 3 మధ్య వారిపై ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు కూడా ఆ ప్రాంతంలోని మహిళలందరిపై ఈ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన మహిళలందరూ కలిసి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం ఆరా తీశారు. అయితే.. వేలి ముద్రల ఆధారంగా ఆగష్టు 1న అతన్ని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితున్ని ఆంథోని గొంజాలెస్గా గుర్తించారు. ఇతడు ఇంతకుముందే ఇలాంటి ఘటనల్లో నిందితునిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మహిళల బూట్లు దొంగిలించిన ఘటనల్లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో లైంగిక స్వయంతృప్తి చెందుతున్నాడనే ఫిర్యాదులు కూడా ఇతనిపై వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: Riots In New York: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు.. -
ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు
ముంబై: ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జోరుగా సాగనున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 8–10 శాతం అధిక అమ్మకాలు ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ రంగంపై క్రిసిల్ ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. గృహ రుణాలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగినా కానీ అమ్మకాల్లో వృద్ధికి ఢోకా ఉండదని పేర్కొంది. మధ్యస్థాయి, ప్రీమి యం విభాగాలు, విలాసవంత ఇళ్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, వీటి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా నమోదైనట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనికితోడు వసూళ్లు బలంగా ఉండడం, రుణ భారం తక్కువగా ఉండడంతో డెవలపర్ల రుణ పరపతి మెరుగుపడినట్టు పేర్కొంది. 11 పెద్ద లిస్టెడ్ సంస్థలు, 76 చిన్న, మధ్య స్థాయి నివాస గృహాల డెవలపర్ల గణాంకాల ఆధారంగా క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదిక రూపొందించింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ విభాగంలో డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక వృద్ధి ఆరోగ్యంగా ఉండడంతోపాటు కార్యాలయాలు ఇప్పటికీ హైబ్రిడ్ నమూనాలో పనిచేస్తున్నాయి. దీంతో ప్రీమియం, పెద్ద ఇళ్ల కు ఇస్తున్న ప్రాముఖ్యం డిమాండ్కు మద్దతిస్తోంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) పెద్ద సంస్థల మార్కెట్ బలోపేతం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11 ప్రముఖ రియల్ ఎస్టేట్ (లిస్టెడ్) కంపెనీలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాల్లో విలువ పరంగా 50 శాతం, స్థల విస్తీర్ణం పరంగా 20 శాతం వృద్ధిని చూపించినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. పెద్ద సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయని, 2020 నాటికి 16–17 శాతంగా ఉన్న వీటి వాటా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. పేరున్న సంస్థలు అయితే బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా రావడంతోపాటు, విశ్వసనీయ బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం వాటి మార్కెట్ వాటాను పెంచుతుందని తెలిపింది. హైదరాబాద్తోపాటు కోల్కతా, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో గణాంకాలను క్రిసిల్ తీసుకుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, కోల్టే పాటిల్ డెవలపర్స్, మాక్రోటెక్ డెవలపర్స్, మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్, ఒబెరాయ్ రియలీ్ట, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పురవంకర, శోభ, సన్టెక్ రియాలిటీ సంస్థలను పెద్ద సంస్థలుగా పేర్కొంది. (రిలయన్స్ గ్రూప్లో కీలక పరిణామం: ప్రెసిడెంట్గా పారుల్ శర్మ) -
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత ఖరీదైన ఇళ్లు
-
రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల నిర్మాణం వేగాన్ని అందుకోనుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది 5,57,900 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. 2022లో 4,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని డెవలపర్లు నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించారా అన్నది తెలియజేయలేదు. నిర్మాణం పూర్తి చేసి డెలివరీ ఇవ్వాల్సిన ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ విభాగం ‘రెరా’, నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఇళ్ల అమ్మకాల రూపంలో పెరిగిన నగదు ప్రవాహం, ఆర్థిక సంస్థల నుంచి నిధుల మద్దతు.. ఇవన్నీ ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు సానుకూలించే అంశాలుగా పేర్కొంది. డెవలపర్లు ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ప్రయత్నిస్తున్నారని, ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయాల భారం పెరుగుతుందని వివరించింది. ‘‘షెడ్యూల్ ప్రకారం 2023లో టాప్–7 పట్టణాల్లో 5.6 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు స్వాధీనం చేయాల్సి (డెలివరీ) ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికం’’అని అనరాక్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో.. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో డెవలపర్లు 23,800 ఇళ్లను ఈ ఏడాది నిర్మించి కొనుగోలుదారులకు ఇవ్వాల్సి ఉంది. క్రితం ఏడాది ఇలా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సి యూనిట్ల సంఖ్య 11,700గా ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఎక్కువ ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,70,100 ఇళ్లను ఈ ఏడాది డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై ఎంఎంఆర్లో 1,31,400 యూనిట్లను పూర్తి చేసి ఇవ్వాలి. ఇదీ చదవండి: తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు! -
టిడ్కో ఇళ్ల పరిశీలన అంటూ ప్రకటన.. మచిలీపట్నం టూర్కు బాబు వెనుకడుగు
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం పర్యటనను ప్రతిపక్ష నేత చంద్రబాబు రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 12న బుధవారం సాయంత్రం మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. రోడ్ షోలో భాగంగా చింతగుంటపాలెం గో సంఘం వద్ద ఉన్న జీ+3 టిడ్కో గృహాలను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్కడ జీ+3 గృహాలు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసింది. స్థానిక టీడీపీ నేతలు ఈ గృహ సముదాయాల పనులను పరిశీలించారు. దీంతో చంద్రబాబును ఇక్కడకు తీసుకువస్తే ప్రజల చేతిలో భంగపాటు తప్పదని అంచనాకు వచ్చారు. నిర్మాణాలు పూర్తవడంతో చంద్రబాబు పరువుపోవడం ఖాయమని భావించిన టీడీపీ నేతలు ఆయన పర్యటనను రద్దు చేయించారు. నాడు: చంద్రబాబు హయాంలో 2019 నాటికి రుద్రవరంలోని జీ+3 గృహాల నిర్మాణ పరిస్థితి ఇది చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా గృహాలు నగరంలోని గోసంఘం, రుద్రవరం ప్రాంతాల్లో జీ+3 గృహాల నిర్మాణం పనులకు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో శ్రీకారం చుట్టారు. గోసంఘంలో 18 బ్లాక్ల్లో 864 గృహాలు నిర్మించాల్సి ఉండగా 14 బ్లాక్లను మాత్రమే నిర్మించారు. నాలుగు బ్లాక్ల పనులు చేపట్టనేలేదు. ఈ గృహాల్లో ఫ్లోరింగ్, కరెంటు, నీటి సదుపాయం తదితర మౌలిక వసతుల పనులు ప్రారంభించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన నాలుగు బ్లాక్లను నిరి్మంచి, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసింది. గృహాల నిర్మాణ పనులకు రూ.53.93 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.13.15 కోట్లు వెచ్చించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేడు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుద్రవరంలో నిర్మించిన జీ+3 గృహాలు, ముమ్మరంగా సాగుతున్న రహదారి పనులు రుద్రవరంలోనూ అంతే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రుద్రవరంలో 30 బ్లాక్ల్లో 1,440 గృహాలు నిర్మించాల్సి ఉండగా కేవలం రెండు బ్లాక్ల జీ+2 పనులు మాత్రమే చేశారు. 28 బ్లాక్లకు సంబంధించి ఫుట్టింగ్ లెవల్ వరకు మాత్రమే పనులు చేపట్టి అలాగే వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ 30 బ్లాకులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం అన్ని బ్లాక్ల్లో జీ+3 గృహాలను నిర్మించింది. మచిలీపట్నంలోని గో సంఘం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న జీ+3 గృహాలు బ్లాక్ల మధ్య రహదారుల నిర్మాణం, వ్యర్థాలకు సంబంధించిన సివిలేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గో సంఘం, రుద్రవరంల్లో జీ+3 గృహాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇందుకు మచిలీపట్నంలోని వాటర్ వర్క్స్ వద్ద నుంచి పైప్లైన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా జీ+3 గృహాలకు తాగునీరు సరఫరా కానుంది. రెండు చోట్లా తాగునీటిని నిల్వ చేసే సంపులను కూడా నిర్మించారు. గృహాల వద్ద ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. చదవండి: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ పంపిణీకి సిద్ధం చేశాం.. గో సంఘం వద్ద జీ+3 గృహాల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశాం. రుద్రవరంలో అన్ని బ్లాక్ల నిర్మాణం పూర్తయింది. గృహాల్లోని మెట్లు, బాత్రూమ్ల పనులు జరుగుతున్నాయి. అలాగే సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నల్ పైప్లైన్ల నిర్మాణం పూర్తి చేశాం. – ఎం.గణేష్బాబు, ఏఈ -
దుబాయ్కి క్యూ కడుతున్న భారతీయులు.. అక్కడ ఇళ్లకు ఫుల్ డిమాండ్..
దుబాయ్.. ప్రపంచంలోని అందమైన నగరాల్లో ఒకటి. బడా వ్యాపారవేత్తలకు స్వర్గధామం. లగ్జరీ లైఫ్ స్టైల్కు, సంపన్నులకు నిలయం. పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ప్రాంతం. ఆకాశాన్ని తాకినట్లు ఉండే భవనాలు, స్కైస్క్రాపర్లు, బుర్జ్ ఖలీఫా ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణలు. అందుకే ఇక్కడ నివసించేందుకు విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా భారతీయ వ్యాపారవేత్తలు దుబాయ్లో స్థిరపడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడ రూ.కోట్లు పెట్టి ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ గణాంకాల ప్రకారం 2022లో వారికి 16 బిలియన్ దిర్హాంలు.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.35,500 కోట్లు ఆదాయం భారతీయుల వల్లే వచ్చిందంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021తో పోల్చితే(9 బిలియన్ దిర్హాంలు..) ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ముంబైలో అద్దెతో సమానం.. దుబాయ్లో ఖరీదైన ఇళ్లు కొనేవారిలో 40 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. ప్రత్యేకించి ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, పంజాబ్కు చెందిన వారే దుబాయ్లో ఎక్కువగా ఇళ్లు కొంటున్నారు. వీరితో పాటు యూఏఈలో నివసించే భారతీయులు, విదేశాల్లోని భారతీయులు కూడా దుబాయ్లో ఇల్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దుబాయ్లో ప్రాపర్టీస్ కొనేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తికనబర్చడానికి ప్రపంచంతో ఈ నగరానికి ఉన్న కనెక్టివిటీనే ప్రధాన కారణమని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. భారతీయ సంపన్నులు నెలకు రూ.లక్షలు చెల్లించి దుబాయ్లో ఇళ్లు అద్దెకు కూడా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కరోనా సమయంలో 30 శాతం క్షీణించిన రెంటల్ మార్కెట్ ఇప్పుడు మళ్లీ పుంజుకొని 2015-16 స్థాయికి చేరుకుందని వివరించారు. వ్యాపారసంస్థలకు దుబాయ్లో అత్యంత అనువైన వాతావరణం ఉందని, హైదరాబాద్, లండన్ నుంచి ఈ నగరానికి సులభంగా ప్రయాణించవచ్చని జేవీ వెంచర్స్ కో-ఫౌండర్ విశాల్ గోయల్ చెప్పారు. తన భార్య కూడా ఫిన్టెక్ వెంచర్ను దుబాయ్లోనే ప్రారంభించిందని వివరించారు. దుబాయ్లో మంచి ఇళ్లు కొనాలంటే 1.6-1.7 మిలియన్ల దిర్హాంలు.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.3.6 కోట్ల నుంచి రూ.3.8 కోట్లు అవుతుంది. ఒకవేళ మంచి అద్దె ఇల్లు కావాలంటే రూ. 3-3.5 లక్షలు అవుతుంది. ఇక్కడ రెంట్లు భారత్లోని ముంబయితో పోల్చితే నాలుగైదు శాతం మాత్రమే అటు ఇటుగా ఉంటాయని స్థానిక రియల్టర్లు చెబుతున్నారు. గోల్డెన్ వీసా ప్రోగ్రామ్.. ఎక్కవ మంది కార్మికులు, నైపుణ్యం గల నిపుణులు, పరిశోధకుల కోసం గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ను విస్తరించడం కూడా దుబాయ్ రియల్ ఎస్టేట్కు ప్రోత్సాహాన్ని ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దీర్ఘకాల వీసా వల్ల విదేశీయులు యూఏఈలో నివసిస్తూ పని చేసుకోవచ్చు లేదా చదువుకోవచ్చు. వీరికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తోంది ప్రభుత్వం. విదేశీయుల నుంచి డిమాండ్ బాగా ఉండటంతో దుబాయ్లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోందని అక్కడి రియల్టర్లు వివరించారు. దుబాయ్లోని భారతీయ పాఠ్యాంశాలతో కూడిన స్కూళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైనవని, తన పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి దుబాయ్లో స్థిరపడ్డ వ్యాపారవేత్త రాహుల్ భట్టాడ్ చెప్పారు. ఈ నగరం అత్యంత సురక్షితమైందని, క్యాబ్లో బ్యాగ్ని మర్చిపోయినా, డ్రైవర్ మిమ్మల్ని ట్రాక్ చేసి తిరిగి ఇస్తాడని చెప్పారు. తన వృద్ధ తల్లిదండ్రులు కూడా ఈ ఆధునిక నగరాన్ని చూసి ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. చదవండి: మోస్ట్ ఫ్యూచరిస్టిక్ హోటల్ ఇన్ ది వరల్డ్ ఇదే -
దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు
ఇప్పట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపొవడం లేదా ఒకకొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు. ఒకవైపు రష్యా మిసైల్ దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి దక్షిణ ఉక్రెయిన్లోని ఖేర్సన్ బాంబు దాడులకు కేంద్రంగా మారింది. అదీగాక ఈ యుద్ధంలో అత్యంత ఘోరంగా ఖేర్సన్ ప్రాంతం నాశనమైంది. దీంతో రష్యా బలగాలు పట్టణాల్లోకి చొరబడి స్థానిక పౌరులను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు. వారి నివాస స్థలాలను రష్యా బలగాలు ఆక్రమించుకుని వారిని డ్నీపర్ నది వెంబడి పారిపోవాల్సిందిగా పౌరులపై ఒత్తిడి తెస్తున్నారు. పైగా వారికి కనీస ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీన్ని రష్యా బలగాలు తరిలింపు చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ....ఉక్రెయిన్ దళాలతో ముఖాముఖీ తలపడేందుకు రష్యా బలగాలు ఇలా చేస్తున్నాయంటూ ఆక్రోశించారు. నగరవాసులను బలవంతంగా ఖాళీ చేయించి రష్యా బలగాలు అపార్ట్మెంట్లోకి చొరబడుతున్నారని ఆరోపించారు. అలాగే ఖైర్సన్లోని క్లినిక్లు, ఆస్పత్రులు రోగులకు సేవలందించడం లేదని, స్థానికులు కనీస ప్రాథమిక అవసరాల లేమితో అల్లాడుతున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్ బలగాలు ఖైర్సన్ని తిరిగి స్వాధీనం చేసుకోనివ్వకుండా నియంత్రించేలా వంతెనలను కూల్చి ప్రధాన ఆహార పదార్థాలు, ఆయుధాల సరఫరా రవాణాలపై రష్యా మిసైల్ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ వాలెరీ జలుజ్నీ మాట్లాడుతూ...గత కొద్ది రోజులుగా రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసిందన్నారు. ప్రతిరోజు సుమారు 80కి పైగా దాడులు చేస్తోంది. ఒక్క శుక్రవారం రష్యా బలగాలు జరిపిన దాడుల్లో సుమారు తొమ్మిది మంది పౌరులు మరణించగా, 16 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సైనిక సమీకరణలు ఇంకా అయిపోలేదని, సుమారు 3 లక్షల మంది సైనికుల రిజర్వ్ను సమీకరించడమే తమ లక్ష్యం అని పుతిన్ చెబుతున్నారు. -
CRISIL Rating: డిమాండ్ ఉంది.. కానీ ఇల్లు కొనడమే గగనం..
