బీచుపల్లి వద్ద పుష్కరఘాట్లను తాకుతూ కృష్ణమ్మ పరవళ్లు
ఇటిక్యాల: గతేడాది నుంచి నీటి ప్రవాహం లేక బోసిపోయిన కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి నీరు వదలడంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు కింద ఉన్న శ్రీశైలంకు చేరుతుంది. బీచుపల్లి వద్ద నూతనంగా నిర్మించే పుష్కరఘాట్లను ఆనుకుని నదిలో నీటì æప్రవాహం ఉండటంతో గురువారం సందర్శకులు కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వస్తున్నారు. వచ్చేనెల 12నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.