ముంబై: ధరలు పెరిగినా, రుణాలపై వడ్డీ రేట్లు సమీప కాలంలో పెరిగే అవకాశాలున్నా కానీ, ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశంలోని టాప్ 6 నగరాల్లో ఇళ్ల డిమాండ్ 5–10% మేర పెరుగుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021–22 మొత్తం మీద ఇళ్ల డిమాండ్ 33–38% స్థాయిలో వృద్ధి చెంది ఉండొచ్చని అంచనా వేసింది. ఇది కరోనా ముందు నాటి స్థాయిలను అధిగమించినట్టేనని పేర్కొంది. 2020–21లో తక్కువ బేస్ (కనిష్ట స్థాయి) కారణంగా అధిక వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. మూలధన వ్యయాలు అధికంగా ఉండడం, వడ్డీ రేట్లు, స్టాంప్ డ్యూటీని తిరిగి ప్రవేశపెట్టడం ఈ రంగానికి అవరోధాలుగా క్రిసిల్ తెలిపింది. నివాస గృహాల ధరలు పెరుగుతాయి.. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు ప్రధాన పట్టణాల్లో నివాస గృహాల ధరలు 6–10% స్థాయిలో పెరుగుతాయన్నది మా అంచనా. ఎందుకంటే మెటీరియల్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికితోడు డిమాండ్–సరఫరా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి’’అని క్రిసిల్ డైరెక్టర్ అనికేత్ దాని తెలిపారు. కరోనా ముందు డెవలపర్ల వద్ద ఇన్వెంటరీ (అమ్మకానికి సిద్ధంగా ఉన్న యూనిట్లు) 3–3.5%గా ఉంటే.. 6 ప్రధాన పట్టణాల్లో తాజాగా ఇది 2–4% స్థాయిలో ఉన్నట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. పెద్ద రియల్టీ డెవలపర్లు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నారని.. 2022 మార్చి నాటికి వీరి వాటా 24–25%కి చేరిందని తెలిపింది. ఇబ్బందే.. ఇప్పటికే ఆర్బీఐ రెపోరేటు పెంచడంతో బ్యాంకులు హోంలోన్లపై వడ్డీలు పెంచాయి. అంతకు ముందే మెటీరియల్ కాస్ట్ పెరగడంతో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకున్నాయి. దీంతో ఇళ్లు కొనాలనే ఆసక్తి ఉన్నా.. ద్రవ్యోల్బణ పరిస్థుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవడం కష్టంగా మారుతోంది. చదవండి: 5 శాతం పెరిగిన రేట్లు.. హైదరాబాద్లో తగ్గని రియల్టీ జోరు -
ఇళ్ల ధరలకు ఈ ఏడాది రెక్కలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు రెక్కలు విప్పుకోనున్నాయి. సుమారు 30 శాతం మేర పెరుగుతాయని ఎక్కువ మంది డెవలపర్లు భావిస్తున్నారు. ప్రధాన కారణం బిల్డింగ్ మెటీరియల్స్ (నిర్మాణంలో వినియోగించే ఉత్పత్తులు) ధరలు గణనీయంగా పెరగడం వల్ల నిర్మాణ వ్యయం కూడా అధికమైనట్టు వారు చెబుతున్నారు. ఇది ధరలపై ప్రతిఫలిస్తుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ‘రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే 2022’ పేరుతో ఒక సర్వేను 2021 డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 11 మధ్య నిర్వహించింది. సర్వేలో 1,322 మంది డెవలపర్లు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సర్వే అంశాలు ► 60 శాతం మంది డెవలపర్లు 2022లో ఇళ్లు/ఫ్లాట్ల ధరలు కనీసం 20 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్లేనని వీరు చెప్పారు. ► ధరలు 10–20 శాతం మధ్య పెరగొచ్చని 35 శాతం మంది అంచనాగా ఉంది. ► 25 శాతం మంది ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ► మరో 21 శాతం మంది అయితే ధరల పెరుగుదల 30 శాతం వరకు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. ► నిర్మాణ వ్యయాలను తగ్గించడం, జీఎస్టీపై ఇన్పుట్ క్రెడిట్ (రుణాలు) అందించడం, రుణ లభ్యతను పెంచడం, ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని డెవలపర్లు కోరుతున్నారు. ► 92 శాతం మంది ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 96 శాతం మంది నివాస ప్రాజెక్టులను చేపట్టేందుకే ఆసక్తి చూపించారు. ► 55 శాతం మంది వ్యాపారంలో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి ‘‘కరోనా మూడో విడత కొనసాగుతుండడంతో ఈ మహమ్మారి ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం’’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్‡్షవర్ధన్ పటోడియా అన్నారు. చాలా మంది డెవలపర్లు డిజిటల్ టెక్నాలజీకి మళ్లడంపై దృష్టి సారించారని, దీంతో ఆన్లైన్ విక్రయాలు పెరిగినట్టు చెప్పారు. ‘‘39 శాతం డెవలపర్లు 25 శాతం అమ్మకాలను ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఈ ఏడాది ఆన్లైన్ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని పటోడియా చెప్పారు. -
ట్రెండ్కి తగ్గట్టుగా.. పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్లు.. ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడ
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీలు, ప్రాంతం.. ఈ రెండింటికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. ఇక, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా చాలా వరకు నిర్మాణ సంస్థలు రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు ప్రణాళికలు చేస్తున్నాయి. పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నాయి. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లు చేయాలంటే నివాస సముదాయాలకైతే వెయ్యి గజాల వరకు స్థలం అవసరం ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, హిమాయత్నగర్, బేగంపేట, అమీర్పేట్, బర్కత్పుర, తార్నాక, మారెడ్పల్లి, పద్మారావు నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 70 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్టులే. ఎవరికేం లాభమంటే? స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలు త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం వస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ.. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్ల స్థలాల టైటిల్స్ క్లియర్గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటార్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్.. స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. పాత స్థలాల్లో కమర్షియల్ కూడా.. ప్రధాన నగరంలో నిర్మిస్తున్న రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్డుకు ఉండే పాత ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, పాత థియేటర్లున్న ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నారు. గతంలో రోడ్డు మీదుండే హోటళ్లు, పాత ఇళ్లు మెట్రో పిల్లర్ల కారణంగా కొంత ఇరుకుగా మారాయని దీంతో ఆయా స్థలాల యజమానులు రీ–డెవలప్మెంట్కు ముందుకొస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న రోడ్డు వెడల్పు, మున్సిపల్ నిబంధన ప్రకారం రీ–డెవలప్మెంట్ కమర్షియల్ నిర్మాణాలుంటాయి. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్థిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా.. - తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. - పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటికి ట్రెండ్స్కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. - రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. - స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. - స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. చదవండి: ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! హైదరాబాద్ విషయానికి వస్తే..! -
హైదరాబాద్లో అమ్ముడవ్వని ఇళ్లు 12 వేలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్య 12 వేలకు చేరుకుంది. అంతా సవ్యంగా సాగితే వీటిని విక్రయించేందుకు ఎంతలేదన్నా మరో 10 నెలల సమయం పడుతుంది. కరోనా థర్డ్ వేవ్ రాకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ వస్తే.. మరికొంత సమయం పట్టే అవకాశముంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రం గం పూర్తిగా ఐటీ రంగంపైనే ఆధారపడి ఉంది. చదవండి:Work From Home: వీకెండ్ హోమ్స్కు డిమాండ్ -
రెండు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలంలో రెండు రెట్లు పెరిగాయి. మొత్తం 62,800 యూనిట్లు విక్రయమైనట్టు అనరాక్ సంస్థ తెలిపింది. గృహ రుణాలపై తక్కువ రేట్లు, ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు పెరగడం డిమాండ్ పెరిగేందుకు కారణమైనట్టు ఈ సంస్థ విశ్లేíÙంచింది. క్రితం ఏడాది సరిగ్గా ఇదే కాలంలో ఇళ్ల విక్రయాలు 29,520 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, క్రితం త్రైమాసికం ఏప్రిల్–జూన్లో ఇళ్ల విక్రయాలు 24,560 యూనిట్లుగా ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే పట్టణాల్లోని విక్రయాలపై ఓ నివేదికను అనరాక్ బుధవారం విడుదల చేసింది. ఇళ్ల ధరలు ఈ పట్టణాల్లో సగటున 3 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు రూ.5,760గా ఉంది. 2020 సెపె్టంబర్ త్రైమాసికంలో సగటు చదరపు అడుగు ధర రూ.5,600గా ఉండడం గమనార్హం. ఇళ్ల నుంచే కార్యాలయ పని విధానం (డబ్ల్యూఎఫ్హెచ్) నివాస గృహాల డిమాండ్ను నిర్ణయించనున్నట్టు అనరాక్ పేర్కొంది. టీకాలను పెద్ద మొత్తంలో వేస్తుండడంతో ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశానికి వచ్చి ఇళ్లను చూసే వారి సంఖ్య పెరిగినట్టు తెలిపింది. హైదరాబాద్లో నాలుగు రెట్లు అధికం 2021 జూలై–సెపె్టంబర్ కాలంలో హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు నాలుగు రెట్లు అధికంగా నమోదయ్యాయి. 2020 జూలై సెపె్టంబర్లో 1,650 యూనిట్లే అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య 6,735 యూనిట్లు విక్రయమయ్యాయి. చెన్నైలో విక్రయాలు రెట్టింపై 3,405 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో విక్రయాలు 10,220 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 5,200 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై ఎంఎంఆర్ ప్రాంతంలోనూ అమ్మకాలు నూరు శాతానికి పైగా పెరిగి 20,965 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో 58 శాతం అధికంగా 8,550 యూనిట్లు అమ్ముడుపోయాయి. -
గ్రేటర్ గృహాలంకరణ
కొబ్బరి, కొన్ని కాయగూరలు తురమడానికి వంటింట్లో తురుము పీటను ఉపయోగిస్తాం. వీటిల్లో హ్యాండిల్ ఉన్నవి, గుండ్రటి, పొడవాటి, డబ్బా పరిమాణంలో ఉన్న గ్రేటర్స్ (తురుమేవి) మార్కెట్లో రకరకాల మోడల్స్లో లభిస్తుంటాయి. ముచ్చటపడో, అవసరానికో తెచ్చుకున్నా ఇవి పదును పోయి సరిగ్గా తురమకపోతే పాతసామాన్లలో పడేయాల్సిందే. అయితే అలా కాకుండా వీటిని గృహాలంకరణకు ఉపయోగించుకోవచ్చు! ఇంటికి వచ్చిన వారు.. రూపు మారిన ఈ గ్రేటర్స్ని అబ్బురంగా చూసి మిమ్మల్ని ‘గ్రేట్’ అనాల్సిందే. ►కరెంట్ పోయినప్పుడో.. క్యాండిలైట్ డిన్నర్కో గాలికి కొవ్వుత్తులు ఆరిపోతుంటే డబ్బా రూపంలో ఉండే గ్రేటర్ను లాంతరుబుడ్డీలా ఉపయోగించాలి. బాల్కనీలో విద్యుద్దీపాలను అందంగా అలంకరించడానికి ఇదో చక్కని మార్గం. ►చిన్న డబ్బాలా ఉండే చీజ్ గ్రేటర్లో రకరకాల పువ్వులను అమర్చి టేబుల్ మీద పెడితే అందమైన వేజ్ సిద్ధం. ►గ్రేటర్ డబ్బాను పెయింటింగ్తో అందంగా అలంకరించి.. దానికి చెవి రింగులు, హ్యాంగింగ్స్ సెట్ చేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద అమర్చుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. ►ఉడెన్ స్పూన్లు వేయడానికి సరైన హోల్డర్ లేకపోతేనేం.. తురుము డబ్బాను ఉపయోగించుకోవచ్చు. ►బోసిపోయిన వాల్ను ముచ్చటైన ఫ్రేమ్తో అలంకరించాలంటే.. నలు చదరంగా ఉండే ప్లేట్ లాంటి గ్రేటర్పైన చిన్న పెయింట్ వేసి అమర్చాలి. -
ఇళ్లపై తగ్గనున్న జీఎస్టీ భారం
న్యూఢిల్లీ: నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించేందుకు మంత్రుల బృందం తొలి భేటీలోనే సానుకూలత వ్యక్తం చేసింది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అధ్యక్షతన మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ గత నెలలో ఏర్పాటు చేసింది. జీఎస్టీ విధానంలో రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిశీలించి, పన్ను రేట్లపై సూచనలు చేసే బాధ్యతలు అప్పగించింది. ఈ మంత్రుల బృందం తొలి సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. వారం రోజుల్లోపే నివేదికను సిద్ధం చేసి వచ్చే వారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముందుంచనున్నట్టు ఓ అధికారి తెలిపారు. పన్ను రేట్లను తగ్గించేందుకు మంత్రుల బృందం సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లపై (పూర్తయినట్టు ధ్రువీకరణ జారీ చేయని వాటిపై) ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయంతో అమలు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరణ ఇచ్చిన ఇళ్లపై కొనుగోలుదారుల నుంచి జీఎస్టీని వసూలు చేయడం లేదు. అయితే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయాన్ని బిల్డర్లు వినియోగదారులకు బదిలీ చేయడం లేదని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ అంశాలను పరిశీలించి తగిన సూచనలకు గాను జీఎస్టీ కౌన్సిల్ జనవరి 10న మంత్రుల బృందాన్ని నియమించింది. జీఎస్టీ తగ్గిస్తే ఇళ్ల అమ్మకాలు రయ్: క్రెడాయ్ నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీని తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని రియల్టర్ల సంఘం క్రెడాయ్ పేర్కొంది. అధిక జీఎస్టీ రేటు 12 శాతం, 8 శాతం ఉండడంతో ఇళ్ల కొనుగోలును ప్రస్తుతం వాయిదా వేసుకుంటున్నట్టు క్రెడాయ్ ప్రెసిడెంట్ జక్సేషా తెలిపారు. జీఎస్టీ తగ్గిస్తే కొనడం ప్రారంభిస్తారని అభిప్రాయపడ్డారు. -
పట్టాలెక్కిన రియల్టీ!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2018 క్యూ1లో ప్రారంభమైన గృహాల్లో 74 శాతం అందుబాటు గృహాలే. 24,600 గృహాలు రూ.80 లక్షల లోపు ధరవేనని అన్రాక్ ప్రాపర్టీస్ కన్సల్టింగ్ నివేదిక తెలిపింది. వేగవంతమైన అనుమతులు, విధానపరమైన నిర్ణయాలతో రియల్టీ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొందని అన్రాక్ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. కొత్త విధానాలతో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెరిగిందని చెప్పారు. విక్రయించబడకుండా ఉన్న ఇన్వెంటరీ గణాంకాల్లోనూ 2 శాతం తగ్గుదల నమోదైంది. 2017 క్యూ4లో 7.11 లక్షల ఇన్వెంటరీ ఉండగా.. 2018 క్యూ1 నాటికవి 7.27 లక్షల యూనిట్లకు తగ్గాయి. ముంబై మినహా ఇతర నగరాల్లో వృద్ధి.. కొత్త యూనిట్ల ప్రారంభాల్లో ముంబై మినహా మిగిలిన అన్ని నగరాల్లోనూ వృద్ధి నమోదైంది. ముంబైలో క్యూ4లో 11,500 యూనిట్లు ప్రారంభమైతే.. క్యూ1 నాటికవి 25 శాతం తగ్గుదలతో 8,600లకు పడిపోయాయి. కోల్కతాలో క్యూ4లో 1,600 యూనిట్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 306 శాతం వృద్ధితో 6,500 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో 3,500 యూనిట్లు అందుబాటు గృహాలే. బెంగళూరులో 3,000 యూనిట్ల నుంచి 127 శాతం వృద్ధితో 6,800 యూనిట్లకు పెరిగాయి. చెన్నైలో 1,000 యూనిట్ల నుంచి 110 శాతం వృద్ధితో 2,100 యూనిట్లు, ఎన్సీఆర్లో 3,800 యూనిట్ల నుంచి 14 శాతం వృద్ధితో 4,500 యూనిట్లుకు, పుణెలో 1,700 యూనిట్ల నుంచి 7 శాతం వృద్ధితో 2,200 యూనిట్లకు పెరిగాయి. చెన్నై మినహా ఇతర నగరాల్లో వృద్ధి.. 2018 క్యూ1 అమ్మకాల్లో చెన్నై మినహా అన్ని నగరాల్లోనూ వృద్ధి కనిపించింది. ఇక్కడ క్యూ4లో 2,600 యూనిట్లు విక్రయం కాగా.. క్యూ1లో 2,300లకు తగ్గాయి. కోల్కతాలో క్యూ4లో 2,400 యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ1 నాటికి 42 శాతం వృద్ధితో 3,400లకు పెరిగింది. బెంగళూరులో 10 వేల యూనిట్ల నుంచి 15% వృద్ధితో 11,500లకు, ఎన్సీఆర్లో 8,200 యూనిట్ల నుంచి 11 శాతం వృద్ధితో 9,100లకు, ముంబైలో 11 వేల నుంచి 12 శాతం వృద్ధితో 12,300లకు, పుణెలో 5,900ల నుంచి 15 శాతం వృద్ధితో 6,800ల యూనిట్లకు పెరిగాయి. నగరంలో 30% తగ్గిన ప్రారంభాలు.. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో 2018 క్యూ1లో 33,300 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో 66 శాతం యూనిట్లు కేవలం ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. హైదరాబాద్లో కొత్త నివాసాల ప్రారంభాల్లో 30 శాతం తగ్గుదల నమోదైంది. 2017 క్యూ4లో నగరంలో 3,700 గృహాలు ప్రారంభం కాగా.. 2018 క్యూ1 నాటికి 30 శాతం తగ్గుదలతో 2,600 యూనిట్లే ప్రారంభమయ్యాయి. నగరంలో 3% పెరిగిన విక్రయాలు.. 2018 క్యూ1లో 49,200 యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 80 శాతం యూనిట్లు కేవలం ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లోనే జరిగాయి. హైదరాబాద్లో అమ్మకాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది క్యూ4లో నగరంలో 3,700 అమ్మడుపోగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 3,800లకు పెరిగింది. -
నీళ్ల పైపులో నివాసం.. విలాసవంతమైన ఇళ్లు!
నీళ్ల పైపులో ఎక్కడైనా నివాసముంటారా? అందులో విలాసవంతమైన ఇళ్లు కూడా ఉంటాయ? అని విస్తుపోతున్నారా? ఔను.. నిజమే నీళ్లపైపులోనూ హాయిగా నివాసముండవచ్చునని ఓ హాంగ్కాంగ్ ఆర్కిటెక్చర్ నిరూపించారు. ఆయన తాజాగా ట్యూబ్ హోమ్స్ సృష్టించారు. ఇవి మాములు ఇళ్లు కావు.. విలాసవంతమైన హంగులతో, కేవలం 8.2 అడుగుల వెడల్పుతో ఉండే ఈ ఇళ్లు. ఇందులోని సోఫానే మంచంగా కూడా వాడుకోవచ్చు, షవర్తో కూడిన బాత్రూం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. అయినా శుభ్రంగా ఇల్లు కట్టుకోక.. ఎందుకు ఈ ఇరుకు పైపుల్లో అంటారా? హంగ్ కాంగ్లో పెరిగిపోతున్న జనాభాకు సరిపడా ఇళ్లు లేవు. ఈ సమస్యను అధిగమించాడానికే జేమ్స్ లా అనే వ్యకి వీటిని రూపొందించారు. ఈయనో పెద్ద ఆర్కిటెక్.. సౌకర్యాలు... ఈ పైపు ఇంట్లో విలాసవంతమైన సౌకర్యాలకు ఏం కొదవ లేదు. ఈ చిన్ని ఇంట్లో కూర్చోడానికి సోఫా ఉంటుంది. మడత తీస్తే అదే మంచంగా ఒదిగిపోతుంది. దాంతోపాటు మిని ఫ్రీజ్ కుడా ఉంది. ఇంకా స్నానం చేయడానికి షవర్తో కూడిన బాత్రూం అందుబాటులో ఉంది. ప్రశాంతంగా సోఫాలో కుర్చోని టీవీ కూడా చూసేయొచ్చు. ఉపయోగాలు.. ఈ ట్యూబ్ హోమ్స్తో చాలా ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు జేమ్స్ లా. హంగ్ కాంగ్లో జనాభా పెరిగిపోయింది. ఉండాటానికి ఇళ్లు సరిపడా లేవు. ఉన్నా వాటిని కొనుగోలు చేయాలంటే.. చాలా ఖరీదుతో కూడిన వ్యవహరం. చాలా మంది ఇల్లు కట్టుకోలేక, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అక్కడ అద్దె కుడా చాలా ఎక్కువ. చాలా మంది ప్రజలు ఇరుకైన ఇళ్లలో అధిక అద్దెను చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారి కోసం, దేశంలోని నివాసాల కొరతను తగ్గించడానికే తను ఈ ట్యూబ్ ఇళ్లను కనిపెట్టినట్టు చెబుతున్నారు జేమ్స్ లా. మరీ ధర సంగతి.. ఈ చిన్న చిన్న ఇళ్లు మధ్య తరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, వీటి ధర కుడా చాలా చౌకేనని అంటున్నారు వీటి రూపకర్త జేమ్స్ లా. వీటి ధర 15000 డాలర్లు మాత్రమే. సాధారణంగా హంగ్ కాంగ్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు 1.8 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. దాంతో పోల్చి చూస్తే ఇది చాలా చౌక. వీటిని ఎక్కడా కట్టుకోవచ్చు? ఈ ట్యూబ్ హోమ్స్ నిర్మించే ఒక్కో పైపు బరువు 22 టన్నులు ఉంటుంది. వీటిని ఒక దానిపై ఒకటి పెట్టుకోవచ్చు. అలా పెట్టేటప్పుడు వాటికి బోల్ట్ కూడా బిగించాల్సిన అవసరం లేదు. పనికిరాని ప్రదేశాలలో, భవనాల మధ్య ఖాళీ స్థలంలో, హైవే ఫ్లైఓవర్ల కింద, బ్రిడ్జిల కింద కుడా వీటిని అమర్చవచ్చు. అధికారుల నుంచి అనుమతులు రాగానే వీటిని తయారుచేసి విక్రయిస్తాం అన్నారు. ఇప్పటికైతే ఈ పైపు ఇల్లు నమునాగానే ఉన్న భవిష్యత్తులో నిజం కాబోతుంది. ట్యూబ్ హోమ్స్కు సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం.. -
వచ్చే ఎన్నికల్లోగా 12 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రంలోని పేదలకు 12 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర మిషన్, ఎన్టీఆర్ గ్రామీణ గృహ ప్రవేశాలు, చంద్రన్న బీమా పథకాల అమలుపై సోమవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. తన మనవడు దేవాన్ష్తో కలసి సీఎం తొలుత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిసందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన లక్ష ఇళ్లకు.. గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రూ. 16 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఒకే రోజు లక్ష గృహప్రవేశాలతో దేశంలోనే రాష్ట్రం ఒక చరిత్ర సృష్టించిందన్నారు. ఎక్కడా పైసా అవినీతి లేకుండా ఈ ఇళ్లను నిర్మించామన్నారు. ఇల్లు, బిల్లు మంజూరు చేసే విషయంలో ఎవరైనా లంచం అడిగితే 1100 కాల్ సెంటర్కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చేస్తున్నామని, ఆ ఫొటోలు అప్లోడ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వచ్చే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు లక్ష, వచ్చే జూన్ 8వ తేదీన మరో లక్ష ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ప్రపంచానికి మహాత్ముడు ఆదర్శం.. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. గాంధీజీ ఒక మహానాయకుడే కాదు ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మహాశక్తి అని కొనియాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకున్నారన్నారు. చరిత్ర ఉన్నంత కాలం మహాత్ముణ్ణి ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటుందన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కడు పేదరికాన్ని అనుభవిస్తూ విద్యాభ్యాసం చేశారని చెప్పారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చురుగ్గా పనిచేసిన 91 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావును బాబు సత్కరించారు. -
గంటల్లో గూళ్లు రెడీ!
వావ్ ఫ్యాక్టర్ పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నా, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నిర్వాసితులయ్యే వారికి తాత్కాలికంగానైనా ఒక గూడు కల్పించాలన్నా ఎంత శ్రమో మనకు తెలియంది కాదు. ఈసమస్యకు ఇప్పటికే ఎందరో ఎన్నో రకాల పరిష్కార మార్గాలు చూపారు. తాజాగా చార్లెస్ అనే ఓ ఆర్కిటెక్ట్ ‘లైఫ్ ఆర్క్’ పేరుతో ఇంకో వినూత్నమైన సమాధానాన్ని సూచిస్తున్నారు. ఫొటోలోకనిపిస్తున్నవన్నీ నీటిపై ఏర్పాటు చేసిన ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు. వీటిని ఒకదానితో ఒకటి జతచేసుకుంటూ, ఒకేదగ్గర కాలనీలా, ఒక పల్లె మాదిరిగా ఏర్పాటు చేసుకోవచ్చు. హెచ్డీపీఈ పదార్థంతో రొటేషనల్ మౌల్డింగ్ అనే టెక్నాలజీతో సిద్ధమయ్యే ప్యానెళ్లను నట్లు, బోల్టులతో జోడించుకోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. ఒక్కో ఇంటికి కంటెయినర్ బాక్స్లోకి సులువుగా ఇమిడిపోయే దాదాపు 24 ప్యానెళ్ల అవసరముంటుంది. అన్నింటినీ కాలిఫోర్నియాలోని తన ఫ్యాక్టరీలోనే తయారు చేస్తున్నారు చార్లెస్. ప్యానెళ్లు తయారైన తరువాత వంటింటి అరుగు, ఎలక్ట్రిక్ వైరింగ్ వంటి అదనపు హంగులనుఇంకో ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ఇళ్లు దాదాపుగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. అంటే విద్యుత్తు, నీళ్లు వంటి అవసరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు వీటిల్లోనే ఉన్నాయన్నమాట. నీటిపైనే కాకుండా నేలపై కూడా సునాయాసంగా కొన్ని గంటల వ్యవధిలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కోటి అరవై చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంటాయి. ప్రస్తుతం అక్కడికక్కడే కాయగూరలు పండించుకునేందుకు కూడా ఈ లైఫ్ఆర్క్ ఇంట్లో హైడ్రోపోనిక్స్ ఏర్పాట్లు ఉన్నాయి. చార్లెస్ ఫ్యాక్టరీలో రోజుకు పది ఇళ్లకు సరిపడ ప్యానెళ్లు సిద్ధమవుతున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే వీటిని వచ్చే మార్చి నాటికి డల్లాస్, టెక్సాస్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ చౌక ఇళ్లను అమ్మడం ద్వారా వచ్చే లాభాలతో మరిన్ని లైఫ్ఆర్క్లు నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నిర్వాసితులైన వారికి, శరణార్థి శిబిరాల ఏర్పాటుకూ ఉపయోగిస్తామంటున్నారు చార్లెస్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అందరికీ ఇళ్లు, వాహనాలు
విజన్ 2031–32 రూపొందించిన నీతి ఆయోగ్ న్యూఢిల్లీ: వచ్చే 15 ఏళ్లలో ప్రజలందరికీ సకల సదుపాయాలు కల్పించి, దేశానికి కొత్త రూపు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. 2032కల్లా అందరికీ అందుబాటులో గృహాలు, ద్విచక్ర వాహనాలు లేదా కార్లు, పవర్, ఎయిర్ కండీషన్లు, డిజిటల్ కనెక్టివిటీని అందుబాటులోకి తేవాలనుకుంటోంది. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఈ మేరకు ఓ విజన్ రూపొందిం చింది. 2031–32 పేరుతో తీసుకొచ్చిన ఈ విజన్ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా గవర్నింగ్ కౌన్సిల్ ముందు ఉంచారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం జరిగిన భేటీలో పనగారియా దీన్ని ప్రజెంట్ చేశారు. పూర్తిస్థాయి అక్షరాస్యత గల సమాజాన్ని ఏర్పాటుచేసి, ప్రపంచస్థాయి సౌకర్యాల నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు అన్నీ ప్రజలకు అందించాలని నీతి ఆయోగ్ ఈ విజన్ను రూపొందించింది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో నాణ్యమైన గాలి, నీటి సదుపాయాలు, అత్యాధునిక రోడ్లు, రైల్వేలు, ఎయిర్ కనెక్టివిటీ విస్తరింపజే యాలని పేర్కొంది. 2015–16లో ఉన్న ఒక్కొక్కరి తలసరి ఆదాయాన్ని రూ. 1.06 లక్షల నుంచి మూడింతలు పెంచి 2031–32కల్లా రూ. 3.14 లక్షలకు చేర్చాల ని ప్రతిపాదించింది. అంతేకాక, స్థూల దేశీయోత్పత్తిని రూ. 137 లక్షల కోట్ల నుంచి రూ. 469 లక్షల కోట్లకు పెంచాలన్నది లక్ష్యంగా నీతి ఆయోగ్ నిర్దేశించింది. -
ప్రజా సంక్షేమం పట్టదా..?
గరుగుబిల్లి : దేశంలో లెక్కకు మిక్కిలి చట్టాలు వస్తుంటాయి. కానీ వాటిలో ఎన్ని సక్రమంగా అమలవుతున్నాయంటే వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పొచ్చు. చట్టాలను చేయడంలో పాలకులు ఎంత ముందుంటారో, అవే చట్టాలను అమలు చేయడంలో అధికారులు అంత వెనక ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీన్నే అలుసుగా తీసుకుని అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి అక్రమ వ్యాపారాలను వ్యాప్తి చేస్తున్నారు. వీటికి చక్కని ఉదాహరణ గరుగుబిల్లి మండలంలోని కొంకడివరం గ్రామ పరిధిలో ఏర్పాటైన క్వారీలు. నిబంధనలను గాలికొదిలి.. కొంకడివరంలో ఏర్పాటు చేసిన క్వారీలు అన్ని అక్రమంగా ఏర్పాటు చేసుకున్నవేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి అడ్డగోలు అనుమతులిచ్చి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. అనుమతులు మంజూరు చేసిన అధికారులు ప్రజా సమస్యలు ఏంటో తెలుసుకోవాలన్న సత్యాన్ని పక్కన పెట్టేశారు. దీనికి కారణం జిల్లా అధికార పార్టీ పెద్దల ఒత్తిడే అన్నది బహిరంగ రహస్యం. దీంతో క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండిపోతున్నారు. ఇష్టా రీతిన పనులు చేయిస్తున్న క్వారీల యజమానులు.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో, మామూళ్లు ఇచ్చి క్వారీ అనుమతులు తెచ్చుకున్న వ్యాపారులు లాభాల కోసం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలకు చేటు తెస్తున్నారు. జనం వీటిపై కలెక్టర్, మైనింగ్, కాలుష్య నివారణ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి వ్యాపారులను బ్లాస్టింగ్, క్వారీయింగ్ పనులు చేయనీయకుండా చేయగలిగారు. రెండు నెలల నుంచి పనులు నిలిచిపోయాయి. కానీ వ్యాపారులు మాత్రం స్థానికులపై మానసికంగా, శారీరకంగా భయపెడుతున్నట్లు సమాచారం. ఇబ్బందుల్లో ప్రజలు, విద్యార్థులు.. కొంకడివరం సమీపంలో రెండు క్వారీలకు రెండు స్టోన్ క్రషర్లకే అనుమతులున్నాయి. కానీ వారు బాస్టింగ్స్ నిర్వహిస్తుండడంతో అంగన్వాడీ, పాఠశాల, ఇళ్ల భవనాలు బీటలు వారుతున్నాయి. ప్రజలు, విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మూగ జీవాల ప్రాణనష్టం కూడా ఎక్కువే. దీనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సర్వే చేసిన తహసీల్దార్ క్వారీలు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నట్లు నివేదికలో తేల్చిచెప్పారు. శ్రీ సత్యదుర్గా స్టోన్ క్రషర్ యాజమాన్యం సర్వే నంబర్ 4–3లో అనుమతులకు మించి 74 సెంట్లు, సర్వే నంబర్ 4 – 14లో 48 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అలాగే సర్వే నంబర్ 86–1లో ఉన్న కొమ్ముదువాని చెరువులో 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేసినట్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచ్ కొద్ది రోజులుగా ఆ రోడ్డును మూసివేసి రాకపోకలు నిలిపేశారు. ఇష్టానుసారంగా బ్లాస్టింగ్స్.. క్వారీ యజమానులు ఎక్స్ప్లోజివ్స్ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉండగా అవేమి చేయకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. వీరు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ వారితో బ్లాస్టింగ్స్కు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి విఘ్నేశ్వర సంస్థవారు లావేరు మండల పరిధిలో మాత్రమే బ్లాస్టింగ్స్ చేసుకునేందుకు అనుమతులున్నాయి. వ్యాపారుల కొమ్ముకాస్తున్న అధికారులు.. క్వారీల నుంచి రక్షించాలని అధికారుల వద్దకు వెళ్తే ఆ యజమానుల దగ్గర మామూళ్లు తీసుకుని ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. ఇప్పటికే 15 మంది వరకు కేసులు పెట్టారు. జిలెటిన్ స్టిక్స్ దొరికినా కూడా చర్యలు శూన్యం . బ్లాస్టింగ్స్తో నష్టాలు.. పేలుళ్ల సమయంలో రాళ్లు తగిలి ప్రాణాలు పోయే అవకాశం, బీటలు వారుతున్న ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పశువులకు మేత కరువు, ప్రాణ నష్టం కూడా, జనం రాకపోకలకు ఇబ్బందులు, క్రషింగ్ సమయంలో రాతి ధూళి, దమ్ము వలన వ్యాధులు వచ్చే అవకాశం, పనుల నిమిత్తం తిరిగే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం, ప్రజల కోసం నిర్మించిన రోడ్లు పాడవుతుండడం, పంట పొలాలు, తోటలు నాశనం అవుతుండడం. -
భాగ్యనగరిలో వాటర్ ఫ్రంట్ ఫేజ్–2, సితార గృహాలు
జనప్రియ సైనిక్పురిలో 5.50 ఎకరాల్లో సితార ప్రాజెక్ట్ను ప్రకటించింది. ఇందులో 4 భవనాల్లో 10 అంతస్తుల్లో మొత్తం 1,078 గృహాలను నిర్మించనుంది. 580– 865 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రారంభ ధర రూ.14.90 లక్షలు. కస్టమర్లు కోరితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), బ్యాంకు రుణాలను కూడా కంపెనీనే ఇప్పిస్తుందని జనప్రియ ఈడీ రవి కిరణ్ రెడ్డి చెప్పారు. రానున్న 5 నెలల్లో మియాపూర్లో 2,000 ఫ్లాట్లు, నాచారంలో 1,000 ఫ్లాట్లు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. • ప్రజయ్ ఇంజనీర్స్ షామీర్పేటలో 27.18 ఎకరాల్లో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్–2ను ప్రకటించింది. ఇండిపెండెంట్ గృహాలు 100–120, జీ+1 గృహాలు 500 వరకు నిర్మించనుంది. ఏప్రిల్లో 100 గృహాలను నిర్మాణ పనులను ప్రారంభించనుంది. ప్రారంభ ధర రూ.16.20 లక్షలు. వచ్చే రెండేళ్లలో మహేశ్వరంలో వర్జిన్ కౌంటీ ప్రాజెక్ట్లో 1,500, కుంట్లూరులో గుల్మోర్ ప్రాజెక్ట్లో 150 గృహాలు, ఘట్కేసర్లో విన్సర్పాక్ ప్రాజెక్ట్లో 1,200 గృహాలను నిర్మిస్తామని సంస్థ సీఎండీ విజయ్సేన్ రెడ్డి తెలిపారు. -
తాళం పగులగొట్టి చోరీలు
ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు గుంటూరు (పట్నంబజారు): ఎవరూ లేని ఇళ్లకు వెళ్లి చాకచక్యంగా తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని రూరల్ జిల్లా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫెరెన్స్ హాలులో మంగళవారం రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్ వివరాలను మీడియాకు వెల్లడించారు. నెల్లూరు జిల్లా డైకాస్ రోడ్డుకు చెందిన షేక్ ఫయాజ్ దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం సత్తెనపల్లిలో నివాసం ఉంటున్నాడు. 2015 సంవత్సరంలో ములోషాద్నగర్లో ఓ దొంగతనం కేసులో అరెస్టు అయినప్పుడు రంగారెడ్డిజిల్లా మహరాజ్పేట ఏరుకుంట తండాకు చెందిన విస్లావత్ రామునాయక్తో పరిచయం ఏర్పడింది. ఈసంవత్సరం జైలులో నుంచి బయటకు వచ్చిన ఫయాజ్, రామునాయక్లు గుంటూరు జిల్లాతోపాటు, ప్రకాశం, రాజమండ్రి, తణుకు, బొమ్మూరు, తదితర ప్రాంతాల్లో 15కు పైగా దొంగతనాలు చేశారు. ముందుగా ఇద్దరూ పక్కా రెక్కి నిర్వహించి ఇంటికి తాళాలు వేసే నివాసాలను గమనిస్తారు. రాత్రి సమయాల్లో తాళాలు పగులగొట్టి వస్తువులు దోచుకుపోతారు. వివిధ ప్రాంతాల్లో ఏడు కార్లు సైతం దొంగిలించుకు పోయారు. గుంటూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు, కార్లు చోరీ జరుగుతుండడంతో ప్రత్యేక దృష్టి సారించిన రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పిడుగురాళ్ళలోని కొండమోడు జంక్షన్ వద్ద ఫయాజ్, రామునాయక్లు మంగళవారం కారులో వెళుతుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాన్ని బయటపెట్టారు. పూర్తి స్థాయిలో చేసిన దొంగతనాల వివరాలను వివరించి, చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి ఏడు కార్లు, బంగారు ఆభరణాలు, మొత్తం రూ. 30,26,000 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో సైతం ఫయాజ్ ఒక హత్య, యాసిడ్ దాడి కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన క్రైమ్ డీఎస్పీ ఎన్.కృష్ణకిషోర్రెడ్డి, పిడుగురాళ్ళ సీఐ హనుమంతరావు, క్రైమ్ సీఐ ఎం.నాగేశ్వరరావు, ఎస్సై పి.కిరణ్, కానిస్టేబుళ్లను అభినందించారు. -
గూడు చెదిరె.. గోడు మిగిలె..
* సజ్జవారిపాలెంలో రహదారి పక్కన 40 ఇళ్ల కూల్చివేత * పోలీసుల సాయంతో ఆర్అండ్బీ అధికారుల జులుం * నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని నిర్వాసితుల ఆవేదన * మగ పోలీసులే మహిళలను ఈడ్చేచిన వైనం * రోడ్డున పడిన కుటుంబాలు వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేదలు.. కూలి పనులకు వెళ్లి కడపు నింపుకొనే అభాగ్యులు.. దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా వారి జీవనం.. ఉండేందుకు కొంత చోటే వారికి ఆధారం.. నలభై ఏళ్ల నుంచి అక్కడ గూడు నిర్మించుకొని బతకుడీస్తున్న దీనులపై ‘ఖాకీ’ క్రౌర్యం ప్రదర్శించింది.. ‘అధికారం’ అరాచకం సృష్టించింది.. ఉన్నపళ్లంగా గూళ్లు వీడి పోవాలని హుకుం జారీ చేసింది.. అన్నంత పనీ చేసింది. దిక్కు మొక్కులేని జనాలగోడు కన్నీటి సంద్రమైంది. – సజ్జావారిపాలెం(నగరం) నగరం మండలంలోని సజ్జావారిపాలెనికి నలభై ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు వచ్చాయి. ఉండేందుకు రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నాయి. అక్కడే జీవనం సాగిస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత రహదారి అభివృద్ధి పేరుతో ఆర్అండ్బీ అధికారులు వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఆదివారం పోలీస్ బలగాలతో వచ్చి 40 ఇళ్లు కూల్చివేయించారు. దీంతో నిర్వాసితులు ఆవేదనతో అడ్డుపడ్డారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాసితులకు సీపీఎం నాయకులు మద్దతు ఇచ్చి వెంట నిలబడ్డారు. సుమారు గంటకుపైగా నిర్వాసితులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జులం.. రహదారి పక్కన నివసిస్తున్న పేదలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇళ్లు కూల్చివేతను అడ్డుకున్న మహిళలను సైతం మగ పోలీస్లే పక్కకు నెట్టి ఈడ్చుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇష్టానుసారంగా కర్రలతో కోట్టారని నిర్వాసితులు వాపోయారు. నలభై ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న తమకు కనీసం నోటీసులు జారీ చేయలేదన్నారు. పోలీస్ బలగాలతో పొక్లెయిన్లతో వచ్చిన అధికారులు ఇళ్లు కూల్చివేశారన్నారు. నిన్నా మొన్నా రాస్తారోకో చే శామని, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మాట తప్పి ఇలాంటి పనులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నివేశన స్థలాలు చూపించిన తర్వాతే ఇళ్లు తొలగిస్తామని హమీ ఇచ్చి ఇప్పుడు పోలీస్లతో వచ్చి ఇళ్లు కూల్చడం సబబు కాదన్నారు. నిర్వాసితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్న నిర్వాసితులు షేక్ గుల్జార్, సిమ్లా, మౌలాలి, జాన్బీ, కె నాంచారమ్మతో పాటు సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి చిక్కాల మణిలాల్, కె.శరత్బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని నగరం పోలీస్ స్టేషన్కు తరలించారు. నగరం, చెరుకుపల్లి, చోడాయిపాలెం ఎస్.ఐలు బి.అశోక్కుమార్, భాస్కర్, శివాజీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నోటీసులు ఇవ్వకుండా జులుం.. నలభై ఏళ్లు ఇళ్లగా ఇక్కడే నివసిస్తున్నాం. ఇళ్లు తొలగించాలని నోటీస్లు కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. కూలి పనులకు వెళితేనే పూట గడుస్తుంది. ఉన్నపళంగా ఇళ్లు కూల్చితే ఇప్పటికిప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్లాలి. పోలీసులను అడ్డంపెట్టుకుని ఇళ్లు తొలగించడం సమంజసం కాదు. - సుజాత, సజ్జావారిపాలెం -
పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ
నల్లగొండ క్రైం : పట్టణంలోని పానగల్ రోడ్డులోని నందీశ్వర కాలనీలో సోమవారం రెండు ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన శ్రీనివాస్, బి.అంజయ్య ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. దీనిని గమనించిన దుండగులు ఇంటి తాళాలలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాస్ ఇంట్లో 20 తులాల వెండి, 2 తులాల బంగారం, రూ. 2 వేల నగదు, బి.అంజయ్య ఇంట్లో రూ.50 వేలు నగదు, 2 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఇంటి తాళాలలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి స్థానికులు బాధితులకు సమాచారం ఇచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇళ్ల స్థలాలు ఇప్పించాలి
కొల్లాపూర్రూరల్ : గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కొందరు ఆక్రమించారని వాటిని ఇప్పించి ఆదుకోవాలని మండలపరిధిలోని మొలచింతలపల్లి గ్రామం బ్రమరాంబ కాలనీ చెంచులు మంగళవారం తహసీల్దార్ పార్థసారధికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా చెంచు సమాఖ్య అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం సర్వేనంబర్ 299, 212, 228, 259లో స్థలాలు చూపించి పట్టాలు ఇచ్చిందని, వాటిని కొందరు ఆక్రమించారని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రమేష్, సాలమ్మ శివ, మాధవి, ఉమ, లక్ష్మి, అలివేలమ్మ, లక్ష్మి, నిరంజనమ్మ, గంగన్న, బయ్యన్న, రాముడు, సీతమ్మ, చంద్రమ్మ, పుల్లమ్మ, తదితరులు ఉన్నారు. -
వివాదంగా మారిన పూసలకాలనీ సమస్య
ఇరువర్గాల ఘర్షణ ఉదయగిరి: ఉదయగిరి - కావలి రోడ్డు మార్గంలోని పూసలకాలనీలో ఇళ్ల స్థలాల విషయమై బుధవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో గతంలో ఎస్సీలకు ఇందిర ప్రభుత్వ హయూంలో ఇళ్ల స్థలాల్లో పక్కాఇళ్లు నిర్మించి ఇచ్చారు. కానీ ఆనాడు గ్రామ శివా రు అయినందున వారు అక్కడ నివాసం ఉండలేదు. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల క్రితం సంచార జాతులకు చెందిన పూసలి వారు ఆ ఇళ్లలోనే కాపురముంటున్నా రు. కాని ప్రస్తుతం ఉదయగిరి పట్టణం విస్తరించడంతో ఆ స్థలాలకు గిరాకీ పెరిగింది. దీంతో ఎస్సీలు తమ ఇళ్లు ఖాళీ చేయాలని పూసలివారిపై ఒత్తిడి తెస్తున్నారు. 9 నెలల క్రితం రెవెన్యూ అధికారులు ఇరువర్గాలతో మాట్లాడి సర్దుబాటు చేశారు. పూసలకాలనీ వాసులకు ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎస్సీలు తమ స్థలాలకు సంబంధించి సరిహద్దు రాళ్లను నాటే నిమిత్తం బుధవారం పూసల కాలనీకి వెళ్లి పనికి ఉపక్రమించడంతో.. స్థానికులు ప్రతిఘటించారు. దీంతో రెండు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందడంతో సీఐ జె.శ్రీనివాసులు, ఎస్సై విజయకుమార్, పీఎస్సై ప్రతాప్ యాదవ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. దీంతో ఆగ్రహించిన ఎస్సీలు కాలనీ సమీపంలోని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో అక్కడి నుంచి విరమించారు. ఈ ఘర్షణకు సంబంధించి రెండు వర్గాల వారు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వల్పంగా గాయపడిన వారు స్థానిక సీహెచ్సీలో చికిత్స చేయించుకున్నారు. ఎస్సై విజయకుమార్ తహశీల్దార్, ఆర్డీఓలకు సమాచారం అందించినట్లు చెప్పారు. పోలీసుపికెట్ ఏర్పాటుచేశారు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి పూసలకాలనీలో చోటుచేసుకున్న పరిణామాలను నిరసిస్తూ తమకు తక్షణమే రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ ఆ కాలనీకి చెందిన ఎరుకల, యానాది కులాలకు చెందిన వారు బుధవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. -
పిల్లలందరికీ ఒకటే టూత్ బ్రష్!
అంగవైకల్యంతో అవస్థలు పడే పిల్లలకు ఆసరా అందించాల్సిన ప్రభుత్వ హాస్టళ్లు, జీవిత చరమాంకంలో పట్టించుకునేవారు లేక పడరాని పాట్లు పడే వృద్ధుల ఆశ్రమాల పరిస్థితి దయనీయంగా ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ హోమ్స్లో సుమారు 50 మంది పిల్లలు ఒకే టూత్ బ్రష్ వాడుతున్నవైనం తనను ఎంతో బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాధీనంలో కొనసాగుతున్న వికలాంగ బాలల హాస్టళ్ళు, వృద్ధాశ్రమాల్లో పరిస్థితిపై.. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ హెచ్ఎల్ దత్తు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమాలను, హాస్టళ్ళను ప్రతిరోజూ సందర్శిస్తున్న ఆయన... వారికి సరైన సహకారం అందించి వారిలో విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత డిసెంబర్ లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్మన్ గా నియమితులైన తర్వాత.. ప్రతిరోజూ బెంగళూరు సమీపంలోని వృద్ధాశ్రమాలను సందర్శించి వారితో కొంత సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి కథ విన్నానని చెప్పారు. ఆయనకు ఇద్దరు బాగా సంపాదిస్తున్న, ఉన్నత స్థాయిలో ఉన్న కొడుకులు ఉన్నారని, అయితే వారితో కలసి తనకు ఉండే భాగ్యం మాత్రం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం తనను ఎంతో బాధించిందని, అటువంటి వారికి రోజూ కౌన్సెలింగ్ ఇప్పించి, వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉందని జస్టిస్ దత్తు అభిప్రాయపడ్డారు. జస్టిస్ దత్తు ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత... ఇరత సభ్యులు జస్టిస్ సిరియాక్ జోసెఫ్, డి. మురుగేశన్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్సి సిన్హాలతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి.. రాష్ట్రాల్లోని వికలాంగ పిల్లల హాస్టళ్లు, వృద్ధాశ్రమాలను సందర్శించి, ప్రాథమిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వాటి పరిస్థితులను మెరుగు పరిచేందుకు కావలసిన సలహాలు, సూచనలను ఇచ్చేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ వృద్ధాశ్రమాల్లో, వికలాంగ హాస్టళ్ళలో ఉండేవారి జీవితాలు ఆనందమయంగా ఉండేట్టు మార్పులు జరిగితే తన జీవితంలో అదే అత్యంత సంతోషకర సన్నివేశం అవుతుందని జస్టిస్ దత్తు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఇంట్లో గాలి కాలుష్యాన్ని కనుక్కోవచ్చు ఇలా..!
రోజూ మనం ఇంట్లో పీల్చుకునే గాలి ఎంత స్వచ్చమైనదో తెలుసుకునేందుకు.. భారతీయ సంతతి వ్యక్తితో కూడిన జపాన్ శాస్త్రజ్ఞుల బృందం కనుగొంది. గ్రాఫైన్ తయారుచేసిన ఈ సెన్సార్ తక్కువ శక్తిని వినియోగించుకుని మన ఇంట్లోని గాలి ఎంత కలుషితమయిందో తెలియజేస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇళ్లు, ఆఫీస్, స్కూళ్లలో గాలి కాలుష్యం వల్ల కలిగే జబ్బులు పెరిగిపోతున్నాయి. దీనిపై జపాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు. ఎలా పనిచేస్తుంది..? ఇంటిలో ఉన్న వస్తువుల నుంచి విడుదలవుతున్న వాయువులు, కార్బన్ డై ఆక్సైడ్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ గ్యాస్ అణువులు, బిల్డింగ్ ఇంటీరియర్స్ నుంచి విడుదలయ్యే అణువులను సెన్సార్ను ఉపయోగించి పసిగడుతుంది. ఈ సెన్సార్లో వాడిన టెక్నాలజీ వల్ల పీపీఎమ్ల్లో ఉండే అణువులను సైతం ఇది కనిపెడుతుంది. తాము తయారుచేసిన సెన్సార్ ఎంత బాగా పనిచేస్తుందో పరీక్షించడానికి ఒక గదిలో సెన్సార్ను ఉంచి కొద్ది మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ను విడుదల చేసిన కొద్ది సెకన్లలోనే సెన్సార్ అలర్ట్ చేయడం ప్రారంభించింది. వీటితో పాటు అతి తక్కువ విద్యుత్తును తీసుకుని పనిచేసే స్విచ్లను ఈ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ రెండు ఆవిష్కరణలను కలిపి అల్ట్రా లో పవర్ సెన్సార్ సిస్టంను తయారు చేసేందుకు ఈ బృందం అడుగులు వేస్తోంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురించారు. -
ఇంటికి వెలుగునిచ్చే గాజులాంటి చెక్క!
లండన్: ఇంటిని అందంగా తీర్చి దిద్దడంలోనూ, అలంకరణ కోసమేకాక ఇంట్లో వెలుతురు నింపేందుకు గాజు పదార్థాన్నివినియోగించడం ఇప్పటి దాకా చూస్తున్నాం. అలా అమర్చిన గ్లాస్ పగిలి పోకుండా ఎంతో సున్నితంగా చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడిక ఆ భయం లేదంటున్నారు పరిశోధకులు. గృహ నిర్మాణాల్లో గోడలకు, కిటికీలకు వాడే అద్దానికి బదులుగా గాజును పోలి ఉండే పారదర్శకమైన చెక్కను అందుబాటులోకి తెస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టేవారు ఇక ఇంట్లో వెలుతురుతోపాటు, అందాన్ని తెచ్చుకునేందుకు గాజుకంటే బలమైన చెక్కను వాడి డబ్బును ఆదా చేసుకోవచ్చంటున్నారు. ఇంటి గోడల గుండా కాంతి ప్రసరించి ఇల్లు ప్రకాశవంతంగా ఉండేందుకు గృహ నిర్మాణంలో అద్దాలను వాడటం జరుగుతోంది. అయితే ఇప్పుడు అదే స్థానంలో ఎంతో ధృఢంగా ఉండి.. గాజులాంటి పారదర్శకంగా ఉండే చెక్కను వాడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న ఈ పదార్థాన్ని సోలార్ సెల్ విండోగా కూడ వినియోగించవచ్చని బయోమాక్రోమోలెక్యూల్స్ జర్నల్ లో వివరించారు. నిజానికి ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుకునేందుకు, విద్యుత్తును ఆదా చేసేందుకు లేత రంగు అద్దాలను పైకప్పులకు అమర్చుకోవడం, దీపాలను ఆశ్రయించడం చేస్తుంటారు. అయితే ఈ పారదర్శకంగా ఉండే చెక్క తో అటువంటి సమస్యను తీర్చవచ్చని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా గోడలు పారదర్శకంగా ఉంటే కృత్రిమ వెలుగుల అవసరాన్ని తగ్గిస్తాయి. ఇప్పటికే చెక్కనుంచి పారదర్శకమైన కాగితాన్ని తయారు చేస్తుండగా, ప్రస్తుత పరిశోధనల్లో అదే కాగితాన్ని ధృఢంగా, బలమైన పదార్థంగా తయారు చేయడం సాధ్యమని కనుగొన్నారు. స్వీడన్ లోని స్టాకోట్ కెటిహెచ్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బెర్గ్ లండ్, అతడి సహచరులు జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇందుకోసం ముందుగా వాణిజ్య బాల్సా చెక్క నమూనాలనుంచి పరిశోధకులు లైనిన్ తొలగించారు. సాధారణంగా మొక్కల్లో ఉండే లైనిన్ చెక్కనుంచి కాంతిని ప్రసరించకుండా చేస్తుంది. అయితే దీన్ని తొలగించడం వల్ల పూర్తి శాతం పారదర్శకత చేకూరదు. అందుకే చెక్కనుంచీ నేరుగా కాంతి లోపలకు ప్రసరించేందుకు వీలుగా యాక్రిలిక్ ను ఉపయోగిస్తున్నారు. దీంతో రెండు రెట్లు బలమైన గాజులాంటి చెక్క తయారవుతుందని చెప్తున్నారు. -
జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లకు.. మంగళం!
హౌసింగ్కు అప్పగించేందుకు నిర్ణయం మేయర్ అధ్యక్షతన సీనియర్ కార్పొరేటర్ల భేటీ త్వరలో మంత్రి నారాయణ వద్దకు నెరవేరని పేదల కలలు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా నగరానికి 28,152 గృహాలు మంజూరయ్యాయి. ఇందులో 9,976 ఇళ్లు కట్టలేమని కార్పొరేషన్ చేతులెత్తేసింది. హౌసింగ్కి బదలాయిస్తూ గతేడాది కౌన్సిల్లో తీర్మానం చేసింది. తాజాగా వివిధ దశల్లో ఉన్న నాలుగు వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి కూడా తప్పుకొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సోమవారం చాంబర్లో మేయర్ కోనేరు శ్రీధర్ టీడీపీ సీనియర్ కార్పొరేటర్లతో భేటీ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతల్ని వదిలించుకునేందుకు మున్సిపల్ మంత్రి పి.నారాయణతో భేటీ అవ్వాలనే ఆలోచనకు వచ్చారు. ఇలా మొదలైంది... జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా నగరానికి 28,152 ఇళ్లను 2006లో కేటాయించారు. కృష్ణానది, బుడమేరు వరద బాధితులు, అభ్యంతరకర పరిస్థితుల్లో నివసించేవారికి జీ ప్లస్ త్రీ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. మొదటి విడతలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. స్థలాల కొరత వెంటాడటంతో విజయవాడ రూరల్, జక్కంపూడి, గొల్లపూడి ప్రాంతాల్లో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో 226.56 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. 60 శాతం వాటా కింద 130 ఎకరాలు రైతులకు, 40 శాతం వాటాగా కార్పొరేషన్కు వచ్చిన 96.56 ఎకరాల్లో గృహనిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. నాలుగు విడతల్లో 18,176 గృహ నిర్మాణాలను చేపట్టగా 14,176 ఇళ్లను పూర్తి చేశారు. ఇందులో 11,676 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిర్మాణాలు పూర్తయిన మరో 2,500 ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉంది. 2,500 ఇళ్లు పంపిణీ చేస్తే.. దండిగా ఆదాయం... గృహనిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు రూ.572 కోట్లు కేటాయించగా, రూ.432 కోట్లతో పనులు పూర్తి చేశారు. నిధులు పక్కదారి పట్టాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీయూఎఫ్ఐడీసీ) తన వాటాగా ఇవ్వాల్సిన రూ.55 కోట్లను నిలుపుదల చేసింది. రూ.72 కోట్లు లబ్ధిదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. రూ.10 కోట్లు కార్పొరేషన్ భరించాల్సి ఉంది. నిర్మాణం పూర్తయిన 2,500 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించినట్లయితే నగరపాలక సంస్థకు దండిగా ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థలాల కొరత కారణంగా 9,976 ఇళ్లను నిర్మించలేమని చేతులెత్తేసిన కార్పొరేషన్ అదనపు భారం పడుతోందనే వంకతో మరో నాలుగువేల ఇళ్లకు మంగళం పాడింది. గతంలో రూ.40 వేలకు ఇళ్లు కేటాయించారు. పెరిగిన ధరల దృష్ట్యా ఈ మొత్తాన్ని రూ.66 వేలు చేశారు. పేదల ఆశలు ఆవిరి జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు దక్కుతాయనుకున్న పేదల ఆశలు ఆవిరైపోతున్నాయి. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా 59 డివిజన్లలో నిర్వహించిన గ్రామసభల్లో 86 వేల దరఖాస్తులు అధికారులకు అందాయి. ఇందులో 51 వేల దరఖాస్తులు ఇళ్ల కోసం వచ్చాయి. రాజధాని ప్రకటన నేపథ్యంలో విజయవాడలో ఇళ్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. శివారు ప్రాంతాల్లో సైతం ఇంటి అద్దెలు రూ.4 వేలకు చేరాయి. నగరపాలక సంస్థ చేపట్టిన గృహ నిర్మాణాలను తీసుకొని తాము పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు ససేమిరా అంటున్నారు. ధరల పెరుగుదల, డిజైన్ల నిర్మాణంలో తేడాలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తంమీద అధికార పార్టీ నేతల తీరుతో పేదోడి సొంత ఇంటి కలలు నెరవేరడం లేదు. -
ఇంటర్నెట్ ఉన్న గాడ్జెట్లతో ఇబ్బందులే...
ఇంటర్నెట్ కనెక్టెడ్ పరికరాలతో భవిష్యత్తు భయంకరంగా మారే అవకాశం ఉందంటున్నారు సైబర్ భద్రతా నిపుణులు. ఇంట్లోని గాడ్జెట్లే ఇబ్బందులకు గురి చేసే అవకాశం కనిపిస్తోందని పానాసోనిక్ సైబర్ భద్రతా చీఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ ప్రతి వస్తువూ ఇంటర్నెట్ ఆధారితంగా మారుతోందని, అయితే వీటి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. నాణ్యతలేని పరికరాల వాడకంతో పాటు... వినియోగదారుల నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే ప్రమాదం కనిపిస్తోందంటున్నారు. హ్యాకర్ ప్రూఫ్ లేని వస్తువులను కొనుగోలు చేసేముందు ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు. నాణ్యతలేని పరికరాలతో కూడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో ప్రమాదాలు తప్పవంటున్నారు జపాన్ భద్రతా నిపుణులు. ఇంటర్నెట్ కనెక్షన్ తో వాడే పరికరాలతో భవిష్యత్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పానాసోనిక్ సైబర్ భద్రతాధికారి హికో హిటోలిన్ చెప్తున్నారు. తక్కువ ఖరీదులో వెలువడే ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తోందని, అలాంటివాటిపై మోజు పెంచుకోవడం ప్రమాదాలకు కారణమౌతుందని హెచ్చరిస్తున్నారు. ఈ గాడ్జెట్లు వేడెక్కడంవల్ల ఇంట్లో మంటలు చెలరేగి ఎందరో మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయని అంటున్నారు. గృహ పరికరాల్లో ముఖ్యంగా టంబల్ డ్రయ్యర్లు ప్రమాదకరంగా ఉంటున్నాయని, గత ఆరేళ్ళలో బ్రిటన్లో సుమారు 6 వేల డ్రయ్యర్లు పేలి... మంటలు వ్యాపించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వెబ్ కనెక్షన్తో వెలువడే ప్రతి ఉత్పత్తిపైనా దృష్టి సారిస్తున్నామని, ముఖ్యంగా వేడెక్కే వస్తువులన్నింటిపైనా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నెట్ ఆధారిత పరికరాల విషయంలో ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యేలా చూసుకోవాలని, హ్యాకర్ల దాడి నుంచి రక్షణ కోసం ఇది తప్పనిసరని సూచిస్తున్నారు. దాంతోపాటు ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే వినియోగదారులు కూడా తమ తమ గాడ్జెట్లకు ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్లు అప్ డేట్ చేసుకోవడం ఎంతైనా అవసరమంటున్నారు. -
100 ఎకరాల్లో జర్నలిస్ట్లకు ఇళ్లు: సీఎం
► బుద్వేల్లో స్థలాన్ని గుర్తించామన్న కేసీఆర్..త్వరలో నిర్మాణాలు హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగు ముందుకు వేశారు. సోమవారం సీఎం కేసీఆర్ అధికారులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తొలి దశలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో జర్నలిస్టులకు నివాస గృహాలు నిర్మించాలని నిర్ణయించారు. నగర శివారులోని బుద్వేల్ ప్రాంతంలో 100 ఎకరాల్లో జర్నలిస్ట్లకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అక్కడ త్వరలో నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దశల వారీగా జర్నలిస్టులందరికీ నివాస గృహాలు నిర్మించాలని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. -
లంచం ఇస్తేనే ఇళ్ల పట్టా
ఇళ్లపట్టా కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ.. నిరుపేదలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆశ్రయించారు. ఓ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఇళ్ల పట్టా కోసం రూ200 డిమాండ్ చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం డివిజన్ సుందర్ నగర్ లో సోమ వారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇళ్ల పట్టా కోసం వీఆర్వో డబ్బు డిమాండ్ చేయడంతో మహిళలు వైఎస్పార్ సీపీ నేత సురేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన విషయాన్ని డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని కోరారు. -
బెజవాడలో మంత్రులకు విల్లాలు, అపార్ట్మెంట్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు బెజవాడలో నివాస గృహాలు ఖరారయ్యాయి. మలేషియన్ టౌన్ షిప్లో విల్లాలు, అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 245 అపార్ట్మెంట్లు, 26 విల్లాలు అద్దెకు తీసుకోనున్నారు. చదరపు అడుగుకు 11 రూపాయల చొప్పున అద్దె చెల్లించనున్నారు. కాగా ఆర్అండ్బీ లెక్క ప్రకారం అడుగుకు 7 రూపాయిలే ఉంది. ఈ అద్దె రూపేణా ఏడాదికి రూ.5.5 శాతం అద్దె చెల్లించనుంది. నవంబర్ 1వ తేదీలోగా అపార్ట్మెంట్లు, విల్లాలను అప్పగించాలని యజమానులతో...సర్కార్ ఒప్పందం చేసుకుంది. రెండు సంవత్సరాలకు ఒప్పందం చేసుకోగా, ఏటా 5 శాతం అద్దె పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే హైదరాబాద్లో నెలకు రూ.50వేలు చొప్పన ప్రభుత్వం అద్దె చెల్లిస్తున్న విషయం తెలిసిందే. -
ఇళ్ల బిల్లులిచ్చేదాకా పోరాడుతాం
- సర్కారును అసెంబ్లీలో నిలదీస్తాం - పూడికల పేరిట టీఆర్ఎస్ దోపిడీ - టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయూకర్రావు వరంగల్ : బడుగు, బలహీన వర్గాలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులిచ్చేంత వరకు పోరాడుతామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. ఇళ్ల బిల్లులు చెల్లించాలంటూ గృహ నిర్మాణ సంస్థ జిల్లా కార్యాలయం ఎదుట బుధవారం ఒక రోజు దీక్షా, ధర్నా చేపట్టారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సం ఘీభావం తెలిపినట్లు ఎర్రబెల్లి చెప్పారు. ఈ సందర్భంగా దయూకర్రావు మాట్లాడారు. 2 రోజుల్లో పెండింగ్ బిల్లులివ్వకుంటే అన్ని పార్టీ ల మద్దతుతో సర్కారును అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మాటలగారడీకి ప్రజలు మోసపోయూరని పేర్కొన్నారు. చివరకు తన ఇంట్లో పనిచేసే వ్యక్తి కూడా టీఆర్ఎస్కే ఓటు వేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.‘నీ ఇంటికి రూ.4కోట్లు, నీ కొడ్కు, నీ కూతురు, నీ అల్లుడు ఉన్న ఇళ్లకు రూ.3కోట్లతో మరమ్మతులు చేరుుంచినవ్.. పేదల ఇళ్లకు బిల్లులు చెల్లించవా?’ అని నిలదీ శారు. పూడికతీత పేరిట టీఆర్ఎస్ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీతో ముప్పు అనే.. ప్రజలను ఏ సమయంలోనైనా ఏమార్చే తెలివి తనకు ఉందన్న ధీమా సీఎం కేసీఆర్కు ఉందని ఎంపీలు గరికపాటి మోహన్రావు, గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, సీతక్క ఎద్దేవా చేశారు. టీడీపీతో ముప్పు అని భావించిన కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మహబూబ్నగ ర్ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారు పదవులకు రాజీనామా చేయూలన్నారు. కేసీఆర్.. పేదల పాలిట దయ్యమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభారాణి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ, ఆంధ్రా వారికి వాటర్ గ్రిడ్ కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారనిప్రశ్నించారు. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మాట్లాడుతూ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎర్రబెల్లి, సీతక్కలకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నా యకులు ప్రతాప్రెడ్డి, అనిశెట్టి మురళీమనోహర్, దొమ్మాటి సాంబయ్య, గండ్ర సత్యానారాయణరావు, ఈగ మల్లేషం, మోహన్లాల్, గట్టు ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు
-
గ్రౌండ్ఫ్లోరైతే రూ.20వేలు
- కార్నర్ ఫ్లాట్ కావాలంటే రూ.30వేలు అదనంగా కట్టాల్సిందే.. - జక్కంపూడి ఇళ్లలో రాయ‘బేరాలు’ - కార్పొరేషన్ ఉద్యోగుల వసూళ్లు విజయవాడ సెంట్రల్ : ‘మీకు పై పోర్షన్లో ఇల్లు వచ్చిందా.. గ్రౌండ్ఫ్లోర్కు మార్చాలా? రూ.20వేలు అదనంగా ఇవ్వండి. అంతా మేం చూసుకుంటాం..’ అంటూ నగరపాలక సంస్థ హౌసింగ్ ఉద్యోగులు బహిరంగంగానే రాయ‘బేరాలు’ సాగించారు. కొందరు లబ్ధిదారుల నుంచి అందిన కాడికి దండుకుని జాబితాలో పేర్లు తారుమారు చేశారు. నగరంలోని రాజీవ్నగర్ కరకట్ట, కేఎల్రావు నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో కాల్వగట్లపై నివాసముంటున్న 170 మందికి శనివారం జక్కంపూడి కాలనీలో గృహాలు కేటాయించారు. ఒక్కో ఇంటి ధర రూ.66వేలు కాగా, ఒకేసారి ఆ మొత్తం చెల్లించిన వారికి గ్రౌండ్ఫ్లోర్ ఇస్తామని అధికారులు ఆఫర్ ఇచ్చారు. విడతలవారీగా సొమ్ము చెల్లించిన వారికి లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయించాల్సి ఉంది. ఈ విషయాలను మభ్యపెట్టిన ఉద్యోగులు అక్రమాలకు తెరతీశారు. రూ.66వేలు చెల్లించిన వారిలో కొందరికి గ్రౌండ్ఫ్లోర్ దక్కలేదు. దీంతో ఓ మహిళ ఆందోళనకు దిగింది. విషయం బయటకు పొక్కిపోతుందనే భయంతో ఉద్యోగులు ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. లాటరీ ఉత్తిదే.. ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో జక్కంపూడిలో జరిగిన లాటరీ అంతా ఓ ఫార్స్గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. హౌసింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లే ఈ కథంతా నడిపారనే వాదనలూ వినిపించాయి. హౌసింగ్ ఈఈ ఉదయ్కుమార్ శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు జక్కంపూడి కాలనీలో ఉన్నారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే వర్క్ ఇన్స్పెక్టర్ ఒకరు జాబితాను చేతిలో పట్టుకుని ఇళ్ల బేరం మొదలు పెట్టాడు. గ్రౌండ్ఫ్లోర్కు అదనంగా రూ.20వేల ధర పలగ్గా, కార్నర్ ఫ్లాట్ రూ.30వేల వరకు వెళ్లింది. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉండే ఇద్దరు ఉద్యోగుల డెరైక్షన్లోనే ఈ వ్యవహారమంతా నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి. విచారణ చేస్తా.. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాల విషయమై విచారణ నిర్వహించనున్నట్లు హౌసింగ్ ఈఈ ఎ.ఉదయ్కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. ఆరోపణలు రుజువైతే బాధ్యులైన ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తానన్నారు. లాటరీకి విరుద్ధంగా గ్రౌండ్ఫ్లోర్ కేటాయించినట్లు తెలిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. -
కాలనీళ్లు
- ఇళ్లను ముంచెత్తుతున్న మురుగునీరు - కాలనీ వాసులకు ఏటా తప్పని కష్టాలు - గ్రేటర్లో 4600 కి.మీ. మేర మురుగునీటి పైప్లైన్లు - సరిగా సాగని పూడికతీత పనులు - చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతున్న మ్యాన్హోళ్లు సాక్షి,సిటీబ్యూరో: వాన పేరు వింటే నగరంలోని బస్తీ జనాలు హడలిపోతున్నారు. చినుకు పడితే వణికిపోతున్నారు. ఏవైపు నుంచి ఏ నాలా పొంగి ఇళ్ల మీదకు వస్తుందోనని భీతిల్లుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ పరిధిలోని మురుగునీటి కాల్వలు, నాలాలు ఉప్పొంగి సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయి. గత పక్షం రోజుల్లో మహా నగర పరిధిలో 138.2 మిల్లీమీటర్ల (దాదాపు 13.8 సెంటీమీటర్ల) వర్షపాతం నమోదైంది. నాలాల్లో పూడికతీత సరిగా లేకపోవడంతో ఈ నీరు వర్షపునీటితో కలసి ఇళ్లలోకి చేరుతోంది. మహా నగర వ్యాప్తంగా 4600 కి.మీ. మేర ఉన్న డ్రైనేజీ పైప్లైన్లు, 1500 కి.మీ. విస్తరించిన నాలాలు, మరో 1.85 లక్షలు ఉన్న మ్యాన్హోళ్లలో పేరుకుపోయిన మట్టి, చెత్తా చెదారం, పూడికను 60 శాతమే తొలగించారు. దీంతో ఈ దుస్థితి తలెత్తింది. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఎక్కడి మురుగు అక్కడే వివిధ ప్రాంతాల్లో మూతలు లేని మ్యాన్హోళ్లలో తినుబండారాల దుకాణాల యజమానులు, బిల్డర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ఫుట్పాత్ వ్యాపారులు, నిర్మాణ సామగ్రి, కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్ పేపర్లు, గ్లాసులు, చెత్తా చెదారం, మట్టితో నింపేస్తున్నారు. దీంతో డ్రైనేజీ లైన్లు పూడుకుపోయాయి. వర్షాలకు ఆయా ప్రాంతాల్లో మురుగు ముంచెత్తుతోంది. ఈ వేసవిలో సుమారు 1840 కి.మీ. మురుగునీటి పైప్లైన్లలో పూడికతీత పనులు అరకొరగా చేపట్టడంతో పరిస్థితి విషమించింది. దీనిపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, జలమండలి క్షేత్రస్థాయి అధికారులకు, అత్యవసర కాల్సెంటర్కు ఫిర్యాదు చేస్తున్నా స్పందన అంతంతమాత్రమేనని శివారు వాసులు గగ్గోలు పెడుతున్నారు. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని వందలాది కాలనీలు, బస్తీల్లో డ్రైనేజి ఔట్లెట్ సదుపాయాలు లేవు. దీంతో వర్షం పడిన ప్రతిసారీ వాన నీటితో కలిసిన మురుగునీరు నివాసాలను ముంచెత్తుతుండడం గమనార్హం. ఇదీ నాలాల దుస్థితి నగరంలో వాన వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రాణాలు నీటిలో కలుస్తున్నాయి. వర్షం కురిస్తే నీరు సాఫీగా వెళ్లే మార్గం లేకపోవడం. నాలాలపైనే అంతస్తులకు అంతస్తులు వెలియడంతో ఈ దుస్థితి నెలకొంది. వీటి అభివృద్ధికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఏళ్లకేళ్లుగా పనులు ముందుకు కదలడం లేదు. దీంతో ఏటా వర్షాకాలంలో జనం ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా మూసీ కాలువలో పడి తరుణ్(7) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇటీవల సీఎం నగర పర్యటనలో, స్వచ్ఛ కమిటీ సమీక్షలో సైతం నాలాల దుస్థితినే ప్రజలు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో నష ్టనివారణకు స్వల్ప, దీర్ఘకాలికంగా వీటి అభివృద్ధి పనులు చేయాలని భావించారు. దీనిపై స్వచ్ఛ కమిటీ చేసిన సిఫారసులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇవీ కమిటీ సిఫారసులు - నాలాల విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారికి నష్ట పరిహారం తగినంత ఇవ్వాలి. - ఇల్లు పూర్తిగా కోల్పోయే వారికి కొత్త ఇల్లు ఇవ్వాలి. - ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల వారికి కూడా నష్ట పరిహారం చెల్లించాలి. - ప్రైవేటు భూములకు కొత్త చట్టం మేరకు నష్ట పరిహారం చెల్లించాలి. - సత్వర భూసేకరణకు డిప్యూటీ కలెక్టర్ నేతత్వంలో టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా భూసేకరణ విభాగం ఏర్పాటు. - 26 కి.మీ. మేర ఉన్న మేజర్ బాటిల్ నెక్స్ను గుర్తించి ప్రథమ ప్రాధాన్యంతో పనులు చేపట్టాలి. ఆస్తులు కోల్పోయే వారికి దాదాపు రూ.223 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. - సివరేజి నాలాల్లోకి చేరకుండా వాటర్ బోర్డు చర్యలు తీసుకోవాలి. - ఏటా నాలాల్లో డీసిల్టింగ్ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితి షరా మామూలే. చెత్తను నాలాల్లో వేస్తుండటంతో పరిస్థితులు మొదటికొస్తున్నాయి. - బల్కంపేట్, గ్రీన్పార్క్ హోటల్, ధరమ్కరణ్ రోడ్, మహబూబ్ కాలేజ్, బైబిల్ హౌజ్, ఫీవర్ ఆస్పత్రి, అంబర్పేట్, మిశ్రీగంజ్ తదితర ప్రాంతాల్లో మురుగునీరు సమీప కాలనీలు, బస్తీలు, రహదారులను ముంచెత్తుతోంది. - చెత్త, మురుగునీరు నాలాల్లో చేరకుండా చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నాలాల వద్ద ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలి. - నాలాలను ఏడాది పాటు సక్రమంగా నిర్వహించేలా కాంట్రాక్టు ఇవ్వాలి. వాటిని తగినంత వెడల్పు చేయాలి. ఇవన్నీ అమలైతే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని స్వచ్ఛ కమిటీ తేల్చింది. నదిని తలపించేలా... ఖైరతాబాద్: ఖైరతాబాద్ రైల్వే గేటు ప్రధాన రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లడంతో రోడ్డు పొడవునా నీరు నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నీరు నిలవడంతో పాదచారులు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి ఖైరతాబాద్ ప్రధాన రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ఉన్న మ్యాన్హోల్ కూరుకుపోవడంతో వాటర్వర్క్స్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఉదయం చింతల్బస్తీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని అటువైపు వె ళ్లకుండా రైల్వేగేటు సమీపంలోని మరో మ్యాన్హోల్ వద్ద అడ్డుకట్ట వేశారు. దీంతో నీరు రోడ్డుపై నిలిచిపోయింది. ఎట్టకేలకు ఆ నీటిని ఇంకో మ్యాన్హోల్ ద్వారా మళ్లించారు. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని మెరుగుపరచాలనివైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్.బ్రహ్మయ్య కోరారు. -
దారి తప్పిన జీవితాల్లో..దివ్యమైన వెలుగు
అమ్మ తిట్టింది.. నాన్న కొట్టాడు.. పరీక్షలు సరిగ్గా రాయలేదు.. చాలా చిన్న కారణాలు. ఇవే పిల్లలను ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నాయి. ఇళ్ల నుంచి పారిపోయి నగరానికి చేరుతున్నారు బాలలు. తాము చేసింది తప్పో ఒప్పో తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక.. వెళ్లే దారి తెలియక ఇక్కడ ఏం చేయాలో తోచక అగచాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ‘దారి’ తప్పుతుంటే.. మరికొందరు చిన్నాచితకా పనుల్లో చేరి తమ జీవితాలను నాశనం చేసుకుంటు న్నారు. ఇలా నగరానికి వచ్చేవారిని చేరదీసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ‘దివ్యదిశ’ స్వచ్ఛంద సంస్థ. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు సన్మార్గంలో నడిచేలా కృషి చేస్తోంది. - సికింద్రాబాద్ నెల రోజుల్లో 100 మందిని చేరదీసిన దివ్యదిశ 1098తో అభాగ్యులకు ఆశ్రయం కారణాలు ఏమైనా జిల్లాలు, రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకునే బాలబాలికల సంఖ్య ప్రతీ నెలలో వందకుపైగా ఉంటోంది. వీరిలో తమ కంటపడే ఒకరిద్దరు చిన్నారులను రైల్వే పోలీసులు చేరదీస్తున్నారు. మిగతా వారు స్టేషన్ దాటిపోయి ఎక్కడెక్కడో తిరిగి.. చివరకు కర్మాగారాల్లో చేరడం, లేదంటే భిక్షాటనను వృత్తిగా ఎంచుకోవడం చేస్తున్నారు. అయితే, దివ్యదిశ ఆధ్వర్యంలో ఇటీవల స్టేషన్లో ఏర్పాటు చేసిన ‘చైల్డ్ హెల్ప్ డెస్క్’ ద్వారా అందిస్తున్న సేవలు బాలల జీవితాలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఈ సంస్థ సేవలను, పనితీరును అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి శాస్త్ర విద్యార్థులు వస్తున్నారంటే సేవలు ఎంత మెరుగ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నెల రోజుల క్రితం.. నెలరోజుల క్రితం రైల్వే అధికారులు, పోలీసుల సహకారంతో దివ్యదిశ రైల్వేస్టేషన్లో చైల్డ్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ విధులు నిర్వహించే సంస్థ ప్రతినిధులు.. ప్లాట్ఫామ్లపై అనుమానాస్పదంగా తచ్చాడే బాలలను గుర్తించి, వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆపై ఆశ్రయం కల్పించడం, పక్కా సమాచారం ఉంటే తల్లిదండ్రులకు సమాచారం అందించడం, లేదంటే హాస్టళ్లలో చేర్పించడం వంటివి చేస్తున్నారు. ఎవరన్నా ఫోన్ చేసి చెబితే చాలు దిక్కు లేని, దారి తప్పిన బాలలను తీసుకెళ్లి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎందరికో ఆదరణ గడిచిన నెలరోజుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వంద మంది బాలలను గుర్తించిన ఈ సంస్థ ప్రతినిధులు.. వివిధ మార్గాల్లో వారి సమస్యకు పరిష్కారం చూపారు. తల్లిదండ్రులు లేని, ఆచూకీ తెలియని 25 మంది బాలురకు సైదాబాద్లోని వసతిగృహంలో ఆశ్రయం కల్పించారు. ఇదే కోవకు చెందిన మరో 20 మంది బాలికలను నింబోలి అడ్డాలోని గర్ల్స్ హాస్టల్లో చేర్చారు. పారిపోయి వచ్చిన 20 మంది బాలురను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ‘చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన మా అమ్మను నాన్న వదిలేశాడు. ఇంటర్ చదువుతున్న నన్ను కళాశాల మాన్పించింది. నన్నూ తప్పుడు మార్గంలో నడిచి డబ్బు తేవాలని చిత్రహింసలకు గురిచేసేది. ఆమె చెర నుంచి తప్పించుకు వచ్చి దివ్యదిశను ఆశ్రయించా. ఇక్కడ నేను చదువుకుం టున్నా’.. అంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి తన కష్టాల కథను చెప్పుకుంది. ‘భర్త మద్యానికి బానిసయ్యాడు. ముగ్గురు పిల్లల్ని పెంచే శక్తి లేక నన్ను, పిల్లల్ని వదిలేసి పోయాడు. నాలుగిళ్లలో పాచిపని చేసుకునే నాకు ముగ్గురు పిల్లలను చదివించే సంపాదన రావడం లేదు. దివ్యదిశ వారు ఇద్దరు పిల్లల్ని వసతిగృహంలో చేర్పించి చదువు చెప్పిస్తున్నారు’.. నగరానికి చెందిన ఓ పేద మహిళ దీనగాథ. నచ్చజెప్పి ఇంటికి పంపిస్తున్నాం ఇంటినుంచి పారిపోయి వచ్చిన బాలలకు నచ్చజెప్పి తిరిగి పంపిస్తున్నాం. తల్లిదండ్రుల ఆచూకీ లభించనివారిని, బాలకార్మికులను మాత్రం వసతి గృహాలకు తరలిస్తున్నాం. పలువురు తప్పిపోయిన బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం. - సుమలత, దివ్యదిశ కౌన్సిలర్ -
'ఒక్క రోజే 1,20,000 ఇళ్ల పట్టాలు పంపిణీ'
-
నేటి నుంచి పేదలకు పట్టాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,300 మంది లబ్ధిదారులకు, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎన్బీటీ నగర్లో 7,000 మందికి సీఎం కేసీఆర్ స్వయంగా ఇళ్ల పట్టాలను అందజేయనున్నా రు. క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 3,43,537 దరఖాస్తులు అందగా, వీరిలో రెవెన్యూశాఖ లక్షా 30 వేల మందిని అర్హులుగా గుర్తించింది. కాగా, ఇప్పటివరకు 1,17,236 మందికి పట్టాలు పంపిణీకి సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను రెవెన్యూశాఖ ఆదేశించింది. -
ఓయూ తెలంగాణ ప్రజల సంపద
ఉన్నత విద్యను రాజకీయాలతో చూడొద్దు విద్యార్థి జేఏసీ నేతల హితవు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం ప్రభువు తెలంగాణ ప్రజలకు అందించిన సంపద అని విద్యార్థులు పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిజాం నవాబు విశాలమైన ప్రదేశంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్ విశ్వవిద్యాలయాలు రాజ దర్బార్లా అని వ్యాఖ్యానించడం ఆయన మొండితనానికి, అహంకారానికి నిదర్శనమని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు విమర్శించారు. యూనివర్సిటీకి వందల ఎకరాల స్థలం వద్దని ముఖ్యమంత్రి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థి జేఏసీనాయకుల అభిప్రాయాలు వారి మాటల్లోనే... - ఉస్మానియా యూనివర్సిటీ కొనడానికి కుదరదు గతంలో ఓయూ భూములను వివిధ అవసరాలకు కొందరు కొనాలని, మరికొందరు ఆక్రమించి సొంతం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావు. ఎందుకంటే 1993లో నియమించిన జస్టిస్ చెన్నప్పరెడ్డి కమిటీ ప్రకారం ఓయూ భూములు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తీసుకునేందుకు వీలులేదు.ఈ భూములన్నీ నిజాం నవాబు రాజ్యం స్వయం ప్రతిపత్తి గల ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీద రికార్డు చేశారు. వ్యక్తి గత పట్టాలకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ఓయూ భూములను ఆక్రమించిన అనేక మంది బడానేతలు భూమి పట్టాల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వీటిని సీఎం కేసీఆర్ కొంటే అదే గతి పడుతుంది. - ప్రొ.భట్టు సత్యనారాయణ, ఔటా అధ్యక్షుడు తెలంగాణ విద్యార్థులకే హక్కు వంద సంవత్సరాల చరిత్ర గల ఓయూ భూములపై తెలంగాణ చదివే ప్రతి విద్యార్థికి హక్కు ఉంది. స్వయంప్రతిపత్తి గల ఓయూ భూములను తీసుకునేందుకు ఎవరికీ హక్కు లేదు. పేదల ఇళ్ల నిర్మాణానికి విద్యార్థులు వ్యతిరేకం కాదు. కానీ ఓయూ భూములలోనే నిర్మిస్తామని విద్యార్థులను రెచ్చగొడితే సహించేది లేదు. ఓయూ విద్యార్థుల ఆందోళన ఫలితంగానే సాధించిన రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ వారినే విమర్శిస్తే రాజకీయ భవిషత్తు ఉండదు. బాబులాల్నాయక్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఓయుూ భూవుుల జోలికి వస్తే సహించం... ఓయూ పట్ల వ్యతిరేక భావనను సీఎం కేసీఆర్ మానుకోవాలి. ఉన్నత విద్య పరిశోధనలకు నిలయమైన విశ్వవిద్యాలయాలను మరింత అభివృద్ధిచేసి ప్రపంచ స్థాయికి తీసుకవెళ్లాసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఓయూ భూములుల్లో ఇళ్లు నిర్మిస్తామని సాధ్యంకాని ప్రకటనలతో క్యాంపస్లో విద్యా వాతావరణానికి విఘాతం కల్గించవద్దు. ప్రస్తుతం ఓయూ నెల కొన్న పరిస్థితులకు సీఎం కేసీఆర్ కారణం. వర్శిటీలో వీసీ, పాలక మండలి సభ్యులను తక్షణం నియమించి సమస్యలను పరిష్కరించాలి. ఓయూ భూముల జోలికి వస్తే సహించేది లేదు. చనగాని దయాకర్ పీడీఎస్యూ విజృంభణ రాష్ట్ర నాయకులు జనం దృష్టి మళ్లించేందుకే... విశ్వ విద్యాలయ భూములపై సీఎం కేసీఆర్ వింత వాదనలు చేస్తూ నగర వాసులను ప్రభావితం చేస్తున్నారు. ధరల పెరుగుదల, పన్నుల పెంపు, ఇతర సమస్యల నుంచి నగర వాసుల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి చౌకబారు వాగ్దానాలు చేస్తున్నారు. - పున్న కైలాష్ నేత, ఓయూ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ ఆ ఆలోచనను విరమించుకోండి ఓయూ భూములలో ఆరంతస్తుల మేడలు నిర్మించాలనే ఆలోనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలి. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే ఓయూ విద్యార్థులకు ఆనందమే. కానీ నగరంలో అనేక చోట్ల వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా... వర్సిటీలలోనే పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడం అన్యాయం. - కళ్యాణ్, టి.విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఓట్ల కోసం సీఎం పాట్లు నగర వాసుల ఓట్ల కోసం సీఎం కేసీఆర్ పడుతున్న వివిధ రకాల పాట్లలో పేదలకు ఇళ్ల నిర్మాణం అనే హామీ ఒకటి. నగరంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం లేదని తెలుసుకున్న కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడుతూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. ఓయూ విద్యార్థులతో పెట్టుకుంటే తన కుర్చీకే ముప్పు వస్తుందని తెలుసుకుంటే మంచింది. - కోటూరి మానవత రాయ్, టి.విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కేసీఆర్ పాలనపై నిరంతర పోరు సీఎం కేసీఆర్ పాలనపై నిరంతరం పోరుకు సిద్ధం. ఏడాదిలోనే ఆయన పాలన విసుగు పుట్టిస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు ఇతర వర్గాలూ అసంతృప్తితో ఉన్నారు. ఉన్నత విద్య, పరిశోధనల అభివృద్ధికి కృషి చేయకుండా... పూర్తిస్థాయి వీసీలను, పాలక మండలి సభ్యులను నియమించకుండా ఉద్యమ గడ్డ ఉస్మానియాను తన సొంత ఆస్తిగా పరిగణిస్తూ మేడలు కడతామని గాలి మాటలు చెప్పడం సిగ్గుచేటు. - విజయ్ యాదవ్- తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు -
ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్నారు
తూర్పు గోదావరి(దేవీపట్నం): దేవీపట్నం మండలంలోని అంగుళూరు గ్రామంలో పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్కు అడ్డంకిగా మారిన గిరిజనేతరులకు చెందిన ఇళ్లు కూల్చివేసేందుకు బుధవారం చేసిన ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం ప్యాకేజి అందేవరకూ ఇళ్లు కూల్చివేయడానికి వీల్లేదన్నారు. ఇప్పటివరకు గ్రామస్తులందరికీ ప్యాకేజి మొత్తం అందించామని అధికారులు తెలిపారు. కాగా ఉదయం గ్రామానికి వచ్చిన ఆర్డీవో సత్యవాణి ఎట్టి పరిస్థితుల్లో గ్రామాన్ని ఖాళీ చేయించాలని తహశీల్దార్ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎస్.ఐ. నున్న రాజులను ఆదేశించారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
- అడ్డుకున్న భవానీనగర్ కాలనీవాసులు కీసర: దమ్మాయిగూడ గ్రామ పరిధిలోని భవానీనగర్లోగల అసైన్డ్ భూమిలో (సర్వేనెంబర్ 538 )లోని అక్రమ కట్టడాలను శ నివారం రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చేయడం చిన్నపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లో వెళితే.. గ్రామంలోని సర్వేనెం 538 లోగల సుమారు 20 ఎకరాల అసైన్ట్ స్థలంలో కొందరు రియల్ వ్యాపారులు భవానీనగర్పేరట లేఔట్ను రూపొందించి నిరుపేదలకు పాట్లు విక్రయించడంతో ఇక్కడ పెద్దఎత్తున కాలనీ వెలిసింది. ఈ భవానీనగర్లో కాలనీల్లో 80 శాతం ఇండ్లు నిర్మించుకోగా మిగతా 20 శాతం మంది బేస్మెంట్లు, గుడిసెలు వేసుకున్నారు. ఇండ్లు నిర్మించుకున్న వారు, ఇంటినెంబర్లు, విద్యుత్ బిల్లులు ఉండటంతో ఇటివల ప్రభుత్వం కల్పించిన జీఓ 58 క్రింద పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇటీవల ఖాళీ స్థలాల్లో కొందరు బెస్మెంట్ల నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు వాటిని కూల్చేయాలని నిర్ణయించారు. కాగా ఇటీవల మండలంలో క్రమబద్ధీకరణ కోసం 58 జీఓ క్రింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇండ్ల పరిశీలన తీరును పరిశీలించేందుకు భవానీనగర్ను సందర్శించిన జేసీ అక్రమంగా నిర్మిస్తు న్న బెస్మెంట్లను తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం ఉదయం స్థానిక వీఆర్ఓ నాయక్, ఆర్ఐ కార్తీక్రెడ్డి తమ సిబ్బందితో భవానీనగర్కాలనీలో అక్రమంగా నిర్మించిన బెస్మెంట్ల ను జేసీబీ సహాయంతో తొలగించే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికులతోపాటు కూల్చివేతలను అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నేత (సర్పంచ్ భర్త) కాలనీవాసులు జేసీబీకి అడ్డం గా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు కాలనీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న జవహర్నగర్ పోలీసులు కాలనీవాసులను, ప్రజాప్రతినిధులను సముదాయించారు. -
అందరికీ ఇళ్లు
గుజరాత్ స్ఫూర్తితో అమలుకు శ్రీకారం ఇళ్ల సంఖ్య, స్థల లభ్యతపై సర్వే చేపట్టాలని ఆదేశం త్వరగా నివేదిక ఇవ్వాలనిపురపాలక సంఘాలకు సూచన సాక్షి ప్రతినిధి, వరంగల్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అందరికీ ఇళ్లు-2022 పథకం అమలు కసరత్తు వేగంగా సాగుతోంది. నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా సొంత ఇళ్లు లేని పేదలు, వారికి అవసరమైన ఇళ్ల సంఖ్య, భూముల లభ్యత వంటి అంశాలతో సమగ్ర నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు అందాయి. త్వరగా ఈ నివేదికలు రూపొందించి పంపించాలని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల కమిషనర్లకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యూరుు. ఈ మేరకు జిల్లా అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఆయూ ప్రాంతంలో ఎన్ని కాలనీలు ఉన్నాయి ? ఏ స్థితిలో ఉన్నాయి ? ఎంతమందికి ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందనే అంశాలపై సర్వే చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయూలి. పథకం ఉద్దేశం దేశంలోని పేదలకు 2022లోపు సొంత ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపడుతోంది. గుజరాత్లోని గాంధీనగర్లో చేపట్టిన ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకుని దీన్ని రూపొందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. దేశంలో సొంత ఇల్లు లేని వారి సంఖ్య కచ్చితంగా ఎంత ఉంటుందనేది తేల్చేందుకు కేంద్రం ప్రాథమికంగా సర్వే నిర్వహించింది. అల్పాదాయ, నిరుపేదల్లో 95 శాతం మందికి సొంతిళ్లు లేవని ఈ సర్వేలో తేలింది. సొంత ఇల్లు లేని వారి జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఇల్లులేని వారిని కేంద్రం నాలుగు కేటగిరీలు (మురికివాడల్లో నివసించే పేదలు, మురికివాడలు కాని ప్రాంతాల్లో నివసించేవారు, పూర్తిగా నిరాశ్రయులు, వలసకాలనీల్లో నివసిస్తున్నవారు)గా విభజించింది. ఈ నివాస ప్రాంతాల్లో కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థలాల్లో ఉండగా మరికొన్ని ప్రైవేట్ స్థలాల్లో ఉన్నాయి. కొన్ని అనుమతి లేని ప్రాంతాల్లో ఉన్నాయి. పేదలు ఇప్పుడు ఉన్న ప్రాంతాల్లోనే వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి. లేనిపక్షంలో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. నగరాలు, పట్టణాల పాలక మండళ్లు పంపించే నివేదిక తర్వాత జాతీయ స్థాయిలో దీనిపై పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. తీరనున్న కష్టాలు గ్రేటర్ వరంగల్ జనాభా 8.20 లక్షలు ఉండగా... ఇప్పటివరకు రాజీవ్ ఆవాస్ యోజన కింద కేవలం 576 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కా గృహాలు నిర్మిస్తున్నారు. రెండో విడతలో మీరా సాహేబ్కుంట, గాంధీనగర్ ఎంపికయ్యాయి. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. కానీ, అధికారిక లెక్కల ప్రకారమే నగరంలో 183 మురికివాడలుగా ఉండగా... ఇందులో 3.30 లక్షల మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. ఎంతమాత్రం నివాసయోగ్యం కాని చెరువు ముంపు ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో 31 కాలనీలు విస్తరించగా, ఇక్కడ లక్షలకు పైగా జనాభా నివసిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం అందుబాటులోకి వస్తే మురికివాడల్లో నివసించే ప్రజల కష్టాలు గట్టెక్కినట్లే. -
ఆర్నెల్లుగా కదలని రిజిస్ట్రేషన్ల ఫైలు
గాజువాక : స్టీల్ప్లాంట్ నిర్వాసిత కాలనీల్లో ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాలకు సంబంధించిన ఫైలు కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్లో ఉండిపోయింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన జాయింట్ కలెక్టర్ దృష్టి సారించకపోవడంతో ఆర్నెల్లుగా ఆయన వద్దే తిష్టేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా జిల్లా అధికారులు స్పందించకపోవడంతో నిర్వాసిత కాలనీల్లోని స్థల యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అవసరాల నిమిత్తం వాటిని అమ్ముకొందామని నిర్ణయించుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ల పునఃప్రారంభంపై అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సబ్ రిజిస్ట్రార్లకు ఎప్పుడు పంపుతారోనన్న ఆశతో కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. స్టీల్ప్లాంట్ నిర్మాణం కోసం జరిగిన భూసేకరణలో తమ భూములతో పాటు ఇళ్లను కూడా కోల్పోయిన నిర్వాసితులకు అగనంపూడి, వడ్లపూడి, దువ్వాడ, పెదగంట్యాడ, గంగవరం కాలనీల్ల పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే. ఈ కాలనీల్లో స్థలాల కేటాయింపులకు సంబంధించి నకిలీ ఆర ్డర్లు వెలుగు చూడడం, బ్రోకర్లు పెద్ద సంఖ్యలో బయల్దేరిన దరిమిలా స్థలాలపై వివాదాలు చోటు చేసుకోవడం తో అగనంపూడి, దువ్వాడ కాల నీల్లో 2008 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయగా, మిగిలిన పునరావాస కాలనీల్లో 2012 నుంచి నిలిపివేశారు. పునరావాస కాలనీల్లో స్థలాలను విక్రయించరాదని లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల్లో నిబంధన ఉండడంతో దాని ఆధారం గా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఇళ్లను వదులుకోవడంవల్ల పరిహా రంగా ఇచ్చిన స్థలాలంటూ నిర్వాసితులు నిర్వహించిన ఆందోళనల ఫలితంగా గత ప్రభుత్వం సానుకూలంగా స్పం దించింది. -
ఆక్రమణల తొలగింపు... మిన్నంటిన ఆక్రందనలు
ఇళ్లను కూల్చరాదని అడ్డుకున్న మహిళలు బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు పంపిన పోలీసులు రెండు రోజులు సమయం ఇవ్వాలని వేడుకున్న బాధితులు హైకోర్టు స్టేతో ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక బ్రేక్ కోలారు : పేదల ప్రతిఘటన మధ్య నగర సమీపంలోని కోలారమ్మ చెరువులో బుధవారం ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో తొలగింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆర్డీవో మంజునాథ్ నేతృత్వంలో బుధవారం ఉదయం ఏడుగంటలకే అధికారులు జేసీబీలతో కోర్టు సర్కిల్ సమీపం నుంచి ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. అయితే కొంతమంది తమ ఇళ్లనుంచి హడావుడిగా ఇళ్లనుంచి సామగ్రిని బయటకు తీసుకురాగా మరికొందరు ఇళ్లను కూల్చవద్దని బీష్మించుకూర్చున్నారు. అయితే పోలీసులు ఇళ్ల యజమానులను బలవంతంగా బయటకు పంపి సామాగ్రిని బయటకు తరలించారు. కొందరు మహిళలు బయటకు రాకుండా తాళం వేసుకొని ఇంట్లోనే బైఠాయించారు. తమను ఇంట్లోనే ఉంచి నివాసాన్ని కూల్చాలని, తాము ఇంటి సమేతంగా సమాధి అవుతామని తలుపులు వేసుకున్నారు సీఐ శివకుమార్ సిబ్బంది సహాయంతో బలవంతంగా తలుపులు తెరచి ఇంటిలో ఉన్న మహిళలను మహిళా పోలీసు సిబ్బంది సహాయంతో బయటకు పంపారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి కిందపడిపోయింది. రెండు రోజులు గడువియ్యండి ఇళ్లను కూల్చివేయడానికి అధికారులు రాగా మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సామగ్రిని తరలించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని వేడుకున్నారు. ఆర్డీవో చేతులు పట్టుకుని మరీ వేడుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నందువల్ల తామేమి చేయలేదని ఆయన నిస్సహాతను వ్యక్త పరిచారు. మరో ఇంటి యజమాని అయితే ఏకంగా జేసీబీకి అడ్డు తగిలి తన ఇంటిని కూల్చవద్దని వేడుకున్నారు. పోలీసులు అతనిని బలవంతంగా పక్కకు లాగేశారు. హైకోర్టు స్టే ఓ వైపు ఆక్రమణల తొలగింపు కొనసాగుతుండగా మరో వైపు కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారి విన్నపాన్ని పరిశీలించిన కోర్టు స్టే మంజూరు చేయడంతో ఆక్రమణల తొలగింపును నిలిపివేశారు. భాధితులు అక్కడి నుంచి తరలి వెళ్లడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం -
పరిశీలించండి.. పరిష్కరించండి
టన్ను రూ.1500 కిలో రూపాయిన్నర భయపడిపోతున్న పేదలు నిలిచిపోతున్న నిర్మాణ పనులు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు...కృష్ణానది చెంతనే ఉన్నా జిల్లా ప్రజలకు ఇసుక కరువవుతోంది. జిల్లాలో తట్ట ఇసుక తెచ్చుకోవాలంటే పేదవాడు నానా ఇబ్బందులు పడుతున్నాడు. పక్క జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి తెచ్చుకోవాలంటే... కిలో ఇసుక రూపాయిన్నర ధర పలుకుతోంది. నూజివీడు : జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇసుకక్వారీలకు ప్రభుత్వం వేలం వేయకపోవడంతో జిల్లా వాసులకు ఇసుక కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. పేదవాడు చిన్న పక్కాఇల్లు కట్టుకోవాలన్నా పక్క జిల్లాలో ఉన్న గోదావరికి పరిగెత్తాల్సివస్తోంది. అధిక వ్యయంతో ఇసుకను కొనుగోలు వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో మధ్య, దిగువ తరగతి ప్రజలు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 74ఇసుక క్వారీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటికి పాటలు పెట్టకుండా సంవత్సరాల తరబడి జాప్యం చేస్తుండటంతో పశ్చిమగోదావరి జిల్లా రావులపాలెం రేవు వద్ద నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడినుంచి ఇక్కడకు వచ్చేసరికి 20టన్నుల లారీకి సుమారు రూ.30వేలు ఖర్చవుతోంది. అంటే కిలో ఇసుక రూపాయిన్నర ధర పలుకుతోంది. దీంతో మధ్య, దిగువతరగతి ప్రజలు గృహనిర్మాణం చేపట్టాలంటే రోజురోజుకు పెరుగుతున్న వ్యయాన్ని భరించలేక భయపడుతున్నారు. మరోవైపు బిల్డర్లు కూడా నిర్మాణాలను తాత్కాలికంగా ఆపేయడమో, లేకపోతే అపార్ట్మెంట్లలోని ప్లాట్ల ధరలను పెంచేయడమో చేస్తున్నారు. ఇసుకకు నూతన విధానమంటూ, ఇసుక క్వారీలకు ప్రభుత్వం పాటలు పెట్టకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. రోజుకు 4వేల టన్నుల వినియోగం జిల్లాలో రోజుకు 4వేల టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని భవన నిర్మాణ కార్మికుల సంఘం, ఇతర సంఘాల అంచానా. జిల్లాలలో 8మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్, ప్రజలు నిర్మించుకుంటున్న గృహాలు, ఇందిరమ్మ గృహాలు, అపార్ట్మెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఎస్సీ సబ్ప్లాన్ కింద నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కాలువల ఆధునికీకరణ పనులు తదితర ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంతేగాకుండా జిల్లాలో ఉన్న దాదాపు 4వందల మంది బిల్డర్లు పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. అంతేగాకుండా నివేశన స్థలాల ధరలు భారీగా పెరగడంతో పట్టణాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణాలు అధికంగా సాగుతున్నాయి. ఒక్క నూజివీడులోనే ప్రస్తుతం 10వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కిలో ఇసుక రూపాయిన్నర! ఇసుక స్థానికంగా దొరకక పోవడంతో ఇసుక వ్యాపారులకు వరంగా మారింది.గోదావరి నుంచి ఇసుకను లారీల్లో తెచ్చినందుకు కిరాయిలతో కలుపుకుని టన్ను రూ.15వందలు పడుతోంది. దానిని స్టాక్ చేసి ఒకటి, రెండు ట్రక్కుల ఇసుక కావాల్సిన వారికి ట్రాక్కర్ ట్రక్కు ఇసుకను రూ.5వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ ట్రక్కుల్లో కేవలం మూడున్నర టన్నుల ఇసుక మాత్రమే పడుతుంది. దీంతో కిలో ఇసుకరూపాయిన్నర ధర పలుకుతోంది. ఇంత మొత్తంలో వెచ్చించి ఇసుకను కొనలేక నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. -
గుబులు రేపుతున్న సర్వే..!
ఘట్కేసర్ టౌన్: సమగ్ర కుటుంబ సర్వే బడా బాబుల్లో గుండెల్లో గుబులు రేపుతోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటి వరకు దొడ్దిదారిన సంక్షేమ పథకాలను కాజేసిన వారు సర్వే పేరు వింటేనే వణికిపోతున్నారు. అక్రమంగా పొందిన సేవలన్ని సర్వే ద్వారా బహిర్గతమయ్యే అవకాశముండటం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. వ్యతిరేకిస్తున్న ఉన్నత వర్గం, ఆహ్వానిస్తున్న పేద వర్గం... కోట్ల కొలది ఆస్తులున్న తెల్ల తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ తదితర రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సౌకర్యాలు పొందుతున్న ఉన్నత వర్గాలు సామాజిక సర్వేను వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలు పొందడానికి అన్ని అర్హతలున్నా ప్రభుత్వ రాయితీలను అందుకోలేకపోతున్న పేద వర్గం సర్వేను స్వాగతిస్తోంది. సర్వేలో ఉద్యోగ స్థితి, ఆధార్, స్థిరాస్తి, చరాస్థి, గ్యాస్, ఇంటి, కుటుంబ పరిస్థితి, పశు సంపద, పెన్షన్స్, భూములు, పాన్ కార్డు తదితర వివరాలను సర్వే సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. పాలకుల స్వార్థపూరిత పాలనలో సర్కారు ఉద్యోగమున్న వారు, భూస్వాములు వారి తల్లితండ్రులు నేడు తెలుపు కార్డులు పొంది పెన్షన్స్, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుల ద్వారా రాయితీలు పొందుతున్నారు. వైకల్యం లేకున్న పెన్షన్ పొందడం, ఇల్లు ఉండగానే స్థలాలు, ఇందిరమ్మ పథకాలను తిరిగి వినియోగించుకున్న వారికి ఇప్పుడు సర్వే అంటేనే దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. భూములు, ప్లాట్ల విక్రయాలన్ని నేడు ఆన్లైన్లో జరుగుతున్నందున ఎక్కడ తమ అక్రమ ఆస్తుల వివరాలు సర్కారుకు తెలిసిపోతాయోనని బడాబాబులు దడుసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులకు తప్పని తిప్పలు... నూతనంగా ఎన్నికలైన ప్రజా ప్రతినిధులను సర్వే తిప్పలు వదలడం లేదు. ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కినా సర్వే ద్వారా ప్రజల నమ్మకాన్ని కోల్పోయే అవకాశముందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓటేసి గెలిపిస్తే ఉన్న సౌకర్యాల్లో కోతల విధిస్తున్నారని, ఇందుకోసమేనే మిమ్మల్ని గెలిపించామా అంటూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. మరి ఈనెల 19న జరిగే సర్వేలో అందరూ అనుకుంటున్నంటు అక్రమాలు బయటపడతాయా లేక ఇది ఓ సాధారణ సర్వేగా మిగిలిపోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
పేదల ఇలాకా... ‘తమ్ముడి’ తడాఖా
సీలింగ్ భూమిపై టీడీపీ నేత కన్ను నకిలీ పత్రాల సృష్టించి పేదల గుడిసెలు కూల్చేందుకు కుట్ర వంతపాడుతున్న పోలీసులు నేడు ఇళ్లు కూల్చివేస్తామని హెచ్చరిక వైఎస్సార్ సీపీకి ఓటేశామనేకక్ష కట్టారని బాధితుల గగ్గోలు అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్డదారుల్లో సంపాదనకు తెరలేపాడు ఓ తెలుగు తమ్ముడు. నకిలీ పత్రాలను సృష్టించి బందరులో విలువైన భూములను సొంతం చేసుకునేందుకు పథకం రచించాడు. పేదలకు అండగా నిలవాల్సిన పోలీసులు కూడా అతను చెప్పినట్టే నడుచుకుంటున్నారు. పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓటు వేసినందువల్లే కక్ష సాధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మచిలీపట్నం : ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న చందంగా ఓ తెలుగు తమ్ముడు కుట్రకు తెరలేపాడు. ప్రభుత్వ సీలింగ్ భూమిలో పేదలు నివసిస్తున్న గుడిసెలను కూల్చివేసి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు చక్రం తిప్పుడుతున్నాడు. ఆ భూమి తనదంటూ నకిలీ కాగితాలు సృష్టించినట్లు సమాచారం. పోలీసులను రంగంలోకి దించాడు. దీంతో పదిహేను రోజులుగా పోలీసులు పేదల వద్దకు వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలని, లేకపోతే మీపై రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరిస్తున్నారు. మరో 24 గంటల్లో గుడిసెలు ఖాళీ చేయకపోతే పొక్లెయిన్లు తీసుకువచ్చి తామే కూల్చేస్తామంటూ ఇనగుదురు ఎస్ఐ మంగళవారం పేదలను బెదిరించడం చర్చనీయాంశమైంది. పదేళ్లుగా నివసిస్తున్నారు పట్టణంలోని 27వ వార్డులో శివగంగ గుడి వెనుక చల్లపల్లి రాజాకు చెందిన భూమి ఉంది. దానిని అప్పట్లోనే సీలింగ్ భూమిగా గుర్తించారు. రెవెన్యూ రికార్డుల్లోనూ సీలింగ్ భూమిగానే ఉంది. పదేళ్ల క్రితం ఇళ్లస్థలాలు లేకపోవటంతో ఈ భూమిలో బండారు నాంచారయ్య, బొమ్మసాని బాలఏసు, విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు, డొక్కు శివరాజు, కటకం నాగరాజు, బండారు కనకయ్య, మారెళ్ల నాగేశ్వరరావు, బడే భవన్నారాయణ కుటుంబాలు గుడిసెలు వేసుకుని అక్కడే నివసిస్తున్నాయి. వీరు గుడిసెలు వేసుకునే సమయంలో 27వ వార్డు ప్రస్తుత కౌన్సిలర్ బంధువులు వీరికి సహాయ సహకారాలు అందించారు. పదేళ్లుగా ఈ కుటుంబాల వారు అక్కడే నివసిస్తుండటంతో రేషన్కార్డు, ఆధార్కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లను రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుంది. ఈ భూమిపై కన్నేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుడు తమ పార్టీ అధికారంలోకి రాగానే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పావులు కదపటం ప్రారంభించాడు. ఈ మేరకు పదిహేను రోజుల క్రితం మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రికి ముఖ్య సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడ్ని సంప్రదించాడు. ఈ నాయకుడితో డీఎస్పీకి సిఫార్సు చేయించుకుని పేదలపైకి పోలీసులను ఉసిగొల్పాడు. ఏమీ ఆలోచించని పోలీసులు ఈ గుడిసెలు ఖాళీ చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తూ వస్తున్నారు. తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు ఇనగుదురుపేట ఎస్ఐ మా కుటుంబాల వారిని వారం రోజుల క్రితం స్టేషన్కు పిలిపించారు. ఎంతకాలం నుంచి అక్కడ నివసిస్తున్నారు.. అంటూ అన్ని వివరాలు తీసుకున్నారు. తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారు ఈ విషయాన్ని డీఎస్పీకి వివరించేందుకు వెళితే స్వచ్ఛందంగా మీరే గుడిసెలు ఖాళీ చేస్తామని రాసి ఇచ్చారు కదా.. అని ఆయన ప్రశ్నిస్తే గానీ మాకు అసలు విషయం అర్థం కాలేదు. మంగళవారం మా వద్దకు వచ్చిన ఎస్ఐ బుధవారం గుడిసెలు కూల్చివేస్తానంటూ హెచ్చరించి వెళ్లారు. - బడే ఉమామహేశ్వరమ్మ పోలీసులు పట్టించుకోవడం లేదు పది సంవత్సరాలుగా ఇక్కడే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాం. మంగళవారం మా ఇళ్ల వద్దకు వచ్చిన ఎస్ఐ బుధవారం ఉదయం పది గంటలలోపు ఖాళీ చేసేందుకు సమయం ఇస్తున్నానని చెప్పి వెళ్లారు. అప్పటికీ ఖాళీ చేయకపోతే పొక్లెయిన్ తీసుకువచ్చి తామే గుడిసెలు కూల్చివేయిస్తామని హెచ్చరించి వెళ్లారు. మాకు రేషన్కార్డులు, ఆధార్కార్డులు ఇక్కడి చిరునామాతోనే ఉన్నాయి. ఇక్కడే నివసిస్తున్నట్లు తహశీల్దార్ జారీ చేసిన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. - బండారు ధనలక్ష్మి పేదలతో తెల్లకాగితాలపై సంతకాలు.. వారం రోజుల క్రితం ఈ ఎనిమిది కుటుంబాల వారిని స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ గుడిసెలు ఖాళీ చేయకకపోతే ఇక్కట్ల పాలవుతారని హెచ్చరించారు. తనదైన శైలిలో వ్యవహారం నడిపి వీరితో తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా మంగళవారం మళ్లీ తన సిబ్బందితో కలిసి వెళ్లి గుడిసెలు ఖాళీ చేయకుంటే బుధవారం ఉదయం 10 గంటలకు పొక్లెయిన్ వస్తుందని, గుడిసెలు కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈ భూమి మీదేనంటూ ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపండి..’ అంటూ ఎస్ఐ నానా హడావుడి చేయటంతో పేదలు కంగుతిన్నారు. ఎంతోకాలంగా ఇక్కడ నివసిస్తున్నామని, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే కష్టమని పేదలు చెప్పినా సదరు ఎస్ఐ వినిపించుకోలేదని బాధితులు వాపోతున్నారు. గత ఎన్నికల్లో తాము వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశామనే కారణంతోనే పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్న తమను ఖాళీ చేయించేందుకు టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఉసిగొల్పుతున్నారు రెవెన్యూ అధికారులకు లేఖ రాసి ఆ భూమి ఏ స్థితిలో ఉందో తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పినా టీడీపీ నాయకులు ఇనగుదురు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకుల హడావుడితో బెదిరిపోయిన పేదలు పది రోజుల క్రితం వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని)ను ఆశ్రయించారు. పేర్ని నాని ఈ పేదలను డీఎస్పీ వద్దకు తీసుకువెళ్లి వాస్తవ పరిస్థితులను వివరించారు. పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే వారు తలదాచుకునేందుకు అవకాశం ఉండదని చెప్పారు. దీంతో ఈ గుడిసెలను ఖాళీ చేయించే విషయం కొన్ని రోజుల పాటు సద్దుమణిగింది. తాజాగా మంగళవారం మళ్లీ గుడిసెల వద్దకు తన పరివారంతో వెళ్లిన ఇనగుదురుపేట ఎస్ఐ బుధవారమే గుడిసెలు కూల్చివేస్తున్నామంటూ హెచ్చరికలు జారీ చేయటంతో పేదలు వణికిపోతున్నారు. పేదలు పదేళ్లుగా నివసిస్తున్న స్థలాన్ని ఖాళీ చేయించాలంటే రెవెన్యూ అధికారులు ఆ భూమి ఎవరిదో గుర్తించాలి. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలి. కొంత సమయం ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలి. ఎలా కూల్చివేస్తారో చూస్తా : పేర్ని నాని భూమికి సంబంధించిన విషయంలో రెవెన్యూ అధికారులు మిన్నకుండి పోతుండగా ఇనగుదురుపేట పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ఇనగుదురుపేట ఎస్ఐ బుధవారం పేదలు నివసిస్తున్న గుడిసెలను కూల్చివేస్తానని హెచ్చరించి వచ్చారని, అక్కడకు తానూ వెళతానని, పేదల గుడిసెలు ఎలా కూలుస్తారని ఆయన ప్రశిస్తున్నారు. ఈ విషయంపై ఇనగుదురు ఎస్ఐ అశోక్ను ‘సాక్షి’ వివరణ కోరగా శివగంగ ప్రాంతంలో గుడిసెలకు సంబంధించిన అన్ని విషయాలను డీఎస్పీకి వివరించానని, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
ఇదీ.. ప్రణాళిక లెక్క
జిల్లా అన్ని రంగాల్లో కునారిల్లుతోంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీల నివేదిక ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. జీవన ప్రమాణాల్లో 6వ స్థానంలో ఉన్న జిల్లా, మానవాభివృద్ధిలో మాత్రం 5వ స్థానం నుంచి 7వ స్థానానికి దిగజారింది. ఆరోగ్యం విషయంలో 6వ, విద్య విషయంలో 7వ స్థానాల్లో ఉంది. కానీ, దీనికి భిన్నంగా రక రకాల నేరాల్లో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఒక శతాబ్దానికి సంబంధించి గణాంకాలను పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు స్త్రీ, పురుష నిష్పత్తి (సెక్స్ రేషియో) పెరిగినా, స్త్రీల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. వేయి మంది పురుషులకు 983మంది స్త్రీలే ఉన్నారు. 1901నాటి జనాభా లెక్కల్లో 892గా ఉన్న సెక్స్ రేషియో 2011 నాటికి 983కు చేరింది. రాష్ట్ర జనాభాలో 9.91శాతంతో ఆరో స్థానంలో ఉంది. గృహాలు జిల్లాలో మొత్తం ఇళ్లు 10,30,937 వేకెంట్ 62,765 ఆక్యుఫైడ్ 9,68,172 నివాస గృహాలు 8,49,437 ఇతరాలు 20,619 షాపులు, ఆఫీసులు 24,817 స్కూళ్లు, కాలేజీలు 6,590 హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు 1,929 ఆసుపత్రులు, డిస్పెన్సరీలు 1,793 ఫ్యాక్టరీలు, వర్క్షాపులు 5,493 గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు 7,16,294 పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు 1,59,645 దేవాలయాలు, చర్చీలు, మసీదులు 6,976 ఇళ్లులేని జనాభా 5,042 గ్రామీణ ప్రాంతాల్లో 3,834 పట్టణ ప్రాంతాల్లో 1,208 స్త్రీపురుష నిష్పత్తి ఇలా.. (వెయ్యి మంది పురుషులకు) 1901 892 1911 946 1921 955 1931 953 1941 945 1951 946 1961 952 1971 965 1981 969 1991 967 2001 971 2011 983 కార్మికులు/కర్షకులు మెయిన్ వర్కర్స్ 14,93,419 మార్జినల్ వర్కర్స్ 2,48,274 మొత్తం వర్కర్స్ 17,41,693 మెయిన్ వర్కర్స్ కల్టివేటర్స్ 3,12,130 వ్యవసాయ కూలీలు 6,93,259 కుటీర పరిశ్రమలు 35,330 ఇతరులు 4,52,700 మార్జినల్ వర్కర్స్ కల్టివేటర్స్ 13,094 వ్యవసాయ కూలీలు 1,69,872 కుటీర పరిశ్రమలు 9,794 ఇతరులు 55,514 మతాలు - ప్రజలు (2001 లెక్కల ప్రకారం) బుద్దిస్ట్ 66 క్రైస్తవులు 32,452 హిందూవులు 30,40,212 జైనులు 89 ముస్లింలు 1,70,553 సిక్కులు 812 భూ వినియోగం విస్తీర్ణం 14,24,000 హెక్టార్లు అడవులు 83,073 హెక్టార్లు వ్యవసాయ యోగ్యంకానిది 1,21,351 హెక్టార్లు వ్యవసాయేతర వినియోగం 1,28,360 హెక్టార్లు వ్యవసాయ యోగ్యం/వృథా 29,146 హెక్టార్లు ఇతర 65,039 హెక్టార్లు ట్రీ క్రాప్స్ 7392 హెక్టార్లు ఫాలో ల్యాండ్స్ 1,60,464 హెక్టార్లు రాష్ట్రంలో జిల్లా స్థానం జనాభాలో 6వస్థానం (9.91%) జనసాంధ్రతలో 7వ స్థానం(245) స్త్రీపురుష నిష్పత్తిలో 8వ స్థానం(983) అక్షరాస్యతలో 5వ స్థానం(64.20%) పురుషుల అక్షరాస్యతలో 4వ స్థానం(4.10%) స్త్రీ అక్షరాస్యతలో 6వ స్థానం(54.19%) అక్షరాస్యత అక్షరాస్యత 64.20% అక్షరాస్యులు 20,01,019 పురుషులు 11,60,757 (74.10%) మహిళలు 8,40,262 (54.19%) గ్రామీణ అక్షరాస్యులు 15,15,547 (60.07%) పట్టణ అక్షరాస్యులు 4,85,472 (81.69%) దళితులు దళిత జనాభా 6,37,385 పురుషులు 3,18,359 స్త్రీలు 3,19,026 గ్రామీణ ప్రాంతాల్లో 5,50,732 అర్బన్ ప్రాంతాల్లో 86,653 అక్షరాస్యత 3,44,974(60.75%) పురుషులు 2,01,096 (71.10%) స్త్రీలు 1,43,848 (50.49%) ఇరిగేషన్ ట్యాంకులు 7,271 కాల్వలు 4,539 బోరుబావులు 1,55,207(రాష్ట్రంలో 3వ స్థానం) బావులు 30,404 ఇతర నీటి వనరులు 3,095 సాగు విస్తీర్ణం 2,89,618 హెక్టార్లు జిల్లాలో ఆస్పత్రులు జనరల్ 04 అనుబంధ 11 పీహెచ్సీలు 72 బెడ్స్ అవైలబుల్ 1450 డిస్పెన్సరీలు 3 రెగ్యులర్ డాక్టర్లు 210 కాంట్రాక్టు డాక్టర్లు 75 -
యూఎస్ లో టోర్నాడో విధ్వంసం!
-
అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు
-
ఎక్సైజ్ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు
బాదంపూడి(ఉంగుటూరు), న్యూస్లైన్ : బాదంపూడిలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న యామల జయరాజు ఆదాయూనికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారం మేరకు స్వగ్రామం బాదంపూడిలో ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సుమారు 14 గంటల పాటు అధికారులు సోదాలు చేశారు. వీఆర్వో నరేంద్రకుమార్ కార్యాలయూనికి వెళ్లి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. జయరాజు పూర్వం ఆస్తులు, కొత్తగా కొనుగోలు వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. సోదరుడు ఇంటిలో ఉన్న దస్తావేజులను చూసి వెల్లమిల్లి ఉన్న పొలాలు బాదంపూడిలో ఉన్న గెస్ట్హౌస్ను ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఏసీబీ సీఐలు బి.శ్రీనివాస్(విజయవాడ), కె.సీతారామయ్య(విజయవాడ), కొమ్మరయ్య(ఏలూరు), పలువురు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఏకకాలంలో ఉయ్యూరు, బాదంపూడి, రాజమండ్రి, హైదరాబాద్లో ఉంటున్న జయరాజు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో దాడులు చేస్తున్నాయని డీఎస్పీ వెంకటేశ్వరరావు చెప్పారు. వివరాలపై ‘న్యూస్లైన్’ డీఎస్పీని ప్రశ్నించగా నాలుగు చోట్ల చేసిన దాడుల వివరాలను రాజమండ్రిలో వెల్లడిస్తామని చెప్పారు. హడలిపోతున్న అధికారులు మండలంలో ఏసీబీ అధికారులు దాడులు చేయటంతో అధికారులు హడలిపోతున్నారు. ఏ క్షణంలో ఏ అధికారిపై దాడులు జరుగుతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. ఏసీబీ సోదాలపై గ్రామంలో చర్చించుకుంటున్నారు. -
గస్తీకి సుస్తీ
తాండూరు, న్యూస్లైన్: జిల్లాలో ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రమైన తాండూరు పట్టణంలో రాత్రి పూట గస్తీ నిర్వహణ నామామాత్రంగా మారింది. దీంతో దుండగలు తెగబడుతున్నారు. ఇళ్లు, దుకాణాలను లూటీ చేస్తున్నారు. బంగారు, వెండి, నగదు అపహరించుకు పోతుండటంతో పట్టణవాసులు బెంబేలెత్తిపోతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మూడు ఇళ్లలో దుండగులు చోరీలకు పాల్పడటం రాత్రి వేళ పోలీసు గస్తీ వైఫల్యానికి అద్దం పడుతోంది. ఈనెల 20న తాండూరు ఎమ్మెల్యే మహేందర్రెడ్డి నివాసం ఎదురుగా కిరాణ వ్యాపారి చంద్రయ్య ఇంట్లో, తాజాగా భవానీ నగర్లోని బైక్ మెకానిక్ మహ్మద్ ఇస్మాయిల్ ఇంట్లో, సాయిపూర్లోని యాదిరెడ్డి చౌక్లో సమీపంలో కిరాణ వ్యాపారి నరేందర్ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడటం సోమవారం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం గాంధీచౌక్లోని బంగారు నగల దుకాణంలోనూ పట్టపగలే చోరీ జరిగింది. కొరవడిన నిఘా... రాత్రి వేళ నడిచే కొన్ని హోటళ్లను మూయించడానికే పెట్రోలింగ్ పరిమితమైందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు రాత్రి పట్టణంలో 8 రూట్లలో గస్తీ నిర్వహించాలి. ప్రస్తుతం మూడు రూట్లకే గస్తీ పరిమితం కావడం గమనార్హం. ఇక తాండూరు రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో గస్తీ తూతూమంత్రంగా మారింది. అర్థరాత్రి దాటిన తరువాత రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద అనుమానితులపై పోలీసు నిఘా పూర్తిగా కొరవడింది. ఒక రౌండ్ పెట్రోలింగ్ నిర్వహించి మమ అనిపించేస్తున్నారు. స్థానిక పోలీసు అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పెట్రోలింగ్ అధ్వానంగా మారింది. అర్భన్ సర్కిల్ కార్యాలయం పరిధిలో సుమారు 42మంది కానిస్టేబుళ్లు, 20 మంది హోంగార్డులు ఉన్నారు. ఇంత మంది సిబ్బంది ఉన్నప్పటికీ రాత్రి పూట కేవలం మూడు రూట్లలో గస్తీ నిర్వహిస్తుండటం గమనార్హం. కర్ణాటక సరిహద్దు కావడం, రైలు సౌకర్యం ఉండటంతో దుండగులు తాండూరును లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. సిబ్బంది కొరత... కానిస్టేబుళ్లు, హోంగార్డులు మూడోవంతు కోర్టు, ఎన్బీడబ్ల్యూ, శిక్షణ, ట్రాఫిక్ నియంత్రణతోపాటు ఉన్నతాధికారుల కార్యాలయాలకు అటాచ్లకు వెళ్లడంతో రాత్రివేళ గస్తీకి సిబ్బంది కొరతగా మారిందనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే రాత్రిపూట బీట్లు తగ్గాయని అంటున్నారు.మూడేళ్ల క్రితం అలాట్మెంట్ ప్రకారమే కానిస్టేబుళ్ల నియామకం అయ్యారని, ఈ సంఖ్యను ప్రస్తుత అవసరాలకనుగుణంగా పెంచితే ఎక్కువ రూట్లలో రాత్రి వేళ్ల గస్తీ నిర్వహించేందుకు వీలవుతుందని, తద్వారా చోరీలను నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సిబ్బంది పెంపుతోపాటు గస్తీ లోపాలను సవరిస్తూ, ప్రత్యేక నిఘాను ఏర్పాటుపై ఉన్నతాధికారులు యోచించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. -
‘చచ్చు’బండ
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్లైన్: ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పేరుతో అట్టహాసంగా ప్రచారం నిర్వహిస్తున్న రచ్చబండ.. చచ్చుబండగా మారింది. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెపుతున్నప్పటికీ ఈ కార్యక్రమం వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడత దరఖాస్తుదారులలో ఏడాది తర్వాత సగం మందికి మాత్రమే మోక్షం కలిగింది. మిగిలిన సగం దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. మళ్లీ 2011 నవంబర్లో మలివిడత రచ్చబండ నిర్వహించగా... నేటికీ ఏ ఒక్క లబ్ధిదారుకూ ప్రయోజనం కలుగలేదు. కాగా, సోమవారం నుంచి మూడో విడత రచ్చబండ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో తొలివిడత రచ్చబండ కార్యక్రమాన్ని 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆర్భాటంగా నిర్వహించారు. గ్రామసభల్లో ప్రధానంగా రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. మళ్లీ అదే సంవత్సరం నవంబర్లో మలివిడత రచ్చబండ నిర్వహించారు. అందులో మొదటి విడత లబ్ధిదారులు కొందరికి పథకాలు అందించి చేతులు దులుపుకున్నారు. రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న వారు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ‘ఆన్లైన్ చేస్తున్నాం.. త్వరలో రేషన్కార్డులు, ఫించన్లు, ఇళ్లు వస్తాయి’ అంటూ అధికారులు తిప్పుకుంటున్నారే తప్ప.. ఒరిగిందేమీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, గతనెల 24 వరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులందరికీ మూడో విడత రచ్చబండలో సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గత రచ్చబండ కార్యక్రమాల్లో ఇచ్చిన దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించకుండా గతనెల 24 వరకు వచ్చిన వాటిని పరిష్కరించడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. అమలుకు నోచని ఇందిరమ్మ ఇళ్లు.. అభివృద్ధి పథకాల అమలులో ప్రభుత్వ అలసత్వంతో మొదటి విడత లబ్దిదారులకు ఇప్పటివరకు ఇళ్లు మంజురు కాలేదు. రెండు విడతల్లో 1,13,928 మంది లబ్దిదారులు అర్హులుగా గుర్తించారు. ఇవికాకుండా గ్రీవెన్స్, ఇతర కార్యక్రమాల్లో మరికొందరు దరఖాస్తు చేస్తున్నారు. ఇలా అక్టోబర్ 24 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఈ రచ్చబండలో 61,958 మందికి మంజురూ చేస్తామని అధికారులు చెపుతున్నారు. గుర్తించిన వారిలోనూ కొందరికి రేషన్కార్డు లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదు. ఫించన్ల కోసం గత రచ్చబండలో 29,678 మంది దరఖాస్తు చేసుకోగా, నేటికీ వారికి ఎదురుచూపులే మిగిలాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనిదే తామేమీ చేయలేమని అధికారులు చేతులెతేస్తున్నారు. రెండోవిడత రచ్చబండలో 62,558 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 42,096 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కానీ వారికి ఇప్పటి వరకూ కార్డులు మంజురు చేయలేదు. దీంతో వారు ఏ ప్రభుత్వ పధకానికీ అర్హులు కావడం లేదు. ప్రచారానికే ప్రాధాన్యత.. రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండలో వచ్చిన దరఖాస్తులకు మోక్షం చూపని ప్రభుత్వం.. ఈ నెల 11 నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రచార ఆర్భాటాల కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. -
ఇందిరమ్మ గృహాలపై విచారణ
నరసరావుపేట టౌన్, న్యూస్లైన్: ఇందిరమ్మ గృహాలు నిర్మించుకొని వాటిని విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు విజిలెన్స్ అధికారులకు అందాయి. వారి ఆదేశాల మేరకు హౌసింగ్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి రేషన్కార్డు, ఆధార్ కార్డులను తీసుకొని స్కానింగ్ చేసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ ఆదినారాయణ మాట్లాడుతూ పట్టణంలో ఇందిరమ్మ మొదటివిడతలో 515మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్నారని చెప్పారు. 45 గృహాల లబ్ధిదారులు వాటిని విక్రయించినట్లు జిల్లా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయన్నారు. వారి ఆదేశాల మేరకు సమగ్రంగా విచారణ జరిపి గృహాల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు నమోదుచేసి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు వర్క్ ఇన్స్పెక్టర్లు కిరణ్, అనిల్, మున్సిపల్ అధికారులు ఉన్నారు. -
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు
-
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు
-
కొనుగోలుదారులను ఆకర్షించేందుకు.. స్వగృహ దసరా ఆఫర్
సాక్షి, హైదరాబాద్: పండుగ వేళల్లో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రైవేట్ సంస్థలు ‘ఆఫర్ల వల’ వేయడం పరిపాటే. అయితే పైసా ఆదాయం లేక అల్లాడుతున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఇదే పంథాను అనుసరిస్తోంది. అక్టోబర్ 15లోపు ఇళ్లను బుక్ చేసుకుంటే వాటి ధరపై 3 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు దసరా ఆఫర్ ప్రకటించింది. ప్రజల్లో స్వగృహాలకు డిమాండ్ ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండా మునిగిన ఆ సంస్థ, కనీసం నిర్వహణ ఖర్చుల కోసమైనా వీలైనన్ని ఇళ్లను అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేసింది. ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో స్టాల్ను ఏర్పాటు చేసిన సందర్భంగా స్వగృహ కార్పొరేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. స్వగృహ కార్పొరేషన్ను అనవసరంగా ప్రారంభించారని, అది కట్టిన ఇళ్లకు డిమాండ్ లేదని అంతర్గత సమావేశాల్లో పేర్కొంటూ ప్రభుత్వ పెద్దలే దాన్ని నష్టాల బాట పట్టించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ప్రాపర్టీ షోలో పాల్గొన్న ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థల స్టాల్స్ కంటే ఎక్కువగా ప్రజలు స్వగృహ స్టాల్పైనే ఆసక్తి చూపించడం విశేషం. దాదాపు వేయి మంది సందర్శకులు స్వగృహ వివరాలను తెలుసుకోగా, నాలుగొందల మంది ఇళ్ల కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఆదరణకు ఆశ్చర్యపోయిన అధికారులు, వారు చేజారిపోకుండా ఈ తగ్గింపు ఆఫర్ను అక్కడ ప్రకటించారు. షోలో వచ్చిన సందర్శకులకే కాకుండా, ఇతర కొనుగోలుదారులకు కూడా దీన్ని వర్తింప చేయనున్నారు. అయితే దీనిపై అధికారికంగా కార్పొరేషన్ ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో అతి తక్కువ ఖర్చయ్యే ప్రాపర్టీ షోలు జరిగినా డబ్బులు లేవంటూ వాటిలో పాల్గొనేందుకు స్వగృహ కార్పొరేషన్ వెనుకడుగు వేసింది. అయితే తాజాగా ఒక ప్రైవేట్ సంస్థ ఒత్తిడితో ఈ ప్రాపర్టీ షోలో పాల్గొనేందుకు సుమారు రూ.14 లక్షల వరకు చెల్లించినట్టు సమాచారం. స్వగృహ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులపై ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన ప్పటికీ ఇక్కడ మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నా అధికారులు కొంత తాత్సారం చేస్తున్నారు. -
మిల్లు కార్మికులకు ఇళ్ల వరాలు
సాక్షి, ముంబై: నగరంలోని 12 మిల్లుల స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా కోరిన మిల్లు కార్మికులపై సీఎం వరాల జల్లు కురిపించారు. ఖాళీగా ఉన్న మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడమేగాకుండా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎమ్మెమ్మార్డీయే)కి చెందిన ఇళ్లలో కూడా 50 శాతం ఇళ్లను కార్మికులకే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో సర్క్యులర్ జారీ చేస్తామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాల అనంతరం కార్మిక నాయకులు, మిల్లు కార్మికుల ప్రతినిధులు ముఖ్యమంత్రి చవాన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు... 1.42 లక్షల మిల్లు కార్మికులకు ఇళ్లు ఇవ్వాలని, గత సంవత్సరం మాడా నిర్వహించిన లాటరీలో ఇల్లు వచ్చిన కార్మిలకు వెంటనే అందజేసే ప్రక్రియను పూర్తిచేయాలని, ప్రభుత్వం అధీనంలోకి వచ్చిన మిల్లు స్థలాల్లో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎంను కోరారు. వారి డిమాండ్లను విన్న చవాన్ సానుకూలంగా స్పందించారు. 12 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశంపై మాడాతో చర్చలు జరుపుతామని, ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెమ్మార్డీయే ఇళ్లలో కూడా సగం ఇళ్లను కార్మికులకే ఇస్తామన్నారు. వీటిని నిర్మించి ఇవ్వడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా.? అనే విషయమై ఎమ్మెమ్మార్డీయే అధికారులతో కూడా చర్చిస్తానన్నారు. 50 శాతం ఇళ్లు ఇవ్వడానికి నియమ, నిబంధనాల్లో ఎమైనా మార్పులు చేయాల్సి వస్తే నెల రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తామని చెప్పారు. బాంబే డయింగ్ మిల్లు స్థలం లభిస్తే అందులో కార్మికుల కోసం ఐదువేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశముంటుందని, ఈ స్థలం ప్రభుత్వ అధీనంలోకి వచ్చేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, అందుకు చట్టపరంగా సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ అధీనంలోకి వచ్చిన 12 మిల్లు స్థలాల్లో 300 చదరపుటడుగుల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉండగా ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలపై మిల్లు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమ కల సాకారమ వుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.